చంద్రబాబు కాన్వాయ్ లో పాత ఫార్చునర్లు... వాహనదారుల్ని ఎక్కువ సేపు ఆపొద్దని సూచన

సాధారణంగా ఎవరి ఇంట్లో అయినా ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువ ఉంటే ఏం చేస్తారు. అనవసర ఖర్చులను తగ్గించుకుంటారు. వీలుంటే కొన్నింటిని వాయిదా వేసుకుంటారు. రాష్ట్రం భారీ రెవెన్యూ లోటులో ఉండటంతో దుబారా ఖర్చులను తగ్గించాలన్న నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తన కాన్వాయ్ లో  అనవసరఖర్చును తగ్గించేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌లో అధికారులు కీలక మార్పులు చేశారు.  చంద్రబాబు కాన్వాయ్‌ వాహనాల్ని మంగళవారం రాత్రి అధికారులు మార్చారు. ప్రస్తుతం కాన్వాయ్‌లో ఉన్న పాత సఫారీ వాహనాలు కండిషన్‌లో లేకపోవడంతో.. వాటి స్థానంలో పాత ఫార్చ్యునర్లను ఏర్పాటు చేశారు. భద్రత ఏర్పాట్లలో భాగంగా ఈ మార్పులు చేసినట్టు అధికారులు తెలిపారు. ఇకపై చంద్రబాబు కాన్వాయ్‌లో పాత ఫార్చ్యునర్లు కూడా చేరాయి. ఈ వాహనాలు గతంలోనే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.. తన కాన్వాయ్ వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌‌ను నిలిపివేయొద్దన్నారు. కాన్వాయ్‌కు సంబంధించి అధికారుల్ని ఆరా తీశారు.. ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొనేందుకు మంగళవారం ఆయన విజయవాడ వచ్చారు. చంద్రబాబు వెళ్లే బందరు రోడ్డులో వాహనదారుల రాకపోకల్ని పోలీసులు నిలిపివేశారు. ఈ విషయాన్ని గమనించిన చంద్రబాబు.. తన కాన్వాయ్ వెళ్లే మార్గంలో వాహనదారుల్ని ఎక్కువ సేపు ఆపొద్దని సూచించారు. వీలైనంత తక్కువ సమయమే వారు వేచి ఉండేలా చూడాలని తన భద్రతాధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ విషయాన్ని పోలీసులకూ తెలియజేయాలని ఆదేశించారు.. ఇటీవల సెక్యూరిటీ అధికారులకు సూచనలు చేసిన సంగతి తెలిసిందే.

లక్ష్మీపార్వతికి అస్వస్థత... బాగా పెరిగిన బీపీ!

వైసీపీ నాయకురాలు, జగన్మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితురాలు లక్ష్మీపార్వతి అస్వస్థతకు గురయ్యారు. రక్తపోటు బాగా పెరిగిపోవడం వల్ల ఆమె అస్వస్థతకు గురైనప్పటికీ, సకాలంలో వైద్య సహాయం అందడం వల్ల ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది. ఆమె బీపీ మరీ పూర్తిగా తగ్గకపోయినప్పటికీ, కొంత అదుపులోకి వచ్చినట్టు సమాచారం. బీపీ పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు బీపీ మందులు క్రమం తప్పకుండా వాడుతూ వుండాలని, ఆవేశంతో, ఆక్రోశంతో రగిలిపోయే విషయాలేవీ ఆలోచించకుండా వుండాలని, అంతే కాకుండా ఆధ్యాత్మిక చింతనలో గడిపితే బాగుంటుందని ఆమెకు వైద్యులు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. లక్ష్మీపార్వతి గత కొన్నేళ్ళుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలిలా వున్నారు. తల్లి తర్వాత తల్లి స్థానంలో ఆమె జగన్మోహన్ రెడ్డితో కలసి ప్రయాణం చేస్తున్నారు. జగన్మోహన్‌రెడ్డికి చెందిన ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలో ఆస్థాన ‘విధ్వంసురాలిగా’ ఆమె ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఏ నిమిషమైనా కెమెరా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడిని తిట్టిపోయడానికి అందుబాటులో వుంటున్నారు. గత ఐదేళ్ళుగా చంద్రబాబు నాయుడిని, ఎన్టీఆర్ కుటుంబాన్ని తిట్టిపోయడంలో, శాపనార్థాలు పెట్టడంలో ఆమె నిమగ్నమై వున్నారు. దీని ద్వారా ఆమెకు నెలనెలా లభించే గౌరవ వేతనాన్ని గౌరవంగా అందుకుంటున్నారు. మొన్నీమధ్య వరకూ ఆమె ఆరోగ్యం బాగానే వుందని, జూన్ నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడి అయినప్పటి నుంచి ఆమె బీపీ అదుపు తప్పిందని తెలుస్తోంది. ఎన్ని మందులు వాడినా ఆమె బీపీ పూర్తిగా అదుపులోకి రావడం లేదని సమాచారం. ఈ ఎలక్షన్లలో కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోతాడని, జగన్ ఛానెల్ ద్వారా తనకు మరో ఐదేళ్ళపాటు గౌరవం, దానితోపాటే గౌరవ వేతనం కూడాలభించే అవకాశం వుంటుందని ఆమె భావించారు. అయితే చంద్రబాబు గెలవటంతో ఆమె ప్లానింగ్ మొత్తం తలకిందులు అయింది. అందుకే అప్పటి నుంచి ఆమెలో బీపీ భరతనాట్యం చేస్తోందని తెలుస్తోంది. చంద్రబాబు గురించి, ఎన్టీఆర్ కుటుంబం గురించి ఆలోచించడం మానుకోవాలని ఆమె సన్నిహితులు సూచించినప్పటికీ ఆమె వినడం లేదని, అందుకే ఆమెలో బీపీ టాప్‌గేర్‌కి వెళ్ళినట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఓడిపోవాలని తాను ఎంత తపస్సు చేసినా, ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా తాను అనుకున్నది జరగకపోవడం కూడా ఆమె బీపీ బౌండరీ దాటడానికి ప్రధాన కారణాల్లో ఒకటి అని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఆమెకి ఏమీ కాదని, ఆమె వందేళ్ళు బతికే ‘చిరాయువు’ అని డాక్టర్లు భరోసా ఇస్తున్నారు.

