ఆరోగ్య కేంద్రాల పనితీరు పై సమీక్ష.

దేశంలో అందరికీ ఆరోగ్యం అన్న నినాదాలు వినిపిస్తూనే ఉంటాయి. ఏళ్ల తరబడి గ్రామీణ ప్రాంతాల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి  రాష్ట్ర ప్రభుత్వం  నిర్వహిస్తున్న ఆరోగ్య కేంద్రం లో మౌలిక సదుపాయాల కల్పన,  సాంకేతిక  పరిజ్ఞానం, నాణ్యమైన మందుల పంపిణీ,రవాణా సౌకర్యాలు, ఆరోగ్య  సిబ్బంది,  అత్యవసర  చికిత్స,, ప్రతి ఆరోగ్య కేంద్రానికి ఇద్దరు డాక్టర్లు, ఒక స్టాఫ్ నర్స్ ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన ముఖ్యంగా అత్యవసర సమయంలో అందించాల్సిన నాణ్యమైన సేవల పై దృష్టి పెట్టాలని ఉద్దేశంతో ఐ పి హెచ్ ఎస్ అంటే ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్  నియమ నిబంధనల ప్రకారం పనిచేస్తున్నాయా లేదా అన్న అంశాన్ని పరిసీ లించేందుకు   ఒక అధ్యయనం జరిగింది.  ఆ అంశాలను ఇప్పుడు ఒక ఏ వి.చూద్దాం                                                                                                        ముందుగా చరిత్రాత్మకంగా అసలు ఆరోగ్య కేంద్రాలు  ఎప్పుడు ప్రారంభమయ్యాయి. అన్న అంశాలు చూద్దాం. చరిత్రాత్మకంగా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అంశం 1978 లో ఐమా, ఆట, యు ఎస్ ఎస్ ఆర్ లో జరిగిన అంతర్జాతీయ సదస్సు  తర్వాత ఆరోగ్య సంరక్షణ అంశం పై దృష్టి  పెట్టాల్సిన అవసరం పై ప్రపంచ దేశాలు గుర్తించాయి. ఈ క్రమంలో భాగంగా సాధారణ ఆరోగ్య  సేవలు, దీని ద్వారా ప్రధమంగా ప్రజలకు  చేరువగా వైద్యం అందించాలన్నది ఈ పధకం ప్రధాన లక్ష్యం. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ప్రధానంగా నాలుగు  సూత్రాలపై ఆధారపడి పని చేస్తాయి. సమాన మైన పంపిణీ,, వివిధ  వర్గాలతో సమన్వయం. వివిధ వర్గాలు పాల్గొనేలా ప్రోత్సహించడం. సరైన సాంకేతిక విధానం, బొరె కమిటీ వంటి  సూత్రాలపై  ఆధారపడి ఉంటుంది. 1948 లో భారత దేశం ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది అయితే 1978 తరువాత గాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల విస్తరణ సాధ్యం కాలేదు. 2005  సంవత్సరానికి భారత ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఆరోగ్య  మిషన్  ను ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లో  మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ప్రారంభించింది . అస్తవ్యస్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల  వ్యవస్థను  ఒకే పరిధిలోకి తెస్తూ గ్రామం, జిల్లా స్థాయిలో, ఆరోగ్య విధానాన్ని సమర్థంగా అమలు చేయడానికి కేంద్రం సిద్ధం అయింది. 2005 ఏప్రిల్ నుంచి జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్  ద్వారా నాణ్యమైన ఆరోగ్యమే లక్ష్యంగా పని చేయడం ప్రారంభించింది.  ప్రత్యేకంగా 18 రాష్ట్రాల్లో ఈ పథకం అమలు తీరును పర్యవేక్షించేందుకు డెమోగ్రాఫిక్ ఇండికేటర్స్ ద్వారా మౌలిక సదుపాయల కల్పన కల్పించేందుకు సిద్ధమయింది. రాజ కీయ కోణంలో భాగం గానే కేంద్ర ప్రభుత్వం. ప్రజా ఆరోగ్యం, పై దృస్తి పెట్టిందని. ఈ మేరకు  జి‌డి ఏ ను 2%3% నికి పెంచాలని ప్రయత్నం చేస్తోంది. అధికారులు ప్రజలకు జవాబు దారి తనం పెంచ డమే ఐ పి హెచ్ యెస్ ప్రధాన లక్ష్యం. మానవ శక్తి, సాంకేతికత, ద్వారా ఇండియన్  పబ్లిక్ హెల్త్ ప్రమాణాల ప్రకారం భారతీయ ప్రజల ఆరోగ్య ప్రమాణాలను పెంచే లక్ష్యం గా హెల్త్ వర్కర్లకు నైపుణ్యం అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేయాలని నిర్ణయించింది.                                                                 ప్రాథమిక ఆరోగ్య  కేంద్రం లక్ష్యం ఏమిటి ? వాటి అవసరం ఏ మేరకు గ్రామ ప్రజా ఆరోగ్య అవసరాలు తీర్చ వచ్చు. అన్న అంశాన్ని పరిశీలిద్దాం. గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ ఆరోగ్యం  ఒక తొలి అడుగు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. మొదటగా నిపుణులైన డాక్టర్ నిపుణులైన వారి ని సంప్రదించాల్సిన అవసరం కేవలం గ్రామ ప్రజలు మాత్రమే ఉంది. వివిధ రాష్ట్రంలో ప్రాథమిక  ఆరోగ్య కేంద్రాలు సేవలు చేస్తారు, గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, ముఖ్యంగా ఉండాలి, అరకు వెలి లాంటి ప్రాంతాల లో నిత్యం టైఫాయిడ్, మలేరియా సమస్యతో బాధపడే వృ పట్ల సరైన వైద్యం అందం లేదని నిర్వాసితులు తమ గోడు వెళ్ళ పోసుకున్న కధనా ఇంకా చూస్తున్నాం. పై ప్రాంతానికి వాహన సదు పాయం లేదు పైగా అంబులెన్స్ వెళ్ళే దారి లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బన్ దులకు గురు అవుతూ ఉండడంతో తీర ఇబ్బందులు పడుతున్నారు. మరి ఏ ఇతర సదుపాయం లేక తీవ్ర  అనారోగ్యం తో బడా పడుతున్న వారు డోలి లో మోసుకు పోయి పరిస్థితులు ఉండడం  తో ఏళ్ళు గడుస్తున్నా గిరిజన గ్రామాల ప్రజల  వెతలు తీరడం అసాధ్యమా అన్న సందేహం కలుగుతుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లక్ష్యం ఏమిటో తెలుసు కుందాం,                                                                                                                   ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మూడు ఆంచెల విధానం ద్వారా  ఆరోగ్య సేవలు అందిస్తోంది. మూడు అంచేలా విధానం ద్వారా ఆరోగ్య వంత మైన సమాజ నిర్మాణానికి దోహదం చేస్తుంది.  ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో నివసించే వివిధ సామాజిక వార్గాల ను  ఆరోగ్య  వంతు లు  గా తయారు చేసేందుకు ద్వారా ఆరోగ్య వంత మైన సమాజ నిర్మాణానికి దోహదం చేస్తుంది. ముఖ్యంగా కమ్యూనిటీ హెల్త్ కేర్  సెంటర్ రెఫరల్ కేంద్రాలుగా పని చేస్తాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 30 పడకల ఆసుపత్రి, తాలూకా, జిల్లా   స్థాయిలో 100 పడకల ఆసుపత్రి పని చేస్తున్నారు.                                                                                                                                                       వాస్తవానికి  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వాలే.  సాధారణ అత్యవసర  కార్యక్రమం, సాధారణ సేవల కార్యక్రమం. కింద ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు వ్యక్తులకు, జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఒక వారధిగా తోడ్పడుతుందని.  