బాలయ్య ఎంట్రీ అదుర్స్..!

      నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో 14 రీల్స్ సంస్థ ఓ చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. బోయపాటి శ్రీను బాలయ్య ఇంట్రడక్షన్ సీన్ ను పవర్ ఫుల్ గా ప్లాన్ చేశాడట. రామ్-లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ నేతృత్వంలో బాలయ్య ఇంట్రడక్షన్ ఫైట్ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తున్నాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు."సింహ" తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. సాయి కొర్రపాటి, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుకంర నిర్మాతలు.

విలన్‌ ఆఫ్‌ ది మిలీనియం ఇకలేరు

      బ్యాడ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా ఇకలేరు.. ఎన్నో విలక్షణ పాత్రలతో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకున్న బాలీవుడ్‌ సీనియర్‌ యాక్టర్‌ ప్రాణ్‌ శుక్రవారం కన్నుమూశారు.. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రాణ్.. మూడు వారాలగా లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్పటినుంచి వెంటిలేటర్‌పై ఉన్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు ముంబైలోని శివాజీ పార్క్‌లో శనివారం మధ్యాహ్నం 12గంటలకు నిర్వహించనున్నారు. 93 సంవత్సరాల ప్రాణ్‌ తన ఆరు దశాబ్దాల కెరీర్‌లో 400కు పైగా సినిమాల్లో నటించారు. ఇండియన్‌ సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను భారతీయ సినిమా రంగంలో అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఈ ఏడాదే అందుకున్నారు.   ప్రాణ్ పూర్తి పేరు ప్రాణ్ కిషన్ సికంద్. 1920, ఫిబ్రవరి 12న పాతఢిల్లీలోని ఒక జన్మించిన ఆయన 1940లో యమలా జాట్ సినిమాతో కెరీర్ ప్రారంభించారు. 1960, 70ల్లో విడుదలైన భారీ బడ్జెట్ హిందీ సినిమాలన్నిటిలోనూ ఆయన నటించారు. ఆయన కెరీర్‌లో మధుమతి, కశ్మీర్ కీ కలి, మిలాన్ వంటి క్లాసిక్స్ ఉన్నాయి. డాన్, అమర్ అక్బర్ ఆంటోనీ, జంజీర్ వంటి బాక్ల్‌బస్టర్‌ సినిమాల్లో ఆయన ఇంపార్టెంట్‌ రోల్స్‌లో కనిపించారు. హిందీలోనే కాదు తాండ్రపాపరాయుడు కొదమసింహం లాంటి సినిమాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. 1990 నుంచి ఆరోగ్య కారణాలతో నటనకు దూరంగా ఉంటున్నారు ప్రాణ్‌. 2000 సంవత్సరంలో స్టార్ డస్ట్ పత్రిక ఆయన్ను 'విలన్ ఆఫ్ ద మిల్లీనియం'గా అభివర్ణించింది. సీఎన్ఎన్ ప్రకటించిన ఆసియాలో టాప్ 25 నటుల జాబితాలో ప్రాణ్ కూడా ఉన్నారు. 2001లో భారత ప్రభుత్వం ఆయన్ను పద్మభూషణ్‌తో గౌరవించింది. మేటి నటునిగా ఇండియన్‌ సినిమాకు ఎన్నో అత్యున్నత పాత్రలను అందించిన ప్రాణ్‌ లేనిలోటు ఎప్పటికీ పూడ్చలేనిది..

గోపీచంద్ 'సాహసం' హిట్ కోసమేనా !

