నటి జియాఖాన్ ఆత్మహత్య పై రాంగోపాల్ వర్మ

        ప్రముఖ నటి జియాఖాన్ ఆత్మహత్య వార్త విని బాలీవుడ్ షాక్ కి గురైంది. ఆమె మృతిపై అందరూ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. “నేను షాక్ కు గురయ్యాను. హీరోయిన్ జియాఖాన్ ఆత్మహత్య చేసుకుంది అన్న వార్త నాకు ఊపిరాడనంత పనిచేసింది. నిశ్శబ్ద్ సినిమా తీస్తున్న సమయంలో జియాఖాన్ అంత ఉత్సాహం కలిగిన నటిని నేను చూడలేదు” అని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఆమె టాలెంటెడ్ యంగ్ గర్ల్ అని పేర్కొన్నారు. 2007లో వర్మ తీసిన నిశ్శబ్ద్ సినిమాలో అమితాబ్ సరసన జియాఖాన్ నటించింది. అందులో జియాఖాన్ నటన అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఆమీర్ ఖాన్ గజినీలో అవకాశం ఇచ్చాడు. జియాఖాన్ ఆత్మహత్య వార్త విని షాక్ కు గురయ్యానని అమితాబ్ కూడా తీవ్ర సంతాపం వెలిబుచ్చారు.

హీరోయిన్ జియాఖాన్ 25 ఆత్మహత్య

        బాలీవుడ్ నటి జియాఖాన్ ఆత్మహత్య చేసుకుంది. జీవితంలో ఎత్తుపల్లాలు, సుఖదుఃఖాలు చూడకనే జీవితం చాలించింది. ఇంతవరకు ఆమెకు పెద్దగా కష్టాలున్నట్లు కూడా ఎప్పుడూ బయటకు రాలేదు. కానీ అనూహ్యంగా ఆమె ఆత్మహత్య చేసుకుంది. సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటన సంచలనం అయ్యింది. రాంగోపాల్ వర్మ తీసిన నిశ్శబ్ద్ ద్వారా ఆమె సినిమాకు పరిచయం అయ్యింది. అమితాబ్ బచ్చన్ సరసన హాట్ గా కనిపించింది. ఆ సినిమా అడ్రస్ లేకుండా పోయినా జియా మాత్రం అందరికీ గుర్తుండిపోయింది. బోల్డ్ గా కనిపించి యువకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. నటనలోనూ నైపుణ్యం చూపి ఫిల్మ్ ఫేర్ బెస్ట్ డేబ్యూ అవార్డు గెలుచుకుంది. ఆ తర్వాత గజిని హిందీ వెర్షన్లో కనిపించింది. ఆ తర్వాత 2010 లో వచ్చిన హౌస్ ఫుల్ ఆమె చివరి చిత్రం. జియా ఆత్మహత్య వార్త తొలుత దియామీర్జా ట్విటర్ మెసేజ్ ద్వారా ప్రపంచానికి తెలిసింది. ఆమె ఆత్మహత్య చేసుకున్న జుహు ప్రాంతం ఇపుడు హాట్ ప్లేస్. స్థానికులన విచారించిన పోలీసులు శవాన్ని పోస్టుమార్టానికి తరలించారు. సాయంత్రం లోపు రిపోర్టు వస్తే కొన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది.