కేంద్రం భావిస్తోంది. ప్రతి ఆరోగ్య కేంద్రం 20,000 మంది జనాభా ఉన్న కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలను  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్ పరిధిలోకి తీసుకు రావడం వైద్య సదుపాయాలను సామాన్యులకు అందించాలన్నదే దీని లక్ష్యం. 30,000 జనబా ఉన్న సాధారణ ప్రాంతాలకు ఆరోగ్య కేంద్రాల ద్వారా ఆరు పడకల ఆసుపత్రి. ఆబ్సర్ వేషన్ పడక గదులు,  ఆసుపత్రుల ద్వారా ఆరోగ్యాన్ని అందించడంతో పాటు ఉపశమనం కలిగించే  పునరావాసం.కల్పించాలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల లక్ష్యం. వైద్య సేవల పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు వైద్య విద్య , పౌస్టిక ఆహారం పై అవగాహన, తల్లి పిల్లల ఆరోగ్యం, పిల్లలు బాలింతలకు సలహా సూచనలు, పిల్లలకు సకాలంలో టీకాలు వేయించాలి. వ్యాధి నువరణకు, గాయాలకు, ఆరోగ్య సమస్యలకు, చికిత్స, మురుగు నీతి పారుదల, పారిశుద్ధ్యం, తాగునీటి పంపిణీ వంటి  అంశాలు సేవలు అందించాలని. ఈ పథకం లక్ష్యం               భారత్ లో గ్రామీణ ఆరోగ్యం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటుంది. మరి ఏ ఇతర విభాగం తోను సరి తూగని సంబంధం లేని ఆస్తిత్వాన్ని సాధించుకుంది. జానా లో ఏ విభాగానికి చెందిన శాఖగా మిగిలి పోయింది. గ్రామీణ ప్రాంతల్ ప్రజలు పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో భరించడం సాధ్యం కాదు. జనాభా 45% మంది  కి అది ఏ విభాగానికి చెందిన శాఖ గా మారిపోయింది. అధికారులు పేర్కొన్నారు. 20% మంది ప్రజలు  ఔట్   పేషెంట్, , సేవల కోసం , 45% మంది ప్రజలు ఇన్  పేషంట్ , సేవల కోసం ప్రభుత్వ సేవల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన. నాణ్యత లేని, మందుల ప,పిణీ, నాణ్యతలేని, వైద్య పరికరాలు . నాణ్యత ప్రమాణాలు ఉన్నప్పుడు అభివృద్ధి సాధ్యం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పని తీరును మదింపు చేయడానికి నిర్దేశించిన ఆ నియమ నిబంధనలు లక్ష్యాలు  ఏమిటో చూద్దాం.                                                                                            భారతీయ గ్రామీణ ఆరోగ్య పధకం ప్రమాణాలకు, నియమనిబందనలు నాణ్యమైన ఆరోగ్యం అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ భారత ప్రభుత్వ భారతీయ గ్రామీణ ఆరోగ్య పధకం కింద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వృద్ధికి మూడు లక్ష్యాలు నిర్దేశించుకుంది. మొదటిది ప్రాథమిక ఆరోగ్య లక్ష్యంగా పని చేస్తుంది.  గ్రామీణ ప్రజల ఆరోగ్యమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లక్ష్యం. రెండవది---అందరికీ ఆమోద యోగ్యమైన ఆరోగ్య రక్షణ కల్పించాలన్నది, కేంద్రం లక్ష్యం. బాధ్యతాయుతమైన సునిశితమైన ప్రజల అవసరాలను తీర్చడం. మనకు అందు బాటులో ఉన్న మౌలిక సదుపాయాలను దృష్టిలో  ఉంచుకుంటే కనీస పక్షంలో భవనం, కనీస  ఆరోగ్య సిబ్బంది, వైద్య  పరికరాలు, మందులు, ఇతర సౌకర్యాలు, వసతులు, ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రాల నిర్వహణ సరిపోతాయి.  భారతీయ గ్రామీణ ఆరోగ్య పథకం యొక్క లక్ష్యం ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం తో పాటు, నాణ్యత తో కూడిన వైద్య సేవలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు పై సమీక్ష పరిశీలనే కాదు ప్రధ మిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్నాయా? లేదా? ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన వైద్య సిబ్బంది ఉన్నారు లేదా ?అన్నది భారతీయ గ్రామీణ ఆరోగ్య పథకం నిబంధనలకు అనుగుణంగా వైద్య ప్రమాణాలు ఉన్నాయా లేదా అన్నది   ప్రశ్నార్థకంగా  మారింది.                                                                                                              భారతీయ గ్రామీణ ఆరోగ్య పధకం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా నెల్లూరు జిల్లాలో 25% ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఎంపిక చేశారు. అందులో ర్యాండమ్ గా 15 ఆరోగ్య కేంద్రం ను ఎంపిక చేశారు. ఈ ఆరోగ్య కేంద్రం పరిశీలన జిల్లా వైద్య ఆరోగ్య అధికారి తో పాటు వైద్య అధికారులు నిర్దేశించిన ప్రశ్నా పాత్రల ఆధారంగా ఎస్ పి ఎస్ ఎస్ సాఫ్ట్ వేర్ ద్వారా డాటాను సమీకరించడం తో పాటు నెల్లూరు జిల్లా లోని వివిధ వర్గాల నుంచి  సేకరించిన సమాచారం ఆధారంగా  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు మదింపు చేసినట్లు  ఆ రిపోర్ట్ లో పేర్కొన్నారు.    రెండు సంవత్సరాల పాటు అధికారులు, నిర్వహించిన పరిశీలన లో అసలు లోపల స్పష్టంగా బయట పడ్డాయి . ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పని తీరు అంచనాలకు మించి పని చేయడం లేదని మౌలిక సదుపాయాల కల్పన  పై దృష్టి పెట్ట లేదని  అర్ధం  అవుతోంది.  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో    ఉండాల్సిన వైద్య సిబ్బంది ఆరోగ్య కార్యకర్తలు వేరు వేరు  రకాలు ఉన్నట్లు, ఆరోగ్య కేంద్రంలో ని ఆయుష్మాన్ భవ వైద్య అధికారులు సరిగా లేరని, వైద్య అధికారుల కొరత ఉందని తేల్చింది.ఏ ఏం ఓ లు 86.6% మాత్రమే ఉన్నారని, భారతీయ గ్రామీణ ఆరోగ్య పథకం  నిబంధనల ప్రకారం  ఫార్మాసిస్టులు 13.3% మాత్రమే  ఉన్నారు,  అన్ని ప్రాథమిక ఆరోగ్య  కేంద్రాల్లో నర్సుల అవసరం కాగా ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక నర్సు  ఉన్నప్పటికీ 86.6% నర్సుల కొరత ఉందని ప్రిసీలకు ల బృందం గుర్తించింది. ప్రతి ఆరోగ్య కేంద్రం లో ఒక ఆరోగ్య కార్యకర్త ఉండాలి. అయితే అందులో 13.3% తక్కువ ఉన్నారన్న విష్యాన్ని పరిశీలక బృందం గుర్తించింది. 93.33% ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నాల్గవ తరగతి ఉద్యోగుల నేరుగా భర్తీ చేసిందని తెలిపారు. ఐ పి హెచ్ సి ప్రమాణాలకు అనుగుణంగా 24/7 ఘంటలు వైయ సిబ్బంది ఇద్దరు డాక్టర్లు అందు బాటులో ఉండాలి, లేదా ముగ్గురు  నర్సులు  ఉండాలి, ఒక ల్యాబ్  టెక్నీషియన్ ఉండాలి, 9, 183 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, 35,.8%  ల్యాబ్ టెక్నీషియన్స్ లేరు, 4,744 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఫార్మా సిస్ట్లు లేరు.  ఇవి ప్రాథమిక ఆరోగ్య  కేంద్రాల పై సమీక్షించింది. కనీస మౌలిక సదుపాయాలు లేని ప్రధామిక ఇబ్బంది  కొరత ఉన్నట్లు  ఐ పి హెచ్ ఎస్  పరిశీలనలో వెల్లడించారు.  గ్రామీణ ప్రాంత్సలలో ఇబ్బదులు పడుతున్న చోట్ల వైద్య ప్రమాణాలు  పాటించడం సాధ్యమేనా? దీని పై భారతీయ గ్రామీణ  పధకం కింద ఐ పి హెచ్ ఎస్ మిషన్ నెల్లూరు  లో  నిర్వహించిన సమీక్ష రేపోర్టు చూద్దాం.                                                                       