పవన్ పేరుతో మారుమోగిన 'ఎవడు' ఆడియో

      మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ 'ఎవడు' ఆడియో ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఫంక్షన్ కు మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా వచ్చారు. అయితే 'ఎవడు' ఆడియో కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాకపోయేసరికి మెగా అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆడియో ఫంక్షన్ మొత్తం పవన్ కళ్యాణ్ పేరుతో మారుమోగింది. దీంతో అభిమానులను సముదాయించడానికి చిరు పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించారు. ఎవడు విజయోత్సవానికి మాత్రం పవన్ కళ్యాణ్ తప్పకుండా వస్తాడని చిరంజీవి అన్నారు. దర్శకుడు పైడిపల్లి వంశీ తనకు చెప్పినట్టుగానే కథను తెరకెక్కించారని చెప్పారు. నిర్మాత దిల్ రాజు నిర్మాణ కార్యక్రమాలను దగ్గరుండి చూసుకున్నారని అన్నారు.

ఎవడు ఆడియో: పవన్ కాదు చిరంజీవే!

      మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎవడు 'ఆడియో' ఈ రోజు సాయంత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ ఆడియో ఫంక్షన్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా వస్తారని మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఆడియో కార్యక్రమానికి హాజరు కాకపోవచ్చునని..మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా వస్తారని అంటున్నారు.   'ఎవడు' ఆడియో రిలీజ్ కి ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు హాజరుకాబోతున్నారని సమాచారం. అల్లు అర్జున్ తో పాటు మెగా హీరోలు కొంతమంది ఫంక్షన్ కి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి 'సుమ' యాంకర్ గా వ్యవహరించనుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్. బ్రిటిష్ మోడల్ అమీ జాక్స్ సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు.

జియాఖాన్ ఆత్మహత్య: సూరజ్ కు బెయిల్

    బాలీవుడ్ నటి జియాఖాన్ ఆత్మహత్య కేసులో అరెస్టైన ఆమె ప్రియుడు సూరజ్ పంచోలికి బెయిల్ దొరికింది. ముంబై హై కోర్ట్ ఈ రోజు సూరజ్ పంచోలికి బెయిల్ మంజూరు చేసింది. వేల పూచీ కత్తుతో పాటు, పాస్ పోర్ట్ ను స్వాదీనం చేయాలని కోర్ట్ ఆదేశించింది. పోలీసులు విచారణకు పిలిచినప్పుడల్లా హాజరుకావాలని సూచించింది.ముంబై సెషన్స్ కోర్టు సూరజ్‌కు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించగా,అతను హైకోర్టును ఆశ్రయించాడు. జియా ఖాన్ జూన్ 3వ తేదీన ముంబై జుహు లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. జియాఖాన్ రాసిన సుసైడ్ నోట్ ఆధారంగా సూరజ్ పంచోలిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ లేఖలో సూరజ్ తనను మానసికంగా, శారీరకంగా హింసించాడని జియా ఖాన్ పేర్కొంది. అంతే కాకుండా సూరజ్ వల్ల తాను గర్భం దాల్చానని, అబార్షన్ కూడా అయిందని పేర్కొంది.

అనుష్క 'రుద్రమదేవి'కి 5కోట్ల ఆభరణాలు

      టాలీవుడ్ అందాల అరుంధతి అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కిస్తున్న భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి మూవీ 'రుద్రమదేవి'. ఈ సినిమాలో అనుష్క వాడే ఆభరణాల ఖరీదు 5కోట్ల రూపాయలని సమాచారం. బాలీవుడ్ జోధాఅక్బర్ కు పనిచేసిన నీతా లుల్లా ఈ సినిమా కు ఆభరణాలు డిజైన్ చేసింది. ఈమె డిజైన్ చేసిన నగలు నిజమైన వజ్రాలు, బంగారంతో తాయారు చేసి అనుష్క కు దరిస్తున్నారట. జోధా అక్బర్‌లో ఐశ్వర్యారాయ్ పెట్టుకున్న నగలు ఎంత గుర్తింపు పొందాయో అంత గుర్తింపు ఈ నగలకు లభిస్తుందని అంటున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ జూలై 3 నుంచి వేయి స్తంభాల గుడి సెట్లో జరగనుంది. అనుష్క, రానా, సుమన్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా 2014సమ్మర్ లో రిలీజ్ కానుంది.