ఆరుద్ర వర్ధంతి

        ఆయన కలం నుండి జాలువారే ప్రతీ అక్షరం ఓ ఆణిముత్యం.. తన అద్భుతమైన ప్రతిభతో యావత్‌ సినీరంగాన్నే అబ్బురపరచారాయన.. మనసుకు హత్తుకునే భావాల్ని అతిసాదారణ పదాల్లో నిల్పిన  పదశిల్పి ఆయన.. కమర్షియల్‌ పాటకు సైతం ధిక్కార స్వరం నేర్పిన ఆయనే సినీకవి  ఆరుద్ర. ఈరోజు ఆరుద్ర వర్ధంతి సందర్బంగా  ఆ మహా రచయితను ఓ సారి గుర్తు చేసుకుందాం..   సామాన్యంగా నటులను, దర్శకులను బట్టి ప్రేక్షకులు, సినిమాలను చూస్తారు. కాని రచయితనుబట్టి సినిమా చూసే స్థాయిని కల్పించింది ఆరుద్ర... మామూలు పదాలతో బరువైన భావాల్ని పలికించి శ్రోతలను రంజిప చేసిన నేర్పరి ఆరుద్ర. ఆరుద్రగా సినీరంగ ప్రవేశం చేసిన భాగవతుల సదాశివ శంకర శాస్త్రీ 1925వ సంవత్సరం ఆగస్టు 31న జన్మించారు. చిన్నప్పటి నుండి సాహిత్యం మీద ఉన్న ఇష్టంతో ఆ దిశగా అడుగులు వేశారు.. 1949లో విడుదలైన బీదల పాట్లు సినిమాతో పాటలరచయితగా పరిచయమయ్యాడు ఆరుద్ర.  ఆరుద్ర రచించిన పాటలలో ఎక్కువగా ఆభ్యుదయ భావజాలం ఉండటం వలన శ్రీ శ్రీ తరువాత యువత ఎక్కువగా ఆయనే కీర్తిని సంపాదించారు.. చిన్ని చిన్ని పదాలతో స్పష్టమైన భావాన్ని పలికించడంలో ఆరుద్ర ఘనాపాటి. తెలుగు పాటను ఆస్వాదించి.. అందరి మనసులను దోచుకున్న ఈ కవి ఎన్ని అవార్డులను ఇచ్చి సత్కరించినా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఆయన సినీ పరిశ్రమకు అందించిన సేవలు మరువలేనివి. విశాఖ పట్నంలో జన్మించిన ఆరుధ్ర విజయనగరం జిల్లాలో ఉన్నత విధ్యను పూర్తి చేశారు.. రచనల పట్ల ఆసక్తి ఉన్న ఆయన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ లో ఉద్యోగం వదులుకొని ఆనందవాణి అనే పత్రికకు సంపాదకునిగా జాయిన్‌ అయ్యారు..        ఆ పత్రికలో శ్రీశ్రీతో పాటు ఆరుద్ర రాసిన కవితలు సంచలనం సృష్టించాయి.. తరువాత అభ్యుదయ రచయితల సంఘం స్థాపించిన ప్రముఖుల్లో ఒకరు ఆరుద్ర..        తెలుగు పదాలకు ఎనలేని సేవ చేసిన ఆరుద్ర తొలి దశలో ఎన్నో కష్టాలను అనుభవించారు.. కొద్ది రోజులు తినడానికి తిండి కూడా లేక పానగల్‌ పార్క్‌ లో నీళ్లు తాగి కడుపు నింపుకున్నారు.. ఈ కష్టాలేవి ఆయన సాహితీ ప్రస్థానానికి అడ్డు రాలేదు..        త్వమేవాహంతో మొదలు పెట్టి.. వందలాదిగా గేయాలు, గేయనాటికలు,కథలు, నవలలు, సాహిత్య పరిశోదక వ్యాసాలు, వ్యంగ వ్యాసాలు, పుస్తకాలపై విమర్శలు ఇలా ఆయన చేయని రచనా ప్రకియే లేదు. కేవలం సాహితీ రంగానికే కాదు తెలుగు సినీ రంగానికి కూడా ఆయన చేసిన సేవలు ఎనలేనివి.. 1949లో మొదలైన ఆయన సినీ ప్రస్థానంలో నాలుగు వేలకు పైగా పాటలు రాశాలు.. వీటిలో ఆయన మార్క్‌ అభ్యదయ గీతాలతో పాటు భక్తి గీతాలు, విరహ గీతాలు, ప్రేమ పాటలు కూడా ఉన్నాయి..        తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలకు గాను 1985లో ఆంద్రవిశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో పాటు గైరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఇలా తెలుగు సాహిత్యాన్ని తన వంతు బాధ్యతగా అభ్యుదయం వైపు అడుగులు వేయించిన ఆరుధ్ర 1998 జూన్‌ 4న తుది శ్వాస విడిచారు.. ఆయన ఈ లోకాన్ని విడిచినా ఆయన రచనలు, కవితలు, పాటల ద్వారా ఎప్పటికీ మన మధ్యే ఉంటారు.. ఈ సంధర్భంగా ఆ మహారచయితకు మరోసారి నివాళులర్పిద్దాం..  

