chandababu speech in nda meeting

ఎన్డీయే ఎంపీల భేటీలో స్పీచ్ అదరగొట్టిన చంద్రబాబు!

శుక్రవారం నాడు ఢిల్లీలో జరిగిన ఎన్డీయే ఎంపీల భేటీలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు ‘‘ఎన్డీయేని అధికారంలోకి తీసుకురావడానికి ప్రధాని మోడీ రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. భారతదేశానికి సరైన సమయంలో సరైన నాయకత్వం మోడీ రూపంలో  వచ్చింది. ఎన్నికల ప్రచారంలో మోడీ చాలా శ్రమించారు. ఏపీలో కూడా మూడు బహిరంగసభలు, ర్యాలీలు చేశారు. ఏపీలో ఎన్డీయే 90 శాతం స్థానాలు గెలిచింది. విజనరీ వున్న నాయకుడు మోడీ కారణంగా భారతదేశం అభివృద్ధిలో ముందడుగు వేస్తోంది. దూరదృష్టి కలిగిన మోడీ ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించారు. భారతదేశం ప్రపంచంలోనే ఐదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగేలా చేశారు. మేకిన్ ఇండియాతో ఆయన భారత్‌ని అభివృద్ధి పథంలో నడిపారు. ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారు. ఆయన నాయకత్వంలో దేశం పేదరిక రహిత దేశంగా మారుతుంది. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా నిలుస్తుంది’’ అన్నారు. ఈ సందర్భంగా మోడీని ప్రధానమంత్రిగా చంద్రబాబు ప్రతిపాదించారు.

former mla jakkampudi raja revolt

జగన్ పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రివోల్ట్

అధికారాంతమున చూడవలే అయ్యగారి సౌభాగ్యముల్ అన్నట్లుగా తయారైంది ప్రస్తుతం జగన్ పరిస్థితి. పార్టీ ఘోరపరాజయం తరువాత ఒక్కరొక్కరుగా వైసీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు జగన్ నిర్వాకమే ఓటమి కారణం అంటూ నోరు విప్పుతున్నారు. ముందుగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా ముందుకు వచ్చి వైసీపీ ఈ స్థాయిలో అత్యంత ఘోరంగా  ఓటమి చెందడానికి పూర్తి కారణం జగనేనని మీడియా ముందుకు వచ్చి మరీ చెప్పారు. ఆ తరువాత గుడ్డు మంత్రి కూడా జగన్ మూడు రాజధానుల సర్కస్ కారణంగానే ఓటమి పాలయ్యామని కుండబద్దలు కొట్టారు. తాజాగా రాజానగరం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన జక్కంపూడి రాజా జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.   గత ఐదేళ్లుగా కనీసం సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అప్పాయింట్ మెంట్ ఇవ్వకుండా జగన్ నిరంకుశంగా వ్యవహరించారనీ,  ఎన్నికలకు రెండు నెలల ముందు ఒక్క సంతకం కోసం కాగితాలు పట్టుకుని గేటు బయట ఎదురు చూసినా ఫలితం లేకపోయిందని చెప్పారు.  ఇప్పుడిక పార్టీలో కూడా పూర్తిగా పట్టు కోల్పోయిన జగన్ అప్పాయింట్ మెంట్ ఇస్తాను రండి మహప్రభో అన్నా ఆయనను కలిసేందుకు సొంత పార్టీ నేతలే ముందుకురాని పరిస్థితి ఏర్పడిందని పరిశీలకులు అంటున్నారు. ఇంత కాలం అంతర్గత సంభాషణల్లో మాత్రమే జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలు ఇప్పుడు బాహాటంగా జగన్ తీరును ఎండగడుతున్నారు. అహంకారంతో, నియంతృత్వ పోకడలతో ఆయన మునిగిపోవడమే కాకుండా తమ రాజకీయ జీవితాన్ని కూడా ముంచేశారని విమర్శిస్తున్నారు. 