      వరుస పరాజయాలతో సతమవుతున్న హీరో గోపీచంద్ ఒకటిన్నర సంవత్సరం గ్యాప్ తరువాత 'సాహసం' సినిమాతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో గోపీచంద్ సరసన తాప్సీ నటించింది. అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సాహసం’ కొంతవరకూ పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఓ ప్రైవేటు సెక్యూరిటీ ఏజన్సీలో గౌతమ్(గోపీచంద్) ఓ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తుంటాడు. చాలా వేగంగా ధనవంతుడు అయిపోవాలనేది అతని లక్ష్యం. దాంతో అతని లక్ష్యాన్ని చేరుకోవడం కోసం బాబాలను కలిసి జాతకాలు చూపించుకుంటూ, లాటరీ టికెట్స్ కొంటూ ఉంటాడు. కానీ అతని లక్, లాటరీ టికెట్ల ఫలితాలు అతన్ని బాగా నిరుత్సాహపరుస్తుంటాయి. అప్పుడే అతనికి ఓ కొత్త దారి దొరుకుతుంది. ఆ దారి ఏంటీ? అతను అనుకున్న దాన్ని ఎలా సాధించాడు అనెది సినిమాలో చూడాలి! చంద్రశేఖర్ యేలేటి 'సాహసం' గోపీచంద్ కి హిట్ నిస్తుందా? లేదో.

అత్తాపూర్ బాబాగా పవన్ కళ్యాణ్

      పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త గెటప్ ప్రేక్షకుల్ని అలరించబోతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అత్తారింటికి దారేది ’ సినిమాలో పవన్ కళ్యాణ్ ‘అత్తాపూర్ బాబా’ అవతారంలో కనిపించబోతున్నాడట. ఈ అవతారంతో పవన్ ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తాడని అంటున్నారు. దీనికి సంబందించిన ఓ ఫోటో నెట్లో హల్ చేస్తూ జనాల్లో క్రేజ్ ని సంపాదించుకుంటుంది. పవన్ కి తోడు కామెడీ సీన్ ను మరింత పండించడానికి బ్రహ్మానందం, అలీలు కూడా ఆయనతో జత కలవనున్నారని, ఈ ముగ్గురి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని అంటున్నారు. ఈ సన్నివేశం చిత్రానికి మరింత హైలైట్ అవుతుందని చెబుతున్నారు. ఈ సినిమాలో సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఫేమస్ బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ తెలుగులో నటిస్తున్న మొదటి సినిమా ఇది.

జసాన్‌లో రజనీ సినిమా

  ఇండియన్‌ సినిమాలో అత్యంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరో ఎవరు అంటే తడుముకోకుండా చెప్పే పేరు రజనీ కాంత్‌.. సౌత్‌ సూపర్‌ స్టార్‌ వెలుగొందుతున్న రజనీ ఇండియాతో పాటు ఇతర దేశాల్లో కూడా ఫ్యాన్‌ పాలోయింగ్‌ విపరీతంగా ఉంది.. ముఖ్యం జపాన్‌ లాంటి దేశాల్లో రజనీ మేనియా ఓ రేంజ్‌లో ఉంది.   సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీ క్రేజ్ జపాన్ లో సునామీ సృష్టిస్తోంది. రజనీ పేరుతో.. జపాన్ లో ఓ సినిమా రూపొందుతోంది. అంతేకాదు జపాన్‌లో ఉన్న రజనీ ఫ్యాన్స్‌ అంతా కలిసి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.. అది రజనీ స్టామినా.   ది రజనీ ఎఫెక్ట్ పేరుతో ఓ ఇంగ్లీష్‌ సినిమా రూపొందుతోంది. ఓ జపనీయుడు సూపర్ స్టార్ అవ్వాలనే కలను నెరవేర్చుకోవడానికి ఏం చేశాడన్న కథాశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రజనీ నే ఇన్సిపిరేషన్‌. రజనీ నిజ జీవితం ఆధారంగానే ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు.   యూకే బార్కింగ్ మాడ్ ప్రొడక్షన్ ఈ చిత్రానికి, లండన్ కి చెందిన నెల్సన్, కువేరా దర్శకత్వం వహిస్తున్నారు. మరో విశేషమేంటంటే.. ఇందులో కొందరు ప్రముఖ తమిళ నటులు గెస్ట్ రోల్స్ పోషిస్తున్నారట. జర్మనీలో ఈ నెల 17 నుంచి జరగనున్న పదవ స్టట్ గట్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ చిత్రం ప్రీమియర్ షో జరుగుతుంది.. జపాన్‌ లో తెరకెక్కిన రజనీ అక్కడితో పాటు ఇండియాలో కూడా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందంటున్నారు ఫ్యాన్స్‌..