బలుపు వేరు..వాపు వేరు: దాసరి

        హీరో రవితేజ నటిస్తున్న ‘బలుపు’ చిత్రం ఆడియో ఫంక్షన్ లో దర్శకరత్న దాసరి నారాయణ రావు రవితేజని పొగడ్తలతో ముంచెత్తాడు. “సినీ పరిశ్రమలో నాకన్న ‘బలుపు’న్న వారు ఎవరూ లేరు. అందరూ వాపునే బలుపు అనుకుంటారు. కానీ వాపు వేరు బలుపు వేరు. ‘బలుపు’ టైటిల్ నాకు నచ్చింది. ఈ చిత్రాన్ని నిర్మించిన పీవీపీ సంస్థకు ఇది మొదటి సినిమా. భారతీయ చిత్ర పరిశ్రమ వందేళ్లు పూర్తయిన సంధర్భంగా మొదలయిన ఈ సంస్థ వందేళ్లు కొనసాగాలి. ఇలాంటి సంస్థలు చిత్ర పరిశ్రమలోకి వస్తే సినీ పరిశ్రమ కలకలలాడుతుంది. హీరో రవితేజ అంటే నాకు ఇష్టం. చిన్న వేశాలతో పరిశ్రమలోకి వచ్చి స్వయంకృషితో ఎదిగాడు. రవితేజ చిత్ర పరిశ్రమకు అవసరం అని, ఆయన రెండు లేదా మూడు నెలల్లో సినిమాను పూర్తి చేయడం వల్ల నిర్మాత లాభపడతాడని''అని దర్శకరత్న దాసరి నారాయణ రావు అన్నారు.ఈ నెల 21 న రిలీజ్ కావడానికి సిద్దమవుతున్న ఈ సినిమాకి గోపీచంద్ మలినేని డైరెక్టర్. శృతి హాసన్, అంజలి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

దీక్షాసేత్ కి లక్కీఛాన్స్

        తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హిట్ లేక సతమతమవుతున్న హీరోయిన్ దీక్షాసేత్ కి ఓ బంపర్ ఆఫర్ తగిలింది. వేదం సినిమాతో టాలీవుడ్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ సెంకండ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని, ఒకటి, రెండూ సినిమాల్లో మొయిన్ హీరోయిన్ గా నటించినా సరైన విజయం దక్కక పోవడంతో సినిమాల్లో తీసుకోవడానికి నిర్మాతలు వెనుకాడుతున్నారు. అయితే ఈమెకు సడన్ గా బాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం దక్కింది. రణబీర్‌ కపూర్‌లకు వరుసకు సోదరుడయ్యే ఆర్మన్‌ జైన్‌ హీరో గా, సైఫ్ ఆలీఖాన్ నిర్మాతగా, ఆరిఫ్‌ అలీ దర్శకత్వం వహించే ఈ సినిమాలో దీక్షాకు హీరోయిన్ గా ఛాన్స్ రావడంతో ఈ అమ్మడు కూడా బాలీవుడ్ కి వెళ్ళే హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. పంజాబీ భామ దీక్షా సేథ్‌కి టాలీవుడ్ దక్కని విజయాలు బాలీవుడ్ లోనైనా దక్కుతాయో లేదో చూడాలి.

