English | Telugu

శ్రీముఖి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా...నా లక్కీ హీరోయిన్!

ఈ ఆదివారం ప్రసారం కాబోయే ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్స్ ప్రోమో మాత్రం కేక పుట్టిస్తోంది. ఎందుకంటే గుప్పెడంత మనసు సీరియల్ టీమ్ ఇక్కడికి వచ్చింది. వీళ్లకు ఫేర్ వెల్ పార్టీ ఇచ్చింది శ్రీముఖి అండ్ టీమ్. ఇక ఈ టైములో రిషి అంటే గర్ల్స్ కి వసు అంటే బాయ్స్ పిచ్చ ఫాన్స్ అని స్రేముఖి చెప్పింది. అలాగే రిషి దగ్గర నుంచి ఒక ప్రామిస్ తీసుకుంది శ్రీముఖి. "గుప్పెడంత మనసు ఐపోయింది అని కాకుండా నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని మాటివ్వు" అని అడిగింది. "బ్రహ్మముడి ఆర్టిస్టుల కన్నా నేనే ఎక్కువగా డేట్స్ ఇస్తా" అని చేతిలో చెయ్యి వేసి ప్రామిస్ చేసాడు రిషి. ఇక ఈ షోకి స్పెషల్ గెస్ట్ గా రిషి సీరియల్ మదర్ జగతి వచ్చింది.

Karthika Deepam2 : కాశీ, దాస్ లని చూసి కార్తీక్ షాక్.. శౌర్యకి ఏదో ఉందని దీపకి డౌట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -137 లో....కాశీ , దాస్ వస్తున్నారని పారిజాతం హడావిడి చేస్తుంది. మనవడు వస్తున్నాడని పిన్ని హడావిడి అని దశరత్ అనగానే.. వాడికీ రాఖి కట్టడం ఇష్టం లేదు.. బావ కోసం మాత్రమే కడుతున్నానని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత దాస్ కాశీ ఇంటికి రాగానే పారిజాతం వెళ్లి ఇద్దరినీ ప్రేమగా పలకరిస్తుంది. ఎలా ఉన్నావంటూ కాశీతో మాట్లాడుతుంది. ఇంట్లో అందరిని పారిజాతం పరిచయం చేస్తుంది. జ్యోత్స్న అక్క అవుతుందని దాస్ అనగానే.. జ్యోత్స్న చిరాకుగా చూస్తుంది. అప్పుడే కాంచనని తీసుకొని కార్తీక్ వస్తాడు. కాశీ, దాస్ లు అక్కడ ఉండడం చూసి.. ఏంటి ఇక్కడున్నారని కార్తీక్ అడుగుతాడు.

Guppedantha Manasu : శైలేంద్ర పాపాల చిట్టా బయటపెట్టిన రిషి...

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu ).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1167 లో.. శైలేంద్రని చంపడానికి మహేంద్ర కోపంగా వస్తుంటే.. శైలేంద్ర ఎదరుపడుతాడు. కోపంగా ఎక్కడికో వెళ్తున్నారని శైలేంద్ర అడుగుతాడు. నీకోసమే వస్తున్నానురా అంటూ తన కాలర్ పట్టుకుంటాడు మహేంద్ర. ముందు నిన్ను ఫినిష్ చేసి తర్వాత వాళ్ళ పని చూస్తానని శైలేంద్ర అనగానే.. మహేంద్ర తన చెంప చెల్లుమనిపిస్తాడు. ఆ తర్వాత కొందరు రౌడీలు మహేంద్రని పట్టుకుంటారు. కర్రతో శైలేంద్ర మహేంద్ర తలపైన కొడుతాడు. బాబాయ్ నీ గురించి తెలిసే నా ప్లాన్ లో నేనున్నానని శైలేంద్ర రౌడీలకి చెప్పి.. మహేంద్రని కిడ్నాప్ చేయిస్తాడు.

Brahmamudi : ఆటో నడుపుకుంటున్న దుగ్గిరాల వారసుడు.. రాహుల్ ప్లాన్ సక్సెస్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -502 లో... కావ్య దగ్గరికి స్వప్న వచ్చి.. రాహుల్ ఫ్రాడ్ చేస్తున్న విషయం చెప్తుంది. ఈ విషయం ఇంట్లో చెప్పి ఎలాగైనా దాన్ని ఇద్దరు అక్కాచెల్లెళ్ళు ఆపాలని అనుకుంటారు. మరొకవైపు జాబ్ చేస్తే.. నెలంత కష్టపడితే డబ్బుకు వస్తాయ్.. అలా అయితే మాకు రోజు ఎలా గడుస్తుందని కళ్యాణ్ అనుకుంటాడు. అప్పుడే ఒక ఆటో డ్రైవర్ ని చూసి తన దగ్గరికి వెళ్లి జాబ్ కావాలి.. ఆటో నడుపుతానని అంటాడు. సరే నీకు సేట్ నెంబర్ ఇస్తాను ఆటో అద్దెకి ఇస్తాడు.. అన్నీ పోను అయిదు వందలు మిగులుతాయని అతను చెప్పగానే అందుకు కళ్యాణ్ సరే అంటాడు.

