మంచు లక్ష్మీ కొత్త బిజినెస్
నటిగా, నిర్మాతగా, టివి హోస్ట్గా అనేక రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్న ఓ స్టార్ వారసురాలు ఇప్పుడు సరికొత్త బిజినెస్లోకి దిగింది.. నటిగా, నిర్మాతగా గుర్తింపు వచ్చినా.. కాసులు రాలక పోవటంతో ఇప్పుడు డబ్బులు సంపాందించే పనిలో పడిందట మంచు లక్ష్మీ ప్రసన్న, మోహన్బాబు నట వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన ఈభామ అనతి కాలంలోనే మల్టీ టాలెంటెడ్గా గుర్తింపు తెచ్చుకుంది.
తండ్రి తగ్గ కూతురిగా మంచి నటిగా డిఫరెంట్ రోల్స్లో మెప్పించిన లక్ష్మీ వరుస అవకాశాలను అందుకోవటంలో మాత్రం వెనుకపడింది. దీంతో నటనతో పాటు నిర్మాణ రంగం మీద కూడా దృష్టి పట్టింది లక్ష్మీ ప్రసన్న.
అయితే నిర్మాతగా మారినా లక్ష్మీ ప్రసన్నకు సక్సెస్ మాత్రం దక్కలేదు. గుండెల్లో గొదారి, ఊ కొడతార ఉలిక్కి పడతారా లాంటి సినిమాలను నిర్మించిన లక్ష్మీ అభిరుచిగల నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న సక్సెస్ మాత్రం కాలేకపోయింది.
అయితే ఇవేవి కలిసి రావనుకున్న లక్ష్మీ ప్రసన్న ఇప్పుడు తనకున్న ఫాలోయింగ్ను క్యాష్ చేసుకోవాలనుకుంటుంది. సోషల్ నెట్వర్కింగ్ సైట్స్తో పాటు యూట్యూబ్లో తనకున ఎకౌంట్స్లో యాడ్స్ పోస్ట్ చేయటం స్టార్ట్ చేసింది లక్ష్మీ..
ఇక సినిమా రంగం మనకు కలిసి రాదని డిసైడ్ అయ్యిందో ఏమో గాని యాడ్ బిజినెస్లోకి ఎంటర్అయింది.. మరి ఈ రంగం అయినా ఈ అమ్మడికి కలిసోస్తుందో లేదో చూడాలి..