నటి అంజలిని అరెస్టు చేస్తామని కోర్ట్ వార్నింగ్

      సినీ నటి అంజలికి సైదాపేట కోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. వచ్చే నెల 12లోపు కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. లేనిచో అరెస్టు వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది. అంజలి మిస్సింగ్ కేసును విచారణకు స్వీకరించిన సైదాపేట్ కోర్టు ఇప్పటికే మూడు సార్లు ఆమె గైర్హాజరవడాన్ని తీవ్రంగా పరిగణించింది. మరోవైపు రెండు నెలల కిత్రం అంజలి 'మిస్సింగ్' కు సంబంధించి మద్రాస్ హైకోర్టులో మరో కేసు నడుస్తోంది. గతంలోనూ అంజలి విచారణ నిమిత్తం కోర్టుకు హాజరు కాకపోవటంతో ఆమెకు కోర్టు మరోసారి అవకాశం ఇచ్చింది. తదుపరి తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. అంతే కాకుండా విచారణకు హాజరుకాని పక్షంలో అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని కూడా కోర్టు హెచ్చరించింది. అయినా అంజలి కోర్టు హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోలేదు. మళ్లీ కోర్టుకు డుమ్మా కొట్టింది. ఇప్పటికే నాలుగు వాయిదాలు ఆ నాలుగు సార్లు అంజలి కోర్టుకు గైర్హాజరైంది. దాంతో తదుపరి విచారణకు కోర్టుకు హాజరు కాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. మరోవైపు అంజలికి అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని పిటిషనర్ కలంజియమ్ కోర్టును కోరారు. మరోవైపు అంజలి తీరుపై ఇటీవలే మద్రాసు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనెల 9లోగా కోర్టు ఎదుట హాజరు కావాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.

పవన్ కళ్యాణ్ తో మిర్చి భామ

      హీరోయిన్ హంసా నందిని బంఫర్ కొట్టేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చిందులేసే అవకాశం హంసా నందిని కి దక్కింది. 'అత్తారింటికి దారేది' చిత్రంలో ఐటెం సాంగు కోసం దర్శకుడు త్రివిక్రమ్ ఈమెను ఎంపిక చేసినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. మిర్చి" సినిమాలో మిర్చి మిర్చి అంటూ అంటూ తన అందం, డాన్సులతో అదరగొట్టిన హంసనందినికి అవకాశాలు బాగానే వస్తున్నాయి.ఇప్పటికే నాగార్జునతో కలిసి "భాయ్" చిత్రంలో ఓ కత్తి లాంటి మాస్ సాంగ్ లో నటించేసింది. ఇపుడు పవన్ తో ఐటెం సాంగ్ చేసే డేట్ కోసం హంస ఎదురుచూస్తుందట. ఈసినిమా తరువాత టాలీవుడ్ లో మరిన్ని ఐటెం అవకాశాలు అవకాశాలు వస్తాయనే ఆశతో ఉంది.

నితిన్ తో పూరిజగన్నాధ్ ‘హార్ట్ ఎటాక్’

      తెలుగు సినిమా ఇండస్ట్రీలో విజయాలు, పరాజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసే డైరెక్టర్ పూరి జగన్నాధ్. బిజినెస్ మ్యాన్ తరువాత పూరి కి హిట్ సినిమా రాలేదు. ఇప్పుడు పూరీ దర్శకత్వం వహించే చిత్రానికి హీరోగా నితిన్ నటించనున్నాడు. వరుస విజయాలతో మంచి స్పీడ్ మీద వున్ననితిన్ పూరీ చెప్పిన కథ విని ఓకే చేశాడంట. వైష్ణో అకాడమీ బ్యానర్ పై పూరీనే దర్శకత్వం వహిస్తూ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. ఈ సినిమా టైటిల్ గా ‘హార్ట్ ఎటాక్ ’ ని పెట్టారు. ఈ సినిమాను ఆగష్టులో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాల తరువాత నితిన్ మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లు లైన్లో వున్నాయి. కిక్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్వకత్వంలో, అలా మొదలైంది, జబర్దస్త్ చిత్రాల ఫేం నందినీరెడ్డి దర్శకత్వంలో చేయనున్నారు.