తెలంగాణలోని 16 జిల్లాల్లో భారీ వర్షాలు...ఎల్లో అలర్ట్ జారీ  

నైరుతి రుతుపవనాలు తెలంగాణ అంతటా విస్తరిస్తున్నాయి. ఈనెల 5న రుతుపనాలు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ నుంచి తెలంగాణలోకి ప్రవేశించగా.. ప్రస్తుతం రాష్ట్రం అంతటా విస్తరించింది. వీటి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నేడు, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో నేడు 16 జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్త గూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం పడొచ్చని పేర్కొంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.  మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిశాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారంలో అత్యధికంగా 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావ్‌పేటలో 6.5, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదీగూడలో 6.5, మెదక్ జిల్లా ఎల్దుర్తిలో 6, తుప్రాన్ మండలం ఇస్లాంపూర్‌లో 5.8, శంకరంపేటలో 5.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ఇద్దరు రైతులు పిడుగుపాటుకు మృతి చెందారు.

సీబీఎన్ ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు అదుర్స్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకార కార్యక్రమ వేదికపై 60 మంది ఆసీనులు కానున్నారు. వీరు కాకుండా ప్రత్యేక అతిథులు, వీవీఐపీల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు.  అలాగే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల కోసం ప్రత్యేకంగా ఒక గ్యాలరీని సిద్ధం చేశారు.  ఇక ప్రమాణ స్వీకారోత్సవ వేదికను అత్యంత  సుందరంగా తీర్చిదిద్దారు.  టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన కార్యకర్తలు, శ్రేణులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.   చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరయ్యేందుకు మంగళవారం(జూన్ 11) నాటికే పలువురు  ప్రముఖలు విజయవాడ చేరుకున్నారు. నారా, నందమూరి, మెగా ఫ్యామిలీల సభ్యులు కూడా మంగళవారం (జూన్ 11) రాత్రికే బెజవాడ చేరుకున్నారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రత్యేక ఆహ్వానితులు, వీవీఐపీలు, వీఐపీలకు ప్రత్యేక పాసులు జారీ చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి విదేశీ, జాతీయస్థాయి అతిథులు తరలి వస్తున్నారు.    చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యే ప్రత్యేక ఆహ్వానితుల కోసం వేదిక వెనుక భాగంలో గ్రీన్‌ రూములను సిద్ధం చేశారు. ఆ గదులను ప్రముఖులకు కేటాయించారు. ప్రధాని కోసం ప్రత్యేకంగా వేదికకు అత్యంత సమీపంలో ఒక గ్రీన్‌ రూమ్‌‌ను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్‌షా, నడ్డా, ఇతర కేంద్ర మంత్రులు కూడా ఈ గ్రీన్‌ రూమ్‌కు చేరుకుంటారు. ప్రధాని గ్రీన్‌ రూమ్‌కు వెనుకభాగంలో పీఎంవో సిబ్బంది కోసం మరొక రూమ్‌  ఏర్పాటు చేశారు. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ కోసం ఒక గ్రీన్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా గ్రీన్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి గ్రీన్‌ రూమ్‌ పక్కనే వీవీఐపీల కోసం ఇంకో గ్రీన్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. 

కేశినేని నాని.. అసమర్థుడి అస్త్రసన్యాసం!

