సెక్సీయస్ట్‌ ఉమెన్‌ కత్రినా

  బాలీవుడ్‌ లాంగ్‌ లెగ్స్‌ బ్యూటి కత్రినా సరికొత్త రికార్డ్‌ను క్రియేట్‌ చేసింది. వరుసగా ఐదో సారి వరల్డ్స్‌ సెక్సీయస్ట్‌ ఉమెన్‌గా ఎంపికై తన అందానికి ఎవరు సాటిరాలేరని తేల్చేసింది. ప్రస్థుతం బాలీవుడ్‌లో టాప్‌ పొజిషన్‌లో ఉన్న హాట్‌ బ్యూటి మరోసారి తన ఫామ్‌ చూపించింది. ఫేమస్ ఫ్యాషన్ మేగజైన్ ఎఫ్ హెచ్ ఎం నిర్వహించిన ఆన్ లైన్  సర్వే లో  అత్యధిక ఓట్లతో  ఫస్ట్ ప్లేస్ లో నిలిచి సెక్సీయెస్ట్ విమెన్ ఆఫ్ ది ఇయర్ గా  టైటిల్ గెలుచుకుంది. ఎఫ్ హెచ్ ఎం మేగజీన్  ప్రతీ సంవత్సరం ఒకరిని సర్వే ద్వారా  సెక్సీయెస్ట్ వుమెన్గా  ఎంపిక చేస్తుంది.. గత నాలుగు సంవత్సరాలుగా సెక్సీయస్ట్‌ ఉమెన్‌గా ఫస్ట్‌ ప్లేస్‌లో ఉన్న కత్రినా ఈ ఇయర్‌ కూడా ఆ ప్లేస్‌ను నిలబెట్టుకొని ఆ క్రెడిట్‌ వరుసగా ఐదు సార్లు సాదించిన బ్యూటిగా సరికొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. కత్రిన తరువాతి స్థానాల్లో పింకీ ప్రియాంక, 500 క్రోర్స్‌ బ్యూటి దీపికా ఉన్నారు.

యూట్యూబ్‌లో రజనీ మేనియా

  సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్ మరోసారి తన స్టామినా ప్రూవ్‌ చేసుకున్నాడు. థియేటర్‌లోనే కాదు యూట్యుబ్‌లో కూడా తానే నెంబర్‌ వన్‌ అని నిరూపించాడు. రజనీ హీరోగా వస్తున్న లేటెస్ట్‌ మూవీ కొచ్చాడియన్‌. ఇటీవల వినాయక చవితి కానుకగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు చిత్రయూనిట్‌. యూ ట్యూబ్ లో కొచ్చాడియన్‌ టీజర్ దుమ్మురేపుతోంది. పూర్తి మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీతో తెరకెక్కిన తొలిని ఇండియన్‌ సినిమాగా గుర్తింపు తెచ్చుకున్న ఈసినిమా యూట్యుబ్‌ హిట్స్‌లో సరికొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. రజనీ డైలాగ్స్‌ లేకుండానే రిలీజ్‌ అయిన ఈ టీజర్‌ను మూడురోజుల్లోనే 16 లక్షల మంది చూశారు. రజీనీ కూతురు సౌందర్య రజనీకాంత్‌ తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు కెఎస్‌ రవికుమార్‌ కూడా వర్క్‌ చేశారు. త్వరలో ఆడియో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈసినిమాను డిసెంబర్‌12 న రజనీకాంత్‌ పుట్టినరోజు కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తమిళ్‌తో పాటు, హిందీ, మళయాలం, జపనీస్‌లో కూడా రిలీజ్‌ అవుతున్న ఈ సినిమా తెలుగులో విక్రమసింహ పేరుతో రిలీజ్‌కు రెడీ అవుతుంది.