నెల్లూరు లోని వివిధ వర్గాల నుండి  సేకరించిన సమాచారం ఆధారంగా నెల్లూరు జిల్లాలోని మూడు డివిజన్ లో ని గూడూరు, నెల్లూరు, కావలి . డివిజన్ లలో ని 25% ప్రాథమిక ఆరోగ్య  కేంద్రల ను ఎంపిక చేశారు. ప్రతి డివిజన్ నుంచి 5 ఆరోగ్య కేంద్రాల ఎంపిక చేసినట్లు అధికారుల బృందం పేర్కొంది. అందులో ర్యాండమ్ కింద 15 ఆరోగ్య కేంద్రాల  ఎంపిక చేశామన్నారు.  అందులో ఏ ఎస్ పెటా, మొహమ్మద్ పురం, వారి గోండా, పొదలకూరు, మహిమలూరు, కాగా గూడూరు డివిజన్ లో ఓజిలి, రామాపురం, కోటా, గిద్దలూరు, పెన్నా డు, కావాలి నుండి రామ తీర్ధం, మర్రిపాడు,  ఎల్లయ్య పాలెం, జల ఢంకి, మరియు యెస్ ఆర్ పురం, లో ఉన్న ఆరోగ్య కేంద్రాలను  ఎంపిక చేశారు. రెండు సంవత్సరాల పరిశీలన తర్వాత ఆగష్టు 2010 – జూన్ 2012 వరకు నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య  అదికారి తోపాటు వై ద్య అధికారులతో సమీక్షించారు.                                                              ఐ పి హెచ్ సి నిబంధనల ప్రకారం 24/7 గంటల లో కనీసం 2 ఇద్దరు డాక్టర్లు అందుబాటులో ఉండాలి. లేదా ముగ్గురు నర్సులు ఒక ల్యాబ్  టెక్నీషియన్  ఉన్నారా అంటే లేరని సమాచారం ఉంది. 9,183 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 35.8% ల్యాబ్ టెక్నీషియన్ ఉండాలి, 4,744 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 18.4% ఫార్మాసిస్టులు లు లేరు. అంటే  కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐ పి హెచ్ సి మిషన్ లో కొన్ని ఆసక్తికర అంశాలు తెలిసాయి. 100%  కేంద్రాల్లో ఒక్క డాక్టర్ మాత్రమే ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.   దేశంలో  ఉన్న ప్రధాన నగరాలు ఈ  పరిస్థితి ఉంటే ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉందో ఊహించడం  కష్టం. అసలు రాష్ట్రాలు ఏదో చూద్దాం.                                                                దేశం లో  త్వరిత గతిన అభివృద్ధి సా దిస్తున్న నగరాలు చెప్పుకోదగ్గది గుజరాత్, దేశ ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత ఇష్టమైన నగరాలు గుజరాత్ ఒకటి ఇక్కడ మొత్తం 600 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉంటే 100% అంటే 1392 కేంద్రాల్లో ఒక్క డాక్టర్ మాత్రమే ఉండడం ఆశ్చ్ర్యన్ని కలిగిస్తోంది. దక్షిణాది లోని మరో రాష్ట్రం కర్ణాటక 2,359 రాష్ట్రాల్లో 1,973 ఆరోగ్య కేంద్రాల్లో ఒక్క డాక్టర్  మాత్రమే ఉండటం గమనార్హం. అంటే 83.6% మాత్రమే.  ద్దేశం లో ఒక డాక్టర్ తో నడుస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో   కర్ణాటక 5వ స్థానంలో ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. .  కేరళలో 83.6%     గుజరాత్ , సిక్కిం ,హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 84% ఒక్క  డాక్టర్ తోనే ఆరోగ్య కేంద్రాలు పని చేస్తున్నట్లు సమాచారం. సిక్కిం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో 84%87% మిజోరంలో చాలా తక్కువ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు  మాత్రమే పని చేస్తున్నాయని సమాచారం.                                                    దేశంలో ఉన్న ప్రాధమికా ఆరోగ్య  కేంద్రాల పని తీరులో మెరుగైన సేవలు అందిస్తున్న వాటిలో తమిళ నాడు, మహారాష్ట్రలు మాత్రమే అని భారతీయ గ్రామీణ ఆరోగ్య పథకం మిషన్ లెక్కలు కట్టింది. తమిళ్ నాడు లో 1,362 ప్రాధమికా ఆత్రోగ్య కేంద్రాలలో 14.4%మహారాష్ట్రలో 1, 814  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 23.8% తో ఒక్క డాక్టర్ మాత్రమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నడపడం విశేషం.దీనికి తోడు పబ్లిక్ హెల్త్ పరిశోధనలు సిల్వియా కర్పగం చెప్పిన సమాచారం ప్రకారం 61% ప్రాథమిక ఆరోగ్య  కేంద్రంలో  ఒక డాక్టర్ తో మాత్రమే నడుస్తున్నాయి ఆమె  తెలిపారు.                                     ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తీరు పై విశ్లేషకుల అభిప్రాయం లేదా  వన్ టూ వన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్ ద్వ్రా రా అభిప్రాయ సేకరణ జరగాలి. దేశంలో   6% ప్రజలకు తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలు అందించే  సామర్థ్యం కేవలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే . ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు నేరుగా సంప్రదించి వీలుంటుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మాత్రమే  నివారణ అవగాహన , చికిత్స, మరియు పునరావాసం ఆరోగ్య రక్షణ ఇవ్వగలరు ఆరోగ్య కేంద్రలే, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్లక్ష్యం చేయడం అంటే ప్రైవేట్ రంగం లో  వైద్య  రంగాన్ని  విస్త్గ రించేందుకే అని సిల్వియా అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గ్రామీణ ప్రజల ఆరోగ్య అవసరాలు తీరుస్తాడు. కేవలం అత్యంత తీవ్ర అనారోగ్యం దీర్ఘకాలిక  అనారోగ్య సమస్యలకు జిల్లా ఏరియా ఆసుపత్రులు సౌకర్యం ఉన్న చోట్ల రోగులను పంపుతారు కొన్ని అంశాలు ఆర్ధిక నిధులు, కేటాయింపు ల తో కూడు కున్నందున ఆరోగ్య రక్షణ అంశం ఇందులో ఉన్నందున ప్రాథమిక ఆరోగ్య రంగం నూతన్ రూపు దిద్దుకోవాలని గ్రామీణులకు మెరుగైన నాణ్యమైన వైద్యం అందించాలని సామాన్యుడు కోరుకుంటున్నారు.  అయితే ప్రాథమిక  ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లకు రక్షణ  లేదు.  స్థానిక రాజకీయ నాయకుల జోక్యం ప్రధాన కారణాలుగా విశ్లేషించారు. అందుకే డాక్టర్లు పట్టణ పల్లె ప్రాంతాలకు వెళ్లేందుకు మొగ్గు చూపడం లేదని అనుకుంటున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు టెలీ  మెడిసిన్ కు అనుసంధించని నిపుణులు సూచించారు. టెలీ మెడిసిన్ ను అనే సాధించడం సాధ్యం? అన్నది సందేహమే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితి అంటే కరోనా రెండోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రాథమిక   ఆరోగ్య కేంద్రం లో సాంకేతిక పరిజ్ఞానం అందించడం. ఎంతో కీలకం అయితే నిధులు కేటాయించడం ఎంత ముఖ్యమో  పి హెచ్ సి ల నిర్వహణ చేయడం మౌలిక సదుపాయాల కల్పన అత్యవసరం.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రివేతీకరించాద్దని కోరుకుంటున్నాం.

