English | Telugu

Guppedantha Manasu : శైలేంద్రకు వసుధారతో సారీ చెప్పించిన రిషి...

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1159 లో.....అసలు ఆ మనుగాడు ఏం చేసినా భయపడట్లేదు.. వాడు అర్థం అవ్వడం లేదు.. ఏదోదో వాగేసాడు.. ఆగస్ట్ లో ఏదో ఒకటి చేస్తానని వార్నింగ్ ఇచ్చాడని శైలేంద్ర అనగానే.. అంటే వాడు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాడు అనుకుంటున్నావా.. తన తండ్రి ఎవరో తెలిసిన మరుక్షణం చంపేస్తాను అన్నవాడు ఏం చేయకుండా సైలెంట్ గా ఉంటున్నాడని ఆలోచిస్తున్నావా అని దేవయాని అంటుంది. ఎవరికైనా తండ్రి మీద ప్రేమ తప్ప కోపం ఉండదు.. అందరూ తండ్రి ఎవరు అనడం వల్ల వాడికి తండ్రి పై కోపం పెరిగింది కానీ మహేంద్ర అంటే ఇష్టం కాబట్టి ఏం చెయ్యలేకపోతున్నాడని దేవయాని అంటుంది. నువ్వే వాడిని టైమ్ దొరికినప్పుడల్లా ఇర్రిటేట్ చేయమని దేవయాని చెప్తుంది. దాంతో వాడు పెద్ద ముదరు అని శైలేంద్ర అంటాడు.

మరొకవైపు అసలు నేను మను తండ్రి ఏంటి అసలు? ఎలా జరిగింది? నేను ఎప్పుడు అనుపమని మంచి స్నేహితురాలిలాగే చూసానని మహేంద్ర బాధపడతాడు. వసుధర అంత గట్టిగా చెప్తుందంటే అది నిజమే అయి ఉంటుందని మహేంద్ర అనుకుంటాడు. ఆ తర్వాత మనుకి మహేంద్ర ఫోన్ చేస్తాడు. మను మహేంద్ర కాల్ చూసి కోపంగా ఉంటాడు.. లిఫ్ట్ చెయ్యడు. ప్లీజ్ మను ఫోన్ లిఫ్ట్ చెయ్ నీతో మాట్లాడాలని మహేంద్ర మెసేజ్ చేస్తాడు. అయినా మను ఫోన్ లిఫ్ట్ చేయడు. ఆ తర్వాత అనుపమకి కూడా ఫోన్ చేస్తాడు.. తను లిఫ్ట్ చెయ్యదు. మహేంద్రకి రిషి కాల్ చేసి ఎక్కడున్నారు.. ఇంట్లో నుండి బయటకి రావద్దని చెప్తాడు. అసలు మీరేం చేస్తున్నారు నాకు అర్థం అవడం లేదు.. ఇంత పెద్ద విషయమని రిషితో వసుధార అంటుండగా.. అప్పుడే శైలంద్ర వచ్చి ఎంత పెద్ద విషయం అంటాడు. నీకు సెన్స్ లేదా ఎందుకు పర్మిషన్ లేకుండా వస్తావని శైలేంద్రపై వసుధార కోప్పడుతుంది. ఏంటి మా అన్నయ్య అంటే రెస్పెక్ట్ లేదా అలా తిడుతున్నావ్.. నువ్వు ఇప్పుడే మా అన్నయ్యకి సారి చెప్పాలని రిషి అనగానే మీరు ఎందుకు చెప్పమని అంటున్నారో నాకు తెలుసంటు శైలేంద్రకి వసుధార సారీ చెప్తుంది.

అ తర్వాత రిషిని శైలేంద్ర పక్కకు తీసుకొని వస్తాడు. ఏంటి ఏదో పెద్ద విషయం అంటుంది.. ఏంటి రంగా అని శైలేంద్ర అడుగుతాడు. మను గురించి, మను ఎవరని రిషి అడుగుతాడు. మా బాబాయ్ దగ్గరకి కోపంగా మను ఏమైనా వచ్చాడా అని అడుగుతాడు. లేదని రిషి చెప్తాడు. మీరు ఎండీ పదవి కోసం చాలా తప్పులు చేశారంట కదా అని వసుధర మేడమ్ అంటున్నారని రిషి అంటాడు. అదేం లేదు అవన్నీ నీకనవసరమని శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.