లవ్ మ్యారేజ్ చేసుకున్న 'ప్రేమిస్తే' భరత్

      ప్రేమిస్తే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన హీరో భరత్ ఓ ఇంటి వాడయ్యాడు. జెస్సీ అనే అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. మంగళవారం ఉదయం చెన్నైలోని గిండీలో ఓ ఫైవ్ స్టార్ హోటల్లో వీరి వివాహం జరిగింది. దుబాయ్ లో డెంటిస్ట్ గా ఉన్న జెస్సీ ఓ స్నేహితుడి ద్వారా భరత్ కి పరిచయమయింది. ఆ పరిచయం తరువాత ప్రేమగా మారింది. తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు భరత్ కాగా ..జెస్సీ క్రిస్టియన్. ఇరుకుటుంబాల పెద్దలు అంగీకరించడంతో వీరి వివాహానికి ఎలాంటి అడ్డంకులు ఎదురుకాలేదు. వీరిద్దరి వివాహ రిసెప్షన్ ఈ నెల 14న చెన్నైలో జరగనుంది. బాయ్స్ సినిమాతో తెరంగేట్రం చేసిన భరత్ ఆ తరువాత ప్రేమిస్తే సినిమాతో మరింత పేరు తెచ్చుకున్నాడు.

ఖ‌ల్ నాయ‌క్ మంచి మ‌న‌సు

  అక్రమాయుధాల కేసులో జైలు శిక్ష అనుభ‌విస్తున్న సంజ‌య్‌ద‌త్ మ‌రోసారి తాను మారాన‌ని నిరూపించుకున్నాడు. జైలులో ఉంటూ కూడా జైలు అధికారుల కోసం ఓ ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో పాల్గొననున్నాడు సంజ‌య్. పూణె లోని ఎర‌వాడ జైలులో శిక్ష అనుభ‌విస్తున్న సంజ‌య్ ద‌త్ ఈ కార్యక్రమంలో పాల్గొన‌టానికి అంగీక‌రించాడు. జైలు సిబ్బంది సంక్షేమానికి అవ‌స‌ర‌మైన నిధుల కోసం  జైళ్ల శాఖ సెప్టెంబ‌ర్ 26న ఓ క‌ల్చర‌ల్ ప్రొగ్రామ్ నిర్వహించ‌డానికి రెడీ అయింది. బాల‌గంధ‌ర్వ ఆడిటోరియంలో జ‌రిగే ఈ కార్యక్రమంలో 50 మంది ఖైదిలు పాల్గోన‌నున్నారు. వీరితో పాటు సంజ‌య్ ద‌త్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన‌నున్నాడు. అయితే చాలా రోజుల త‌రువాత సంజ‌య్ బ‌య‌టికి వ‌స్తుండ‌టంతో ఈ కార్యక్రమానికి డిమాండ్ బాగా పెరిగింది. ఫ్యాన్ప్ ఖ‌ల్ నాయ‌క్‌ను ఒక్కసారి క‌ల‌వడానిరి ఎంత ఖ‌ర్చుపెట్టడానికైనా రెడీ అవుతున్నారు. ఇక ఈ మంచి మ‌న‌సు సంజ‌య్‌కు భ‌విష్యత్తులో ఉప‌యోగ‌ప‌డుతుందంటున్నారు విశ్లేష‌కులు.

కంగనా కూడా పెట్టేసింది

  ఈమధ్య కాలంలో కొందరు హీరో, హీరోయిన్స్, సెలబ్రిటీలు సొంతంగా ఓ వెబ్‌సైట్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇటీవలే సల్మాన్ కూడా మీడియాలో తనపై వస్తున్న వార్తల్ని తిప్పికొట్టేందుకు ఓ వెబ్‌సైట్ పెట్టుకున్నాడు. అదే విధంగా అదే జాబితాలోకి మరో హీరోయిన్ కూడా చేరిపోయింది. బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కూడా అఫిషియల్‌కంగనారనౌత్‌.కామ్ పేరిట సొంతంగా ఒక వెబ్‌సైట్ ను ఏర్పాటు చేసుకుంది. తనకు సంబంధించిన మూవీ అప్‌డేట్స్, ఫ్యాషన్ ఈవెంట్స్, పర్సనల్ ప్రొఫైల్ వంటి అన్ని వివరాలని ఆ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురానుంది. దీనివల్ల తన అభిమానులకు దగ్గర అవడంతో పాటుగా తనపై వస్తున్నా రూమర్స్ కి స్వస్తి పలకొచ్చు అని భావిస్తుందట.