రాజ‌కీయాల్లో ఇత‌రుల చేతుల్లో మోస‌పోయిన వారు ఉంటారు. అయితే కేశినేని నాని లాంటి అతి తక్కువ మంది మాత్రం త‌మ‌ను తాము అతిగా ఊహించుకొని బొక్క‌బోర్లా ప‌డుతుంటారు.  ఒక‌రిద్ద‌రు బ‌డా రాజ‌కీయ నేత‌లు ప‌రిచ‌యం కాగానే తనంత తోపులేడు అనే భ్ర‌మ‌ల్లో గ‌డిపేస్తుంటారు.  ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌లు తాను ఏది చెబితే అది న‌మ్మేస్తార‌ని ఊహాలోకాల్లో విహ‌రిస్తుంటారు.  ఎన్నిక‌ల స‌మ‌రంలోకి దిగితే కానీ తెలియ‌దు వారిస‌త్తా ఏ పాటిదో.  విజ‌య‌వాడ మాజీ ఎంపీ కేశినేని నాని  సరిగ్గా అలాగే బొక్కబోర్లా పడ్డారు. కేశినేని నాని టీడీపీని వీడ‌కుండా ఉండి ఉంటే ఇప్పుడు మోదీ 3.0 క్యాబినెట్ లో మంత్రిగా ఉండాల్సిన వ్య‌క్తి. కానీ, అతివిశ్వాసం, తలకెక్కిన అహంభావం, కేంద్రంలో బ‌డా రాజ‌కీయ నేత‌ల‌తో ప‌రిచ‌యాలు ఉన్నాయ‌న్న ధీమా, ప్ర‌జ‌లు తానేం చేసినా  స‌మ‌ర్ధిస్తార‌న్న పిచ్చిత‌నం.. వెర‌సి  కేశినేని నాని రాజకీయ జీవితానికి చుక్క పెట్టేసింది.  ఒక్క‌ముక్క‌లో చెప్పాలంటే ఎన్నిక‌ల స‌మ‌యంలో నాని వేసిన ఒక్క త‌ప్ప‌టడుగు  ఆయన రాజ‌కీయ జీవితాన్నే స‌మాధి చేసేసింది.  విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని అంటే.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ ప్ర‌ముఖుల‌కు ప‌రిచ‌య‌మున్న పేరు. జాతీయ రాజ‌కీయాల్లో ముఖ్య‌నేత‌ల‌తో  మంచి సంబంధాలున్నాయి. అందుకు ప్ర‌ధాన కార‌ణం తెలుగుదేశం పార్టీ.  కేశినేని నాని 2014, 2019 ఎన్నికల్లో విజయవాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి  తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. త‌ద్వారా ప‌దేళ్ల‌లో నితిన్‌ గ‌డ్క‌రీలాంటి కేంద్ర మంత్రుల‌తో పాటు ప‌లు పార్టీల‌కు చెందిన జాతీయ స్థాయి నేత‌ల‌తో మంచి అనుబంధాన్ని ఏర్ప‌ర్చుకున్నారు. ఇదంతా తెలుగుదేశం పార్టీతోనే , తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్య‌మైంది. దీనికి తోడు టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు జాతీయ రాజ‌కీయాల్లోనూ, జాతీయ మీడియాలో మంచి ప‌లుకుబ‌డి ఉంది. చంద్ర‌బాబు మ‌నిషిగా కేశినేని నానికి కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నేత‌లు ప్రాధాన్య‌త‌నిచ్చేవారు. కానీ, ఇదంతా త‌న గొప్ప‌త‌నం అని కేశినేని నాని భావిస్తూ వ‌చ్చారు. అది కాస్తా త‌ల‌కెక్క‌డంతో చంద్ర‌బాబు నాయుడునే ఎదిరించేందుకు వెనుకాడని పరిస్థితికి చేరారు. చంద్ర‌బాబు నేను స‌మాన‌మే అనే భ్ర‌మ‌ల్లోకి నాని వెళ్లిపోయారు. దీంతో ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో  తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ గూటికి చేరాడు. ఆ త‌ప్పుడు నిర్ణ‌య‌మే కేశినేని నాని రాజ‌కీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది.   కేశినేని నాని వైసీపీ తీర్థం పుచ్చుకున్న త‌రువాత చంద్ర‌బాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. చంద్ర‌బాబును ప్ర‌జ‌లు న‌మ్మ‌డం లేద‌ని చెప్పుకొచ్చాడు. విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు తనపై ఎన‌లేని న‌మ్మ‌కం ఉంద‌ని, వారు తనను భారీ మెజార్టీతో గెలిపిస్తార‌ని కేశినేని నాని భ్రమల్లో మునిగిపోయారు. అయితే  నానికి ప్ర‌జ‌లు దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే  షాకిచ్చారు. రెండు సార్లు ఎంపీగా గెలిపించింది నిన్ను చూసికాదు.. తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబును చూసి అని ఓటు ద్వారా ప్ర‌జ‌లు విస్పష్టంగా చెప్పేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన కేశినేని నాని, ఆ పార్టీ నుంచి విజయవాడ ఎంపీ స్థానానికి పోటీ చేశాడు. త‌న సోద‌రుడు, తెలుగుదేశం అభ్యర్థి కేశినేని చిన్ని (కేశినేని శివనాథ్) చేతిలో ఏకంగా 2 లక్షల 82 వేల ఓట్ల తేడాతో నాని ఓటమి పాలయ్యారు. ఘోర ఓట‌మి త‌రువాత‌.. రెండుసార్లు ఎంపీగా గెలిచింది త‌న బ‌లంతో కాదు.. తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు ఆశీస్సులతో, తెలుగుదేశం పార్టీ బలంతో అని గుర్తించిన నాని, ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.  తెలుగుదేశంలో  ఉన్న‌న్ని రోజులు  కేశినేని నానికి అన్నివైపుల నుంచి ఎన‌లేని గౌర‌వం ల‌భించేది. కానీ, ఒక్క‌సారి తెలుగుదేశం పార్టీని వీడిన త‌రువాత ఆయన  రాజ‌కీయజీవితమే సమాధి అయిపోయింది. కేశినేని నాని రాజ‌కీయ జీవితం ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో ఎదుగుతున్న‌వారికి ఓ గుణ‌పాఠం అని చెప్పొచ్చు. మ‌రోవైపు విజ‌య‌వాడ పార్ల‌మెంట్ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయిన నేత‌లు రాజ‌కీయాల‌కు దూరమ‌వుతుండ‌టం ఆన‌వాయితీగా వ‌స్తున్నది. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కోనేరు రాజేంద్ర ప్రసాద్, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్‌లపై కేశినేని నాని విజయం సాధించారు. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత కోనేరు రాజేంద్ర ప్రసాద్, పొట్లూరి వర ప్రసాద్ రాజకీయాలకు దూరమయ్యారు.  2024 ఎన్నిక‌ల్లో కేశినేని చిన్నిపై నాని ఓట‌మి పాల‌య్యాడు. ప్ర‌స్తుతం ఆయ‌న కూడా రాజ‌కీయాలు గుడ్ బై  చెప్పేశారు. 

