English | Telugu

అనసూయకి నిజం చెప్పేసిన  కార్తీక్!

  ​స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -135 లో.... శౌర్య కోసం టాబ్లెట్స్ తీసుకొని వస్తుంది అనసూయ. ఈ టాబ్లెట్స్ చిన్న పిల్లల గుండె సమస్యలు ఉంటే వాడుతారని చెప్పారు. శౌర్యకి ఏం సమస్య ఉందని ఆలోచిస్తూ అనసూయ వస్తుంటే.. అప్పుడే నర్సింహా ఎదరుపడతాడు. నీ కోసమే వస్తున్నాను.. నువ్వే వస్తున్నావని నర్సింహా అంటాడు. మనం ఊరు వెళ్లి, ఇల్లు అమ్మాలి నీకు రెండు లక్షలు ఇస్తాను. మిగతా డబ్బులు ఆ శోభ మోహన కొడతానని నర్సింహా అనగానే.. అది దీప ఇల్లు దానికే హక్కు ఉంటుంది. దాని జోలికి రాకని నర్సింహాకీ అనసూయ వార్నింగ్ ఇస్తుంది.

Eto Vellipoyindhi Manasu : భార్యాభర్తలని దూరం చేసిన శ్రీలత.. ఆ పని చేస్తుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -187  లో.... సీతాకాంత్ ని రామలక్ష్మి కొంగున కట్టేసుకని వస్తుంది. అది చూసి ఇది అన్నంత పని చేసిందని శ్రీలత అనుకుంటుంది. ఇదేదో బాగుందని సీతాకాంత్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత శ్రీలత వాళ్ళతో మాట్లాడుతుంటే.. రామలక్ష్మి వెళ్తు ఏవండి అంటూ పిలిచి.. మళ్ళీ కొంగున కట్టేసుకుంటుంది. అలా వాళ్ళని చూస్తూ శ్రీలత ఈర్ష్య పడుతుంది. ఇదేంటి బావ గారు ఎన్నడు లేనిది రామలక్ష్మి కొంగు పట్టుకొని తిరుగుతున్నారని శ్రీవల్లి అంటుంది. అది నాతో ఛాలెంజ్ చేసింది.. అందుకే అలా చేస్తుందని శ్రీలత చెప్తుంది.

Guppedantha Manasu : రిషి గతం రివీల్ .. గుప్పెడంత మనసులో సూపర్ ట్విస్ట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1165 లో... రాధమ్మని తీసుకొని రిషి దగ్గరికి వస్తుంది సరోజ. పదా రంగా మన ఇంటికి వెళదామని రాధమ్మ అనగానే.. రంగా ఏంటి వాడు నా కొడుకు రిషి అని మహేంద్ర అంటాడు. రిషి కాదు రంగా అని చెప్పమని రాధమ్మ అనగానే.. లేదు నానమ్మ నేను రిషిని.. తన కొడుకుని, వసుధార భర్తని అని అనగానే రాధమ్మ, సరోజ షాక్ అవుతారు. మీకు రంగాని చూపిస్తానని రిషి అంటాడు. అప్పుడే సరోజ పక్కకి వెళ్లి నువ్వు వసుధర కలిసి నా బావ పూర్తిగా రిషిలాగా మార్చారు.. ఇప్పుడు అసలు రంగా చూపిస్తాను.. నేను రిషిని అంటున్నాడని శైలేంద్రకి ఫోన్ చేసి చెప్తుంది సరోజ. దాంతో శైలేంద్ర షాక్ అవుతాడు. అసలు రంగా దగ్గరికి వెళ్తున్నారా.. నేను వస్తాను లొకేషన్ పంపు అనగానే సరోజ పంపిస్తుంది.