Yellow alert in Hyderabad

హైదరాబాద్ లో ఎల్లో అలర్ట్ ...ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

మృగశిర కార్తె రోజు వర్షం పడటం రివాజు. నైరుతి రుతుపవనాలు వారం రోజుల ముందే  తెలంగాణ తాకాయి. వర్షాలు కూడా వారం రోజుల ముందు రావడంతో వాతావరణం చల్లబడింది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం, ఫియర్ జోన్ ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని... మరో 4 రోజుల్లో రాష్ట్రమంతా విస్తరిస్తాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడం, ఉపరితల ఆవర్తనం, షియర్ జోన్ ప్రభావంతో రెండు రోజుల పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. శుక్రవారం జీహెచ్ఎంసీ పరిధితో పాటు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్ష సూచన ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురు గాలులతో వర్షం పడవచ్చునని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

priyanka may contest from wayanad

కాంగ్రెస్ కోసం ప్రియాంక సెంచరీ కొట్టబోతోందా?!

కాంగ్రెస్ పార్టీ కోసం ప్రియాంకా రాబర్ట్ వధేరా సెంచరీ కొట్టబోతోంది. సెంచరీ అంటే క్రికెట్‌లో కొట్టే సెంచరీ కాదు.. రాజకీయ క్రీడలో కొట్టే సెంచరీ. ప్రస్తుతం పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లు వున్నాయి. ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పార్లమెంట్‌కి పోటీ చేసి గెలిస్తే, కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు వస్తాయి. మరి ఇప్పటికిప్పుడు ప్రియాంక పోటీ చేసి గెలవటానికి పార్లమెంట్ స్థానం ఎక్కడుంది? ఎందుకు లేదూ.. అన్నయ్య రాహుల్ గాంధీ పోటీ చేసి గెలిచిన కేరళలోని వాయనాడ్ స్థానం వుంది కదా.. తమ కుటుంబ నియోజకవర్గమైన రాయబరేలీ స్థానంతోపాటు వాయనాడ్ స్థానం నుంచి కూడా పోటీ చేసిన రాహుల్ గాంధీ రెండు స్థానాల్లోనూ గెలిచారు. ఇప్పుడు వయనాడ్ స్థానాన్ని రాహుల్ గాంధీ వదులుకోబోతున్న్టట్టు తెలుస్తోంది. అప్పుడు ఆ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో ప్రియాంకా గాంధీని నిలిపి ఆమెను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ప్రియాంక కూడా దీనికి సుముఖంగా వున్నారని, కాంగ్రెస్ పార్టీకి సెంచరీ గిఫ్టుగా ఇవాలని కూడా అనుకుంటున్నట్టు తెలుస్తోంది. కాకపోతే వాయనాడ్ ఓటర్లు ఏమంటారన్నది మాత్రం వేచి చూడాల్సిన అంశం.

Fish Prasad will be distributed tomorrow

8 నుంచి చేప ప్రసాదం పంపిణీ షురూ 

హైదరాబాద్ చేపమందు పంపిణీ  దేశ వ్యాప్తంగాా ప్రసిద్దిగాంచింది. దశాబ్దాలుగా పాతబస్తీ దూద్ బౌలిలో ప్రారంభమైన చేప మందు తయారీ అక్కడే పంపిణీ చేశారు. అస్త మా పేషెంట్లు ఎక్కువ కావడంతో   పంపిణీ కార్యక్రమం కాస్తా  నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి  షిప్ట్ అయ్యింది.   గతంలో ఇదే చేపమందును కొందరు వ్యక్తులు వివాదాస్పదం చేశారు. చేపమందులో అస్తమా వ్యాధిని తగ్గించే అవశేషాలు లేవని కొందరు వ్యక్తులు హైకోర్టునాశ్రయించారు. హైకోర్టు కూడ చేపమందును కాస్తా చేప ప్రసాదంగా మారుస్తూ ఉత్తర్వులు జారి చేసింది.  నేటితో మృగశిర కార్తె ప్రారంభం కావడంతో హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్దమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో శని, ఆదివారాలు(జూన్ 8, 9తేదీల్లో ) చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మత్స్యశాఖ అవసరమైన చేప పిల్లలను సమకూరుస్తుండగా, దూర ప్రాంతం నుంచి వచ్చే వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.మరోవైపు తెలంగాణ ఆర్టీసీ అదనంగా 130 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. చేప ప్రసాదం కోసం నగరానికి వచ్చే వారు ఇబ్బందులు పడకుండా వివిధ ప్రాంతాల నుంచి నేరుగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు బస్సులు నడుపుతోంది.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, ఈసీఐఎల్, ఈసీఐఎల్ క్రాస్‌రోడ్స్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, దిల్‌సుఖ్‌నగర్, ఎన్జీవోస్ కాలనీ, మిథాని, ఉప్పల్, చార్మినార్, గోల్కొండ, రాంనగర్, రాజేంద్రనగర్, రిసాల బజార్, పటాన్‌చెరు, జీడిమెట్ల, కేపీహెచ్‌బీ, గచ్చిబౌలి నుంచి ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి.