ఏయూలో  65 మందికి కరోనా.. హాస్టల్స్ మూసివేత

ఆంధ్రప్రదేశ్ లో  కరోనా పంజా విసురుతోంది. తాజాగా విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో కరోనా కలకలం రేగింది. వర్సిటీకి చెందిన ఇంజినీరింగ్ కాలేజీలో 65 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ క్యాంపస్ లో మొత్తం 15 వందల మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఇప్పటివరకు వచ్చిన పరీక్షల్లో 65 మందికి వైరస్ సోకింది. కరోనా సోకిన వారిని ఐసోలేషన్ కు తరలించారు వైద్యాధికారులు.  విద్యార్థులకు కరోనా సోకడంతో ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్ లో హాస్టళ్లను మూసివేశారు. యూనివర్శిటీ పరిధిలోని పలు కాలేజీలు తమ విద్యార్థులకు ఆన్ లైన్ లో పాఠాలు బోధించాలని నిర్ణయించాయి. ఏయూ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏయూ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్, ఏయూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా, ఏయూ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ విభాగాలు ఆఫ్ లైన్ నుంచి ఆన్ లైన్ బోధనకు మారాలని వర్సిటీ రిజిస్ట్రార్ వి.కృష్ణమోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏయూలో కరోనాపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని వెంటనే స్పందించారు. జిల్లా ప్రధాన వైద్యాధికారి డాక్టర్ సూర్యనారాయణను అడిగి ఏయూలో కరోనా వ్యాప్తి వివరాలు తెలుసుకున్నారు.వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. విశాఖ జిల్లాలో నిత్యం 7 వేలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని... పాడేరు, అరకు, కేజీహెచ్, అనకాపల్లి, నర్సీపట్నం, విమ్స్ ఆసుపత్రుల్లో కొవిడ్ వార్డులు ఏర్పాటు చేశామని, 1000 బెడ్లు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు.  ఆంధ్రప్రదేశ్ పై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతోంది. కొత్త కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. గత 24 గంటల్లో 42,696 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా... 947 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 180 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో విశాఖ జిల్లా (156), గుంటూరు జిల్లా (145) ఉన్నాయి. 

మీ నిధులు మీ ఇష్టం.. సర్పంచులకు మనీ పవర్ .. 

గ్రామ పంచాయితీ నిధుల తాళాలు సర్పంచులకే. ఇక సర్పంచులకు పండగ స్టార్ట్ అయితుంది. నిధులు వాడడంలో ఇకపై ఎవరి ఆమోదం లేదు. గ్రామానికి వారే రాజులూ.. వారే మంత్రులు. గ్రామ పంచాయతీల నిధులను, పై అధికారుల అనుమతి లేకుండానే, ఆయా గ్రామలోని ప్రజలు, పంచాయితీల తీర్మానం మేరకే నిధులు ఖర్చు చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. శనివారం దీనికి సంబంధించి ప్ర‌భుత్వం జీవో 91 ని జారీ చేసింది. ఇక నుంచి స్థానిక అవసరాల మేరకు నిధులను ఖర్చుచేసుకునే దిశగా పంచాయతీలకు హక్కు లభిస్తుంది. గ్రామ నిధులకు కేటాయించిన నిధులు దుర్వినియోగం చెయ్యకుండా గ్రామ స‌భ ఆమోదం మేర‌కు గ్రామ అవ‌స‌రాల‌కు గ్రామంలో ఉన్న పనులు పూర్తి  చేప‌ట్టాల్సి ఉంటుంది. ఆయా ప‌నుల‌న్నీ నిబంధ‌న‌ల మేర‌కు మాత్ర‌మేగాక‌, ఆ ఆర్థిక సంవ‌త్స‌ర కేటాయింపుల‌కు మించ‌కుండా మాత్ర‌మే ఖ‌ర్చు చేయాల‌ని ప్ర‌భుత్వం ఆ జీవోలో తెలిపింది.  ఈ జీవో రావ‌డం వ‌ల్ల ఇప్ప‌టికే ప‌ల్లె ప్ర‌గ‌తి, పారిశుద్ధ్యం, ప‌చ్చ‌ద‌నం మ‌రింత‌గా ప‌రుగులు పెడ‌తాయ‌ని రాష్ట్ర పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు . వెంట‌నే జీవో జారీ చేసిన ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు కి మంత్రి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ జీవో ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయ‌తీల స‌ర్పంచ్ లు, ఉప స‌ర్పంచ్ లు, వార్డు స‌భ్యులు, ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. భారతదేశంలో ఎక్క‌డ లేని విధంగా ప‌ల్లె ప్ర‌గ‌తి చేప‌ట్టిన సీఎం, ఈ జీవో తో గ్రామాలు మ‌రింత వేంగంగా అభివృద్ధి చెంద‌డానికి వీలు క‌లుగుతుంద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి అన్నారు. ఎక్క‌డ ఎలాంటి వివాదాల‌కు తావు లేకుండా, నిధుల దుర్వినియోగం జ‌ర‌గ‌కుండా, ప‌నులు నాణ్యతతో జ‌రిగే విధంగా గ్రామ‌ పంచాయ‌తీల బాధ్యులు న‌డుచుకోవాల‌ని ఆయ‌న సూచించారు.       

కరోనాకు హైదరాబాద్ నుంచే మరో టీకా! 

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ టీకాకు భారీగా డిమాండ్ వస్తోంది. దాదాపు 40 దేశాలు కోవాగ్జిన్ కోసం ఆర్డర్లు ఇచ్చాయి. అయితే కరోనా వ్యాక్సిన్ల తయారీలో కేంద్ర బిందువుగా మారిన హైదరాబాద్‌ నుంచి మరో టీకా త్వరలో అందుబాటులోకి రానుంది. నోరు, ముక్కు ద్వారా చుక్కల రూపంలో అందించే వీలున్న ‘నియోకోవ్‌’టీకా హైదరాబాద్ లోనే తయారు కాబోతోంది.  నియోకోవ్ టీకాను ఉత్పత్తి చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన నియోడెల్‌ ఫార్మా కంపెనీ, అమెరికాలోని అట్లాంటాకు చెందిన ఎమోరి విశ్వవిద్యాలయం నుంచి పేటెంట్స్‌ పొందింది. మశూచీ టీకాల తయారీకి ఉపయోగిస్తున్న మాడిఫైడ్‌ వ్యాక్సినా అంకారా సాంకేతిక పరిజ్ఞానంతో నియోకోవ్‌ తయారుకానుంది. అమెరికా-భారత్‌ ఉమ్మడి సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వ్యాక్సిన్‌ను సిద్ధం చేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. మిగిలిన టీకాలకు భిన్నంగా ఇది వైర్‌సను ఎక్కువకాలం పాటు సమర్ధంగా అడ్డుకుంటుందని నియోడెల్‌ కంపెనీ సారథి డాక్టర్‌ కె. కోటేశ్వరరావు తెలిపారు. నియోకోవ్ టీకా ఇచ్చినప్పుడు 7 నుంచి 10 రెట్లు అధికంగా ప్రతిరక్షకాలు విడుదలవుతున్నట్లు జంతువులపై నిర్వహించిన ప్రయోగ పరీక్షల్లో నిర్ధారణ అయిందని చెప్పారు. కరోనా వైరస్‌ కొత్త వేరియంట్లను దారికి తెచ్చేందుకు వీలుగా హెల్పర్‌ సెల్స్‌గా పిలిచే ‘సీడీ 4’, కిల్లర్‌ సెల్స్‌గా పిలిచే ‘సీడీ 8’ రక్షకాలు నియోకోవ్‌ టీకాకే ప్రత్యేకం.  వైరస్‌ ఏ రూపంలో దాడి చేసినా ఈ కిల్లర్‌ టీ సెల్స్‌ అడ్డుకోవడంతో పాటు వైరస్‌ మరోసారి దాడి చేయకుండా కూడా రక్షణ కల్పించనున్నాయి. 2022 మే నాటికి నియోకోవ్ టీకా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. 2022లో  5.6  కోట్ల డోసులు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2023 నాటికి 600 కోట్ల డోసులు ఉత్పత్తి చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ వాక్సిన్‌ ముక్కు ద్వారా అయితే ఒక చుక్క, నోటి ద్వారా అయితే రెండు మూడు చుక్కలు వేసుకుంటే సరిపోతుంది. నియోకోవ్ టీకాలన్నింటినీ దేశ ప్రజల అవసరాలకే అందిస్తామని డాక్టర్‌ కె. కోటేశ్వరరావు చెప్పారు.  నియోకోవ్ టీకా ధర కూడా 140 రూపాయలే.  నియోడెల్‌ ఫార్మా కంపెనీ అధినేత డాక్టర్‌ కె. కోటేశ్వరరావు ఏలూరు సమీపంలోని దెందులూరు వాసి. బ్రిటన్‌లో విస్తృతంగా పరిశోధనలు నిర్వహించారు. ఆ దేశ ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వహించిన ఆయన, జన్యుమార్పిడి చేసిన హెపటైటిస్‌-బి వ్యాక్సిన్‌ను భారత్‌కు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఈయనతో ఎమోరి విశ్వవిద్యాలయంలోని మైక్రోబయాలజీ, ఇమ్యూనాలజీ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన ప్రొఫెసర్‌ అమర రామారావు జత కలిశారు. డాక్టర్‌ రామారావు ఎయిడ్స్‌, ఎబోలా, సార్స్‌ వ్యాధులపై రెండు దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. ఆయన సారథ్యంలో నిర్వహించిన పరిశోధనల నుంచి నియోకోవ్‌ టీకా రూపుదిద్దుకుంది. 