చంద్రబాబు కేబినెట్ లో తొలి సారి ఎమ్మెల్యేలు పది మంది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తన కేబినెట్ లో తొలి సారి ఎమ్మెల్యేలుగా గెలిచిన పది మందికి స్థానం కల్పించారు. వీరిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉన్నారు. అలాగే ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించి చంద్రబాబు కేబినెట్ లో స్థానం దక్కించుకున్న వారిలె మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, ఎస్ వనిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి ఉన్నారు.   అలాగే గతంలో పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి తొలి సారిగా చంద్రబాబు కేబినెట్ లో  స్థానం దక్కించుకున్న వారిలో పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, డోలా బాలవీరాంజనేయులు, గొట్టిపాటి రవి, బీసీ జనార్దన్ రెడ్డి ఉన్నారు.

బెజవాడ వైపు వచ్చే అన్ని రహదారుల్లో ట్రాఫిక్ జాం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచీ జనం సునామీలా పోటెత్తారు. దీంతో బెజవాడలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంది. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. బెజవాడలోకి వచ్చే దారులన్నీ అష్టదిగ్బంధనం చేసేశారు. పోలీసులు చర్య కారణంగా బెజవాడకు వచ్చే అన్ని దారుల్లోనూ ట్రాఫిక్ స్తంభించిపోయింది. దాదాపు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.   చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచీ  తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో ప్రమాణ స్వీకారోత్సవ సభా స్థలికి వచ్చే దారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. మంగళగిరి సమీపంలోని కాజా టోల్ గేట్ వద్ద రాయలసీమ నుంచి పెద్ద ఎత్తున వస్తున్న వాహనాలతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇంతే కాకుండా విజయవాడ వైపు వచ్చే అన్ని రహదారులపైనా కూడా ట్రాఫిక్ స్తంభించిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.  

ఏపీ ముఖ్యమంత్రిగా నేడే చంద్రబాబు ప్రమాణం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం మధ్యాహ్నం 11.27 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కృష్ణాజిల్లా కేసరపల్లిలో దాదాపు పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో చంద్రబాబు ప్రమాణ స్వీకార సభా ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అత్యద్భుతంగా జరిగే ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, చిరంజీవి, రజనీకాంత్, లక్షలాది మంది కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరు కానున్నారు. 36 గ్యాలరీలలో సభావేదిక అందరికీ కనిపించేలా ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. వీఐపీల కోసం నాలుగు గ్యాలరీలను సిద్ధం చేశారు.

దండుపాళ్యం బ్యాచ్ రాకపోతేనే మంచిది!

అబ్బ... ఇంతకంటే పెద్ద శుభవార్త వుంటుందా? చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకారోత్సవానికి జగన్ పార్టీ దండుపాళ్యం బ్యాచ్ హాజరు కాకూడదని నిర్ణయించుకుందట. ఈ దండుపాళ్యం బ్యాచ్ నాయకుడు జగన్‌‌ని ఆహ్వానించాలని చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసినా ఆ పోటుగాడు అందుబాటులోకి రాలేదంట. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావడం ఇష్టం లేకనే జగన్ ఫోన్‌‌కి అందుబాటులో లేకుండా పోయాడంట. దరిద్రం వదిలింది. ఈ దరిద్రపు బ్యాచ్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చి, ఎదురుగా కూర్చుని కళ్ళలో నిప్పులు పోసుకుని ఏడ్చి చస్తారు. శాపనార్థాలు పెడతారు. కుళ్ళుకుంటారు.. దిష్టిపెడతారు. ఈ అపశకునపు పక్షులని ఎదురుగా పెట్టుకుని ప్రమాణ స్వీకారం చేయడం కూడా రాష్ట్రానికి అంత మంచిది కాదు. జగన్ పార్టీ చేసిన మంచి పని ఏదైనా వుందీ అంటే... చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాకూడదని నిర్ణయించుకోవడం. చాలా వైభవంగా, ఆనందోత్సాహాలతో జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో ఏడుపు ముఖాలు వేసుకుని ఈ వైసీపీ పిశాచాలు కూర్చుని వుంటే ఎంతమాత్రం బాగోదు. ప్రమాణ స్వీకారోత్సవంలో అందరూ ఒకర్నొకరు ఆనందంగా పలకరించుకుంటూ, కౌగిలించుకుంటూ, నవ్వుకుంటూ, తుళ్ళుకుంటూ, జై అమరావతి అని నినాదాలు చేసుకుంటూ వుంటే, అక్కడే వున్న ఈ వైసీపీ మూకలు కర్రల్లాగా బిగుసుకుపోయి, దేభ్యం ముఖాలు వేసుకుని కూర్చుని వుంటే ఏమన్నా బాగుంటుందా? అందువల్ల వైసీపీ బ్యాచ్ వాళ్ళు చంద్రబాబు ప్రమాణానికి రాకూడదని నిర్ణయించుకోవడమే చాలా మంచిదైంది. శుభమా అని చంద్రుడు ప్రమాణ స్వీకారం చేసుకుంటూ వుంటే, అక్కడ ఈ వైసీపీ మచ్చలెందుకు? 

యముడు పోయాడు..  మయుడు వచ్చాడు.. అమరావతిలో సంకేతాలు!