అక్కడైతే చూపిస్తుందట

      టాలీవుడ్‌లో తన అందాలు తప్ప నటన చూడటం లేదంటూ బాలీవుడ్ చెక్కేసిన ఓ హాట్ బ్యూటి ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా అదే పని మొదలు పెట్టింది. ఇన్నాళ్లు టాలీవుడ్ మీద అభాండాలు వేసిన ఈ భామ అక్కడ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుంది.     దేవదాసు సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన గోవా బ్యూటి ఇళియానా.. తొలి సినిమాలోనే తన తీగ నడుముతో అందరిని కట్టిపడేసిన ఈ బ్యూటి తరువాత వరుస సినిమాలతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. దాదాపు తెలుగు యంగ్ హీరోస్ అందరితో సినిమా చేసిన ఇళియానా టాప్ పొజిషన్‌ను మాత్రం ఎక్కువ రోజులు నిలబెట్టుకొలేకపోయింది. దీంతో తెలుగు సినిమా ప్రేక్షకులు తన అందాలను తప్ప తన నటనను ఏ మాత్రం గుర్తించలేదంటూ తెగ వగలు పోయిందీ ఈ బ్యూటి.     అయితే బాలీవుడ్ ఎంట్రీ కూడా ఈ బ్యూటికి బాగానే కలిసొచ్చింది. ఎటువంటి అందాల ఆరబోత లేకుండా హుందాగా కనిపించిన బర్ఫీ సినిమాతో బాలీవుడ్  ఎంట్రీ ఇచ్చిన ఇళియాన తొలి సినిమాతో బాలీవుడ్లో 100 కోట్ల హిట్ నమోదు చేసింది. అయితే తొలి సినిమాతో ఎలాంటి ఎక్స్‌పోజింగ్ లేకుండా నడిపించినా తరువాత మాత్రం అలా నడవదని తెలుసుకుంది ఇళ్లిబేబి. అందుకే తన బాలీవుడ్ సెకండ్ ఫిల్మ్ ఫటా పోస్టర్ నికలా హీరోలో షాహిద్ సరసన రెచ్చిపోయి మరి ఎక్స్‌పోజింగ్ చేసేసింది.     తెలుగు వాళ్ల ముందు చూపించటానికి అంత కష్ట పడినా బాలీవుడ్‌లో మాత్రం తెగ చూపించేసే సరికి ఇళియానా మీద గుర్రుగా ఉన్నారట టాలీవుడ్ సినీ జనాలు.

పరిణితీ చోప్రా హాట్‌ రికార్డ్‌

      స్టార్ వారసురాలిగా బాలీవుడ్‌కి పరిచయం అయిన ఓ ముద్దుగుమ్మ తొలి సినిమా నుంచి హద్దులేవి లేకుండా రెచ్చిపోతుంది. అయితే కెరీర్ స్టార్టింగ్ నుంచి అందాల ప్రదర్శనకు వెనుకాడని ఈ భామ ఇప్పుడు ఓ సరికొత్త రికార్డ్ సృష్టించింది.     లేడీస్ వర్సెస్ రికీ బాల్ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన బాలీవుడ్ బ్యూటి పరిణితీ చొప్రా, ప్రియాంక చోప్రా వారసురాలిగా బాలీవుడ్ తెరకు పరిచయం అయిన ఈ భామ అందాల ప్రదర్శన లో మాత్రం అక్క మించిన చెల్లిగా పేరుగా తెచ్చుకుంది.     తన రెండో సినిమా ఇష్క్‌జ్యాదేతో అందరి దృష్టిని ఆకర్షించిన పరిణితి చోప్రా హీరోయిన్‌గా సక్సెస్ అవ్వటానికి కావాల్సిన విషయాల్లో అక్క కన్నా ముందే పరిణతి సాదించింది. అయితే తాజాగా ఈ అమ్మడు నటిస్తున్న సినిమాతో ఓ అరుదైన రికార్డ్ సాదించనుందట. ఇంత వరకు ఏ బి గ్రేడ్ సినిమాలో కూడా లేని విదంగా ఈ సినిమాలో బోలెడన్ని హాట్ సీన్స్ ఉన్నాయంటున్నారు చిత్రయూనిట్.     ఇప్పటివరకు ఒకటి రెండు లిప్లాక్ సీన్స్‌తొ సినిమాలకు క్రేజ్ తెచ్చుకుంటున్న బాలీవుడ్ సినీ బాబులకు దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చింది పరిణితి చోప్రా. ఒకటి రెండు కాదు ఒకే సినిమాలో ఏకంగా 15 లిప్‌లాక్ సీన్స్‌లో నటించనుందట.     గతంలో క్వాయిష్ అనే సినిమాతో మళ్లికా శెరవాత్ చేసిన  లిప్ లాక్‌ సీన్స్‌ రికార్డ్‌ను ఈ సినిమాతో బ్రేక్ చేయనుంది పరిణితి. తను నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ శుద్‌ దేశి రోమాన్స్ ఈసినిమాలో ఈ హాట్ రికార్డ్ క్రియేట్ చేస్తుంది. మరి ఈ సినిమా తరువాత పరిణితి చోప్రాకు మరిన్ని హాట్ ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తాయంటున్నారు సినీ విశ్లేషకులు.