రాజన్న రాజ్యమంటే ?

ఒకప్పుడు జగనన్న వదిలిన బాణం అంటూ రాజకీయ పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిల, ఇప్పుడు రాజన్న రాజ్యం అంటూ కొత్త జెండా పట్టుకుని తెలంగాణలో రాజకీయ యాత్రకు సిద్ధమయ్యారు.రాజకీయాలలోకి ఎవరైనా రావచ్చును, అలాగే ఎవరైనా ఇంటికో పార్టీ,కాదంటే  రెండు, మూడు పార్టీలు పెట్టుకోవచ్చును.అన్న జగన్’లానే సోదరి షర్మిల, బ్రదర్ అనీల్ కూడా ఎవరి పార్టీ వారు పెట్టుకుంటే పెట్టుకోవచ్చును. అందుకు ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఉండవలసిన అవసరమూ లేదు. అయితే, ఆమె చెపుతున్న రాజన్న రాజ్యం అంటే ఏమిటి? ఇదీ ఇప్పుడు తెలంగాణ ముందున్న ప్రశ్న. షర్మిల సమాధానం చెప్పవలసిన ప్రశ్న. బ్రాడ్’గా రామన్న రాజ్యం అంటే, దివంగత ముఖ్యమంత్రి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరేడేళ్ళ పాలన కావచ్చును. వైఎస్స్ పాలనలో, అప్పుడైనా, ఇప్పుడైనా, ఎవరైనా గొప్పగా చెప్పుకునే  విశేషాలు, ఆయన పాలనలో ప్రజలకు జరిగిన మేళ్ళు ఏవైనా ఉన్నాయంటే, అందులో మొదటిది జలయజ్ఞం, రెండవది ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు.జలయజ్ఞం  విషయమే తీసుకుంటే, అందులో ఎన్నెన్ని అవకతవకలు జరిగాయో, ఎంతెంత అవినీతి చోటు చేసుకుందో వేరే చెప్పనక్కర లేదు. జలయజ్ఞంలో మొదలైన అవినీతి ఆ తర్వాత శాఖోపశాఖలుగా విస్తరించి, క్విట్ ప్రో కో (నీకింత నాకింత)గా విశ్వవ్యాపితం అయింది. ఈ ‘క్విట్ ప్రో కో’ మొత్తం విలువ వందల కోట్లా, వేల కోట్లా అన్నది పక్కన పెడితే, ఇందుకు సంబదించి ఇంచుమించుగా ఓ డజను వరకు క్రిమినల్ కేసులు, సిబిఐ, ఈడీ విచారణలో  ఉన్నాయి. ఈ అన్ని కేసుల్లోను, ‘జగనన్న’ ముద్దాయిగా ఉన్నారు. చాలావరకు కేసుల్లో ‘ఏ వన్’ ముద్దాయిగానూ ఉన్నారు. సుమారు రెండు సంవత్సరాలకు పైగా వారం వారం,ప్రతి శుక్రవారం కోర్టు మెట్లు ఎక్కారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని, కోర్టు హాజరు నుంచి మినహాయింపు పొందుతున్నారు, కానీ, ఆయన అక్రమాస్తుల కేసుల విచారణ ఆగలేదు. అంతే కాదు, ఆయన 16 నెలలు జైలు జీవితం అనుభవించారు.ఆయన అక్రమ సంపదగా గుర్తించిన కోట్ల రూపాయల ఆస్తులను విచారణ సంస్థలు జప్తు చేయడం జరిగింది. ఇప్పుడు షర్మిల తెస్తానంటోంది, ఆ రాజన్నరాజ్యమేనా? క్విట్ ప్రో కో, సూట్ కేసు’కంపెనీలు వంటి అపరిచిత నేర పదకోశాన్ని సామాన్య ప్రజలకు కూడా చేరువ చేసిన రాజన్నరాజ్యమేనా, షర్మిల మళ్ళీ తెస్తానంటోంది? నిజం అవునో కాదో, కానీ, క్విట్ ప్రో కో’ వాటాల పంపకంలో వచ్చిన తకరారు కారణంగానే, షర్మిల ఇటు నుంచి నరుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారన్న మాట కూడా లేక పోలేదు. తెలంగాణలో కుంపటి రాజేసి, ఏపీ సర్కార్ ‘కు సెగ పెట్టె ఆలోచన తోనే ఆమె ఇక్కడ ఇటు నుంచి ఆట మొదలు పెట్టారని, అక్కడ, ఇక్కడ కూడా వినవస్తోంది.   అదలా ఉంటే వైఎస్సార్  గొప్పల ఖాతాలో మరీ గొప్పగా పేర్కొనే జలయజ్ఞం, తెలంగాణకు చేసిన మేలేంటి? తెలంగాణ ఉద్యమం మూడు మూల మంత్రాలు (నీళ్ళు, నిధులు, నియామకాలు) నుంచి మొదటి మంత్రం నీళ్ళు’ తొలిగి లేదు.నిజానికి, వైఎస్సార్ ఆరేడేళ్ళ పాలనలో కంటే, రాష్ట్ర విభజన అనంతరం గడచిన ఆరేడేళ్ళ కేసీఆర్  పాలనలో, కాళేశ్వరం సహా అనేక సాగు నీటి ప్రాజక్టుల నిర్మాణం వేగంగా సాగుతోంది. అంతే కాదు,ఇప్పటికే కోటి ఎకరాలు కాకపోయినా ఎంతో కొంత మేరకు, ఎన్నోకొన్ని ఎకరాలకు నీరు అందుతోంది. కోనసీమ కళ కొంచెంగా అయినా, అక్కడక్కడా కనిపిస్తోంది. మరి అలాంటప్పుడు, ‘రాజన్న రాజ్యం’ పేరిట షర్మిలమ్మ తెచ్చేదేమిటి?  క్విట్ ప్రో కో, పాలననా,లేక బ్రదర్ అనీల్ ప్రవచించే క్రైస్తవ రాజ్యమా? ఇక వైఎస్సార్ జనాలకు చేసిన మేళ్ళు, సంక్షేమ పథకాల విషయానికి వస్తే, ఆయన ప్రవేశ పెట్టిన పథకాలలో కొన్ని ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వానికే, జగనన్న పాలిస్తున్న పొరుగు రాష్ట్రం ఎపీలోనూ ప్రభుత్వాలకు గుడి బండగా మారాయి. చివరకు, జగనన్న తెచ్చిన రాజన్న రాజ్యంలో, బొక్కలు బయట పడతాయనే భయంతో బడ్జెట్’ ప్రవేశ పెట్టలేని దౌర్భాగ్య స్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారింది. కానీ, తెలంగాణ ప్రభుత్వం పాత పథకాలను అంతగా పక్కన పెట్టలేదు. అంతే కాకుండా, రైతు బంధు,కళ్యాణ లక్ష్మీ, వంటి కొన్ని కొత్త పథకాల తెరాస ప్రభుత్వం అమలు చేస్తోంది. గీత దాటిన సంక్షేమం ఆర్థిక వ్యవస్థకు ఆరోగ్యకరం కాదు,ఇప్పుడు ఏపీ ఎదుర్కుంటున్న సంక్షేమ సంక్షోభం రేపు, తెలగానా తలుపు తట్టవచ్చును.    అయినా ఆ విషయాన్నిఅలా ఉంచితే,సంక్షేమ పథకాల అమలులో తెలంగాణా నెంబర్ వన్’ అని ప్రభుత్వం చెప్పుకుంటోంది. అందులో కొంత నిజం, కొంచెం అబద్ధం అయితే కావచ్చును కానీ, సంక్షేమ రంగంలో ఇప్పుడు షర్మిల వచ్చి కొత్తగా చేసేది, ఏదీ లేదు. ఈ ప్రభుత్వం అని కాదు, అని ప్రభుత్వాలు సంక్షేమం పేరిట పేదల పేదరికాన్ని పెంచి పోషించి, ఓటు బ్యాంకు క్రియేట్ చేసుకుంటున్నాయి. సో, ఇప్పుడు షర్మిల వచ్చిన జనాలకు చేసే మేళ్ళు ఏమున్నాయి. అందుకే షర్మిల చెపుతున్న రాజన్న రాజ్యంఅంటే ఏమిటి? ఇది ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న,  షర్మిల సమాధానం చెప్పవలసిన ప్రశ్న.