gudiwada amarnath admits jagan three capital policy reason for

మూడు ముక్కలాటే కొంప ముంచింది.. గుడివాడ అమర్నాథ్ కి ఇప్పుడు అర్థమైంది!

నిన్న బొత్స సత్యనారాయణ, నేడు గుడివాడ అమర్నాథ్ ఇలా వైసీపీ ఓటమి తరువాత జగన్ సర్కార్ లో మంవత్రులుగా, మాజీ మంత్రులుగా పని చేసిన ఒక్కొక్కరూ జగన్ తప్పిదాలే తమ కొంప ముంచాయంటూ మీడియాకెక్కుతున్నారు. తాజాగా విశాఖ రాజధాని అంశమే వైసీపీ కొంప ముంచిందని తాజా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ జగన్ పై విమర్శల వర్షం కురిపించారు.  జగన్ తానా అంటే తందానా అంటూ ఐదేళ్ల పాటు భజన చేసిన గుడివాడ అమర్నాథ్ కి ఓటమి తరువాత తత్వం బోధపడింది. రాజును మించి రాజభక్తి అన్నట్లుగా జగన్ భజన చేసి తరించిన గుడివాడ అమర్నాథ్ ఇప్పుడు పార్టీ ఓటమికి జగనే కారణమని పరోక్షంగానైనా నిందిస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పును ఆయన విశాఖ రాజధాని అంశంపై రిఫరెండంగా అభివర్ణిస్తున్నారు. జనం విశాఖ కాదు అమరావతే రాజధాని అని విస్పస్ట తీర్పు ఇవ్వడం ద్వారా తన ప్రభుత్వాన్ని కూలదోశారని అంగీరించారు.  గాజువాక నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన ఈ ఐటీ మాజీ మంత్రి రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖ రాజధాని నిర్ణయం సహా జగన్ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం, అవలంబించిన ప్రతి విధానాలను ప్రజలు తిరస్కరించారని గుడివాడ అమర్నాథ్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తద్వారా ఐదేళ్ల పాలనలో జగన్ చేసిన పనులు, తీసుకున్న నిర్ణయాలూ అన్ని అసంబద్ధంగా ఉన్నాయని చెప్పకనే చెప్పేశారు.  అంటే జగన్ చెప్పిన సంక్షేమం సహా ఆయన ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయాన్నీ, ప్రవేశ పెట్టిన ఏ పథకాన్నీ జనం ఆమోదించలేదని ఈ మాజీ ఐటీ మంత్రి అంగీకరించేశారు.  

Sharmila prevented TDP victory

ఎంతపని చేశావు షర్మిలమ్మో... షర్మిలమ్మా!