తుఫాన్ కి హైకోర్టు రక్షణ కవచం

  రామ్ చరణ్ తేజ్ నటించిన  తెలుగు సినిమా-తుఫాన్, హిందీ సినిమా-జంజీర్ రెండూ కూడా ఈ 6వ తారీకున విడుదల కానున్నాయి. అయితే చిరంజీవి రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొననందుకు సమైక్యవాదులు, సమైక్యవాదానికి మద్దతు ఇస్తున్నందున తెలంగాణవాదులు మెగా హీరోల సినిమాలు అడ్డుకొంటామని హెచ్చరికలు జారీ చేయడంతో, నిర్మాతలు తమ సినిమాకు రక్షణ కల్పించాలని కోరుతూ నిన్న హైకోర్టులో పిటిషను దాఖలు చేసారు. వారి పిటిషనుపై కోర్టు సానుకూలంగా స్పందిస్తూ తుఫాన్, జంజీర్ సినిమాలు ప్రదర్శన జరిగే అన్ని సినిమా హళ్ళవద్ద భద్రత కల్పించాలని పోలీసులకు కొద్ది సేపటి క్రితం ఆదేశాలు జారీచేసింది.

రామ్ చరణ్ 'తుఫాన్' సినిమాను అడ్డుకుంటా౦

      మెగా పవర్ స్టార్ రాం చరణ్ తేజ్, బాలివుడ్ భామ ప్రియాంకా చోప్రా నటించిన తుఫాన్ సినిమా ఈ నెల 7న విడుదల చేస్తున్నట్లు సినీ నిర్మాతలు రిలయన్స్ ఎంటర్టెయిన్మెంట్స్ సంస్థ వారు ప్రకటించారు. ఒక పక్క ఉద్యమాలు భయపెడుతున్నపటికీ దైర్యం చేసి సినిమాను విడుదల చేయబోతుంటే వారు భయపడినట్లే ఈ రోజు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో సమైక్యవాదులు తుఫాన్ సినిమా పోస్టర్లను కాల్చివేసి, చిరంజీవి తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయనంత వరకూ ఆ కుటుంబానికి చెందిన హీరోల సినిమాల విడుదలకు అంగీకరించబోమని, ఒకవేళ కాదని విడుదలచేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు. నిజామబాద్ జిల్లాలో కూడా అటువంటి ఘటనే జరిగింది. అక్కడ తెలంగాణా వాదులు తుఫాన్ సినిమా పోస్టర్లను చింపి తగులబెట్టారు. తెలంగాణా ప్రజల ఆదరణతో, సొమ్ముతో ఆర్ధికంగా, రాజకీయంగా ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిన చిరంజీవి, అదే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడటం తాము సహించబోమని, అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా అతని కుటుంబానికి చెందిన హీరోలెవరి సినిమాలను తెలంగాణాలో ఆడనీయబోమని వారు హెచ్చరించారు.