కేటీఆర్ ను ఉరి తీయాలి! తీన్మార్ మల్లన్న సంచలనం 

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో అధికార పార్టీకి చుక్కలు చూపించిన తీన్మార్ మల్లన్న... దూకుడు మరింత పెంచారు. ఉద్యోగం రావడం లేదన్న బెంగతో ఆత్మహత్యా యత్నం చేసిన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సునీల్ ను ఎంజీఎంలో పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు తీన్మార్ మల్లన్న. నిరుద్యోగులకు అన్యాయం చేసిన మంత్రి కేటీఆర్‌ను హన్మకొండ చౌరస్తాలో ఉరితీయాలని అన్నారు.  సీఎం కేసీఆర్ ఉద్యోగం పొగొడితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. సునీల్‌ను వెంటనే కార్పొరేట్ ఆస్పత్రికి తరలించాలని తీన్మార్‌ మల్లన్న డిమాండ్ చేశారు.  ఉద్యోగం రావడం లేదన్న బెంగతో కాకతీయ యూనివర్సిటీ సాక్షిగా మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం గుండేంగ తేజవత్‌రామ్‌సింగ్‌ తండాకు చెందిన కేయూ విద్యార్థి బోడ సునీల్‌నాయక్‌ పురుగుల ముందు తాగి శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్నేహితులు వెంటనే సునీల్‌ను వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కేయూలో తీవ్ర దుమారం రేపుతోంది. విపక్ష పార్టీల నేతలు ఎంజీఎంకు వెళ్లి సునీల్ ను పరామర్శించారు.  ఎంజీఎంలో చికిత్స పొందుతున్న సునీల్‌ను వైఎస్ ష‌ర్మిల అనుచ‌రులు ప‌రామ‌ర్శించారు. అండగా ఉంటామని అతనికి హామీ ఇచ్చారు. అక్క వ‌స్తోంది..అన్ని క‌ష్టాలు తీరుతాయని సునీల్‌కు ష‌ర్మిల అనుచ‌రులు భ‌రోసా ఇచ్చారు. 

ఆధార్ ఉంటేనే.. ఊర్లోకి ఎంట్రీ..

ప్రయాణించాలంటే టికెట్ ఉండాలి. పెన్షన్ కావాలంటే ఆధార్ కార్డు ఉండాలి. మన కులం  ఏదో తెలియాలంటే కాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి. ఇతర  దేశాలకు వెళ్లాలంటే పాస్ పోర్ట్, వీసా ఉండాలి.. అంతకంటే ముందు మనీ కూడా ఉండాలి.. కానీ తెలంగాణలో ఓ  గ్రామంలోకి కొత్తవాళ్లు అడుగుపెట్టాలంటే కూడా తప్పకుండా ఆధార్ ఉండాల్సిందే.. ఆధార్ కార్డు లేకుంటే ఆ ఊరు కాదుకదా. గ్రామ పొలిమేర‌ కూడా దాటలేరు. ఆ ఊరిలో ఎవరింటికి అయినా చుట్టాలు ఆధార్ లేకుంటే వస్తే.. తిరిగి వచ్చినా దారినే యూటర్న్ తీసుకోవాల్సిందే. అది ఐస్ క్రీమ్ అమ్మేవాడైన, కూరగాయలు అమ్మేవాడైన, కూలికి వచ్చినా వాడైనా సరే మూడు ఐడి కార్డు ఇచ్చి గ్రామంలోకి వెళ్ళాలి మళ్ళీ తిరిగివెళ్ళటప్పుడు ఐడి కార్డు తీసుకోవాలి. అదే ఆ గ్రామ శాసనం. గ‌త ప‌దేళ్లుగా ఈ క‌ట్టుబాటును కొనసాగిస్తున్నారు ఆ గ్రామ ప్రజలు.  ఏంటి.. ? నాకు తెలిసి అసలు అలాంటి ఊర్లు ఇంకా ఉన్నాయా అని అనుకుంటున్నారా? ఉంటే ఎక్కడ ఉంది..? ఆ ఊరి పేరు ఏంటి? అని తెలుసుకోవాలనుకుంటున్నారా.. అసలు ఆ గ్రామస్తులు ఈ కట్టుబాట్లు ఎందుకు ఫాలో అవుతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా. అయితే మీరే చదవండి.  కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్ద పొతంగల్ గ్రామంలో 2,500 జనాభా ఉంది. పదేళ్ల క్రితం ఓ దొంగ బాబా ఒళ్లంతా వీభూతి, కాషాయం బట్టలు వేసుకుని ఊరిలో వ‌చ్చాడు. గ్రామ‌స్తులు వ్య‌వ‌యంపై ఆదార‌ప‌డి జీవించేవారు.. అయితే మధ్యాహ్నం గ్రామంలో ఇళ్ల‌కు తాళాలు వేసి, పొలం పనుల‌కు వెళ్లారు. ఆ స‌మ‌యంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న వారిని గమనించి మాట‌ల‌తో ఓ వ్యక్తిని నమ్మించాడు. బంగారాన్ని పూజ చేసి అంతకు అంత చేస్తానని న‌మ్మ‌బ‌లికాడు. దీంతో బాబా మాయమాటలు నమ్మిన ఆ వ్యక్తి ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసుకు వ‌చ్చి బాబా చెప్పిన‌ట్టు చేసారు. ఆ దొంగ బాబా త‌న ప‌ని పూర్తి చేసుకుని అక్క‌డి నుండి బయటపడ్డాడు. అతడు తేరుకుని చూడ‌గా బంగారం లేదు. ఆ బాబా లేడు. ఆ తర్వాత బాబా కోసం ఎక్కడ వేతికినా ఆచూకీ తెలియలేదు. ఆప్ప‌టి నుంచి ఆ గ్రామ‌స్తులు  ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. తమ గ్రామంలోకి ఎవ‌రు వ‌చ్చిన ముందు గ్రామ‌పంచాయితీ వ‌ద్ద వారి ఆధార్ కార్డు ఇచ్చినా త‌రువాతే గ్రామంలోకి రావాలి లేదంటే ఎంతటి వారైన తిరిగి పంపాల‌ని క‌ట్టుబాటు పెట్టుకున్నారు. పెద్ద పొతంగల్​ గ్రామంలోకి రాగానే ముందుగా పంచాయితీ కార్య‌ల‌యం దగ్గర ఉన్న చెట్టు కింద మార్నింగ్ నుంచి నైట్ వరకు గ్రామస్తులతో పాటు పంచాయితీ వారు​ కూర్చొని​ ఉంటారు. కొత్త వ్యక్తి కనిపించగానే ఊరు, పేరు, ఎక్కడికోసం వచ్చాడు, ఎవరికోసం వచ్చాడు అని అన్నీ విష‌యాలు ఆరాతీసారు. ఆధార్​ కార్డు తీసుకున్న త‌ర్వాత ఊళ్లో అడుగుపెట్టనిస్తారు.  గ్రామంలోకి కూర‌గాయ‌లు అమ్మ‌డానికి వ‌చ్చినా.. ఐస్ క్రింమ్ అమ్మేవారు వ‌చ్చినా గ్రామ పంచాయ‌తీ కార్యాలయంలో ఐడి ఇచ్చి తిరిగి గ్రామంలో నుంచి వెళ్లే స‌మ‌యంలో వారి ఐడీ వారు తిసుకోని వెళ్లాల్తారు. ఈ నిబంధన అమ‌లు చేసిన‌ప్ప‌టి నుంచి గ్రామంలో ఎలాంటి దొంగ‌త‌నాలు, మోసాలు జ‌రుగ‌డం లేద‌ని గ్రామాస్తులు చెబుతున్నారు.  