ఉన్నదానివి వుండకుండా ఎంత పని చేశావు షర్మిలమ్మో షర్మిలమ్మా!  అవినాష్ రెడ్డి మీద నువ్వు పోటీ చేయకుండా వున్నా బాగుండేది షర్మిలమ్మో.. షర్మిలమ్మా!  నువ్వేమో అవినాష్ రెడ్డిని ఓడించాలని కంకణం కట్టుకున్నావు షర్మిలమ్మో.. షర్మిలమ్మా! చివరికి ఓడిపోవాల్సిన వాడిని నువ్వే గెలిపించావు షర్మిలమ్మో.. షర్మిలమ్మా!  నీవల్ల వైసీపీ ఓట్లు చీలి టీడీపీ అభ్యర్థి గెలుస్తాడని అనుకుంటే, నీవల్లే టీడీపీ అభ్యర్థి ఓడిపోయాడు షర్మిలమ్మో.. షర్మిలమ్మా!  బాబాయ్ హత్య పాయింట్ పట్టుకుని భారీగా ప్రచారం చేశావు షర్మిలమ్మో.. షర్మిలమ్మా!  నువ్వు గెలిచినా బాగుండేది షర్మిలమ్మో.. షర్మిలమ్మా!  నువ్వూ గెలవలేదు.. పైగా టీడీపీ అభ్యర్థిని ఓడించావు షర్మిలమ్మో.. షర్మిలమ్మా!  అవినాష్‌రెడ్డికి 6,05,143 ఓట్లు అంటే, 47.78 శాతం ఓట్లు పడ్డాయి. టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డికి 5,42,448 ఓట్లు అంటే 41.03 శాతం ఓట్లు పడ్డాయి. వైఎస్ షర్మిలకేమో 1,41,039 ఓట్లు అంటే, 10.67 శాతం పడ్డాయి.. అంటే అర్థమేంటి.. షర్మిల పోటీలో నిలవకుండా వుంటే, ఆ ఓట్లు కూడా టీడీపీకి పడి టీడీపీ అభ్యర్థి గెలిచేవాడు. కేవలం షర్మిల పోటీ చేయడం కారణంగానే అవినాష్ రెడ్డి గెలిచాడు. అదీ పాయింటు. ఉన్న నాలుకకి మందు వేయబోయి కొండ నాలుక ఊడగొట్టావు షర్మిలమ్మో.. షర్మిలమ్మా! జైలుకు వెళ్ళాల్సిన అవినాష్‌రెడ్డిని పార్లమెంటుకు పంపించావు షర్మిలమ్మో.. షర్మిలమ్మా! 

jagan insult ycp leaders

అంతకంతా అనుభవించాల్సిందే!

చింత చచ్చినా పులుపు చావలేదు అన్న సామెత మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ కు అతికినట్టు సరిపోతుంది. అధికారంలో ఉన్నంత కాలం నియంతృత్వం, అహంకారంతో విర్రవీగిన ఆయన పార్టీ ఘోర పరాజయం పాలై, పదవీ చ్యుతుడైన తరువాత కూడా ఇసుమంతైనా  తగ్గలేదు. ఐదేళ్లూ తన కోసం వారి రాజకీయ భవిష్యత్ ను కూడా వదులుకుని, ప్రజలతో సంబంధాలు తెంపేసుకుని, ప్రత్యర్థులపై బూతులు, అనుచిత భాషతో విరుచుకుపడటమే పనిగా పెట్టుకున్న సొంత పార్టీ మాజీ ఎమ్మెల్యేల పట్ల జగన్ ఎంత అవమానకరంగా ప్రవర్తించారో  ఆ పార్టీ నుంచే విడుదలైన ఒక వీడియో తిరుగులేని సాక్ష్యంగా నిలుస్తోంది. అయితే జగన్ చేత అంతగా అవమానానికి గురైనా వైసీపీ నేతలపై ఎక్కడా, ఎవరికీ సానుభూతి కలగడం లేదు.  వైసీపీ ఘోర పరాజయం తరువాత జగన్ తో  పార్టీ నేతలు, అసెంబ్లీకి ఎన్నికైన 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, పలువురు తాజా మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.  ఆ సమావేశానికి హాజరైన వారందరికీ కూడా పార్టీ ఘోర పరాజయానికి కారణమేమిటో తెలుసు. జగన్ విధానాలు, వైఖరీ, వ్యవహార శైలి, తలకెక్కిన అహంకారం, కక్షసాధింపే పాలనగా భావించిన తీరే వైసీపీ ఘోర పరాజయానికి కారణమని తెలుసు. అయినా జగన్ పార్టీ ఓటమికి ఎమ్మెల్యేల వైఫల్యాలే కారణమని తమ ముఖం మీదే చెప్పేస్తున్నా చేతులు కట్టుకుని నిలబడి మరీ విన్నారు. సీనియర్లు, వయస్సులో పెద్దవారు కూడా జగన్ ముందు చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఆయన కళ్లల్లో ఆనందం కోసం తమ వ్యక్తిత్వాన్ని చంపుకుని మరీ అధికారంలో ఉండగా చేసిన దాష్టికాలు, దౌర్జన్యాలను కళ్ల ముందు కనిపిస్తున్నా, తాము ఎవరి కోసం ఇంత చేశామో ఆ వ్యక్తే కనీస మర్యాద లేకుండా నిలుచోబెట్టి దులిపేస్తుంటే నోళ్లు మూసుకుని భరించారు.   అలా నిలబడిన వారిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేతలు కూడా ఉన్నారు. వారికి అంత అవమానం జరిగిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమంలో  తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయినా ఎవరికీ అలా బిక్కముఖం వేసుకుని చేతులు కట్టుకు నిలబడిన వారిపై సానుభూతి కలగడం లేదు. కనీసం అయ్యోపాపం అని కూడా అనిపించడం లేదు. చేసినదానికి ఫలితం అనుభవించాలి కదా? అనే అంటున్నారు. నెటిజన్లైతే.. వారి దౌన్యంపై ఓ రేంజ్ లో సెటైర్లు పేలుస్తున్నారు. జగన్ ఎటూ వారం వారం కోర్టుకు హాజరై చేతులు కట్టుకుంటారు. జగన్ తో అంటకాగి జనాలను వేధించిన ఆ పార్టీ నేతలూ అవమానాలు ఎదుర్కొంటూ అధినేత బాటలో పరదాల మాటున బతుకీడ్చాల్సిందేనని ట్రోల్ చేస్తున్నారు. 

