ప్రజావాణి షురూ!
posted on Jun 7, 2024 9:18AM
లోక్ సభ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమం శుక్రవారం(జూన్ 7) నుంచి తిరిగి ప్రారంభం అయ్యింది. ప్రజావాణి ఇంచార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి గురువారం (జూన్ 6) నాడు ఈ విషయాన్ని వెల్లడించారు.
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందు వల్ల ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.
ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో ప్రతి మంగళ, శుక్ర వారాల్లో యథావిధిగా కొనసాగనుంది.
ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవా లని, ప్రజలు తమ సమస్య లను అర్జీల ద్వారా ప్రజా వాణిలో అందజేయాలని చిన్నారెడ్డి కోరారు. ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ గా రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్ దివ్య వ్యవహరిస్తున్నారు.