ఏపీకి ముగ్గురు ముఖ్యమంత్రులు! సచివాలయంలో చర్చ 

ఎక్కడైనా రాష్ట్రానికి ఒకరే ముఖ్యమంత్రి.. డిప్యూటీ సీఎంలు మాత్రం ఎంతమందైనా ఉండొచ్చు.. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రికి అదనంగా పవర్ ఉండదు. సామాజిక సమీకరణల కోసం అలా నియమిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో డిప్యూటి ముఖ్యమంత్రి పదవులను పెంచేస్తున్నారు పాలకులు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కొత్త చర్చ సాగుతోంది. ఏపీలో అధికారికంగా ఒక్కరే ముఖ్యమంత్రి ఉన్నా.. అనధికారికంగా ముగ్గురు ముఖ్యమంత్రులున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒకరేమో రాజకీయ ముఖ్యమంత్రి, మరొకరు అధికారులకు ముఖ్యమంత్రి, ఇంకొకరేమో సచివాలయ అధికారులు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి అట. సిఎంవో కార్యాలయ ఇంఛార్జి అధికారి ప్రవీణ్‍ ప్రకాష్‍ను తమ ముఖ్యమంత్రిగా ఐఎఎస్‍ అధికారులు చెప్పుకుంటున్నారట. ఐఏఎస్ లకు సీఎం అపాయింట్ మెంట్ దొరకడం లేదట. ముఖ్యమంత్రిని కలవాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా.. వీలు కాకపోవడంతో వారంతా ఇక ఆ ప్రయత్నాలే చేయడం మానుకున్నారట. సీఎంవో ఇంచార్జ్ ప్రవీణ్‍ ప్రకాష్‍ను కలిసి తమ అభిప్రాయాలు చెప్పుకుంటున్నారట. తమ శాఖపరమైన అంశాలను కూడా ఆయనతోనే చర్చిస్తున్నారట. ప్రవీణ్ ప్రకాశ్ ను కలిస్తే ముఖ్యమంత్రిని కలిసినట్టేనన్న భావనలో ఐఏఎస్ లు ఉన్నారంటున్నారు. అందుకే ఐఏఎస్ లకు ప్రవీణ్ ప్రకాషే ముఖ్యమంత్రి అన్న చర్చ సచివాలయంలో జరుగుతోంది.  సచివాలయ అధికారులు, ఉద్యోగులకు...  సచివాలయ ఉద్యోగ సంఘ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి ముఖ్యమంత్రి అని పలువురు చెబుతున్నారు. సచివాలయంలో బదిలీలు, పోస్టింగ్‍లన్నీ వెంకటరామిరెడ్డి కనుసన్నల్లోనే జరుగుతున్నాయట. ప్రాధాన్యత కీలక శాఖలలో పోస్టులు కావాలన్నా ఎవరినైనా బదిలీ చేయాలన్నా వెంకటరామిరెడ్డిని స్వయంగా కలిస్తే.. ఆగమేఘాలపై బదిలీలు జరుగుతాయట. పోస్టింగ్‍లు కూడా ఇస్తున్నారని ఉద్యోగులు అంటున్నారు.వెంకటరామిరెడ్డికి ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆశీస్సులు ఆయనకు ఉన్నాయంటున్నారు. అందుకే సచివాలయంలో ఆయన సూపర్ బాస్ లో మారారనే చర్చ సాగుతోంది.  అనధికారిక ముఖ్యమంత్రులుగా ప్రచారం జరుగుతున్న ప్రవీణ్‍ ప్రకాష్‍, వెంకటరామిరెడ్డిలు ముఖ్యమంత్రి జగన్‍రెడ్డికి అత్యంత సన్నిహితులే.  అందుకే ప్రవీణ్‍ ప్రకాష్‍, వెంకటరామిరెడ్డిని కలిస్తే.. పనులు చక్కపెట్టుకోవచ్చని ఐఎఎస్‍ అధికారులతో పాటు సచివాలయ క్రింది స్థాయి అధికారులు, ఉద్యోగులు నమ్ముతున్నారట. ఈ విషయాలన్నీ అసలు ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డికి తెలుసో తెలియదో కానీ సచివాలయంలో కొసరు ముఖ్యమంత్రి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని టాక్. ఈ విషయాలు త్వరలో సిఎం జగన్‍ దృష్టికి తీసుకెళ్లేందుకు రంగం సిద్దమవుతోందని తెలుస్తోంది. ముఖ్యమంత్రితో బాగా పరిచయం ఉన్న అధికారులు అసలు విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని అధికార వర్గాల సమాచారం. సచివాలయంలో జరుగుతున్న బాగోతంపై ముఖ్యమంత్రి జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.. 

కరోనా కలకలం.. కర్ఫ్యూ  

కరోనా సెకండ్ వేవ్ ఇన్నింగ్ ఊపందుకుంది. దాని  కారణంగా ఈ ఆదివారం నుంచి రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ అమలు రానుంది. మాల్స్‌ని రాత్రి 8 గంటలకే కట్టేయాలని ఆదేశించారు. రోజురోజుకూ కరోనా కేసులు విపరీతంగా పుంజుకోవడంతో కర్ఫ్యూ కి మించిన మార్గం మరొకటి కనిపించట్లేదని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కార్యాలయం తెలిపారు. రోజూ రాత్రి 8 గంటలకు మూతపడే షాపింగ్ మాల్స్ మార్నింగ్  7 గంటల తర్వాత తెరచుకుంటాయి. ప్రజలు గనక కరోనా రూల్స్ విస్మరిస్తే  కఠిన చర్యలు తీసుకుంటామని ఉద్ధవ్ థాక్రే హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్నపళంగా లాక్‌డౌన్ తెచ్చే ఉద్దేశం లేదని.. రాష్ట్రంలో ఎక్కడెక్కడ లాక్‌డౌన్ పెట్టాలో.. జిల్లాల కలెక్టర్లు, అధికారులు డిసైడ్ చేస్తారని ఆయన అన్నారు. ప్రజలకు ముందుగా నోటీస్ ఇచ్చాకే లాక్‌డౌన్ తెస్తామని అన్నారు. మహారాష్ట్రలో లాక్‌డౌన్ రావడం ఖాయం అని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రములో  కేసులు ఊపు అందుకున్న నేపథ్యంలో  ఆస్పత్రులకు వచ్చే పేషెంట్ల సంఖ్య కూడా ఎక్కువైయిందని.  దాంతో మరిన్ని బెడ్లు, మందులు రెడీ చేస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే మహారాష్ట్రలో 36,902 కరోనా కేసులు వచ్చాయి. కరోనా టైం స్టార్ట్ అయినప్పటి నుండి ఒకే రోజులో ఇన్ని కేసులు పెరగడం ఇదే మొదటిసారి.  నిన్న ఏకంగా 112 మంది మృతిచెందారు. రాష్ట్రంలో జస్ట్ 5 డేస్లో 1.3 లక్షల కరోనా కేసులు వచ్చాయి. ముంబైలో ఇప్పటివరకు ఒకే రోజు 5,504 కరోనా కేసులు రావడం అత్యధికం. ఆ రికార్డు శుక్రవారం చెరిగిపోయింది. కొత్త రికార్డుగా 5,513 కేసులు వచ్చాయి. దేశంలో లాక్‌డౌన్ ఎత్తేశాక... ప్రజలు కొన్ని నెలల పాటూ కరోనా జాగ్రత్తలు తీసుకున్నరని.. ఎప్పుడైతే వ్యాక్సిన్ పంపిణీ మొదలైంతో... అప్పటి నుంచి ప్రజల్లో ధైర్యం పెరిగింది. ఇక కరోనా పని కతం అనుకుంటూ... మాస్క్, సోషల్ డిస్టాన్స్ పాటించకుండా, శానిటైజర్ల వాడకం దాదాపు ఆగిపోయిందని. వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా సోకుతుంది అనే వాస్తవాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో రాష్ట్రాలు ఫెయిల్ అయ్యాయి. ఫలితంగా మళ్లీ కరోనా పెరిగిందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.   