‘బాహుబలి’లో సోనాక్షి లేదన్న రాజమౌళి

        ప్రముఖ దర్శకుడు రాజమౌళి భారీ బడ్జెట్ తో రూపొందించబోతున్న ‘బహుబలి ’ సినిమా కు సంబంధించి ఏదో ఒక రూమర్ రావడం, దానిపై రాజమౌళి స్పందించడం సర్వ సాదారణం అయిపోయింది. తాజాగా ఈ సినిమా హిందీ వెర్షన్ లో హీరోయిన్ గా అనుష్కను తీసివేసి, సోనాక్షి సిన్హాను తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ వార్తల పై రాజమౌళి ట్విట్టర్ లో స్పందించాడు. బాహుబలిలో సోనాక్షి నటించడం లేదని స్పష్టం చేశారు. అనుష్క లీడ్ హీరోయిన్ పాత్రకు ఖరారైందని, మరో హీరోయిన్ ఫైనలైజ్ కావాల్సి ఉందని తెలిపారు. అదే విధంగా తాను కూడా ఈ చిత్రంలో నటించడం లేదని, కేవలం దర్శకుడిగా నా పని తెర వెనక మాత్రమే అని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇలాంటి వార్తలు వినివిని చిరాకెత్తిన సినీ జనాలు, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని అమోయమంలో పడిపోతున్నారని అంటున్నారు.

సునీల్ 'యాక్షన్ త్రీడీ'

        అల్లరి నరేశ్ నటిస్తోన్న యాక్షన్ త్రీడీ సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. ఫస్ట్ లుక్ దగ్గర్నుంచి పోస్టర్ల వరకూ అన్నీ వెరైటీగా డిజైన్ చేయడంతో సినిమా ఓ రేంజ్ లో ఉండొచ్చన్న ఆసక్తి పెరుగుతోంది జనాల్లో. ఈ ఆసక్తిని మరింత పెంచడానికి దర్శక నిర్మాతలు ఓ ప్రత్యేక పాత్రను సృష్టించారు. అందులో నటించాలంటూ సునీల్ ని అడిగారు. హీరో అవతారం ఎత్తాక సునీల్ చిన్న చిన్న పాత్రలు చేయడం మానేశాడు. అయినా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు. దానికి కారణం అల్లరి నరేశ్. అతడితో సునీల్ కి మంచి స్నేహం ఉంది. అందుకే అతణ్ని ఒప్పించే పనిని నరేశ్ కే అప్పగించాడు దర్శకుడు. సునీల్ కూడా నరేశ్ మాట కాదనలేక వెంటనే సరే అన్నాడు. టాలీవుడ్ లో కాంపిటీషన్ చాలా హెల్దీగా ఉంటుందని చెప్పడానికి ఇదో ఉదాహరణ!

పాప్ సింగర్ మధు 'దేశి గర్ల్' ఆల్బమ్ విడుదల

        తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన పాప్ సింగర్ మధు రూపొందించిన 'దేశి గర్ల్' ఆల్బమ్ గురువారం రాత్రి హైదరాబాద్ లో తాజ్ డెక్కన్ లో విడుదలైంది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ, సంగీత ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఆల్బమ్ లోని తొలి పాటను దశరథ్, రెండో పాటను ఆర్పీ పట్నాయక్, మూడో పాటను రమేష్ పుప్పాల ఆవిష్కరించారు.   డైరెక్టర్ దశరథ్ మాట్లాడుతూ: ''మధుకు పాటలంటే చాలా ఫ్యాషన్. పాప్ సింగర్ గా మంచి పేరు తెచ్చుకుంది. సంగీతం మీద తనకున్న ఆసక్తి ఇంత దూరం వచ్చేలా చేసింది. వీడియో ఆల్బమ్ కూడా చలా బాగుంది'' అన్నారు. ఆర్పీ పట్నాయక్  మాట్లాడుతూ:  ''పాప్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న మధు ఎంతో కష్టపడి ఈ స్థానానికి చేరుకుంది. ఈ రంగంలో ఆమె అనుకున్న అన్ని స్థానాలను చేరుకోవాలి'' అన్నారు.  నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ: ''మధు ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడిందో నాకు ప్రత్యేకంగా తెలుసు. తన ఇళ్ళు కూడా తాకట్టు పెట్టి ఎన్నో కష్టాలను అధిగమించింది. అనుకున్నదాని కోసం ఇంతగా కష్ట పడేవారు అరుదుగా ఉంటారు. ఆమె తప్పకుండా విజయం సాదించాలి'' అన్నారు.   పాప్ సింగర్ మధు మాట్లాడుతూ...''నేను పడ్డ కష్టాన్ని ఇంతమ౦ది గుర్తించారని అనుకుంటుంటే ఆనందంగా ఉంది. నిజానికి ఇంత మంది సపోర్ట్ తో కష్టాన్ని ఈజీగా అధిగమించాను. నేను చిన్నప్పటి నుంచి కవితలు రాసేదాన్ని. న్యూజేర్సిలో మా ఇంటి పక్కన సాయిబాబా గుడి ఉండేది.అందరూ నైవేద్యాలు సమర్పిస్తుంటే నేను ఓ భజన్ పాడతానని అన్నాను. ఇక రెండు రోజులు ఉదనంగా రాసి పాడాను. తొలిసారి నా పాటను నేను పాడుతుంటే నాకు వణుకు పుట్టింది. ఈ స్థాయికి రావడానికి చలా కష్టపడ్డాను. నా దేశిగర్ల్ ఆల్బమ్ అందరూ ఆదరిస్తారని నమ్మకం ఉంది''అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని మధుని అభినందించారు.   