సింగం-2 హీరో సూర్య కేక

      హీరో సూర్య, అనుష్క, హన్సిక ప్రధాన తారాగణంగా రూపొందిన 'సింగం-2' సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రిలీజైంది. 'సింగం-2' లో సూర్య మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా సూర్య వన్ మాన్ షో అని చెప్పవచ్చు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సూర్య నటన చాలా బాగుంది. సినిమాలో సూర్య చెప్పే డైలాగ్స్ మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చుతాయి. డైరెక్టర్ హరి మరోసారి తన సత్తా చూపించాడు. సూర్య నుంచి ఎలాంటి నటన రాబట్టుకోవాలో తనకే తెలుసునన్నట్లు 'సింగం-2' మలిచాడు. హన్సిక సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర చేసింది కానీ చాలా తక్కువ సేపు స్క్రీన్ మీద కనపడుతుంది. అనుష్క పాటలవరకే పరిమితమైంది. వివేక్..సంతానం కామెడీ, స్టంట్స్, డాన్స్ స్వీక్వెన్స్ అదుర్స్ అనిపించాయి.

తెలుగు వారి లోగిళ్లలో పూసిన పున్నాగ పరిమళం

    తెలుగు సినీ సంగీత ఆకాశంలో మెరిసిన స్వరతార ఆయన తెలుగు సంస్కృతి సాగరంలో వెలసిన సంగీత దీవి ఆయన తెలుగు వారి లోగిళ్లలో పూసిన పున్నాగ పరిమళం   జామురాతిరి అలసిన మనసులకు జాబిలమ్మ కిరణం   మౌనంగానే ఎదగమని చెప్పిన మొగ్గలోని లాలిత్యం గాలిని సైతం గాంథర్వం చేయగల హృదయ మేళనం ఆయనే తెలుగు స్వరాల సుస్వరవాణి కీరవాణి   కోట్లాది ప్రజలను ఊరించి, ఊగించి, ఉత్తేజపరిచి, ఉల్లాస డోలికల ఆడిస్తున్న ఓ సంగీత సరస్వతి ఆయన.. శాస్త్రీయ సంగీతంలో స్వరరాగమే ఆయన పేరుగా ఉండటం కాకతాళీయమే అయినా దాన్ని సార్ధకం చేసుకున్న కారణ జన్ముడాయన.. సంగీత ధ్వనిని తన అణువనువునా నింపున్న కీరవాణి పూర్తి పేరు మరకతమణి కీరవాణి.. ప్రస్థుతం స్వర తరంగమై ఎగసి పడుతున్న కీరవాణి 1961 జూలై 4న జన్మించారు.. చిన్ననాటి నుంచే సంగీతంపై ఉన్న మక్కువతో ఎలాగైన ఆ రంగంలో పరిణతి సాదించాలనుకున్నారు.. అందుకే 1987లో ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర అసిస్టెంట్‌గా చేరి తన ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నారు.. తొలిసారిగా ఉషాకిరణ్‌ మూవీస్‌ వారు తెరకెక్కించిన మనసు మమత సినిమాతో 1989లో సంగీత దర్శకునిగా మారారు కీరవాణి.. ఆ తరువాత వరుసగా సంగీత దర్శకునిగా అవకాశాలు వస్తున్న కీరవాణి అనుకున్న స్థాయి గుర్తింపు మాత్రం రాలేదు.. రామ్‌గోపాల్‌ వర్మ, నాగార్జున లాంటి వారితో భారీ సక్సెస్‌లు అందించినా అవేవి ఆయనకు స్టార్‌డమ్‌ను సాధించి పెట్టలేదు.. కీరవాణి కీర్తిని జాతీయస్థాయిలో ఉన్నత శిఖరాలకు చేర్చిన సినిమా అన్నమయ్య..నాగార్జున రాఘవేంద్రరావుల కాంభినేషన్‌లో వచ్చిన ఈ సినిమా విజయంలో కీరవాణి పాత్ర ఎంతో ఉంది.. అన్నమయ్య పదాలకు మరింత అందాన్ని చేకూర్చేలా తన బాణీలతో రంగులద్దిన కీరవాణి ఆ సినిమాకు గాను ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ అవార్డును సైతం అందుకున్నారు.. అంతేకాదు నాలుగు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులతో పాటు.. ఎనిమిది నంది అవార్డులను సైతం సొంతం చేసుకున్న అరుదైన రికార్డ్‌ కీరవాణి సొంతం.. కేవలం తెలుగులోనేకాదు తమిళ, మళయాల భాషల్లోనూ కీరవాణి ఎన్నో అద్భుత విజయాలను అందుకున్నారు.. అంతేకాదు తెలుగు వారందరూ గర్వంగా చెప్పుకునేలా ఉత్తరాదిలో కూడా తన సంగీతం జయ కేతనం ఎగురవేశారు కీరవాణి.. దాదాపు 200 లకు పైగా సినిమాలకు సంగీతం అందించిన కీరవాణి ఇప్పటికీ తన పాటల ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.. తనతో పాటు తన వారసులుగా ఎమ్‌ ఎమ్‌ శ్రీలేఖ, కళ్యాణిమాళిక్‌ లాంటి సంగీత దర్శకులను తెలుగు తెరకు అందించారు.. ఇప్పటికీ తెలుగు సినిమాకు తన స్వరాలతో పాటల పట్టం కడుతున్న కీరవాణిగారి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు తెలుగువన్‌ తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేస్తూ ఆయన సంగీత ప్రయాణం మరింత కాలం ఇలాగే కొనసాగాలని మనల్ని అలరించాలని ఆశిద్దాం..

