English | Telugu
Guppedantha Manasu : తండ్రిని చంపటానికి ఆవేశంతో వెళ్తున్న మను
Updated : Aug 23, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1160 లో.. రిషి సర్కి మను తండ్రి ఎవరో తెలిసినా కూడా ఎందుకు రియాక్ట్ కావడం లేదు? ఇంత సీరియస్ విషయాన్ని అంత కూల్గా ఎలా తీసుకుంటున్నారు? రిషి సర్ ప్రవర్తనలో ఏదో తేడా ఉంది. ఆయన నా దగ్గర ఏదో దాస్తున్నారు? అసలు అదేంటో కనిపెట్టాలని వసుధార అనుకుంటుంది. మరోవైపు మనుకి మెసేజ్లు పెడుతూనే ఉంటాడు మహేంద్ర. ఎందుకు మను ఫోన్ తీయడం లేదు.. నేను నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని అనుకుంటున్నానంటూ మహేంద్ర మెసేజ్ పెట్టగానే.. అది చూసిన మను ఫోన్ని విసిరికొట్టబోతుంటాడు.
అప్పుడే మనుకి అనుపమ జ్యూస్ తీసుకొని వస్తుంది. దానిని విసిరిగొట్టేసి.. ఈ ఇంటికి ఎవరైన వచ్చారా అంటు మను అడగ్గానే.. రిషి, వసుధారలు వచ్చారని చెప్తుంది. రిషికి చెప్పారా? నా తండ్రి ఎవరోనని మను అడుగుతాడు. అవును.. నేను చెప్పాల్సి వచ్చిందని అనుపమ అంటుంది. ఏం చెప్పావని మను అడిగితే.. నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానమంటూ అనుపమ చెప్తుంది. ఇక ఏం చెప్పావంటు మను నిలదీయగా.. మహేంద్ర నీ కన్నతండ్రి అని చెప్పానని అనుపమ అంటుంది. మరి రిషి ఏమన్నాడని మను అడుగగా.. తనేం మాట్లాడలేదు, నేను ఆ నిజం చెప్పిన తరువాత నా మొహం వాళ్లకి చూపించలేక రూమ్లోకి వెళ్లిపోయానని అనుపమ అంటుంది.
మళ్లీ అడుగుతున్నాను.. మా నాన్న ఇక్కడికి వచ్చాడా? అని మను అడుగుతాడు. దాంతో అనుపమకి కోపం తన్నుకొస్తుంది. ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు.. మీ నాన్న ఇక్కడికి రాలేదు రాలేదు.. రాలేదుని అనుపమ అంటుంది.
నన్ను నిజం తెలుసుకోమంటారా అని మను అడుగుతాడు. వెళ్లి ఆయనతోనే మాట్లాడి డైరెక్ట్గా తెలుసుకుంటానని గన్ చూపిస్తాడు. గన్ పట్టుకుని మను ఆవేశంగా వెళ్తుంటే.. అనుపమ ఆపుతుంది.. ప్లీజ్ మను నువ్వు వెళ్లొద్దని అంటుంది. లేదమ్మా.. ఈ ఆగస్టు నెల అయిపోయేలోగా.. ఈ గన్లో బుల్లెట్స్ ఖాళీ అవుతాయి. ఇది మాత్రం పక్కా అని మను అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.