ఫామ్ హౌస్ లో దొరికిన హీరోయిన్

        తమిళ నటి అయిన లీనా మరియాపాల్ కూడా బ్యాంక్ కి 19 కోట్లు ఎగనామం పెట్టింది. ఈమెకి తమిళంలో మంచి అందగత్తె అనే పేరుంది. కానీ ఈ వ్యవహారం బయటికి రావడంతో తమిళ ప్రేక్షకులతో సహా ఆమె అభిమానులు కూడా ఈమెను ఛీ కొట్టడమే కాకుండా మోసగత్తె అనే బిదురుకూడా ఇచ్చారు. ఈమె ఓ బ్యాంక్ నుండి రుణం పొంది దానిని కట్టకుండా గత కొన్ని రోజుల నుండి తప్పించుకు తిరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. తన బాయ్ ఫ్రెండ్ అయిన బాలాజీ ఆలియాస్ చంద్రశేఖర్ తో కలిసి ఢిల్లీలోని ఓ ఫామ్ హౌజ్ లో ఉన్నారని సమాచారం అందుకున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈమెతో పాటు మరో ఆరుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకొని లీనా , ఆమె బాయ్ ఫ్రెండ్ పై 420 ఛీటింగ్ కేసుతో సహా 406 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు.

బుల్లితెర ఐటెం భామలు

        పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న్యూ మూవీ 'అత్తారింటికి దారేది ’లో ఐటెం సాంగ్ చేయడానికి హాట్ యాంకర్ అనసూయ ఒప్పుకోక పోవడంతో, ఆమె స్థానంలో మరో హాట్ యాంకర్ కి అదృష్టం వరించింది. ఈ సినిమాలో పవన్ సరసన నటించడానికి యాంకర్ ఉదయభానుకు ఛాన్స్ దొరికిందని అంటున్నారు. గత దశాబ్ద కాలం నుండి యాంకర్ గా బుల్లి తెర ప్రేక్షకుల్ని ఉర్రూతలు ఊగిస్తున్న ఉదయభాను ఈ మధ్య తన అందాలను ఒలకబోస్తూ ఒకటి రెండు సినిమాల్లో ఐటెం సాంగుల్లో నటించిన విషయం తెలిసిందే. ఇటీవల 'జులాయి'లో అల్లుఅర్జున్ సరసన ఐటెం సాంగ్ చేసిన ఉదయభానుకు పవన్ కళ్యాణ్ సరసన అవకాశం రావడంతో ఎగిరిగంతెసిందట. ఇంకేముంది.... ఈ సినిమా పాటలో ఉదయభాను అందాలకు ప్రేక్షకుల మతి పోవడం ఖాయం అంటున్నారు.

