త్రిషకి అది కూడా పోయింది

      ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికి ఏ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో, అది ఎప్పుడు చేజారిపోతుందో ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు త్రిష కి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అసలకే సినిమాలు లేక సతమవుతున్న త్రిషకు సడన్ గా హీరో సూర్య పక్కన నటించే ఛాన్స్ రావడంతో మళ్ళీ తనకు లక్కీ డేస్ మొదలయ్యాయని అనుకుంది త్రిష. కాని ఇక్కడే ఓ ట్విస్ట్ జరిగింది. ఇప్పుడు త్రిష అవకాశం అమలాపాల్ కి దక్కింది.   సూర్య, గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో 'ద్రువ నక్షత్రం' అనే చిత్రం తెరకేక్కబోతుంది. అసలు ఈ సినిమాకి హీరోయిన్ గా ముందు అమలాపాల్ పేరే పరిశీలించారు. ఆ తరువాత ఎందుకనే త్రిషని ఎంచుకున్నారు. అయితే మళ్ళీ ఆ ఆఫర్ అమలాపాల్ కే దక్కడం చిత్ర మాయ. అలా..అమలాపాల్ ది త్రిషకి... త్రిష ది అమలాపాల్ కి దక్కింది.

భగ్నప్రేమికుడి షష్ఠిపూర్తి

    దేవాదాసు సినిమా విడుదలై 60 సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా తెలుగు వన్.కాం ఆ చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తుంది.       కొన్ని కథలు ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తాయి..ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తాయి. అలా వెండితెర మీద 14 సార్లు ఆవిష్కరింపబడిన అరుదైన కథ దేవాదాసు.. దాదాపు భారతీయ భాషలన్నింటిలో తెరకెక్కిన దేవాదాసు తెలుగు వెండితెర మీద ఆవిష్కరింపబడి 60 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ చిత్ర విశేషాలు తెలుసుకుందాం.. దేవదాసు పాత్ర అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అక్కినేని నాగేశ్వర్రావు.. అవును అసలు దేవాదాసు ఇలాగే ఉంటాడేమో అనేంత బాగా నటించారు ఆయన.. శరణ్‌ రాసిన నవలా నాయకున్ని కళ్లకు కట్టినట్టుగా మన ముందు ఆవిష్కరించారు.. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన మరో పాత్ర పార్వతి.. ఈ పాత్రల్లో ఎంతో హుందాగా ఓదిగిపోయింది సావిత్రి.. జానకీ చేయాల్సిన పాత్ర అదృష్టం కొద్ది సావిత్రిని వరించటంతో ఆ అవకాశాన్ని ఎంతో బాగా ఉపయోగించుకుంది.. 17 ఏళ్ల వయసులోనే తను తప్ప మరెమరూ ఆ పాత్రకు అంతగా న్యాయం చేయలేరేమో అనేంత బాగా నటించి మెప్పించింది.. Click Here to Watch Devadasu Full Movie   తెలుగులో అక్కినేని నటించిన దేవదాసు రిలీజ్‌ నాడే, పోటీగా సైగల్ నటించిన హిందీ దేవదాసును విడుదల చేశారు బాలీవుడ్‌ నిర్మాతలు.. అయినా తెలుగు దేవాదాసు ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు.. అంతేకాదు భారతీయ చరిత్రలోనే అన్ని దేవాదాసుల కంటే ఏఎన్నార్‌ హీరోగా నటించిన దేవాదాసే భారీ విజయం సాదించింది.         