అమరావతి మహానగరాన్ని పురిట్లోనే చంపేయాలని అనుకున్న యముడు జగన్ పోయాడు... అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడానికి ఆ మయబ్రహ్మకు ప్రతినిధిగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. దీనికి సంకేతాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. చీకటి పడితే చాలు.. స్ట్రీట్ లైట్లు జిగేల్‌మంటున్నాయి.. ఇప్పుడు అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన రోడ్లు వేసేస్తున్నారు. ఇప్పుడే ఇలా వుంది... రేపు అభినవ మయుడు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశాక అమరావతి అభివృద్ధి సాక్షాత్తూ ఆ మయుడు కూడా ముచ్చడపడేలా వుంటుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో చార్జిషీట్ దాఖలు 

బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పదేళ్ల తర్వాత   కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చీ రాగానే ఫోన్ ట్యాపింగ్ తెరమీదకు తెచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మార్చి 10న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నలుగురు పోలీసు అధికారులను అరెస్ట్ చేశారు. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరిని నిందితులుగా చేర్చారు. సిట్ దర్యాఫ్తు బృందం కస్టడీలో వారి వాంగ్మూలాన్ని నమోదు చేసింది. మరోవైపు, భుజంగరావు, తిరుపతన్నలు తమకు బెయిల్ ఇవ్వాలని నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తమను రాజకీయ దురుద్దేశంతో అరెస్ట్ చేశారని నిందితులు కోర్టుకు తెలిపారు. అయితే వారిని ఇంకా విచారించాల్సి ఉన్నందున బెయిల్ మంజూరు చేయవద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. ఇద్దరి బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తయ్యాయి. నాంపల్లి కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది.

జూన్ 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం 

హ్యాట్రిక్ కొట్టిన ఎన్డీఏ ప్రభుత్వం ఈ సారి తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించనుందన్న వార్తలు వెలువుడుతుందన్న నేపథ్యంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే పార్లమెంట్ సమావేశాల తేదీలు కన్ఫర్మ్ అయ్యాయి. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మోదీ 3.0 మంత్రివర్గం కూర్పు కూడా పూర్తైంది. మొత్తం 71 మంది ఎంపీల‌కు మంత్రులుగా అవ‌కాశం దక్కింది. వీరందరికీ శాఖలు కూడా కేటాయించడంతో మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కేంద్రం పార్లమెంట్‌ సమావేశాలకు పిలుపునిచ్చింది. ఈ సమావేశాల్లో లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక, కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 8 రోజులపాటు ఈ పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జూన్‌ 24 నుంచి జులై 3 వరకూ ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా జూన్‌ 26న లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. జూన్‌ 24, 25 తేదీల్లో కొత్త పార్లమెంట్‌ సభ్యులు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. కాగా, లోక్‌సభ స్పీకర్ పదవిపై ఎన్‌డీఏ కూటమి పార్టీలు టీడీపీ, జేడీయూ రెండూ ఆశలు పెట్టుకున్నాయి. 26న లోక్‌సభ స్పీకర్ పదవిపై సస్పెన్స్ తొలిగిపోనుంది.

సంకీర్ణ ధర్మం మోడీకి సమజయ్యేనా?

మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేసి కేంద్రంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసారు. బీజేపీకి 240 స్థానాలు మాత్రమే రావడంతో మ్యాజిక్ ఫిగర్ కు ఇంకా 32 స్థానాలు అవసరమయ్యాయి. ఫలితంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మద్దతు అవసరమయ్యింది. ముఖ్యంగా తెలుగుదేశం,జేడీయు సహకారంతో పాటు 21పార్టీల మద్దతు తప్పని సరి అయింది. మోడీ గత రెండు సార్లూ కూడా సంకీర్ణ ప్రభుత్వాన్నే నడిపారు. అయితే అప్పటి పరిస్థితి వేరు ఇప్పటి పరిస్థితి వేరు.  ఆయన గత 10ఏళ్ల పాలనలో సొంత మేజార్టీ వచ్చినా మిత్రులకు మంత్రివర్గంలో చోటు కల్పించారు.  నిర్ణయాలు మాత్రం స్వతంత్రం గానే, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఏకపక్షంగానే తీసుకున్నారు. ఈ సారి మాత్రం ఆయనకు ఆ అవకాశం ఇసుమంతైనా ఉండదు. సమష్టి నిర్ణయాలు తప్పని సరి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భాగస్వామ్య పక్షాలను ఒప్పించాలి. వారి ఆమోదం పొందాలి.   ఆయన గుజరాత్ సీఎంగా  13 సంవత్సరాలు, దేశ ప్రధానిగా 10ఏళ్లు నడిచిన తీరు వేరు. ఇప్పుడు రానున్న ఐదేళ్లు నడవాల్సిన దారి వేరు. అప్పట్లో ఆయన అనుకున్నది ఎవరి ఇష్టాయిష్టాలతో పని లేకుండా చేసేశారు. ఇప్పుడు మాత్రం ఇష్టం ఉన్నా లేకున్నా భాగస్వామ్య పక్షాలను ఒప్పించి ముందుకు సాగాలి. వారి ఆమోదం పొందలేకపోతే రాజీ పడాలి. మోడీ అలా చేయగలరా? అన్దిన రానున్న రోజులలో తేలుతుంది. అయితే గత పదేళ్లుగా ప్రధానిగా ఆయన పోకడ, తీరు గమనించిన వారికి మోడీ మొండితనం గురించి బాగానే తెలుసు. భాగస్వామ్య పక్షాలలో చీలకలను ప్రోత్సహించి అయినా తాననుకున్నది సాధించే తత్వమే ఆయనలో ఇప్పటి వరకూ కనిపించింది.  అయితే ఇప్పుడు అలా చీలికలు తీసుకురావడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీయేలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న పార్టీలన్నీ గతంలో మోడీ కారణంగా ఇబ్బందులు పడినవే. అందుకే ఆ పార్టీలు కూడా అప్రమత్తంగానే ఉంటాయి. బీజేపీకి అనుకూలంగానే ఉంటూ అవసరమైతే దూరం జరగడానికి కూడా వెనుకాడని వైఖరినే ఇప్పుడు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు అనుసరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలకు తమ రాజకీయ మనుగడ కోసం రాష్ట్ర ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాయి. అవి నెరవేరడం లేదని భావిస్తే సంకీర్ణం నుంచి అంటే ఎన్డీయే నుంచి బయటకు రావడానికి పెద్దగా ఇలోచించవు. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అయినా, అదే విధంగా ఎన్డీయే అయినా గతంలో అదే ధోరణి అవలంబించాయి. అయితే అప్పట్లో బీజేపీకి సొంతంగానే తిరుగులేని మెజారిటీ ఉంది కనుక అప్పట్లో తెలుగుదేశం, ఎన్డీయేలే బీజేపీతో విభేదించి నష్టపోయాయి. ఈ సారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. భాగస్వామ్య పక్షాలు కూటమి నుంచి బయటకు వస్తే నష్టపోయేది, అధికారం కోల్పోయేది బీజేపీయే అవుతుంది. అన్నిటి కంటే ఎక్కువగా.. ఇప్పుడు బీజేపీలో నరేంద్ర మోడీగి గతంలోలా సంపూర్ణ మద్దతు లభించే అవకాశాలు కూడా అంతంత మాత్రమే. పార్టీని మించి ఎదిగిన మోడీకి ఆయన స్థాయి చూపడానికి పార్టీలోనే ఒక వర్గం ఎదురు చూస్తూ ఉందనడంలో సందేహం లేదు.  1989-2014 వరకూ సంకీర్ణ ప్రభుత్వాలే నడిచాయి. మంత్రివర్గంలో ఏదేని నిర్ణయం తీసుకునే ముందు ఎన్డీఏ,యూపీఏ సమావేశంలో చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చిన తరువాత కేబినెట్ లో ప్రవేశ పెట్టేవారు. 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత మేజార్టీ ఉండడంతో ఆ సమస్య రాలేదు.ఇకపై అలా ఉండదు. కేంద్రమంత్రివర్గం 72మందితో   కొలువుతీరింది. మిత్రులకు 11 మంత్రి పదవులు కేటాయిం చారు.అత్యధికంగా సహాయ మంత్రుల పదవులే ఇచ్చారు. ఐదు స్థానాలు దాటిన వారికే కేబినెట్ పదవి ఇచ్చారు.సోమవారం శాఖలు కేటాయించారు. బీజేపీ సీనియర్లకు ముఖ్యమైన పాత శాఖలే కేటాయించారు. టీడీపీకి 2014లో ఇచ్చిన పౌరవిమానయాన శాఖ కేటాయించారు. ప్రధానమైన శాఖలు బీజేపీ ఆధీనంలోనే ఉన్నాయి. దీనిని బట్టే సీట్లు తగ్గినా మోడీ వైఖరి పెద్దగా మారలేదని స్పష్టమౌతోంది. అయితే మోడీ వైఖరి మారకుంటే  ప్రభుత్వం పూర్తి కాలం అధికారంలో ఉండేది అనుమానమే.  