నాగచైతన్య తో మూడోసారి తమన్నా

        టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా, అక్కినేని నాగచైతన్య ముచ్చటగా మూడోసారి తెరపై జంటగా కనిపించబోతున్నారు. 100% లవ్, తడఖా వంటి చిత్రాలతో హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్న వీళ్ళిద్దరూ త్వరలో హాట్రిక్ కొట్టేందుకు సిద్దమవుతున్నారు. నాగచైతన్య డ్యూయల్ రోల్ లో కింగ్ నాగార్జున సూపర్ హిట్ హలోబ్రదర్ ఫిల్మ్ ని శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో శివప్రసాద్ రెడ్డి రీమెక్ చేయనున్నారు. ఈ సినిమాలో చైతుకు జంటగా తమన్నాని సెలెక్ట్ చేశారు. ఈ మూవీ జూన్ లో మొదలు కానుందని సమాచారం. తడఖా తో ఫామ్ లోకి వచ్చిన చైతు 'మనం', 'హలోబ్రదర్' తో వరుస విజయాలు కొడతాడని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు.

ఎన్టీఆర్, అనూప్ 'రభస'

        టాలీవుడ్ లో చిన్న హీరోలకి వరుస విజయాలు అందిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ 'అనూప్ రూబెన్స్'. ఈ సమ్మర్ లో సర్ ప్రైజ్ హిట్ 'గుండెజారి గల్లంతయిందే' అనూప్ మ్యూజిక్ కి మేజర్ షేర్ వుంది. ఇదికాక ఇష్క్, పూలరంగడు, ప్రేమ కావాలి వంటి విజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించాడు. ఇప్పుడు అవే అతనికి పెద్ద సినిమాల్లో అవకాశాలు తెచ్చిపెడుతున్నాయి. అక్కినేని ఫ్యామిలీ నటిస్తున్నా 'మనం' సినిమాకి అనూప్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఇతనికి మరో గోల్డెన్ ఛాన్స్ దక్కింది. ఎన్టీఆర్, సమంత జంటగా కందిరీగా డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో త్వరలో మొదలుకానున్న 'రభస' కి అనూప్ మ్యూజిక్ అందిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి బెల్లంకొండ సురేష్ నిర్మాత. ఈ సినిమాతో అనూప్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ల సరసన చేరడం ఖాయం అంటున్నారు.

ప్రభాస్ 'బాహుబలి' రెమ్యూనరేషన్ 20 కోట్లు!

        యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ 'మిర్చి' బ్లాక్ బాస్టర్ తరువాత సడన్ గా టాలీవుడ్ టాప్ లీగ్ లోకి దూసుకువెళ్ళాడు. తెలుగు సినిమాలో ఎక్కువగా పారితోషకం తీసుకుంటున్న హీరోలలో పవన్ కళ్యాణ్, మహేష్, ఎన్టీఆర్ పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి. అయితే ఈ హీరోలందరికి షాక్ ఇచ్చే రేంజ్ లో ప్రభాస్ రెమ్యూనరేషన్ తీసుకున్నాడని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో, భారీ స్థాయిలో రూపొందుతున్న 'బహుబలి' కోసం ప్రభాస్ కి భారీ పారితోషకం ఇచ్చారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ దాదాపు 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని అంటున్నారు. దీంతో తెలుగులో అత్యధిక పారితోషకం తీసుకున్న హీరోగా ప్రభాస్ రికార్డు సృష్టించినట్టేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సినిమాకు ప్రభాస్ ఈస్థాయి పారితోషకం తీసుకోవడం పెద్ద విశేషమేమీ కాదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా రెండు సంవత్సరాలు కొనసాగే అవకాశం ఉందని, ఇంతే సమయంలో ప్రభాస్ కనీసం మూడు సినిమాలను పూర్తి చేసుకొనే అవకాశాన్ని మిస్ అయినట్టేనని వీరి వాదన!

'ఇద్దరమ్మాయిలతో' సెన్సార్ రిపోర్ట్ న్యూస్

        స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'ఇద్దరమ్మాయిలతో' సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ మూవీ లో కొన్ని సీన్లకు కత్తెర వేసిన సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికేట్ ను జారీ చేసింది. ఈ నెల 31న 'ఇద్దరమ్మాయిలతో' గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 'దేశముదురు' సూపర్ హిట్ తరువాత పూరి జగన్నాథ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో, దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే సినిమా సంగీతం సూపర్ హిట్ కావడంతో, మూవీ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసలు ఈ రోజే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా...ఐపీఎల్ ఫీవర్ కారణంగా సినిమాను వచ్చే వారానికి వాయిదా వేసారు. బన్నీ సరసన కేథరిన్, అమలా పాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