1951 నవంబర్ 24న మద్రాసులోని రేవతి స్టూడియోలో రాత్రి 8 గంటలకు దేవదాసు షూటింగ్ ప్రారంభమైంది. ఎంత మంది వద్దు అంటున్నా .. ఎలాంటి అవాంతరాలు ఎదురైనా ఎలాగైనా ఈ సినిమా పూర్తి చేయాలనే దృడ సంకల్పంతో సినిమా ప్రారంబించారు నిర్మాత  ద్రణావధ్యుల లక్ష్మీ నారాయణ.. నిర్మాత లక్ష్మీ నారాయణ గారు అంత సాహసం చేయటం వెనుక కారణం లేకపోలేదు.. దేవాదాసు కథ అప్పటికే బాలీవుడ్‌ తెర మీద మంచి సక్సెస్‌ సాదించింది.. అంతకు మించి దర్శకులు వేదాంతం రాఘవయ్యగారు భారీ బరోసా ఇవ్వటంతో నిర్మాత నిశ్చింతగా ఉన్నారు.. ఇక ఈ చిత్రానికి మరో ఎసెట్‌ సీనియర్‌ సముద్రాల.. ఈ సినిమాకు మాటలు పాటలు అందించిన సముద్రాల ప్రతీ అక్షరంలోనూ తన మార్క్‌ చూపించారు.. అంతేకాదు ఈ సినిమాలో ఉన్న పదకొండు పాటలూ ఆయనే రాయడం విశేషం..   ఈ సినిమా సంగీతం ఇప్పటికీ అదే స్థాయిలో ఆకట్టుకుంటుంది అంటే అందుకు కారణం సంగీత దర్శకుడు సుబ్బరామన్‌.. ఇప్పటి చిత్రాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఆ రోజుల్లోనే మాస్‌, క్లాస్‌, రోమాంటిక్‌ అండ్‌ ట్రాజిక్‌ సాంగ్స్‌తో అద్భుతమైన పాటలు ఇచ్చారు.. దేవాదాసు సినిమా మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ నడుస్తుండగానే సుబ్బరామన్‌గారు మరణించారు.. అప్పటికీ రెండు పాటలు ఇంకా బ్యాలెన్స్‌ ఉన్నాయి.. దాంతో సుబ్బరామన్‌గారి అసిస్టెంట్‌.. ఎం ఎస్‌ విశ్వనాధన్‌గారు ఆ రెండు పాటలను పూర్తి చేశారు.. ఫైనల్‌గా ఎన్నో అవాంతరాల తరువాత దేవాదాసు చిత్రం విడుదలకు రెడీ అయ్యింది.. జూన్‌ 26, 1953న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. అప్పటి వరకు ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ ఘనవిజయం సాదించింది.. ఏడు కేంద్రాల్లో వందరోజులు ఆడి చరిత్ర సృష్టించింది. సంతోషాన్ని, చిలిపితనాన్ని, పొగరుని, క్షోభని, ఎడబాటుని, తాగిన మైకాన్ని, విషాదాన్ని... ఇలా రకరకాల హావ భావాల్ని అద్భుతంగా చూపించిన అక్కినేని నటనకు యావత్‌ భారత దేశం మురిసిపోయింది.. దిలీప్‌కుమార్‌, శివాజీ గణేషన్‌ లాంటి మహానటులు కూడా ఈ పాత్ర ఆయన తప్ప మరెవరూ ఇంత బాగా చేయలేరు అన్నారంటే ఆయన నటన ఏ స్థాయితో ఉందో ఊహించుకోవచ్చు..     పేదింటి అమ్మాయి - పెద్దింటి అబ్బాయి - పెద్దలు విడగొట్టడం - అబ్బాయి మద్యానికి బానిస కావడం ఇదంతా చాలా సార్లు విన్న కథ లాగే అనిపించినా ఈ నాటికి మళ్లీ మళ్లీ చూడాలని పించే సినిమా దేవదాసు.. అందుకే ఆ సినిమా రిలీజ్‌ అయి 60 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా మనం ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం..

