English | Telugu

Eto Vellipoyindhi Manasu : భార్యతో శోభనం.. సీతాకాంత్ గతంలో ఆ అమ్మాయితో అలా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -182 లో..... ఈ రోజు ఎలాగైనా సీతా సర్ తో నా మనసులో మాట చెప్పి తన సొంతం అవ్వాలని రామలక్ష్మి అనుకుంటుంది. సీతాకాంత్ గదిలోకి రావడం రామలక్ష్మి తన మనసులో మాట చెప్తుంది. సీతాకాంత్ కూడా తన ప్రేమ గురించి చెప్తాడు. ఆ తర్వాత రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. రామలక్ష్మి డోర్ వేసి పాల గ్లాస్ సీతాకాంత్ కి ఇచ్చినట్లు రామలక్ష్మి ఉహించుకుంటుంది. ఇంకా సీతా సర్ రావడం లేదేంటని రామలక్ష్మి టెన్షన్ పడుతుంది.

సీతాకాంత్ కి ఫోన్ చేస్తుంది కానీ అతను లిఫ్ట్ చెయ్యడు. మరొకవైపు సీతాకాంత్ నందిని పార్టీలో అన్న మాటలు గుర్తు చేసుకుంటాడు. నందిని కూడా తన గతాన్ని గుర్తుకుచేసుకుంటుంది. గతంలో సీతాకాంత్ కోసం నందిని వెయిట్ చేస్తుంది. ఈ రోజు ఎలాగైనా డాడ్ ని ఒప్పించి సీతాకాంత్ కి జాబ్ ఇప్పించాలని అనుకుంటుంది. ఆ తర్వాత సీతాకాంత్ నందిని వాళ్ళ డాడ్ దగ్గరికి వస్తాడు. అతను జాబ్ ఇస్తాడు. దాంతో నందిని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సీతాకాంత్ తో నందిని ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి నందిని వచ్చి బయటకు వెళదామని అంటుంది. లేదు వర్క్ ఉందని సీతా అనగానే నేను మా డాడ్ తో మాట్లాడతానంటూ తన వెంట తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత నందిని వాళ్ళ డాడ్ నందిని రాగానే.. ఈ సీతాకాంత్ ఫోటోని గదిలో ఎందుకు ఉందని అడుగుతాడు. నేను సీతాకాంత్ ని ప్రేమిస్తున్నానని నందిని చెప్పగానే.. నువ్వు అతన్ని ప్రేమించడమేంటని కోప్పడతాడు. అతన్ని పెళ్లి చేసుకోకుంటే చచ్చిపోతానని నందిని అనగానే.. అలా అనొద్దు నీకంటే మాకూ ఏది ఎక్కువ కాదని నందిని వాళ్ళ నాన్న అంటాడు.

అ తర్వాత నందిని సీతాకాంత్ కి ప్రపోజ్ చేస్తుంది. నా జీవితంలో పెళ్లి అనేది ఉండదని చెప్తాడు. నేను కూడా పెళ్లి చేసుకోకుండా ఉంటానని నందిని అంటుంది. సీతాకాంత్ జాబ్ కి రిజైన్ చేసి వెళ్లిపోతాడు. గతంలో జరిగింది నందిని గుర్తు చేసుకుంటుంది. మరొకవైపు సీతాకాంత్ గురించి రామలక్ష్మి టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత సీతాకాంత్ నందిని ఇంటికి వెళ్ళగానే.. నా సీత నా కోసం వచ్చాడంటూ ఎక్సైట్మెంట్ అవుతుంది. కూర్చోమని నందిని అనగానే.. సీతాకాంత్ కూర్చుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.