‘రాజధాని ఫైల్స్’ లక్ష్యం నెరవేరింది!

‘‘మనది ప్రజా ప్రభుత్వం.. ఇకపైన మన ప్రభుత్వంలో ప్రజావేదికలా కూల్చివేతలుండవు. మూడు రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తుతో ఆటలాడే పరిస్థితి వుండదు. మన రాజధాని అమరావతి. అమరావతే రాజధాని’’ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో వేలాదిమంది రాజధాని రైతుల హృదయాలు ఆనందంతో ఉప్పొంగాయి. ప్రజాకంటక జగన్ ప్రభుత్వం ప్రజా సునామీకి కొట్టుకుపోవడంతోనే అమరావతి ప్రాంతంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఇప్పటివరకూ గాఢాంధకారంలో వున్న అమరావతి ప్రాంతం ఇప్పుడు గ్రహణం తొలగినట్టుగా చిమ్మచీకటి వేళలో కూడా పట్టపగటిని తలపించేలా వెలిగిపోతోంది. మంగళవారం నాడు ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో ‘మన రాజధాని అమరావతి.. అమరావతే రాజధాని’ అంటూ చంద్రబాబు చెప్పిన మాటలు తెలుగు ప్రజలలో ఉత్సాహాన్ని మరింత పెంచాయి. ఇక అమరావతిని ఎవరూ కదిలించలేరన్న దృఢ నిశ్చయం, పటిష్ట సంకల్పం సైతం చంద్రబాబు మాటల్లో వినిపించాయి. ఈరోజు కోసమే.. ఈ శుభవార్తని రాజధాని ప్రాంత రైతులందరూ వినడం కోసమే ‘తెలుగువన్’ అధినేత కంఠంనేని రవిశంకర్ ‘రాజధాని ఫైల్స్’ చిత్రాన్ని నిర్మించారు. ఏ లక్ష్యాన్ని ఆశించి ఆయన ఆ సినిమా రూపొందించారో, ఈరోజు చంద్రబాబు నాయుడి ప్రకటనతో ఆ లక్ష్యం నెరవేరిందని భావించవచ్చు. చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో రాజధాని కోసం 33 వేల ఎకరాల భూములను ఇచ్చి, ఆ తర్వాత జగన్ ప్రభుత్వం చేత ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న పరిస్థితులను, వారు చేసిన అలుపెరుగని పోరాటాన్ని అద్దం పట్టేలా ‘రాజధాని ఫైల్స్’ చిత్రం రూపొందింది. చిత్ర నిర్మాణ సమయంలోనూ, చిత్రం విడుదల సమయంలోనూ ‘రాజధాని ఫైల్స్’ జగన్ ప్రభుత్వం నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. అయినప్పటికీ, నిర్మాత కంఠంనేని రవిశంకర్ వెనకడుగు వేసేదే లేదంటూ ముందుకు వెళ్ళారు. ‘రాజధాని ఫైల్స్’ని విజయవంతంగా విడుదల చేశారు. రాజధాని రైతుల నుంచి మాత్రమే కాదు.. సినిమా చూసిన ప్రేక్షకులందరి నుంచి మంచి సినిమా తీశారనే ప్రశంసలు అందుకున్నారు. అమరావతిని రాజధానిగా నిలపడానికి చంద్రబాబు నాయుడు చేసిన మహా యజ్ఞంలో ‘నేను సైతం సమిధనొక్కటి ధారపోశాను’ అన్నట్టుగా కంఠంనేని రవిశంకర్ నిర్మించిన ‘రాజధాని ఫైల్స్’ సినిమా ఈరోజు యజ్ఞఫలాన్ని అందుకుంది.  ఒక అద్భుత నగరాన్ని ఆంధ్రజాతికి అందించాలని చంద్రబాబు దర్శించిన స్వప్నం త్వరలో నిజం కాబోతోంది. చంద్రబాబు నాయుడు నాయకత్వంతో, అతి తక్కువ కాలంలోనే అంతర్జాతీయ నగరంగా రూపొందే ‘అమరావతి మహానగరం’ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఒక్కరి ఊహల్లో మెదులుతోంది. ఆ అద్భుత నగరంలో ఎన్నో సినిమా థియేటర్లు భవిష్యత్తులో వస్తాయి. ఆ థియేటర్లన్నిటిలో మొట్టమొదటగా ప్రదర్శించే చిత్రం ‘రాజధాని ఫైల్స్’ అవుతుంది. ఈ మహానగరం రూపొందడానికి ఈ ప్రాంత రైతులు చేసిన త్యాగాలు, పోరాటాలను ‘రాజధాని ఫైల్స్’ సినిమా ద్వారా స్మరించుకుంటూ ఏ సినిమా థియేటర్ అయినా ప్రారంభం అవుతుంది. ఆ మహానగరంలోని మల్టీప్లెక్స్.లలో ‘రాజధాని ఫైల్స్’ చిత్రం మట్టి వాసనలా పరిమళిస్తుంది. త్యాగాల జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. ఈ మహానగరం నిర్మాణం కోసం తమ ముందు తరాలు చేసిన త్యాగాలను రాబోయే తరాలు తెలుసుకునేలా చేస్తుంది. ఇలాంటి అద్భుత నగరాన్ని ఒక దుష్టశక్తి, ఒక అహంభావి మృతనగరంలా మార్చడానికి ప్రయత్నించాడన్న వాస్తవాన్ని భవిష్యత్తు తరాలు తెలుసుకునేలా చేస్తుంది.  ఏడాదికి ఒకసారి వచ్చే ‘అమరావతి డే’ రోజున అమరావతిలోని అన్ని థియేటర్లలో ‘రాజధాని ఫైల్స్’ చిత్రం ప్రదర్శితమవుతుంది. అద్భుతమైన భవిష్యత్తు వున్న అమరావతి నగరంలో ‘రాజధాని ఫైల్స్’ సినిమాకి కూడా శాశ్వత స్థానం వుంటుంది. ఇంత మంచి సినిమాని నిర్మించిన ‘కంఠంనేని రవిశంకర్’ పేరు వెండితెరమీద స్వర్ణకాంతులతో మెరుస్తుంది.