Brahmamudi : రాహుల్ ఫ్రాడ్ ని కావ్య బయటపెట్టగలదా.. అసలేం జరిగిందంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -500 లో.....స్వప్న బెలూన్ లో లాఫింగ్ లిక్విడ్ ని వేస్తుంది. దాంతో రాహుల్, రుద్రాణి ఇద్దరు బెలూన్ ని పగులగొట్టడంతో ఇద్దరు నవ్వుతూనే ఉంటారు. అది చూసిన స్వప్న.. నా చెల్లిని అవమానిస్తారా రాత్రి అంత నువ్వుతూ ఉండండి అని అనుకుంటుంది. రాహుల్ రుద్రాణిలు నవ్వుతు కిందకి వస్తారు. అక్కడ ధాన్యలక్ష్మి కూర్చొని బాధపడుతుంటే.. అప్పుడే రాహుల్ రుద్రాణిలు నవ్వుతూ వస్తుంటారు అదే పనిగా నువ్వుతుంటే ఏంటి ఎందుకు నవుతున్నారు.. నేను ఇక్కడ బాధపడుతుంటే మీరు హ్యాపీగా ఉన్నారని రుద్రాణి చెంపచెల్లుమనిపిస్తుంది ధాన్యలక్ష్మి. అయిన రుద్రాణి నవ్వుతు ఉంటుంది. దాంతో ధాన్యలక్ష్మి కోపంగా వెళ్లిపోతుంది.

బిగ్ బాస్ బజ్ యాంకర్ ఎవరో తెలిసిపోయింది...

సెప్టెంబర్ 1న రాత్రి 7 గంటల నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అయితే మొదలుకాబోతోంది. ఐతే బిగ్ బాస్ హోస్ట్ ఎవరో తెలుసు కానీ బిగ్ బాస్ బజ్  కి హోస్ట్ ఎవరు అన్న టాపిక్ ఇప్పుడు అందరిలో ఉంది. ఐతే చాలా పేర్లు వినిపిస్తున్నాయి.  ముందుగా శివాజీ అన్నారు తర్వాత శోభా అన్నారు..ఇక ఇప్పుడు ఆడియన్స్ ఎదురుచూపులకు  క్లారిటీ వచ్చేసింది. బిగ్ బాస్ బజ్ హోస్ట్ ఎవరో రివీల్ చేశారు. అందుకు సంబంధించి ప్రోమో కూడా విడుదల చేశారు. ఎవరూ ఊహించని పేరు చూసి షాకయ్యారు ఆడియన్స్. ఈసారి బిగ్ బాస్ బజ్ కి యాంకర్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టెంట్ అంబటి అర్జున్ ని తీసుకున్నారు. అంబటి అర్జున్ చాలా క్లారిటీగా తప్పు చేస్తే ముఖం మీదే చెప్పే మైండ్ సెట్ ఉన్నవాడు. అలాటి వాళ్ళే బిగ్ బాస్ బజ్ కి వస్తే మంచి రేటింగ్ మంచి కాంట్రావర్సీస్ కూడా ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశంతో అంబటి అర్జున్ కి స్వాగతం పలికారు. గత సీజన్స్ లో బిబి కేఫ్, బిగ్ బాస్ బజ్ ని అరియనా గ్లోరీ, శివ, రాహుల్ సిప్లిగంజ్, గీతూ రాయల్ వంటి వాళ్ళు చేశారు. ఇక ఇప్పుడు అంబటి అర్జున్ రాబోతున్నాడు.

కూలీ పనిచేస్తూ కన్పించిన అనసూయ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(karthika deepam 2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -134 లో....కాంచన చైన్ చూపించి ఇది ఎవరిది అని అడుగుతుంది. నన్ను చిన్నప్పుడు ఒక అమ్మాయి కాపాడిందని తెలుసు కదా.. ఆ అమ్మాయి చైన్.. అనుకోకుండా నా దగ్గరికి వచ్చింది. ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడా ఉందో ఆమెకి సాయం చెయ్యాలి.. ఒకవేళ దీప లాంటి పరిస్థితిలో ఉందేమోనని కార్తీక్ అంటాడు. అందరూ అల ఎందుకు ఉంటారు. అందరు నర్సింహాలాగా ఉంటారా? మీ నాన్న లాంటి వాళ్ళు కూడా ఉంటారని కాంచన అంటుంది. నాన్న గురించి నీకు తెలిస్తే తట్టుకోలేవని కార్తీక్ అనుకుంటాడు. ఆ అమ్మాయి ఎదురుపడాలని కోరుకుంటున్నానని కాంచన అంటుంది.