రజనీకాంత్ హిందీ పాట

        సూపర్‌స్టార్ రజనీకాంత్ మొదటిసారిగా ఓ హిందీ పాటను పాడారు. ఇప్పటికే 'కొచ్చాడయాన్' తమిళ వెర్షన్ కోసం వైరముత్తు రాసిన పాటను పాడిన ఆయన ఇప్పుడు అదే సినిమా హిందీ వెర్షన్‌లో ఇర్షాద్ కమిల్ రాసిన పాటను పాడటం విశేషం. 'లవ్ ఆజ్ కల్', 'రాక్‌స్టార్' సినిమాలతో గేయ రచయితగా ఇర్షాద్ మంచి పేరు సంపాదించుకున్నాడు. రజనీ కుమార్తె సౌందర్య డైరెక్ట్ చేసిన 'కొచ్చాడయాన్'కు ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నాడు. రజనీ నమ్మకాలు, ఆయన తాత్వికత ప్రతిఫలించే రీతిలో నడిచే ఈ పాటలోని కొన్ని ఉర్దూ పదాలను పాడేందుకు మొదట కాస్త ఇబ్బంది పడినప్పటికీ రెహమాన్ ఆయన చేత వాటిని సరిగ్గా పలికించగలిగాడని సమాచారం. రజనీ మొదటిసారిగా రెండు దశాబ్దాల క్రితం 'మణ్ణన్' (1992) సినిమా కోసం ఓ పాట పాడారు.

హీరోయిన్ అంజలి కి కోర్ట్ వార్నింగ్

        ప్రముఖ సినీ నటి అంజలి మీద చెన్నై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శకుడు కళంజియం పరువు నష్టం కేసులో ఈ రోజు నటి అంజలి కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఆమె హాజరు కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు జూన్ 5న ఖచ్చితంగా హాజరుకావాలని సైదాపేట కోర్టు ఆదేశించింది. విచారణకు హాజరుకాకుంటే అరెస్టు వారెంట్ జారీ చేస్తామని న్యాయస్థానం హెచ్చరించింది. ఇంతకుముందు కూడా ఒకసారి అంజలి న్యాయస్థానానికి హాజరుకాలేదు. దర్శకుడు కళంజియం డబ్బుల కోసం తనను వేధించాడని అంజలి ఆరోపించింది. దాని మీద దర్శకుడు కళంజియం పరువునష్టం కేసు పెట్టారు. కుటుంబ సమస్యల నేపథ్యంలో పిన్ని, దర్శకుడి మీద ఆరోపణలు చేసిన అంజలి ఐదు రోజులు అజ్ఞాతంలోకి వెళ్లి కలకలం రేపింది. తరువాత బయటకు వచ్చి యధావిధిగా షూటింగ్స్ లో పాల్గొంటుంది. అయితే కళంజియం మాత్రం అంజలిని వదలడం లేదు.

పవన్ కళ్యాణ్ కి నో చెప్పిన అనసూయ

        పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' లో జబర్దస్త్ యాంకర్ అనసూయ ఐటెం సాంగ్ చేస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలను యాంకర్ అనసూయ ఖండించింది. పవన్ కళ్యాణ్ సినిమాలో ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చిన మాట నిజమే కాని, మొదటి సారే ఇలాంటి సాంగ్ తో తన కేరియార్ ప్రారంభించడం ఇష్టం లేక నో చెప్పిందట. తాను ప్రస్తుతం టీవి షో లతో బిజీగా ఉన్నానని.. సినీ కేరియార్ గురించి ఆలోచించడం లేదని చెప్పింది. నటనలో తన టాలెంట్ నిరూపించుకున్న తరువాత ఇలాంటి వాటిపై దృష్టి పెడతానని పేర్కొంది. పవన్ కళ్యాణ్ చిత్రంలో ఛాన్స్ మిస్ అవుతున్న౦దుకు బాధగా వుందని అంది అనసూయ.