చరణ్ 'ఎవడు' మూవీ ఆడియో రివ్యూ

      మెగా పవర్ పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఎవడు' ఆడియో ను సోమవారం శిల్పా కళావేదికలో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి అటు మాస్ ప్రేక్షకులను, ఇటు క్లాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే మ్యూజిక్ ఇచ్చాడు. ఈ ఆల్బంలో అన్ని పాటలు మెగా ఫ్యాన్స్ ని అలరిస్తాయి. రామ్ చరణ్ లోని డాన్సింగ్ స్కిల్స్ ని చూపించడానికి చక్కని అవకాశం ఉంది. ఈ ఆల్బంలోని పాటల పై విశ్లేషణ మీ కోసం:   పాట1 : ఫ్రీడమ్ గాయకుడు : దేవి శ్రీ ప్రసాద్, సుచిత్ సురేసన్ సాహిత్యం : కృష్ణ చైతన్య  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ గా దీనిని చెప్పవచ్చు. ఫాస్ట్ బీట్స్ తో దేవి శ్రీ ప్రసాద్ ఈ సాంగ్ ని డిఫరెంట్ గా డిజైన్ చేశాడు. కృష్ణ చైతన్య రాసిన సాహిత్యం బాగుంది. అందులోనూ యువతకు ప్రేరణ ఇచ్చేలా పాటను ప్రత్యేకంగా రాయించటంతో ఈ పాట డీసెంట్ హిట్ గా ఈ ఆల్బమ్ లో నిలుస్తోంది.       సాంగ్ 2: నీ జతగా గాయనీ గాయకులు : కార్తీక్, శ్రేయా ఘోషల్ సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి సీతారామశాస్త్రిగారు సాహిత్యం రాసిన ఈ పాట ఈ ఆడియో కి హైలైట్ గా చెప్పవచ్చు. కార్తీక్, శ్రేయ ఘోషల్ వాయిస్ ఈ పాటకు పెద్ద ప్లస్. ఈ ఆల్బమ్ లో బాగా పాపులర్ అవుతుంది. ఈ సాంగ్ ప్రోమో చూస్తే...పాటను కూడా బాగా తీశారని అర్థమవుతుంది. దేవి శ్రీ ప్రసాద్ చేసిన టాప్ టెన్ మెలోడి సాంగ్స్ లో ఈ పాట ఒకటిగా చెప్పవచ్చు.         సాంగ్ 3: అయ్యో పాపం గాయనీ గాయకులు : రంజిత్, మమత శర్మ సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి దేవి శ్రీ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఐటెం సాంగ్స్. ఐటెం సాంగ్స్ చేయడంలో దేవి శ్రీ దిట్ట అని చెప్పవచ్చు. ఈ పాటలో దేవీశ్రీ మంచి బీట్స్ తో వినే వారికి మంచి ఎనర్జీ ఫీల్ ని క్రియేట్ చేసాడు. గబ్బర్ సింగ్ లో కెవ్వు కేక పాటలాగ ...టాప్ లేచిపోద్ది రేంజిలో ఈ పాట దుమ్మురేపేలా ఉంది. రామజోగయ్యశాస్త్రి మంచి సాహిత్యాన్ని అందించారు. మమత శర్మ వాయిస్ చాలా బాగుంది.    సాంగ్ 4: చెలియా గాయకుడు : కె.కె సాహిత్యం : చంద్రబోస్ చెలియా చెలియా’ పాట కి చంద్రబోస్ సాహిత్యం అందించాడు. ఇదో ప్రయోగాత్మకమైన పాట అని చెప్పుకోవాలి. పెయిన్ ని ఈ పాటలో చూపించాడు. ఈ పాటలోని సాహిత్యం వల్ల వినడానికి డీసెంట్ గా ఉంది. ఈ పాట సినిమాలో చాలా కీలకమైన సమయంలో వస్తుందని ఆశించవచ్చు. ఈ ఆల్బంలో యావరేజ్ సాంగ్ గా దీనిని చెప్పవచ్చు.  సాంగ్ 5: ఓయే ఓయే గాయనీ గాయకులు : డేవిడ్ సిమోన్, ఆండ్రియా సాహిత్యం : శ్రీ మని ఓయే ఓయే రొమాంటిక్ డ్యూయెట్. సంగీత ప్రియులను మత్తుగా చిత్తు చేసాలా ఈ పాటను దేవి డిజైన్ చేసారు. డేవిడ్ సిమోన్, ఆండ్రియా  వాయిస్ బాగుంది. అయితే అంతకుముందు విన్న పాటలతో పోలిస్తే పెద్దగా కిక్ ఇవ్వదు. కానీ స్క్రీన్ పై రామ్ చరణ్ అదరకొట్టేలా మాత్రం ఉంది. సాంగ్ 6: పింపుల్ డింపుల్ గాయనీ గాయకులు : సాగర్, రనిన రెడ్డి సాహిత్యం : రామ్ జోగయ్య శాస్త్రి ‘పింపుల్ డింపుల్’ ఈ ఆల్బంలోని మరో మాస్ సాంగ్. ఈ సాంగ్ మంచి బీట్స్ తో వేగంగా ఉంది. ముఖ్యంగా ముందు బెంచ్ వారిని టార్గెట్ చేసిన పాట ఇది. సాగర్ – రనిన రెడ్డిలు తమ వాయిస్ లతో పాటని బాగా పాడారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ఓకే అనేలా ఉంది. దేవీశ్రీ ఈ పాటకి మాస్ బీట్స్ తో ఊపు తెచ్చే మ్యూజిక్ ఇచ్చాడు.  