నా ఇమేజ్ కి బిగ్ బాస్ కరెక్ట్ కాదబ్బా

బిగ్ బాస్ న్యూ సీజన్ రావడానికి ఇంకెంతో టైం లేదు. ఐతే కంటెస్టెంట్స్ లిస్ట్ ఇది అంటూ రకరకాల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సీజన్ లో ‘చక్రవాకం’, మొగలి రేకులు సీరియల్స్ ఫేమ్ ఇంద్రనీల్ కూడా ఉన్నాడని  ప్రచారం జరుగుతోంది. అయితే ఇంద్రనీల్ మాత్రం తాను ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్లడం లేదంటూ ఒక వీడియోని తన యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేసాడు. తాను బిగ్ బాస్ కు సెలెక్ట్ అయ్యానని, ఇంటర్వ్యూలకు కూడా వెళ్లానని చెప్పాడు. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి మాత్రం వెళ్ళాను అనే విషయం బల్లగుద్ది చెప్పేసాడు. "నన్ను అభిమానించే ఫ్యాన్స్‌కి చెప్పేది ఏంటంటే..నేను బిగ్ బాస్‌ హౌస్ లోకి వెళ్లడం లేదు.

Karthika Deepam2 : కాశీకి రాఖీ కట్టిన దీప..నిజం తెలుసుకొని షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -136 లో.....పారిజాతం దాస్ ని కలుస్తుంది. నేను చేసిన పనివల్ల మీ జీవితం ఇలా అయిందని పారిజాతం అనగానే.. అంత పెద్ద తప్పు ఏం చేసావని దాస్ అడుగుతాడు. చేశాను కానీ నీలా.. నీ కొడుకు, నా మనవడు అవ్వకూడదు.. వాడికి ఆ కుటుంబాన్ని దగ్గర చెయ్యాలని పారిజాతం అంటుంది. రేపు రాఖి పండుగ కదా కాశీని ఇంటికి తీసుకొని రా వాడితో జ్యోత్స్న చేత రాఖి కట్టిస్తానని పారిజాతం అంటుంది. అయిన వాళ్ళు రానిస్తారా.. నన్ను తిట్టారు.. కానీ వాడిని తిడితే భరించలేనని దాస్ అనగానే.. నువ్వు తీసుకొని రా నేను చూసుకుంటానని పారిజాతం అంటుంది. 

Eto Vellipoyindhi Manasu : మ్యాగజైన్ ఫోటో కోసం నందిని ప్లాన్.. భర్తని ఒప్పించిన భార్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -188 లో.....సందీప్, శ్రీలతలు కలిసి రామలక్ష్మి, సీతాకాంత్ లని దూరంగా ఉంచడానికి ప్లాన్ చేస్తారు. సీతాకాంత్, రామలక్ష్మిలు వస్తుండడం గమనించి యాక్టింగ్ స్టార్ట్ చేస్తారు. ఎందుకు  నిప్పుల గుండంలో నడుస్తానంటున్నావని శ్రీవల్లి, సందీప్ లు శ్రీలతని అడుగుతారు. అప్పుడే రామలక్ష్మి, సీతాకాంత్ లు వస్తారు. ఏమైందని అడుగుతారు. మీ జాతకం జ్యోతిష్యునికి చూపించాను. అందులో ఏవో దోషాలు ఉన్నాయట.. మీరు ఇద్దరు కలిసి ఉంటే మీకు గండం ఉందట అని శ్రీలత అంటుంది. దానికి పరిహారంగా ఇది చేస్తానంటున్నానని అనగానే.. వద్దని సీతాకాంత్ అంటాడు. నువ్వు ఏ నిప్పుల గుండంపై నడవాల్సిన అవసరం లేదు.. నువ్వు చెప్పినట్టే దూరంగా ఉంటామని సీతాకాంత్ అంటాడు.

Brahmamudi : రాహుల్ వేసిన ప్లాన్ లో వాళ్ళు ఇరుక్కుంటారా.. అది నిజమైన బంగారమేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -501 లో.... అప్పు, కళ్యాణ్ లని ఇంటికి రమ్మని కృష్ణమూర్తి ఆహ్వానిస్తాడు. కానీ రాలేమని అప్పు చెప్తుంది. ఆ తర్వాత కనకం వెళ్ళిపోతు అప్పుకి మూడు వేయిలు ఇస్తుంది. వద్దని అప్పు అంటున్నా వినకుండా కనకం ఇచ్చి వెళ్తుంది. ఆ తర్వాత కనకం వాళ్లు బయటకు వచ్చాక.. ఇలా వచ్చి అలా వెళ్తున్నామని కృష్ణమూర్తి అనగానే.. ఉంటే ఏం పెడుకతారు.. పాపం వాళ్ళకి తినడానికి కూడా లేదు.. వాయినం ఇచ్చిన ప్రసాదం మనకి ఇచ్చిందని కనకం అనగానే.. కళ్యాణ్ జాబ్ చూసుకున్నాకా అదంతా ఏం ఉండదని కృష్ణమూర్తి అంటాడు.