 The dashing Tinmar Mallanna

 దూసుకుపోతున్న తీన్మార్ మల్లన్న 

నల్లగొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. నాలుగు రౌండ్ల తర్వాత ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ - 1,22,813 (తీన్మార్ మల్లన్న), బీఆర్ఎస్ - 1,04,248 (ఏనుగుల రాకేష్ రెడ్డి), బీజేపీ - 43,313 (గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి), అశోక్ పాల్కూరి - 29,697 (స్వతంత్ర అభ్యర్థి) ఓట్లు పోలయ్యాయి. తీర్మాన్ మల్లన్న 18,565 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు. మూడో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి తీర్మార్ మల్లన్నకు లక్షకు పైగా ఓట్లు పోలయ్యాయి. బీఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి 87356 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి 34516 ఓట్లతో మూడో స్థానంలో, స్వతంత్ర అభ్యర్థి అశోక్ 27,493 ఓట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.

kodali nani chapter close

కొడాలి నానీ.. నీకు మొదలైంది చూస్కో!

కొడాలి నాని గుడివాడకి చేసిందీ సచ్చిందీ ఏదీ లేదుగానీ, గుడివాడ ప్రజల్ని వేధించిందే ఎక్కువ.. గుడివాడ సొమ్మును దోచిందే ఎక్కువ. 20 ఏళ్ళుగా ఈ దుష్టుడి ధాటికి గుడివాడ ప్రజలు విలవిలలాడిపోయారు. గతంలో రెండుసార్లు క్షమించి మళ్ళీ గెలిపించినా, ఈసారి మాత్రం ఇతని వ్యవహార శైలి ఎంతమాత్రం నచ్చని గుడివాడ ప్రజలు ఓటుతో శిక్షించారు. ఇప్పుడు కొడాలి నాని గుడివాడలో బయటకి వెళ్ళి తిరిగే పరిస్థితి కూడా కనిపించడం లేదు. కొడాలి నాని పేరు చెబితేనే ఆగ్రహంతో రగిలిపోతున్న ప్రజల దగ్గరకి కొడాలి నాని వెళ్ళకపోవడమే ఆయనకి మంచింది.  ఇప్పుడు గుడివాడలో కొడాలి నానికి షాక్ ట్రీట్‌మెంట్ మొదలైంది. మునిసిపల్ నిధులతో నిర్మించిన రాజేంద్రనగర్ పార్కుకు కొడాలి నాని తన పేరే పెట్టేసుకున్నారు. ఆ పేరుని తాజాగా గుడివాడ ప్రజలు తొలగించారు. గుడివాడలో తనకు ఆర్యవైశ్యులు ఓట్లు వేయడం లేదని మనసులో పెట్టుకున్న కొడాలి నాని పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణమంటపం పక్కనే భారీగా చెత్తకుండీని ఉద్దేశపూర్వకంగా నిర్మించారు. ఇప్పుడు ఆ చెత్తకుండీని ఆర్యవైశ్యులు ధ్వంసం చేశారు.  అంతేకాదు.. గుడివాడ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కొడాలి నాని పేరు మీద వున్న శిలాఫలకాలన్నీ జనం పగలగొట్టేస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని పేరు ఎక్కడా కనిపించకూడదన్న పంతంలో వున్న జనం ఆ మంచి కార్యక్రమాన్ని కలసికట్టుగా నిర్వర్తిస్తున్నారు.

ap assembly speaker aspirants

మంత్రికంటే స్పీకర్ ఉత్తమం!