'కిస్' ఆడియో అదిరింది

    అడివి శేష్ హీరోగా నటించిన 'కిస్' మూవీ ఆడియో రిలీజైంది. ఈ సినిమా పాటల వేడుక హైటెక్స్ నోవాటెల్ లో ఘనంగా జరిగింది. మిస్ కెనడా ప్రియ బెనర్జీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ సాయి కిరణ్ అడివి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటలు చాలా బాగున్నాయని, అడివి శేష్ మంచి నటుడు అవుతాడని భరద్వాజ గారు అన్నారు.   హీరో సుమంత్ మాట్లాడుతూ...అడివి శేష్ తాను మంచి ఫ్రెండ్స్ అని, తన డైరెక్షన్లో ఒక సినిమా చేద్దామని అనుకున్నాం. కాని కొన్ని కారణాల వల్ల అది కుదరలేదని, త్వరలో శేష్ డైరెక్షన్లో తప్పకుండా సినిమా చేస్తానని చెప్పారు.     అడివి సాయి కిరణ్ మాట్లాడుతూ...ఎనభై ఏళ్ళ తెలుగు సినిమాకు మా వంతు గౌరవాన్ని ప్రదర్శించాడనికి ఈ కార్యక్రమంలో కొన్ని ఆణిముత్యాలైన పాటలను వేశా౦. ఈ సినిమా పూర్తి కావడానికి రమేష్ ప్రసాద్ చాల సపోర్ట్ ఇచ్చారు. ఈ సినిమాకు అన్ని శేష్ చూసుకున్నాడు. నేను జస్ట్ సపోర్ట్ ఇచ్చానంతే.         ఈ కార్యక్రమంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, రమేష్ ప్రసాద్, ఎమ్మెస్ రాజు, తమ్మారెడ్డి భరద్వాజ, హీరో సుమంత్, నీలిమ తిరుమల శెట్టి, సిరాశ్రీ తదితరులు పాల్గొన్నారు. 

విజయశాంతి కోటి తీసుకుందట

      తెలుగుతెర లేడి అమితాబ్ విజయశాంతి 49వ పుట్టినరోజు నేడు. తెలుగు సినిమాలలో అగ్రహీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన విజయశాంతి ప్రతిఘటన, రేపటి పౌరులు, నేటి భారతం, కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మ తదితర సినిమాలతో తనదైన ముద్ర వేసుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో హీరోయిన్లకు విజయశాంతి ఓ రోల్ మోడల్ లా నిలిచింది. ఇప్పుడు హీరోలు, హీరోయిన్లకు పారితోషికం అంటే లెక్క లేకుండా పోయింది. ఒక్క సినిమా హిట్టయిందంటే పారితోషికం పెంచేస్తారు. రెండు సినిమాలు హిట్టయితే వారి పారితోషికానికి హద్దుండదు. అయితే పారితోషికాల పట్ల అంత పట్టింపుగాని..పెద్ద మొత్తం పారితోషికాలు లేని ఆ సమయంలో అంటే ఇరవై ఏళ్ల క్రితం విజయశాంతి సినిమాకు ఏకంగా రూ.కోటి తీసుకునేదట. చిత్ర పరిశ్రమలో రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ ల తరువాత అగ్ర పారితోషికం తనదేనని రాములమ్మ తెలిపింది.

మహేష్ తో 'శివం' చేస్తున్న సోనాక్షి సిన్హా

        టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు తో బాలీవుడ్ రౌడీ గర్ల్ సోనాక్షి సిన్హా 'శివం' సినిమా చేస్తుందని గత౦లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి సోనాక్షి శివం సినిమా గురించి మీడియాతో మాట్లాడింది... ''క్రిష్ శివం సినిమా స్టోరీ చెప్పగానే ఎంతో ఉద్వేగభరితంగా అనిపించింది. క్రిష్ కథ చెప్పడానికి వచ్చినప్పుడు బాలీవుడ్ లో బిజీ గా ఉన్నాను..ఇప్పుడు తెలుగు లో సినిమా చేయలేను అని వినయంగా తిరస్కరిద్దామనుకున్నాను. కథ విన్నాక ఉత్కంఠను ఆపుకోలేకపోయాను. నేను చేసిన పాత్రలన్నీటికంటే..శివం లో చేస్తున్న పాత్ర నాకు మంచి పేరు వస్తుందని'' చెప్పింది సోనాక్షి. కానీ ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్ళుతు౦దానెది చెప్పలేదు. ప్రస్తుతం మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో '1 నేనొక్కడినే' సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం తరువాత శ్రీను వైట్ల తో 'ఆగడు' సినిమా చేయనున్నాడు. ఆ తరువాత 'శివం' చేస్తారని సమాచారం.  

