English | Telugu

యాంకర్ రష్మీ ఇంట తీవ్ర విషాదం...

బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెర మీద శ్రీముఖి, రష్మీ హవానే కొనసాగుతోంది. అలాంటి యాంకర్ రష్మీ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. రష్మీ తాతయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. ఎంతో ఇష్టమైన తాతయ్య మరణన్ని తట్టుకోలేకపోతున్నానని రష్మి ఒక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది. తన బామ్మ తలకు తాతయ్య నూనెతో మర్దన చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది.. ‘మా తాత అచ్చమైన స్త్రీవాది. ఫైనల్ గా ఆయన స్వర్గంలో మా బామ్మను కలుసుకున్నారు. ఆగస్టు 17 న మా తాతయ్య ఆనారోగ్యంతో మరణించారు. ఆయనకు తుది వీడ్కోలు పలికాం.

మా బామ్మ తాతయ్యల మనసులు విడదీయలేనివి. మా బామ్మ భౌతికంగా దూరమయ్యాక మా తాతయ్య చాలా బాధపడుతూనే ఉన్నారు. ఏడాదిన్నర నుంచి ఆమె గురించిన జ్ఞాపకాలనే మాకు పదేపదే చెప్పేవాడు. మా బామ్మ మీద ఎంత ప్రేమ ఉందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది’ అని రష్మీ ఒక హార్ట్ టచింగ్ లైన్స్ రాసింది. రష్మీ షేర్ చేసిన పోస్ట్ పై చూసి ఫాన్స్ , నెటిజన్స్ స్ట్రాంగ్ గా ఉండాలంటూ ఆమెకు ధైర్యం చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. రష్మీ తన అందంతో వచ్చి రాని తెలుగుతో బాగా ఫేమస్ అయ్యింది. ఇక ఆ తర్వాత వెండితెరపై మెరవాలనుకుంది కానీ అదృష్టం కలిసి రాలేదు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.