ఆంధ్రప్రదేశ్‌లో కొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుతీరబోతోంది. ఇప్పుడు అంతటా కొత్త మంత్రివర్గ కూర్చు గురించిన చర్చలే జరుగుతున్నాయి. ఏ పోర్టుఫోలియోకి ఎవరు మంత్రి అయ్యే అవకాశం వుంది.. కూటమిలో ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు వస్తాయి.. పవన్ కళ్యాణ్ మంత్రి పదవి తీసుకుంటారా తీసుకోరా... ఇలాంటి డిస్కషన్లు ఒకవైపు నడుస్తుంటే, కూటమిలో వున్న మూడు పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మంత్రి పదవులు దక్కించుకోవడం కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మంత్రి పదవులకు డిమాండ్ ఎలాగూ వుంటుంది. గతంలో అయితే  స్పీకర్ పదవికి పెద్దగా డిమాండ్ వుండేది కాదు.. మంత్రి పదవి కావాలా స్పీకర్ పదవి కావాలా అని ప్రశ్నిస్తే, స్పీకర్ పదవి వద్దు బాబోయ్ అనేవారు. ఎందుకంటే, స్పీకర్ పదవిలో వుంటే భావోద్వేగాలను భారీ స్థాయిలో అదుపులో పెట్టుకోవాల్సి వస్తుంది.  బీపీ లేనివాళ్ళకి కూడా బీపీ వచ్చే అవకాశం వుంది. మంత్రుల మాదిరిగా యాక్టివ్‌గా కాకుండా సంప్రదాయబద్ధంగా వుండాల్సి వస్తుంది. ఇలాంటి కొన్ని డిజడ్వాంటేజెస్ స్పీకర్ పదవిలో వున్నాయి. అలాగే అపారమైన గౌరవం కూడా స్పీకర్ పదవిలో వున్న వారికి వుంటుంది. అయినప్పటికీ స్పీకర్ పదవి కోసం పోటీపడే వారి సంఖ్య అంతగా వుండదు. స్పీకర్ పదవి అంటే గుర్తొచ్చింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మాత్రమే కాదు.. దేశ చరిత్రలోనే తమ్మినేని సీతారాం లాంటి ఘోరమైన స్పీకర్‌ని ఎవరూ చూసి వుండరు. కూర్చుంది స్పీకర్ కుర్చీమీద అయినా, లారీ క్లీనర్ కంటే దారుణంగా బిహేవ్ చేశారాయన. ప్రతిపక్ష పార్టీల సభ్యులను పురుగుల కంటే హీనంగా చూశారు..  గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు డాక్టర్ కోడెల శివప్రసాద్ స్పీకర్‌గా ఎంతో హుందాగా పనిచేశారు. సభలో రెచ్చిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలను అదుపులో పెట్టడంలో విజయం సాధించారు. ఆ పగతోనే ఆయన్ని మానసికంగా క్రుంగిపోయేలా చేసి, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చారు. సర్లే, ఈ మంచి రోజుల్లో గాయాలుగా మిగిలిన ఆ రోజులను ప్రస్తావించినందుకు సారీ... ఇప్పుడు మంచి రోజులు వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో స్పీకర్ పదవికి మాంఛి డిమాండ్ ఏర్పడింది. మంత్రి పదవుల కోసం ఎలా పోటీ పడుతున్నారో, స్పీకర్ పదవి కోసం కూడా చాలామంది పోటీ పడుతున్నారు. ఈమధ్యే తెలుగుదేశంలో చేరి, గెలిచిన రఘురామకృష్ణంరాజుకు జగన్‌తో రాజీపడని పోరాటం చేసిన చరిత్ర వుంది. అలాగే బొత్స మీద చీపురుపల్లిలో గెలిచిన కిమిడి కళా వెంకట్రావు కూడా స్పీకర్ పదవిని ఆశిస్తున్నారు. ఆత్మకూరు ఎమ్మెల్యే రామనారాయణరెడ్డి... ఇంకా ముగ్గురు నలుగురు స్పీకర్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. వీరిలో రఘురామకృష్ణంరాజు వైపే మొగ్గు ఎక్కువగా కనిపిస్తోంది. సభలో జగన్ పార్టీ సభ్యులు వున్నది 11 మందే కాబట్టి ఈసారి స్పీకర్ పదవి నిర్వహించేవారికి బీపీ పెరిగే అవకాశం వుండకపోవచ్చు.