ఐటమ్‌గర్ల్‌గా సదా

  తేజ స్కూల్‌ నుంచి హీరోయిన్‌గా పరిచయం అయిన ఓ అందాల భామ ఇప్పుడు సరైన అవకాశాలు లేక ఐటమ్‌ సాంగ్స్‌తో అయినా రాణించాలనుకుంటుంది.. తేజ డైరెక్షన్లో వచ్చిన జయం సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది సదా. తొలి సినిమా తొనే భారీ సక్సెస్‌తో పాటు మంచినటిగా కూడా గుర్తింపు తెచ్చుకున్న సదా తరువాత వరుస అవకాశాలతో  స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకుంది. అంతేకాదు విక్రమ్‌ లాంటి స్టార్ హీరోయిన్‌ సరసన, శంకర్‌  డైరెక్షన్‌లో నటించే చాన్స్‌ కూడా కొట్టేసింది ఈ అందాలభామ. కాని ఎంత స్పీడుగా టాప్‌ ప్లేస్‌కు వచ్చిందో అదే స్పీడ్‌లో కిందకు పడిపోయింది. వరుస ఫ్లాప్‌లతో అవకాశాలకు రాక సిల్వర్‌స్క్రీన్‌కు దూరం అయింది. దీంతో ఇప్పుడు ఎలాగై మరోసారి సక్సెస్‌ ట్రాక్‌లోకి రావాలనుకుంటుంది సదా. అందుకే తమిళ్‌లో విశాల్ హీరోగా నటిస్తున్న న్యూ మూవీలో ఐటమ్‌సాంగ్‌ చేయడానికి రెడీ అయింది. కాని హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగి తరువాత ఐటమ్‌ సాంగ్స్‌కు వచ్చిన హీరోయిన్లు ఎవరు ఇంతవరకు సక్సెస్‌ అయిన దాఖలాలు లేకపోవటంతో సదా రికార్డును మారుస్తుందా అనుకుంటున్నారు సినీ వర్గాలు.

తుఫాను ఆగిపోతుందా

  మెగా పవర్ స్టార్ రాం చరణ్ తేజ్, బాలివుడ్ భామ ప్రియాంకా చోప్రా నటించిన తుఫాన్ సినిమా ఈ నెల 7న విడుదల చేస్తున్నట్లు సినీ నిర్మాతలు రిలయన్స్ ఎంటర్టెయిన్మెంట్స్ సంస్థ వారు ప్రకటించారు. అనేక న్యాయపోరాటాలు, వివాదాల తరువాత, ఒక పక్క ఉద్యమాలు భయపెడుతున్నపటికీ దైర్యం చేసి సినిమాను విడుదల చేయబోతుంటే వారు భయపడినట్లే ఈ రోజు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో సమైక్యవాదులు తుఫాన్ సినిమా పోస్టర్లను కాల్చివేసి, చిరంజీవి తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయనంత వరకూ ఆ కుటుంబానికి చెందిన హీరోల సినిమాల విడుదలకు అంగీకరించబోమని, ఒకవేళ కాదని విడుదలచేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు.   ఆంధ్ర ప్రాంతంలో మిగిలిన చోట్ల ఇంతవరకు ఎటువంటి వ్యతిరేఖత కనబడలేదు. కానీ ఈ రోజే నిజామబాద్ జిల్లాలో కూడా అటువంటి ఘటనే జరిగింది. అక్కడ తెలంగాణా వాదులు తుఫాన్ సినిమా పోస్టర్లను చింపి తగులబెట్టారు. తెలంగాణా ప్రజల ఆదరణతో, సొమ్ముతో ఆర్ధికంగా, రాజకీయంగా ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిన చిరంజీవి, అదే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడటం తాము సహించబోమని, అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా అతని కుటుంబానికి చెందిన హీరోలెవరి సినిమాలను తెలంగాణాలో ఆడనీయబోమని వారు హెచ్చరించారు. ఈ సంఘటనలు జరిగిన వెంటనే నిర్మాతల తరపున హైకోర్టులో ఒక పిటిషను దాఖలయింది. తమ తుఫాన్, జంజీర్ సినిమాలకు రక్షణ కల్పించాలని వారు పిటిషనులో కోరారు.   అయితే, పోలీసులు మాత్రం ఎన్నిసినిమా హాళ్ళకు కాపలా కాయయగలరు? ఎన్ని రోజులు కాయగలరు? అది సాద్యమయ్యే పనేనా? అని రేపు కోర్టు కూడా వారిని అడగవచ్చును. పోలీసుల పహారాలో సినిమాలను నడపాలంటే అందుకు ప్రత్యేక పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేయలేమో కూడా?   చిరంజీవి వల్ల ముగ్గురు మెగా హీరోల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారింది. చిరంజీవి సమైక్యవాదం చేస్తున్నందుకు తెలంగాణాలో, రాజినామా చేయనందుకు సీమంధ్రలో మెగా హీరోల సినిమాలు ప్రదర్శనకు నోచుకోకపోతే, ఇక వారితో సినిమాలు తీసేందుకు ఎవరు ముందుకు వస్తారు? రాష్ట్రంలో పరిస్థితులు మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేవరకు సినిమాలు విడుదల చేయలేకపోతే నిర్మాతల నష్టాన్ని ఎవరు పూడుస్తారు?   ఈ రోజు మెగా హీరోల వంతు. రేపుజూ.యన్టీఆర్ వంతు కూడా వస్తుంది. అతని తండ్రి హరికృష్ణ సమైక్యాంధ్రకు మద్దతుగా త్వరలో బస్సు యాత్ర చేపడతానని ప్రకటించడంతో తెలంగాణాలో యన్టీఆర్ సినిమాలు ఆడనీయబోమని తెలంగాణావాదులు అప్పుడే ప్రకటించారు కూడా.