హీరోయిన్ అంజలి కి సీరియస్‌ వార్నింగ్

      హీరోయిన్ అంజలి వివాదం కొనసాగుతూనే ఉంది. అంజలిపై ఇప్పుడు రెండు కేసులు ఉన్నాయి. ఒకటి ఆమె పిన్ని పెట్టింది, రెండోది తమిళ దర్శకుడు పెట్టింది. ఇప్పటి వరకూ వీటి విచారణ విషయమై అంజలికి మూడు సార్లు చెన్నై కోర్ట్ నుంచి పిలుపు వచ్చింది. మూడుసార్లూ అంజలి కోర్ట్ కు గైర్హాజరైంది. దీంతో ఈ సారి మరింత సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చింది కోర్టు. ఈ నెల 9లోగా కోర్టుకు హాజరు కాకుండా తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఇది అంజలిలోని నిర్లక్ష్యాన్ని చాటుతోంది. మరి కోర్టులు ఎన్ని రోజులు అంజలిని ఇలాగే క్షమిస్తాయి? అనేది కూడా ఆసక్తికరమైన అంశమే!

నటి అంజలికి బలుపా ?

      హీరోయిన్ అంజలి వివాదం కొనసాగుతూనే ఉంది. అంజలిపై ఇప్పుడు రెండు కేసులు ఉన్నాయి. ఒకటి ఆమె పిన్ని పెట్టింది, రెండోది తమిళ దర్శకుడు పెట్టింది. ఇప్పటి వరకూ వీటి విచారణ విషయమై అంజలికి మూడు సార్లు చెన్నై కోర్ట్ నుంచి పిలుపు వచ్చింది. మూడుసార్లూ అంజలి కోర్ట్ కు గైర్హాజరైంది. దీంతో ఈ సారి మరింత సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చింది కోర్టు. ఈ నెల 9లోగా కోర్టుకు హాజరు కాకుండా తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఇది అంజలిలోని నిర్లక్ష్యాన్ని చాటుతోంది. మరి కోర్టులు ఎన్ని రోజులు అంజలిని ఇలాగే క్షమిస్తాయి? అనేది కూడా ఆసక్తికరమైన అంశమే! ఇప్పుడు అంజలి తప్పు చేసిందా లేదా అనేది పాయింటు కాదు కానీ.. ఈమె కోర్టుకు హాజరు కాకపోవడమే ఇష్యూ అవుతోంది. తప్పు చేయని వారు దేనికీ భయపడనక్కర్లేదు.. మరి అంజలి కోర్టుకు రావడానికి ఎందుకు భయపడుతోంది? అంజలిది భయమా, బలుపా?

రామ్ చరణ్ 'ఎవడు' ఆడియో హైలైట్స్

      మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ 'ఎవడు' ఆడియో రిలీజ్ చిరంజీవి చేతులమీదుగా జరిగిన సందర్భంగా ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సంధర్బంగా చిరంజీవి మాట్లాడుతూ.. మగధీరకి దీటుగా తయారైందంటూ ప్రశంసించారు. మగధీర లాంటి చిత్రం చరణ్ కి మరోసారి ఇంత త్వరగా లభించిందంటూ ఆయన అందుకు తన ఆనందాన్ని వ్యక్తపరచారు. మగధీరలో షేర్ ఖాన్ లా ఎవడు లో సాయికుమార్ నటించారని, కథానాయిక గా శ్రుతి హాసన్ అసమాన నటనా చాతుర్యాన్ని చూపించిందని, ఆమె తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంటుందని చిరంజీవి అన్నారు. చరణ్ పాత్ర గురించి మాట్లాడుతూ చరణ్ ఇందులో చాలా అందంగా కనిపించాడని, పాత్రలో చక్కగా ఇమిడిపోయాడని, ఈ సినిమాలో మాస్ హీరోగా అభిమానులకు బాగా నచ్చుతాడని అన్నారు చిరంజీవి.  అల్లు అర్జున్ ఇందులో అతిథి పాత్రలో కనిపిస్తాడని, ఆ చిన్న పాత్రలో అర్జున్ అలరించాడని అన్నారు.   ఇక పాటల గురించి మాట్లాడుతూ, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం తనలో ఉత్సాహాన్ని రేపి, ఇంట్లో తమ మనుమరాలితో కలిసి డ్యాన్స్ చేసేటట్టుగా చేసిందని చిరంజీవి శ్లాఘించారు. అభిమానుల మధ్య సంతోషాన్ని పంచుకున్న చిరంజీవి అభిమానులకు చక్కని సూచన కూడా ఇచ్చారు.  తన మీద, తన కుటుంబంలోని ఇతర హీరోల మీద ఉన్న అభిమానంతో వారు ఇతర సినిమాలను ఇతర నటీనటులను విమర్శించరని, తన అభిమానులు హుందాగా ప్రవర్తిస్తారని వారిమీద తనకున్న నమ్మకాన్ని చిరంజీవి వ్యక్తపరుస్తూ వారు ఆ స్థాయిని కొనసాగించవలసిందిగా కోరారు. ఈ వేడుకలో పాల్గోన్న అల్లు అర్జున్ ప్రచార చిత్రాలను విడుదల చేసారు.  ఇంకా వేడుకలో చిత్ర నాయికా నాయకులతో పాటు నిర్మాత దిల్ రాజు, అల్లు అరవింద్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, కోట శ్రీనివాసరావు, వేణమాధవ్, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు.