93 percent mps in new loksahba are millionaires

ఎంపీల్లో 93 శాతం మంది కోటీశ్వరులే: ఏడీఆర్

కొత్త పార్లమెంటులో కొలువుదీరనున్న లోక్ సభ సభ్యుల్లో 90శాతానికి పైగా కోటీశ్వరులే. ఆ వివరాలను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) తెలిపింది. గత లోక్ సభలో మొత్తం 475 మంది కోటీశ్వరులుండగా, ఈ సారి వారి సంఖ్య 504కు పెరిగింది. అత్యంత సంపన్నుల జాబితాలో గుంటూరు నుంచి లోక్ సభకు ఎన్నికైన తెలుగుదేశం నాయకుడు పెమ్మసాని చంద్రశేఖర్ తొలి స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తుల విలువ5వేల705 కోట్ల రూపాయలు. రెండో స్థానంలో తెలంగాణలోని చేవెళ్ల లోక్ సభ స్థానం నుంచి గెలిచిన  బీజేపీ అభ్యర్థి విశ్వేశ్వర్రెడ్డి ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ  4,568 కోట్ల రూపాయలు.  

andhrapradesh new cs neerabh kumar prasad

ఏపీ కొత్త సీఎస్ గా నిరభ్ కుమార్ ప్రసాద్

ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్ గా నిరభ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన నీరభ్ కుమార్ ప్రసాద్  ఆంధ్ర ప్రదేశ్ కొత్త సీఎస్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. బుధవారం (జూన్ 6) ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారు. అప్పుడే ఆయన ఏపీ కొత్త సీఎస్ గా నియమితులయ్యే అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన ఏపీ సీఎస్ గా నియమితులయ్యారు. నీరభ్ కుమార్ ప్రసాద్ రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.   ప్రస్తుత సీఎస్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి గురువారం (జూన్ 6) సెలవుపై వెళ్లిన సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ కు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జవహర్ రెడ్డిని సెలవుపై వెళ్లాల్సిందిగా చంద్రబాబు మౌఖికంగా ఆదేశించినట్లు తెలుస్తోంది. జవహర్ రెడ్డి ఈ నెలాఖరుకు పదవీవిరమణ చేయనున్న సంగతి తెలిసిందే.  

cbn eye on power sector

విద్యుత్‌ లెక్కలు నిగ్గు తేల్చండి.. అధికారులకు బాబు మౌఖిక ఆదేశాలు!

జగన్ ఐదేళ్ల పాలనలో విద్యుత్ రంగాన్ని కుదేలు చేశారు. విద్యుత్ రంగంపై గత ప్రభఉత్వం మోపిన భారాలు, విద్యుత్ సంస్థల అప్పులపై చంద్రబాబు దృష్టి సారించారు. గత ఐదేళ్లలో ఎన్ని సార్లు విద్యుత్ చార్జిలు పెంచారు. ఎన్ని వేల కోట్ల అప్పులు తెచ్చారు. ఎంత విద్యుత్ కొనుగోలు చేశారు వంటి సకల వివరాలనూ అందజేయాల్సిందిగా చంద్రబాబు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.   రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ఎంత, మిగులు ఎంత అన్న వివరాలు సైతం సేకరించాల్సిందిగా ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. గత ఐదేళ్లలో పదే పదే విద్యుత్  చార్జీలు పెంచడమే కాకుండా, ట్రూఆప్, సర్దుబాటు చార్జీలు అంటే ఏకంగా తొమ్మిది సార్లు జగన్ సర్కార్ ప్రజలపై మోయలేని భారాన్ని మోపింది.  చార్జీలు పెంచడం తప్ప విద్యుత్ సరఫరాపై దృష్టి పెట్టలేదు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించకపోవడానికి తోడు విద్యుత్ కోతలతో బతుకు నరకం చేసింది.  అసలు ఇన్నిసార్లు విద్యుత్‌ ఛార్జీలను పెంచాల్సిన అవసరం ఎందుకొచ్చింది? బయట ప్రైవేట్‌ మార్కెట్‌ నుంచి విద్యుత్‌ ఎంత కొనుగోలు చేశారు? అనే అంశాలపై లెక్కల నిగ్గు తేల్చాలని ఇప్పటికే చంద్రబాబు అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.  కొత్త ప్రభుత్వం కొలువదీరగానే విద్యుత్ రంగంపై చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేసే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   విద్యుత్‌ రంగాన్ని గాడిలో పెడతానని చంద్రబాబు నాయుడు ఎన్నికల ఫలితాల అనంతరం నిర్వహించిన తొలి మీడియాలో సమావేశంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రజావాణి షురూ!