24 గంటల 'కిస్'

      అడివి శేష్ హీరోగా నటించిన 'కిస్' మూవీ ఈ నెల13న విడుదలకు సిద్దమవుతుంది. 'కిస్' ఆడియో కి సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని యూనిట్ సభ్యులు నమ్మకంతో వున్నారు. ఒక అమ్మాయి..అబ్బాయి మధ్య 24 గంటల్లో జరిగిన జర్నీని సింపుల్ రొమాంటిక్ స్టోరీ గా తెరకెక్కించమని అడివి శేష్ అన్నారు. ఓ మాస్ అబ్బాయి...ఓ క్లాస్ అమ్మాయి మధ్య ప్రేమ చిగురిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ కథ రాశాను. కామన్‌మేన్‌కి ఈజీగా ఈ సినిమా కనెక్ట్ అవుతుందని శేష్ చెప్పారు.  సాయి కిరణ్ అడవి నిర్మించిన ఈ సినిమాకి సాయిచరణ్ పాకల – పీట్ వండర్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాతో మరో హాట్ బ్యూటీ టాలీవుడ్ కి పరిచయం కాబోతుంది. 'మిస్ కెనడా ఫోటోజెనిక్'గా పేరుబడిన ప్రియా బెనర్జీ నీ  'కిస్' తో టాలీవుడ్ పరిచయం చేస్తున్నాడు శేష్. ఆన్ స్క్రీన్ పై ప్రియా, శేష్ ల కెమిస్ట్రీ హాట్ గా ఉందని వార్తలు కూడా వచ్చాయి. 'కిస్' తో ప్రియా టాలీవుడ్ ప్రేక్షకుల మనసులు దోచుకోవడం ఖాయమని అంటున్నారు.   

నిప్పు కాంభినేషన్‌లో మరోసినిమా

  నిప్పులాంటి భారీ డిజాస్టర్‌ ఇచ్చిన వైవియస్ చౌదరి నిర్మాతగా రవితేజ మరోసినిమా చేయనున్నాడు. గతంలో నిప్పు సినిమాతో నష్టపోయిన వైవియస్‌ను ఆదుకోటానికే రవితేజ ఈ సినిమా అంగీకరించాడన్న టాక్‌ వినిపిస్తుంది. బొమ్మరిల్లు బ్యానర్‌పై యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా ద్వారా బాబి అనే కొత్త దర్శకడు పరిచయం కాబోతున్నాడు. బలుపు సినిమాకు కథ అందించి రవితేజ కెరీర్‌ను మళ్లీ సక్సెస్‌ట్రాక్‌లోకి తీసుకొచ్చిన బాబితో ఓ సినిమా చేస్తానని బలుపు షూటింగ్‌ సమయంలోనే రవితేజ మాట ఇచ్చాడు. ఇప్పుడు ఆ మాటకు కట్టుబడి ఈ సినిమా అంగీకరించాడట. ఇటీవల వైవియస్‌ చౌదరి ఆఫీస్‌లో యూనిట్‌ సభ్యుల మధ్య పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈసినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెలఖరునుంచి ప్రారంభం కానుంది. మరి రవితేజకు బలుపులాంటి సక్సెస్‌ఫుల్‌ కథ అందించిన బాబి డైరెక్టర్‌గా ఎంతవరకు సక్సెస్‌ అవుతాడో చూడాలి.

