ఎన్డీయే ఎంపీల భేటీలో స్పీచ్ అదరగొట్టిన చంద్రబాబు!

శుక్రవారం నాడు ఢిల్లీలో జరిగిన ఎన్డీయే ఎంపీల భేటీలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు ‘‘ఎన్డీయేని అధికారంలోకి తీసుకురావడానికి ప్రధాని మోడీ రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. భారతదేశానికి సరైన సమయంలో సరైన నాయకత్వం మోడీ రూపంలో  వచ్చింది. ఎన్నికల ప్రచారంలో మోడీ చాలా శ్రమించారు. ఏపీలో కూడా మూడు బహిరంగసభలు, ర్యాలీలు చేశారు. ఏపీలో ఎన్డీయే 90 శాతం స్థానాలు గెలిచింది. విజనరీ వున్న నాయకుడు మోడీ కారణంగా భారతదేశం అభివృద్ధిలో ముందడుగు వేస్తోంది. దూరదృష్టి కలిగిన మోడీ ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించారు. భారతదేశం ప్రపంచంలోనే ఐదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగేలా చేశారు. మేకిన్ ఇండియాతో ఆయన భారత్‌ని అభివృద్ధి పథంలో నడిపారు. ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారు. ఆయన నాయకత్వంలో దేశం పేదరిక రహిత దేశంగా మారుతుంది. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా నిలుస్తుంది’’ అన్నారు. ఈ సందర్భంగా మోడీని ప్రధానమంత్రిగా చంద్రబాబు ప్రతిపాదించారు.

Teluguone gnews banner