మోహన్ బాబుకి తప్పిన ప్రమాదం

      టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం బ్యాంకాక్ లో మంచు ఫ్యామిలీ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సంధర్భంగా భార్య నిర్మలతో కలిసి మోహన్ బాబు సముద్ర జలాల్లో వేగంగా వెళ్లే మోటార్ బైక్ మీద భార్యను ఎక్కించుకుని నీళ్లలోకి వెళ్లగా అది అదుపు తప్పి ఇద్దరూ నీళ్లలో పడిపోయారు. అక్కడే ఉన్న కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ లు ఇది గమనించి నీళ్లలోకి దూకి తల్లిదండ్రులను రక్షించుకున్నారు. వీరిద్దరూ క్షేమంగా చేరుకునేసరికి దర్శకుడు రిలీఫ్ ఫీలయ్యారు.ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

'రొమాన్స్' బూతు సినిమానే

      ప్రేమ కథా చిత్రంతో డైరెక్టర్ మారుతి తన స్టైల్ ను మార్చుకున్నాడని అనుకున్నారు అందరూ, కాని మారుతి మాత్రం తాను ఏ మాత్రం మారలేదని మరోసారి 'రొమాన్స్' మూవీ తో నిరూపించుకున్నాడు. గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ పై డార్లింగ్ సినిమా మాటల రచయితని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ తీసిన సినిమా 'రొమాన్స్'. ఈ సినిమా ఆడియో నిన్న రిలీజైంది. ఈ సినిమా ట్రైలర్ చూసిన యూత్ మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పటిలాగే ఈ రోజుల్లో, బస్ స్టాప్ వంటి బూతు డైలాగులతో, కాన్సెప్ట్ కూడిన సినిమాని తీశారు. మరోసారి అబ్బాయిలు, అమ్మాయిలు బూతులు మాట్లాడుకోవడం చక్కగా చూపించారు 'రొమాన్స్' ట్రైలర్లలో. సో 'రొమాన్స్' లో కూడా బస్ స్టాప్, ఈ రోజుల్లో లాగా మంచి బూతు సినిమానే!

పవన్ కోసమే 'ఎవడు' ఆడియో వాయిదా

    రామ్ చరణ్ కి 'నాయక్' తరువాత టైం అసలు కలిసి రావడం లేదు. బాలీవుడ్ ప్రాజెక్ట్ 'జంజీర్' కోర్ట్ కేసులతో వాయిదా పడుతూ వస్తుంటే...ఇప్పుడు 'ఎవడు' సినిమా షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి రోజురోజుకూ వెనక్కిపోతునే వుంది. లేటెస్ట్ గా ఈ సినిమా ఆడియో మళ్ళీ వాయిదా పడింది. 'ఎవడు' మూవీ ఆడియో ఈ నెల 30న విడుదల చేస్తున్నామని హీరో రామ్ చరణ్ కూడా ప్రకటించారు. అయితే ఏమైందో తెలియదు గాని దీనిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. 'ఎవడు' ఆడియో రిలీజ్ కి గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' కోసం యూరప్ వెళ్ళారు. అక్కడి నుంచి 30న హైదరాబద్ కి రానున్నారు. ఈ నేపధ్యంలో ఒకటికి షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరి జూలై ఈ '1' సినిమా ఆడియో విడుదలవుతుందో లేదో! 

'బలుపు' రెస్పాన్స్ పై శ్రుతి హాసన్ ట్విట్

        మాస్ మహారాజ రవితేజ నటించిన 'బలుపు' మూవీ నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యాక్షన్ తో పాటు కామెడీ కూడా బాగా పండడంతో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో బలుపు యూనిట్ సభ్యులు ఆనందంలో సంబరాలు చేసుకుంటున్నారు.   'బలుపు'  సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో హీరోయిన్ శ్రుతి హాసన్ ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని తెలియజేసింది. బలుపు సినిమా సక్సెస్ ట్యాంక్ ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పింది. ఈ సినిమాని సక్సెస్ చేసిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసింది. శ్రుతి హాసన్ కి తెలుగులో రెండో విజయం ఇది. వరుసు ప్లాపులతో ప్రేక్షకులను నిరాశపరుస్తూ వచ్చిన రవితేజ ‘బలుపు'తో వారి మనసు గెలిచాడని చెప్పొచ్చు.