అల్లు అర్జున్ తో హరీష్ శంకర్ సినిమా

      'జులాయి' మూవీ తో సూపర్ హిట్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల వచ్చిన 'ఇద్దరమ్మాయిలతో' కమర్షియల్ హిట్ ఇచ్చి మంచి జోరు మీద ఉన్నాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'రేసు గుర్రం' సినిమా చేస్తున్నాడు. దీని తరువాత అల్లు అర్జున్ హరీష్ శంకర్ డైరెక్షన్ ల్లో సినిమా చేయడానికి ఒకే చెప్పాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బాస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో 'రామయ్య వస్తావయ్య' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్‌ని డెరైక్ట్ చేయనున్నారు హరీష్‌శంకర్. ఈ సినిమాను పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా హరీష్‌శంకర్ తెరకెక్కించనున్నారని సమాచారం. దీంతో మెగా అభిమానులను ఆయన మరోసారి అలరించడం ఖాయమని ఇప్పటికే ఫిలింనగర్ వర్గాలు నమ్మకం వ్యక్తం చేస్తున్నాయి.

ఉత్తరాఖండ్ వరదలు: పవన్ కళ్యాణ్ 20 లక్షల విరాళం

      ఎవరినైనా ఆదుకోవడంలో ముందుంటాడని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పేరుంది. ఆయన అందరికీ సాయం చేసి అప్పుల పాలయ్యారని, తన ఆస్తులు అమ్ముకుంటున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా వరద బాధితులకు సాయం ప్రకటించి పవన్ కళ్యాణ్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఉత్తరాఖండ్ వరద బాధితుల కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 20 లక్షల రూపాయల విరాళం అందించారు. ఉత్తరకాశీ పుణ్యక్షేత్రం దర్శనార్ధం ఉత్తరాఖండ్ కు దేశ నలుమూలల నుంచి వచ్చిన అనేకమంది వరదల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు 556 మంది చనిపోయారు. వందలాది మంది ఆచూకీ తెలియడం లేదు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ బాధితులకు అండగా నిలవాలని, ఆర్థికసహాయం అందించాలని కేంద్రం విరాళాలు కోరుతోంది. దీంతో తన వంతుగా పవన్ కళ్యాణ్ రూ.20 లక్షలు ప్రకటించారు.

రామ్ చరణ్ 'ఎవడు' ఆడియో డేట్

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ 'ఎవడు' సినిమా ఆడియో రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కి ఇప్పటి వరకు పలు డేట్స్ అనుకున్న అనుకొని అంతరాయాలు ఏర్పడడంతో విడుదల చేయలేకపోయారు. లేటెస్ట్ గా వస్తున్న సమాచారం ప్రకారం జూలై 7తేది ఆడియో విడుదలచేయడానికి ప్లాన్ చేసినట్లు సమాచారం. త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు. అల్లు అర్జున్ ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. శ్రుతిహాసన్, అమీజాక్సన్ కథానాయికలు. పైడిపల్లి వంశీ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. దేవిశ్రీప్రసాద్ తనదైన శైలిలో శ్రావ్యమైన స్వరాలను ఈ చిత్రానికి అందించారని యూనిట్ వర్గాల సమాచారం. వచ్చే నెల 24న సినిమాను విడుదల చేయడానికి నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు.