అజ్ఞానం నుంచి అజ్ఞాతంలోకి అనిల్ కుమార్ యాదవ్!

చరిత్ర కనీవినీ ఎరుగని పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ.. ఇక ఓటమికి సాకులు వెతకడం మానేసింది.  చేతులెత్తేసింది. జనాలకు ముఖం చూపలేక నానా యాతనా పడుతోంది. ఆ పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లూ ఓళ్లూపై తెలియకుండా మాట్లాడిన వాళ్లు, అడ్డగోలుగా అక్రమ సంపాదనకు అలవాటు పడ్డవాళ్లు ఇప్పుడు  తల ఎక్కడ దాచుకోవాలో తెలియక సతమతమౌతున్నారు. ఏపీ అసెంబ్లీలో 175 స్థానాలుంటే వాటిలో 164 స్థానాలు తెలుగుదేశం కూటమి చేజిక్కించుకుంది. 151 స్థానాలతో గత ఎన్నికలలో విజయం సాధించిన వైసీపీ ఇప్పుడు కేవలం 11 స్ధానాలకు గెలుచుకుని కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకండా మిగిలిపోయింది. ఈ నేపథ్యంనే వైసీపీ అధికారంలో ఉండగా అక్రమాలకు పాల్పడిన నేతలు, విపక్ష నేతలపై ఇష్టారీతిన నోరు పారేసుకున్న నాయకులు ఇప్పుడు ఒక్కరొక్కరుగా మౌనం లోకి వెళ్లిపోయారు. కొందరైతే అజ్ణాతంలోకి  జారుకున్నారు. అలాంటి వారిలో మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ఒకరు. వైసీపీ అధికారంలో ఉండగా కన్నూమిన్నూ గానక ఇష్టారీతిగా  తెలుగుదేశం అధినేత చంద్రబాబు పైనోరెట్టుకు పడిపోయిన అనీల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. వినిపించడం లేదు. పోలింగ్ జరిగిన తరువాత ఒక సారి మీడియా ముందుకు వచ్చి పోలీసులు, అధికారులు ఏకపక్షంగా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా వ్యవహరించారని ఓ ఆరోపణ చేసి ఫలితాలకు ముందే ఓటమి అంగీకరించేశారు.  ఆ తరువాత ఆయన ఇక ఎక్కడా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. అయితే  పార్టీ అధికారంలో ఉండగా, తాను మంత్రిపదవి వెలగబెడుతున్న సమయంలో అనీల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లా లో సాగించిన దోపిడీ పర్వం అంతా ఇంతా కాదు. నెల్లూరు జిల్లాలో ఖనిజాల దోపిడీ సహా అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ఆనం రామనాయారణరెడ్డి, కొటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వంటి వారు వైసీపీ తీరుతో, జగన్ విధానాలతో విభేదించి  బయటకు వచ్చి తెలుగుదేశం గూటికి చేరారు. వారిని అనీల్ కుమార్ యాదవ్  అనుచితంగా దూషించి వారి రాజకీయ జీవితం ముగిసిపోయందని చెప్పారు. ఒక వేళ వారు రాజకీయాలలో రాణిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సవాళ్లు సైతం విసిరారు. ఇప్పుడు తన రాజకీయ జీవితమే సందిగ్ధంలో పడిన నేపథ్యంలో ముఖం చూపలేక చాటేశారు.  విపక్షంలో ఉన్న సమయంలోనే తెలుగుదేశం పార్టీ అనీల్ కుమార్ యాదవ్ అక్రమాలపై జ్యుడీషియల్ విచారణకు డిమాండ్ చేసింది. ఇప్పుడు అధకారంలోకి రాగానే విచారణకు ఆదేశించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఇలా ఎలా చూసినా చిక్కుల సుడిగుండంలో చిక్కుకున్న అనీల్ కుమార్ యాదవ్ ఏ కలుగులో దాక్కొన్నా బయటకు లాక్కొచ్చి చట్టం ముందు నిలబెట్టడానికి తెలుగుదేశం శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. 