Eto Vellipoyindhi Manasu : భర్తని కొంగున కట్టేసుకున్న భార్య.. అత్త చూసి షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -186 లో......రామలక్ష్మి నందినికి ఫోన్ చేసి అందరం కలిసి భోజనం చేద్దాం రమ్మని అంటుంది. దాంతో నందిని ఒకేసారి అని భోజనానికి వస్తుంది. అప్పుడే రామలక్ష్మి వాటర్ ఉండడంతో జారీ పడిపోతుంటే అప్పుడే సీతాకాంత్ పట్టుకుంటాడు. అప్పుడే నందిని వచ్చి.. వాళ్ళను చూస్తుంది. మీ మధ్యలో నేనేందుకని నందిని అంటుంది. మీరు మా వాళ్ళే అంటూ ముగ్గురికి రామలక్ష్మి భోజనం వడ్డీస్తుంది. సీతా వాలకం చూస్తుంటే రామలక్ష్మి అంటే ఇష్టం లేనట్లుంది అందుకే కదా నేను నా ప్రేమతో దగ్గర అవ్వాలనుకుంటున్నానని నందిని అనుకుంటుంది.

Brahmamudi : అప్పు మాస్ వార్నింగ్.. రాజ్ ఆ పని చేయగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -499 లో...అప్పు, కళ్యాణ్ లని ధాన్యలక్ష్మి అవమానించిన విషయం రాజ్ గుర్తు చేసుకొని బాధపడతాడు.ఇంటికి తీసుకొని రావాలని ఆలోచించాను కానీ వచ్చాక వాళ్ళకి అవమానం జరగకుండా ఆపలేకపోయానని రాజ్ అనుకుంటాడు. మరొకవైపు అప్పు, కళ్యాణ్ లు అటోలో రూమ్ కి వస్తారు. ఆటో దిగుతుంటే ఒకతను కళ్యాణ్ పక్కనుండే బైక్ స్పీడ్ గా వెళ్తుండడంతో అప్పు అతనిపై కోప్పడుతుంది. అతను కూడా అప్పుపై కోప్పడగా.. అప్పు మరింత కోపంగా అతన్ని కొడుతుంది. దాంతో అతను సారి అని చెప్పి వెళ్ళిపోతాడు.

ఇండియన్ ఐడల్ సీజన్ 3 నుంచి కేశవ్ రామ్ ఎలిమినేట్..

ఇండియన్ ఐడల్ సీజన్ 3  ఆహా ఓటిటి ప్లాటుఫారం మీద సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఐతే ఇప్పుడు ఈ సీజన్ లో ఒక్కొక్కరిగా ఎలిమినేట్ ఐపోతున్నారు.   ఐతే ఇంతవరకు తన పాటలతో ఆకట్టుకున్న కేశవ్ రామ్ రీసెంట్ ఎపిసోడ్ లో  ఎలిమినేట్ అయ్యాడు. దాంతో కేశవ్ కి ఉన్న ఫాన్స్, ఆడియన్స్ షాక్ అయ్యారు.  కేశవ్ సాంగ్స్ అంటే పడిచచ్చిపోయే ఫాన్స్ చాలామంది ఉన్నారు. ఆయన గాత్రం మృదుమధురంగా ఉంటుంది.  కేశవ్‌కి ముందు,  కుశాల్ శర్మ, హరి ప్రియ, రాంజీ శ్రీపూర్ణిమ, శ్రీధృతి, అభిగ్న, సాయి వల్లభ ఎలిమినేట్ అయ్యారు. ప్రేక్షకుల నుంచి వస్తున్నా ఓట్లు జడ్జ్ ల స్కోర్‌ ఆధారంగా ఈ  ఎలిమినేషన్స్  జరుగుతున్నాయి.