ఉత్తరాఖండ్: చరణ్, బన్నీ చెరో 10లక్షల సాయం

      ‘ఎవడు’ ఆడియో వేదిక సాక్షిగా ఉత్తరాఖండ్ వరద బాధితులకు హీరోలు అల్లు అర్జున్, మెగా తనయుడు రాంచరణ్ తేజ ఇద్దరూ చెరో పది లక్షల రూపాయలు సహాయం అందించారు. ఈ మేరకు చెక్కును ఆడియో వేదిక మీద కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవికి అందజేశారు. ఇంతకు ముందు హీరో పవన్ కళ్యాణ్ 25 లక్షల రూపాయలు వరద సహాయం ప్రకటించారు. నా పిలుపు మేరకు ఇలా స్పందించడం ఆనందంగా ఉంది. ప్రకృతి వైపరీత్యాలలో చిక్కుకున్న వారిని ఆదుకోవడం మన కర్తవ్యం. వారి ఆదుకునేందుకు సహాయం చేయడం అభినందనీయం. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ రూ.25 లక్షలు ఇచ్చాడు. ఇప్పుడు చెర్రీ, బన్నీలు చెరో పది లక్షలు ఇచ్చారు. అభిమానులు కూడా సహాయం చేయడం సంతోషంగా ఉంది. ఈ మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి అందజేస్తానని చిరంజీవి తెలిపారు.

ఎవడు ఆడియో... మగధీర ని బ్రేక్ చేస్తుంది: చిరంజీవి

      రామ్ చరణ్ తేజ నటించిన 'ఎవడు' మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్ 'మగధీర' రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. రామ్ చరణ్ ఎవడు ఆడియో రిలీజ్ కి ముఖ్య అతిధి గా వచ్చిన చిరంజీవి...రామ్ చరణ్ చెప్పినట్లు 'మగధీర' ని మించిన సినిమా చరణ్ కి ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదని అన్నారు. ఈ సినిమా మెగా ఫ్యాన్స్ ఉహించిన దాని కంటే ఎక్కువగానే ఉంటుందని అన్నారు. సాయి కుమార్ ఈ సినిమాలో అద్బుతంగా నటించాడని, 'మగధీర' శ్రీ హరి షేర్ ఖాన్ పాత్రని సాయి కుమార్ మళ్ళీ గుర్తు చేస్తాడని చెప్పారు.   ఈ ఫంక్షన్ కి రామ్ చరణ్, అల్లు అర్జున్, శృతి హాసన్, వంశీ పైడిపల్లి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, బ్రహ్మానందం, దిల్ రాజు, అల్లు అరవింద్, సాయి కుమార్, దేవి శ్రీప్రసాద్ తదితరులు ఉన్నారు. చిరంజీవి మొదటి ఆడియో సి.డి ను ఆవిష్కరించి రామ్ చరణ్, అల్లు అర్జున్ లకు అందజేశారు.