బాలయ్యతో చేయడం లేదు: త్రిష

    నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటిల 'సింహ' సూపర్ హిట్ తరువాత మళ్ళీ ఈ కాంబినేషన్లో మరో సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి ఇప్పటి వరకు హీరోయిన్లను ఎంపిక చేయకపోవడంతో రకరకాల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. లేటెస్ట్ గా త్రిష పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా త్రిషను తీసుకున్నట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో...త్రిష ట్విట్టర్ లో ఈ వార్తలపై స్పందించింది. ప్రస్తుతం తాను తెలుగులో కానీ తమిళ్ లో ఏ సినిమాకు సైన్ చేయలేదని, గతంలో ఒకే చేసిన ప్రాజెక్ట్ లతోనే బిజీగా ఉన్నానని వివరణ ఇచ్చింది. దీంతో ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే సస్పెన్స్ కొనసాగుతునే ఉంది. ఈ సినిమా దుబాయ్‌లో షెడ్యూల్ తో మొదలుకానుందని సమాచారం. అక్కడ ఎడారిలో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయికొర్రపాటి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

రామ్ చరణ్ ముంబై కి షిఫ్టింగ్!

      మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముంబై వెళ్ళిపోతున్నాడా? అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు! రామ్ చరణ్ ముంబై కి షిఫ్ట్ అవుతున్నాడంటూ 'జంజీర్' షూటింగ్ కి ముందు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఆ వార్తలకు బలం చేకూరే మరో వార్త బయటకు వచ్చింది. ముంబై లో అత్యంత ఖరీదైన ఏరియాలో రామ్ చరణ్ 12కోట్ల కి ఓ అపార్ట్ మెంట్ కనుగోలు చేశాడు. నాలుగువేల చదరపు అడుగుల అపార్ట్ మెంట్ ని ఖార్ ఏరియాలో తీసుకున్నాడు. ఈ ఫ్లాట్ కి ఉపాసన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాతనే చరణ్ కనుగోలు చేసినట్లు సమాచారం. 'జంజీర్' రిలీజ్ తరువాత రామ్ చరణ్ అక్కడికి షిఫ్ట్ అవుతారని అంటున్నారు. మొత్తానికి ముంబై లో చరణ్ డ్రీంహౌస్ కల నెరవేరింది.

'కిస్' లో పవన్ కళ్యాణ్, మహేష్

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరు ఒకే సినిమాలో కనిపించబోతున్నారు! అదేంటీ వీరిద్దరూ ఒకే సినిమాలో ఎప్పుడు నటించారు అని ఆశ్చర్యపోతున్నారా! అసలు సంగతీ ఏమిటంటే...అడివి శేష్ హీరోగా చేస్తున్న 'కిస్' మూవీ లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కనిపించబోతున్నారు, అదీ ఎలాగంటే...అడివి శేష్, పవన్ కళ్యాణ్ కలిసి నటించిన పంజా సినిమాలోని, మహేష్ బాబు దూకుడు సినిమాలోని సీన్లను ఈ చిత్రంలో పెట్టారట. అది మ్యాటర్..ఆ విధంగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు.   కిస్ ఆడియోని ఈ నెల 14న విడుదల చేయాలనుకున్నారు. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆడియో‌లో పెట్టాలని అనుకోవడం వల్ల వాయిదా వేయడం జరిగింది. ఈ సినిమా ఆడియోని జూన్ 23 తేదిన విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.మిస్‌ కెనడా ఫొటోజెనిక్‌ ప్రియా బెనర్జీ హీరోయిన్‌గా నటించింది. శ్రీచరణ్‌ పాకాల, పీట్‌ వండర్‌ సంగీతం సమకూర్చారు. అడివి సాయికిరణ్‌ ఈ సినిమాకు నిర్మాత.

పవన్ 'గబ్బర్ సింగ్ 2' సీక్వెల్ స్టోరీ కాదు!

        పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న 'అత్తారింటికి దారేది' చిత్రం పూర్తి కావొచ్చింది. ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ క్రేజీ ప్రాజెక్ట్ 'గబ్బర్ సింగ్ 2' సెట్స్ పైకి వెళ్లనుంది. తాజా సమాచారం ప్రకారం 'గబ్బర్ సింగ్ 2' సినిమా 'గబ్బర్ సింగ్' కి సీక్వెల్ కాదని వార్తలు వస్తున్నాయి. గబ్బర్ సింగ్ లోని పవన్ కళ్యాణ్ పాత్ర శైలిని మాత్రమే తీసుకొని, కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను తీయబోతున్నారని సమాచారం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ సంపత్ నంది 'గబ్బర్ సింగ్ 2' కోసం కొత్త కాన్సెప్ట్ తో స్టోరీ రెడీ చేశారు. ఒక్క పవన్ పాత్ర మినహా ‘గబ్బర్‌సింగ్'కు ఈ సినిమాకూ ఎక్కడా పోలిక ఉండదని అంటున్నారు. పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై శరత్‌మరార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.‘గబ్బర్‌సింగ్'కి పనిచేసిన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రాహకుడు జయనన్ విన్సెంట్ ఈ చిత్రానికి పనిచేయబోతున్నారు. హీరోయిన్ అండ్ మిగతా నటీ నటులు ఎంపిక చేయవలిసి ఉంది.

ప్రియమణి..ఆయనకి మాత్రం ఫ్రీ

      అందాల సుందరి ప్రియమణి బాలీవుడ్ కి రెండు సార్లు వెళ్ళిన అదృష్టం కలిసి రాలేదు. దాంతో ఈ సారి వచ్చిన ఆఫర్ ను బాగా ఉపయోగించుకోవాలని చూస్తోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ తాజా చిత్రం ‘చెన్నై ఎక్స్ ప్రెస్ ’లో ఐటెంసాంగ్ చేసింది ప్రియమణి. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం కంపోజ్ చేసిన స్టెప్స్ కి అదరహో అనే విధంగా డ్యాన్స్ వేసిందట. ఇక్కడ మరో విశేషమేమిటంటే ...ఈ అమ్మడు ఈ పాట కోసం నయా పైసా కూడా తీసుకోలేదట. షారూఖ్ సరసన అవకాశం రావడం అంటేనే గొప్ప. ఆయన పై ఉన్న అభిమానం, గౌరవంతో ఈ సాంగు ఫ్రీగా చేశానని చెప్పుకొచ్చింది. అయితే ప్రియమణి ఫ్రీగా చేయడం వెనక వున్న ప్లాన్ ఏమిటో తమకు తెలుసునని ఆడియన్స్ అంటున్నారు!

శ్రీనువైట్ల కి మహేష్ వార్నింగ్!

      టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు డైరెక్టర్ శ్రీనువైట్ల కి వార్నింగ్ ఇచ్చాడట! అదేంటి శ్రీనువైట్ల కి మహేష్ బాబు వార్నింగ్ ఇవ్వడమేమిటి అని అనుకుంటున్నారా! ఇది మాత్రం నిజం. త్వరలో మహేష్ బాబు, డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబినేషన్లో తెరకేక్కబోతున్న 'ఆగడు' సినిమా నేపధ్యంలో ఈ విషయం చోటుచేసుకుంది.   రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో శ్రీనువైట్ల తీసిన 'బాద్ షా' కి హిట్ టాక్ వచ్చిన..చివరకు నిర్మాత నష్టాలు చూడవలసి వచ్చిందని ఫిల్మ్ నగర్ టాక్. అయితే దీనికి కారణం శ్రీనువైట్లనే అని అందరూ గుసగుసలాడుకుంటున్నారు. నిర్మాతతో అనవసర ఖర్చులు ఎక్కువగా పెట్టించాడని..అందుకే సినిమాకి నష్టాలు వచ్చాయని పుకారుంది సినీ వర్గాల్లో. ప్రిన్స్ మహేష్ బాబు మాత్రం తన సినిమా ఖర్చు పై ముందుగానే జాగ్రతలు తీసుకుంటున్నాడు. దర్శకుడు శ్రీనువైట్లతో 'ఆగడు' ఖర్చు ఎట్టి పరిస్థితుల్లో నలబై కోట్ల కు మించి ఒక్క పైసా కూడా ఎక్కువ కాకూడదని వార్నింగ్ ఇచ్చాడట. దీంతో ఆ సినిమా నిర్మాతలు మహేష్ ని తెగ పొగిడేస్తూ..సంబరపడిపోతున్నారు. 