అత్యాచార బాధితురాలిగా నిత్య

  దేశ వ్యాప్తంగా అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈసినిమాలో లీడ్‌ రోల్‌ చేయడానికి ప్రముఖ హీరోయిన్‌ నిత్యా మీనన్‌ అంగీకరించటం విశేషం. అయితే తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న ఈ సినిమాకు అలనాటి నటి శ్రీ ప్రియ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో నిత్యా అత్యాచార బాధితురాలిగా నటించనుంది. అయితే మాలిని 22 పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాను మళయాలంలో ఘనవిజయం సాదించిన 22 ఫీమేల్‌ కొట్టాయం అనే సినిమాకు రీమేక్‌ గా తెరకెక్కిస్తున్నారు. అయితే ఇన్నాళ్లు కేవలం కమర్షియల్‌ ఎంటర్‌టైనర్స్‌లో మాత్రమే నటిస్తూ వచ్చిన నిత్యామీనన్‌ తొలిసారిగా ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా ఏర్పడుతున్నాయి.

'ఆరడుగుల బుల్లెట్' పవన్ బర్త్ డే

        టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేడు. అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయితో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా... హీరోగా టాలీవుడ్ కి పరిచయమై గోకులంతో సీత, సుస్వాగతం వంటి విభిన్న కథాచిత్రాల్లో నటించి మంచి ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకుని.... 'తొలి ప్రేమ'తో లవ్ స్టోరీస్ లో ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసి 'తమ్ముడు'తో అన్నకు తగ్గ తమ్ముడుగా అద్భుత విజయాన్ని సాధించి 'బద్రి'తో తనకంటూ ఓ సెపరేట్ స్టైల్ ని క్రియేట్ చేసుకుని 'ఖుషి'తో రికార్డులు బ్రేక్ చేసి అందరూ తన స్టైల్ ని ఫాలో అయ్యే రేంజికి ఎదిగి జానితో దర్శకుడుగా పరిచయమై గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం చిత్రాలతో ఓపెనింగ్స్ క్రియేట్ చేసి జల్సాతో బాక్సాఫీస్ ని మరోసారి షేక్ చేసి కొమరం పులి, తీన్ మార్, పంజా చిత్రాల తర్వాత గబ్బర్ సింగ్ తో మళ్ళీ తన పవర్ ఏమిటో చూపించి కలెక్షన్ల వర్షం కురిపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు 'అత్తారింటికి దారేది' తో మరోసారి సరికొత్త రికార్డు సృష్టించడానికి వస్తున్నాడు. సెప్టెంబర్ 2తో 42వ వసంతంలోకి అడుగు పెడుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి తెలుగు వన్ తరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

ఆయనకు తల్లి కాబోతున్న మీనా...?

  పెళ్లి చేసుకొని సినిమాలకు కాస్త విశ్రాంతి ఇచ్చిన నటి మీనా, మళ్ళీ వరుస సినిమాలతో బిజీ అవుతుంది. ఇటివలే మీనా నటించిన "శ్రీ జగద్గురు ఆదిశంకర" చిత్రం విడుదలయింది. అయితే మీనా ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలతో బిజీగా ఉంది. తాజాగా మీనాకు ఓ మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి చిత్రంలో నటించే అవకాశం లభించింది. అయితే ఈ చిత్రంలో మమ్ముట్టికి తల్లి పాత్రలో మీనా నటించబోతుంది. అసలే వయసులో తనకంటే దాదాపు 20సంవత్సరాలు పెద్దవాడైన మమ్ముట్టికి తల్లిగా నటించడం అనేది ఒక చాలెంజ్ లాంటిదే కావడంతో... ఈ పాత్రను ఓ సవాల్ గా తీసుకోని చేయనుందట. ఈ చిత్రంలో ఈషా తల్వార్ హీరోయిన్ గా నటిస్తుంది. అదే విధంగా మరో చిత్రంలో మోహన్ లాల్ కు భార్య పాత్రలో మీనా నటిస్తుంది. మరి ఈ ఇద్దరు పెద్ద హీరోల చిత్రంలో నటిస్తున్నమీనాకు ఎలాంటి విజయం దక్కుతుందో త్వరలోనే తెలియనుంది.