'ఎవడు' ఆడియోకి పవన్ కళ్యాణ్

      మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఎవడు' ఆడియో ఈ నెల 30న తేదిన విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆడియో ఫంక్షన్ కి మెగా హీరోలు అందరూ వస్తారని సమాచారం. ముఖ్యఅతిధిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' చిత్రం షూటింగ్ కోసం యూరప్ వెళ్ళారు. అక్కడ షూటింగ్ ముగించుకొని ఈ నెల 30న హైదరాబాద్ కి వస్తున్నారు. అదే రోజు సాయంత్రం 'ఎవడు' ఆడియో ఫంక్షన్ లో పాల్గొంటారని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఉత్తరఖాండ్ వరద బాధితుల పనుల పర్యవేక్షణలో బిజీగా ఉండడంతో ఆయన హాజరుకాకపోవచ్చునని చెబుతున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో శృతి హాసన్, బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్ సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది.

'బలుపు'లో బాలకృష్ణ పై సెటైర్లు..!

      రవితేజ 'బలుపు' లో బాలయ్య పైన సెటైర్లు వేశారా! అవుననే..వార్తలు వినిపిస్తున్నాయి. బలుపులో హీరోయిన్ తో క్లోజ్ గా మూవ్ అయ్యేందుకు గిటారిస్టుగా అవతారమెత్తిన హీరో..ఆ వేషాన్ని మేనేజ్ చేసుకోలేక ఓ సారి చిక్కుల్లో పడతాడు. ఈ సినిమాలో డాక్టర్ పాత్ర పోషించిన అంజలి తన పేషంట్లని మ్యూజిక్ తో మోటివేట్ చేయమని అడుగుతుంది. అప్పుడు అసంధర్బం నుంచి బయటపడటానికి ఏం చేయాలో అర్థం కాక రవితేజ నోటికొచ్చినట్లు మాట్లాడుతాడు. అయితే బాలకృష్ణ వాయిస్ ని అనుకరిస్తూ రవి ఆ డైలాగ్ చెప్పారట. దీంతో కావాలనే బాలయ్య ను ఉద్దేశించి ఆ సీన్లు పెట్టించారని అభిమానులు అంటున్నారు. దీనిపై మున్ముందు ఎలాంటి కామెంట్స్ వస్తాయో చూడాలి.

ఎన్టీఆర్ తొందర పడుతున్నాడు

      యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా' మూవీ అనుకున్న డేట్ కంటే ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రిలీజ్ ను ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రీపోన్ చేశారట. లేటెస్ట్ గా వస్తున్న సమాచారం ప్రకారం...ఎన్టీఆర్ తొలి హిట్ సినిమా 'స్టూడెంట్ నెం. 1' సెప్టెంబర్ 27న విడుదలైంది. ఇదే రోజున 'రామయ్యా వస్తావయ్యా' ను కూడా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే దాని కంటే ముందుగా ఈ సినిమా సెప్టెంబర్ 17న విడుదల చేస్తున్నట్లు దిల్ రాజు తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో జరుగుతోంది. ఈ సినిమాలో సమంత, శ్రుతిహాసన్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

రవితేజ 'బలుపు' పబ్లిక్ టాక్

        మాస్ మహారాజ రవితేజ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. టాలీవుడ్ మినిమ౦ గ్యారెంటీ హీరోగా పేరు పొందిన మాస్ రాజా టైం గత రెండు సంవత్సరాలుగా ఏమి బాగాలేదు. వరుస పరాజయాలు రావడంతో ప్రొడ్యూసర్ లు అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తిగా లేరూ. ఈ సమయంలో ఆయన నటించిన తాజా మూవీ 'బలుపు' ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. దీంతో రవితేజకు టెన్షన్ ప్రారంభమైంది.   ఈ మార్నింగ్ షో తరువాత ప్రేక్షకుల అభిప్రాయాలు తెలుసుకుంటే...రవితేజ 'బలుపు' తో మళ్ళీ ఫాంలోకి వస్తాడని అ౦టున్నారు. ఈ సినిమాలో మాస్ రాజా తన మార్క్ యాక్షన్ తో అభిమానులను ఆకట్టుకున్నాడని తెలుస్తోంది. సినిమాలో కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నా...కామెడీసీన్లు, స్క్రీన్ ప్లేతో కవర్ చేసాడనే టాక్ వినిపిస్తోంది. అయితే తొలి రోజు గడిస్తే గానీ అన్నివర్గాల ప్రేక్షకుల అభిప్రాయాలు వెల్లడయ్యే అవకాశం లేదు. రవితేజ ఈ సినిమా పై పూర్తి నమ్మకంతో వున్నాడు.

