English | Telugu
యాంకర్ రష్మీ ఇంట తీవ్ర విషాదం...
Updated : Aug 22, 2024
బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెర మీద శ్రీముఖి, రష్మీ హవానే కొనసాగుతోంది. అలాంటి యాంకర్ రష్మీ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. రష్మీ తాతయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. ఎంతో ఇష్టమైన తాతయ్య మరణన్ని తట్టుకోలేకపోతున్నానని రష్మి ఒక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది. తన బామ్మ తలకు తాతయ్య నూనెతో మర్దన చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది.. ‘మా తాత అచ్చమైన స్త్రీవాది. ఫైనల్ గా ఆయన స్వర్గంలో మా బామ్మను కలుసుకున్నారు. ఆగస్టు 17 న మా తాతయ్య ఆనారోగ్యంతో మరణించారు. ఆయనకు తుది వీడ్కోలు పలికాం.
మా బామ్మ తాతయ్యల మనసులు విడదీయలేనివి. మా బామ్మ భౌతికంగా దూరమయ్యాక మా తాతయ్య చాలా బాధపడుతూనే ఉన్నారు. ఏడాదిన్నర నుంచి ఆమె గురించిన జ్ఞాపకాలనే మాకు పదేపదే చెప్పేవాడు. మా బామ్మ మీద ఎంత ప్రేమ ఉందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది’ అని రష్మీ ఒక హార్ట్ టచింగ్ లైన్స్ రాసింది. రష్మీ షేర్ చేసిన పోస్ట్ పై చూసి ఫాన్స్ , నెటిజన్స్ స్ట్రాంగ్ గా ఉండాలంటూ ఆమెకు ధైర్యం చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. రష్మీ తన అందంతో వచ్చి రాని తెలుగుతో బాగా ఫేమస్ అయ్యింది. ఇక ఆ తర్వాత వెండితెరపై మెరవాలనుకుంది కానీ అదృష్టం కలిసి రాలేదు.