లోక్ సభ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమం శుక్రవారం(జూన్ 7)  నుంచి తిరిగి ప్రారంభం అయ్యింది.  ప్రజావాణి ఇంచార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి  గురువారం (జూన్ 6) నాడు ఈ విషయాన్ని వెల్లడించారు.  దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందు వల్ల ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.  ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో ప్రతి  మంగళ, శుక్ర వారాల్లో  యథావిధిగా కొనసాగనుంది.   ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవా లని, ప్రజలు తమ సమస్య లను అర్జీల ద్వారా ప్రజా వాణిలో అందజేయాలని చిన్నారెడ్డి కోరారు. ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ గా రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్ దివ్య వ్యవహరిస్తున్నారు.

లీవ్.. రిలీవ్.. ఈ ఆటలేవీ సాగట్లేదు!

ప్రస్తుతం సర్వీసులో వున్న పలువురు అధికారులు, అలాగే వేరే శాఖల నుంచి డిప్యుటేషన్ మీద వచ్చిన అధికారులు జగన్ హయాంలో ఆడింది ఆటగా, పాడింది పాటగా హవా నడిపించారు. వీళ్ళు ప్రస్తుతం లీవ్ లేదా రిలీవ్ అనే పదాలను జపం చేస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టేలోపు లీవ్ మీద వెళ్ళిపోవాలని కొంతమంది తంటాలు పడుతుంటే, డిప్యుటేషన్ మీద వచ్చినవాళ్ళ రిలీవ్ అయిపోవాలని హడావిడి పడిపోతున్నారు. గతంలో తన సర్వీసును పొడిగించాలని అభ్యర్థన పెట్టుకున్న ఐ అండ్ పీఆర్ కమిషనర్ టి.విజయ్‌కుమార్‌రెడ్డి తనను అర్జెంటుగా రిలీవ్ చేసేయాలని బతిమాలుకుంటున్నారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి ఇలా ఎన్నికల ఫలితాలు వచ్చాయో లేదో అలా తనను రిలీవ్ చేయాలని రిక్వెస్ట్ పెట్టుకున్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ కూడా తనను రిలీవ్ చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తమను రిలీవ్ చేయాలని గనుల శాఖ ఎండీ వెంకటరెడ్డి, ఏపీ ఎఫ్ఎస్ఎల్ ఎండీ మధుసూదన్ రెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ రాజేశ్వర్‌రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. అయితే డెప్యుటేషన్ మీద వచ్చినవాళ్ళని రిలీవ్ చేయడానికి కుదరదని ప్రభుత్వం ప్రకటించడంతో వీళ్ళందరి గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది. అలాగే కొంతమంది లీవులు పెట్టుకున్నారు. వారిలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి, సీఐడీ చీఫ్ సంజయ్ వున్నారు. వీరిలో ధర్మారెడ్డి లీవ్ అప్లికేషన్‌ని ప్రభుత్వం రీజక్ట్ చేసింది. ఎలాగూ లీవ్ మంజూరు కాదని అర్థం చేసుకున్న సీఐడీ చీఫ్ సంజయ్ తన లీవ్ దరఖాస్తును వెనక్కి తీసుకున్నారు.