రామ్ చరణ్ మ్యాటర్ సెటిల్

      మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్ మూవీ 'జంజీర్' కి కష్టాలు తొలగిపోయాయి. కాపీ రైట్ కోర్ట్ కేసులతో సతమతమవుతున్న ఈ సినిమా త్వరలో విడుదలకు రెడీ అవుతుంది. ఎలాగా అనుకుంటున్నారా...ఇప్పుడు ఏకంగా ఈ సినిమా నిర్మాతే మారిపోయాడు! అవును మరి.. ఈ సినిమాని స్టార్ట్ చేసిన నిర్మాణ సంస్థ అమిత్ మెహ్రా కంపెనీ స్థానంలో ఇప్పుడు రిలయన్స్ పార్టనర్ షిప్ తో ప్రకాష్ మేహ్రా ప్రొడక్షన్స్ సంస్థ రిలీజ్ చేయబోతుంది. ఎందుకంటే అమిత్ మెహ్రా సోదరులకు మనీ చెల్లించడంలో విఫలమయ్యారు. ఇంకా కొంచెం వివరాల్లోకి దిగితే అమిత్ మెహ్రా, ప్రకాష్ మేహ్రా వరసకి అన్నదమ్ములే కానీ వ్యాపారం వ్యాపారమే కదా! ఇప్పుడు జంజీర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతో౦ది. జూలైలో ప్రచారానికి ఈ సినిమా యూనిట్ రెడీ అవుతోంది. సెప్టెంబర్ లో ఈ మూవీ రిలీజ్ చేయనున్నారు.

'బాహుబలి' నిజాలు బయటపెట్టిన రాజమౌళి

      రాజమౌళి 'బాహుబలి' సినిమా పై గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. తన సోషల్ నెట్విర్కింగ్ ద్వారా రాజమౌళి ఈ వార్తలను ఖండించారు. ఈ సినిమాకు ఐమ్యాక్స్ ఫార్మాట్ కెమెరాలను ఉపయోగిస్తున్నారనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. అతని అన్ని సినిమాలకూ వాడినట్టుగానే అలెక్సా ఎక్స్ టీ కెమెరాలనే వాడనున్నట్లు రాజమౌళి స్పష్టం చేశాడు. అలాగే ఈ సినిమా బడ్జెట్ విషయంలోని పుకార్లను కూడా రాజమౌళి ఖండించారు. కేవలం మూడు రోజుల షూటింగ్ కు పది కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారన్న ప్రచారం ఫాల్స్ అని ఆయన స్పష్టం చేశారు. తాము ఈసినిమాకు భారీగా ఖర్చు పెడుతున్న విషయం వాస్తవమే అయినా..దాన్ని తెలివిగా ఖర్చు పెడుతున్నాం తప్ప… పిచ్చి పట్టినట్టు ఖర్చు చేయడం లేదని ఈ దర్శకుడు స్పష్టం చేశాడు. బాహుబలి జూలై ఆరు న సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది. గత ఏడాది జూలై ఆరున ఈగ సినిమా రిలీజ్ అయ్యింది. ఆ సెంటిమెంటుతో ఈ సినిమాకు క్లాప్ కొడుతున్నారని తెలుస్తోంది.

రాజకీయాల్లోకి ఉదయభాను!

      ప్రముఖ యాంకర్ ఉదయభాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన ఉదయభాను యాంకర్ గా బుల్లితెరపై హిట్ అయింది. ఉదయభాను అంటే తెలియని వారు రాష్ట్రంలో ఉండరు అంటే సందేహం అక్కర్లేదు. వేటగాడు, ఎర్రసైన్యం, ఖైదీబ్రదర్స్, కొండవీటి సింహాసనం, పోలీస్ నంబర్ 1, బస్తీమే సవాల్, శ్రావణమాసం తదితర చిత్రాలలో నటించింది. ఆపదమొక్కుల వాడు చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటించిన ఉదయభాను, లీడర్, జులాయి సినిమాలలో ఐటం సాంగ్ చేసింది. తాజాగా ఉదయభాను ప్రధాన పాత్రలో మధుమతి చిత్రం రూపొందింది. త్వరలో అది విడుదలకానుంది. తెర మీద ఇన్నాళ్లు భవిష్యత్ ఎదుర్కొన్న ఉదయభాను రాజకీయ రంగంలోకి రావాలని అనుకోవడం ఆశ్చర్యకరమే. గతంలో ఆమె తండ్రి మొయినుద్దీన్ మూడుసార్లు సర్పంచ్ గా పనిచేశారు. స్థానికంగా మొయినుద్దీన్ మంచి గుర్తింపు కూడా వుంది. మొయినుద్దీన్ మృతి చెందక ఫ్యామిలీ హైదరాబాద్ రావడంతో రాజకీయాలకి దూరమయ్యారు. తాజాగా ఉదయభాను టీఆర్ఎస్ లేదా బీజేపీ పార్టీలలో చేరుతుందని ఊహాగానాలు వినిపిస్తున్పాయి. 