  నీట్ విచారణ జూలై 8కి వాయిదా: సుప్రీం 

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ( నీట్) టాప్ ర్యాంక్ సాధించినప్పటికీ, దేశంలోని టాప్ మెడికల్ కాలేజీ ఎయిమ్స్(ఏఐఐఎంఎస్)లో సీటు రావడం కష్టమే. ఎందుకంటే, ఈసారి టాప్ 1 ర్యాంక్ 67 మందికి వచ్చింది. ఇది చాలా పెద్ద సంఖ్య. జూన్ 4న నీట్ ఫలితాలు విడుదలైన తర్వాతి నుంచి పరీక్ష నిర్వహణ సక్రమంగా లేదంటూ అనేక వాదనలు తెరపైకి వచ్చాయి. వైద్య విద్యలో విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్షే ఈ నీట్. నీట్‌లో మొదటి ర్యాంకు సాధించిన 67 మందిలో ఆరుగురు, హరియాణాలోని ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్ష రాశారు. ఎన్ని ప్రశ్నలకు, ఎన్ని మార్కులనే లెక్కలకు అంతుచిక్కని రీతిలో కొందరు విద్యార్థులు మార్కులు సాధించారు.అయితే, ఈ వాదనలను నీట్ పరీక్ష నిర్వహించే 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ' ఖండించింది. పరీక్ష పేపర్ లీక్, లేదా పరీక్ష నిర్వహణ ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న వాదనలను తోసిపుచ్చింది. సకాలంలో పరీక్ష పేపర్ అందని కొందరు విద్యార్థులకు మాత్రమే అదనపు మార్కులు ఇచ్చినట్లు స్పష్టం చేసింది. కానీ, మళ్లీ పరీక్ష నిర్వహించాలంటూ కొందరు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై దేశవ్యాప్తంగా పలుచోట్ల న్యాయస్థానాల్లో కేసులు కూడా నమోదయ్యాయి. ఎంబీబీఎస్, ఇతర అండర్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఏడాది మే 5న జరిగిన  నీట్ ప్రవేశపరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను రద్దు చేయాలని పిటిషనర్లు కోరుతున్నారని.. దీనిపై సమాధానం చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వంతోపాటు ఎంట్రన్స్ నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకు నోటీసులు జారీ చేసింది.  అయితే ఈలోగా జరగనున్న నీట్ కౌన్సెలింగ్ పై స్టే విధించేందుకు మాత్రం నిరాకరించింది. కేసు తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది. . మంగళవారం ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘మీరేమీ పవిత్రమైన పనిచేయలేదు. ఇది తేలికగా కొట్టిపారేసే విషయం కాదు. పరీక్షల పవిత్రత దెబ్బతింది. దీనిపై మేం సమాధానాలు కోరుకుంటున్నాం. ఎప్పటిలోగా సమాధానం చెబుతారు? కాలేజీల రీఓపెనింగ్ జరిగిన వెంటనే చెబుతారా? లేదంటే ఈలోగా ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ మొదలవుతుంది’ అని జస్టిస్  ఎన్ టీఏ తరఫు న్యాయవాదిని ఉద్దేశించి ప్రశ్నించారు.

కేసీఆర్‌కి కరెంట్ షాక్!

కేసీఆర్‌కి కరెంట్ షాక్ తగిలింది. ఛత్తీస్‌ఘడ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసిన వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి నోటీసులు జారీ చేసినట్టు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి తెలిపారు. కేసీఆర్‌తో సహా 25 మందికి జస్టిస్ నరసింహారెడ్డి నోటీసులు ఇచ్చారు. తాను ఇచ్చిన నోటీసులకు స్పందించిన కేసీఆర్ జులై 30వ తేదీ వరకు సమయాన్ని కోరారని, అయితే జూన్ 15 లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించామని జస్టిస్ నరసింహారెడ్డి వెల్లడించారు. ఈ అంశం మీద కేసీఆర్ వివరణ సంతృప్తికరంగా లేకపోతే కమిషన్ ముందుకు విచారణకు రావాల్సిందే అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. టెండర్ల ప్రక్రియ లేకుండా కేసీఆర్ తన ఇష్టారాజ్యంగా ఛత్తీస్‌ఘడ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇప్పుడు అదే అంశం కేసీఆర్‌కి కరెంట్ షాక్‌లా తగిలింది.