నిర్మాతగా పవన్‌ వైఫ్ రేణు దేశాయ్

      పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ మరాఠీ లో చిత్రాన్ని తీసేందుకు సిద్దమవుతున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్ర కథాంశమే అంతటా చర్చనీయాంశమైంది. విడిపోవడానికి సిద్ధపడిన భార్యభర్తలు.. చివరికి ఎలా కలిసారన్నది ఈ చిత్ర కథాంశం. రేణుదేశాయ్ స్వస్థలం పూణె కావడంతో.. ఆమె మరాఠీ చిత్రాలను నిర్మించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. మరాఠీ చిత్రాలపై బాలీవుడ్ ప్రభావం కూడా పుష్కలంగా ఉంటుంది గనుక.. ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఈ చిత్రానికి "మంగళాష్‌టేక్" అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే ఈ చిత్ర కథ కాస్త అటు ఇటుగా పవన్‌కళ్యాణ్రేణుదేశాయ్‌ల ప్రస్తుత స్థితిని ప్రతిబింబించేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా షూటింగ్ పుణెలో సాగుతోంది. స్వప్నిల్‌ జోషి, ముక్తా భార్వే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

'కిస్' టిజర్ డైలాగ్స్ కేక

      టాలీవుడ్ హ్యాండ్ సమ్ హీరో అడివి శేష్ న్యూ మూవీ 'కిస్' రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా ఫస్ట్ టిజర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. టిజర్ లోని డైలాగులు యూత్ బాగా ఆకట్టుకుంటున్నాయి. 'కొంప దీసి పెళ్ళిచేసుకుంటావా ఏమిటి'..'నువ్వు సూపర్ ఫిగర్' వంటి డైలాగులకు మంచి రెస్పాన్స్ వస్తుంది. కిస్ ఆడియోని ఈ నెల 14న విడుదల చేయాలనుకున్నారు. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆడియో లో పెట్టాలని అనుకోవడం వల్ల వాయిదా వేయడం జరిగింది. ఈ సినిమా ఆడియోని జూన్ 22 తేదిన లేదా 23 తేదిన విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.   ''అమెరికా లో వుండి అడివి శేష్ తెలుగు సినిమా మీద ఫ్యాషన్ ఈ సినిమా చేశాడు. సాయి నాకు కథ చెప్పినప్పుడు చాలా బాగుంది. కానీ రిస్క్ ఎందుకు అని చెప్పాను. ఈ సినిమా లో కొన్ని సీన్స్ చూశాక ఆల్ రెడీ హిట్ కొట్టేశారు అన్న ఫీలింగ్ కలిగింది. నిర్మాతగా సాయి కి మంచి డబ్బులు వస్తాయి. అడివి శేష్ చాలా మంచి నటుడు అవుతాడు'' అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.     'కిస్' అంటే 'కీపిట్ సింపుల్ స్టుపిడ్' ఇదే ఈ సినిమా ట్యాగ్ లైన్. ప్రతిదాన్ని సరదాగా తీసుకునే యువకుడి పాత్రలో అడివి శేష్ కనిపించనున్నారు.  