శ్రుతి అందాలకు 'A' సర్టిఫికేట్

      వరుస పరాజయాలతో సతమవుతున్న మాస్ మహా రాజ రవితేజ ఈ సారి ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద తన 'బలుపు' ను చూపించాలనుకుంటున్నాడు. ఈ సినిమా జూన్ 28న ప్రపంచవ్యాప్తంగా రవితేజ కేరియార్లోనే అధిక ధియేటర్ లో విడుదలకు సిద్దంగా వుంది. మొదటిసారి 'బలుపు' ను చూసిన సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికేట్ ను జారీ చేసింది. ఏం జరిగిందో తెలియదు కాని మంగళవారం కూడా మళ్ళీ స్క్రీన్ చేసి 'A' సర్టిఫికేట్ ను జారీ చేశారు. దీనికి అసలు కారణం ఏమిటంటే...ఈ సినిమాలో శ్రుతి హాసన్ ఎక్స్ పోసింగ్ తో తన బలుపును చూపించేసరికి సెన్సార్ సభ్యులు పునరాలోచనలో పడి 'A' సర్టిఫికేట్ ను ఇచ్చారు. ఈ సినిమాలో శ్రుతి హాసన్ పొట్టి పొట్టి డ్రెస్ లతో మాస్ ప్రేక్షకుల మతులు పోగొట్టడం ఖాయమని అంటున్నారు.

రామ్ చరణ్ 'ఎవడు' న్యూ ఫొటోస్ సూపర్

      మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ 'ఎవడు' మూవీ షూటింగ్ శరవేగంగా జరుతున్న సంగతి తెలిసిందే. జూలై చివరికల్లా సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతోంది. ఇక్కడ రామ్ చరణ్, శ్రుతి హాసన్ పై మంచి మాస్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. 'ఎవడు' సినిమా న్యూ స్టీల్స్ కొన్ని ఈ రోజు మీడియాకు విడుదల చేశారు. ఈ స్టీల్స్ సినిమా పై అంచనాలను పెంచుతున్నాయి. ఇందులో రామ్ చరణ్ న్యూ లుక్స్ తో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. చరణ్ కి తగిన జోడిగా శ్రుతి హాసన్, అమీజాక్సన్ ఆకట్టుకుంటున్నారు. ‘ఎవడు' చిత్రం ఆడియోను జూన్ 30వ తేదీన విడుదల చేయనున్నారు.ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.  

మహేష్ 'శివం' ఎప్పుడు మొదలవుతుందో?

        టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు, క్రిష్ కలయికలో రూపొందనున్న 'శివం' సినిమా లేటెస్ట్ గా మరోసారి వార్తల్లోకి వచ్చింది. మహేష్ బాబు 'శివం' సినిమా చేయబోతున్నాడని తెలియజేసింది బాలీవుడ్ రౌడీ గర్ల్ సోనాక్షి సిన్హా. దీంతో ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెలుతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మహేష్ బాబు అభిమానులు. మహేష్ 'శివం' మూవీ 2014లో మొదలు కావచ్చునని అంటున్నారు. అప్పటికి మహేష్, సోనాక్షిల పెడ్డింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అవుతాయని చెబుతున్నారు. కొన్ని నెలల క్రితమే 'శివం' మూవీని నిర్మించబోతున్నట్లు అశ్వినీదత్ తెలిపారు. సోనాక్షి శివం సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ... ''క్రిష్ శివం సినిమా స్టోరీ చెప్పగానే ఎంతో ఉద్వేగభరితంగా అనిపించింది. క్రిష్ కథ చెప్పడానికి వచ్చినప్పుడు బాలీవుడ్ లో బిజీ గా ఉన్నాను..ఇప్పుడు తెలుగు లో సినిమా చేయలేను అని వినయంగా తిరస్కరిద్దామనుకున్నాను. కథ విన్నాక ఉత్కంఠను ఆపుకోలేకపోయాను. నేను చేసిన పాత్రలన్నీటికంటే..శివం లో చేస్తున్న పాత్ర నాకు మంచి పేరు వస్తుందని'' చెప్పింది