మహేష్ తో మిల్కీ బ్యూటీ

      సినిమాల్లో రాణించాలంటే.. అందం, అభినయంతోపాటుగా కాస్తంత అదృష్టం కూడా ఉండితీరాలి. అయితే.. తమన్నాకు మాత్రం అందం, అభినయంతోపాటుగా అదృష్టం పాళ్లు కాస్త ఎక్కువగా ఉన్నట్లున్నాయి. లేకపోతే.. ఓసారి దూరమైన అవకాశం మళ్లీ ఆమెను వెతుక్కుంటూ వెళ్లడమేంటి. అది కూడా సూపర్‌స్టార్ మహేష్‌బాబు సరసన నటించే అవకాశం ఏరికోరి ఆమెను వరించడమేంటి..?   ఏం చేస్తాం.. తమన్నా సుడి ఆ రేంజ్‌లో తిరుగుతోంది. అసలైతే.. మహేష్‌_సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న "ఒన్ నేనొక్కడినే" చిత్రంలో హీరోయిన్‌గా తమన్నాను తీసుకోవాలనుకున్నారు. కానీ.. తమన్నా డేట్స్ ఆ సమయానికి ఖాళీలేనందున ఆ సదవాకశం కృతిసనమ్ దక్కించుకుంది. ఇప్పుడు.. తాజాగా శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్‌ నటించనున్న "ఆగడు" చిత్రంలో నాయికగా తమన్నా ఎంపికవ్వడం ఫిలింనగర్‌లో చర్చనీయాంశంగా మారింది. "దూకుడు" వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత శ్రీనువైట్ల_మహేష్‌బాబు కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడం విశేషం. మరి ఈ చిత్రంతో తమన్నా పొజిషన్ టాలీవుడ్‌లో నెం.1 స్థానానికి ఎగబాకడం ఖాయం!

మహేష్ అనుమానం నిజమైంది !

      ఓ వారం రోజుల క్రితం మహేష్‌బాబు ట్విట్టర్ ఎకౌంట్‌ను ఎవరో అభిమాని హ్యాక్ చేసి.. సిని"మా" అవార్డ్స్‌లో మహేష్ ఎంపిక కాకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తూ చేసిన ట్వీట్ అంతటా చర్చనీయాంశమైంది. అది గాలి వార్త అని అందరూ దాదాపుగా ఆ విషయాన్ని మరిచిపోయే స్టేజ్‌కి వచ్చేసారు. అయితే.. మొన్న జరిగిన "మా" అవార్డ్స్ వేడుక ఆ ఆరోపణలను నిజం చేస్తోంది.   మొత్తం అవార్డుల్లో సగానికిపైగా చిరంజీవి, నాగార్జున స్వచ్చందంగా పంచుకున్నారు. ముఖ్యంగా హిందీ "దబాంగ్"కు రీమేక్‌గా రూపొందిన "గబ్బర్‌సింగ్" చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డు, ఆ చిత్రంలో నటించినందుకుగాను పవన్‌కళ్యాణ్‌ను ఉత్తమ నటుడు అవార్డుకు ఎంపిక చేయడం గమనార్హం.    అలాగే.. "షిరిడి సాయి" చిత్రం కూడా బెస్ట్ హీరో (జ్యూరీ), బెస్ట్ ఫిలిం (జ్యూరి) అవార్డులు అందుకోవడంతోపాటుగా.. కొన్ని అవార్డులు రాజమౌళి "ఈగ"కు కూడా పంచిపెట్టడం అందర్నీ ఆశ్యచ్యపరుస్తోంది.    మరి.. మహేష్‌బాబు అభిమాని సరదాకి చేసిన ట్వీట్ నిజమవ్వడంతో.. సిని"మా" అవార్డ్స్ వేడుక హాస్యాస్పదమైంది!  

నటుడు మణివన్నన్‌ కన్నుమూత

      ప్రముఖ దర్శక, నటుడు మణివన్నన్‌ (59) శనివారం కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన ఈ రోజు చెన్నైలో మృతి చెందారు. తెలుగులో పలు చిత్రాల్లో మణివన్నన్ హాస్యనటుడుగా, క్యారెక్టర్ నటుడిగా ప్రధాన పాత్రలలో నటించారు. తమిళంలో సుమారు 50 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. మణివన్నన్ మృతికి తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖలు సంతాపం తెలిపారు. సత్యరాజ్‌ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న ‘నాగరాజచోళన్‌ ఎంఏ, ఎంఎల్‌ఏ’ చిత్రానికి ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. రజనీకాంత్ నటించే ప్రతి సినిమాలో ఆయన ముఖ్యపాత్రలో నటిస్తారు. శంకర్ అర్జున్ ల కాంబినేషన్ లో వచ్చిన ఒకేఒక్కడు సినిమాలో ఆయన ముఖ్యమంత్రి సహాయకుడి పాత్రలో ప్రేక్షకులను అలరించారు.