జగన్.. జనాల జేబులు కటింగ్?

మాటం తప్పం.. మడమ తిప్పం. ఇది ఎన్నికల ప్రచారంలో వైసీపీ నినాదం. జగన్మోహన్ రెడ్డి వాదం. అయితే అధికారంలోకి వచ్చాకా ఆయన మడత తిప్పుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యం మద్యం విషయంలో జగన్ మాట తప్పారని ప్రతిపక్షాలతో పాటు జనాలు విమర్శలు చేస్తున్నారు. తమకు అధికారమిస్తే.. దశల వారీగా మద్యపాన నిషేదం అమలు చేస్తామని చెప్పారు జగన్. ఆయన మాట నమ్మిన ఆడపడుచులు.. వైసీపీకి మద్దతుగా నిలిచారు. కాని ఇప్పుడు మాత్రం ఏపీలో సీన్ మారింది. దశల వారీగా మద్య నిషేదం కాదు.. నెలనెలకు లిక్కర్ సేల్స్ పెరిగిపోతున్నాయి.  2019 కంటే 2021లో లిక్కర్ ఆదాయం డబులైంది. అంతేకాదు కొత్త కొత్త బ్రాండ్లు,  నాసిరకం మద్యాన్ని తీసుకొచ్చి జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నంద్యాల మందు బాబులు బ్యాలెట్ బాక్సుల్లో తమ అభిప్రాయం చెప్పారు. మంచి బ్రాండ్లు అందుబాటులోకి తీసుకురాకుంటే వచ్చే ఎన్నికల్లో ఓటు వేసేది లేదని స్లిప్పుల్లో రాసి జగన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. మద్యం దుకాణాల్లో అమ్ముతున్న బ్రాండ్లపై మొదటి నుంచి విమర్శలు వస్తున్నాయి. మద్య నిషేధం అంటూనే దారుణమైన బ్రాండ్లతో ప్రజలతో చెలగాటం ఆడుతున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.  తాజాగా టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఇదే అంశంలో ఘాటుగా స్పందించారు. జగన్ రెడ్డి మద్యపాన నిషేధం అంటూనే మహిళల మెడలో పుస్తెలు కూడా లాగేస్తున్నాడని విమర్శించారు. విషం కంటే ప్రమాదకరమైన బ్రాండ్లు తీసుకువస్తూ జనాల జేబులు కత్తిరిస్తున్నాడని వ్యాఖ్యానించారు. 2019లో లిక్కర్ ఆదాయం రూ.5 వేల కోట్లు ఉండగా, ఇప్పుడు 2021లో అది రూ.10 వేల కోట్లకు చేరిందని అయ్యన్న వెల్లడించారు. మద్యం పేరుతో రూ.10 వేల కోట్లు దోపిడీ చేస్తూ మద్యపాన నిషేధం అంటూ కటింగ్ ఇవ్వడం ఒక్క జగన్ రెడ్డికే చెల్లింది అంటూ విమర్శించారు. టీడీపీ అసత్య ప్రచారం చేస్తోంది అని బులుగు బ్యాచ్ చొక్కాలు చించుకుంటారని, కానీ ఇవి తాము చేస్తున్న ఆరోపణలు కాదని, కాగ్ బయటపెట్టిన జగన్ రెడ్డి భాగోతం అని అయ్యన్న ధ్వజమెత్తారు. 

బార్లు బార్లా.. స్కూళ్లు మూత!

కరోనా కేసులు పెరుగుతున్నాయంటూ విద్యా సంస్థలను మూసివేసింది తెలంగాణ సర్కార్. మెడికల్ కాలేజీలు తప్ప అన్ని స్కూళ్లు, కాలేజీలు బంద్ అయ్యాయి. సర్కార్ ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. స్కూళ్లు, కాలేజీల మూతతో వేలాది మంది టీచర్లు, లెక్చరర్లు రోడ్డున పడ్డారు. వారంతా ఆందోళనలు చేస్తున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడ్డామని, మళ్లీ స్కూల్స్ , కాలేజీలు మూసివేస్తే తమ పరిస్థితి ఏంటని బోరుమంటున్నారు.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేపట్టాయి. ఈ సందర్బంగా టెస్మ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, కరోనా పేరుతో ప్రైవేటు స్కూళ్లను మూసివేయడం దారుణమని అన్నారు. సినిమా థియేటర్లు, బార్లను తెరిచే ఉంచారని... దీనివల్ల కరోనా రాదా? అని ప్రశ్నించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆ ప్రాంతాలకు వెళ్లరా? అని నిలదీశారు. ప్రభుత్వ గురుకులాల్లో కరోనా కేసులు వస్తే... శిక్ష తమకెందుకు వేస్తున్నారని మండిపడ్డారు. కరోనా కట్టడి చేయాలనుకుంటే... ప్రతి వ్యవస్థను బంద్ చేయాలని డిమాండ్ చేశారు. అన్ని వ్యవస్థలను తెరిచి ఉంచి, విద్యాసంస్థలను మాత్రమే మూసివేస్తామంటే కుదరదని  టెస్మా ప్రతినిధులు హెచ్చరించారు.   ప్రైవేటు పాఠశాలల మూసివేత   నిర్ణయం వలన లక్షలాది విద్యార్థులకు నష్టం జరిగిందన్నారు వేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు. పదోతరగతి విద్యార్థులకు సిలబస్ పూర్తి కానందున వారు పరీక్షలు రాయడానికి కష్టం అవుతుందన్నారు. జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరీక్షల్లో తెలంగాణ విద్యార్థులు పోటీ పడలేక మంచి ర్యాంకులు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. విద్యాసంస్థల మూసివేతకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల విద్యార్థులు రాయటం చదవటం వంటి కనీస విద్యా ప్రమాణాలు కోల్పోయారని చెప్పారు. ప్రైవేటు ఉపాధ్యాయులు గత సంవత్సరం కాలంగా ఉపాధి లేక అనేక ఇతర పనులు చేసుకోలేక వారి కుటుంబ పోషణ కష్టంగా మారి ఆత్మహత్యలకు దారితీసే పరిస్థితి తలెత్తిందని  కావున వారికి ప్రభుత్వం నెలకు ఏడు  వేల రూపాయిలు చెల్లించాలని  డిమాండ్ చేశారు.  విద్యా సంస్థలను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

ఢిల్లీ టార్గెట్‌గా దొరల రాజకీయం!

తెలంగాణలో వెలమ రాజ్యం. దొర పాలనంటున్న ప్రతిపక్షం. తెలంగాణతో ఆగనంటున్నారు కేసీఆర్. ప్రధాని పీఠంపై బాణం గురిపెడుతున్నారు. ఎన్నికల ముందు హస్తిన బాట పడతానంటూ హడావుడి చేసిన గులాబీ బాస్.. ఆ తర్వాత ఎందుకో చల్లబడ్డారు. చాలా కాలం తర్వాత సడెన్‌గా మంత్రి మల్లారెడ్డి ఆ ముచ్చట మళ్లీ తీసుకొచ్చారు. కేసీఆర్‌ను ప్రధానిగా చూడాలంటూ.. అది తన కలంటూ.. అసెంబ్లీ సాక్షిగా తన మనసులో మాట వినిపించారు మల్లన్న.  మల్లారెడ్డి ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందనేది ఆసక్తికరం. ఆయనే అన్నారా? లేక, ఆయనతో పెద్దాయనే అనిపించారా? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. కేసీఆర్ ఇషారా మేరకే మల్లారెడ్డి సభలో ప్రధాని ప్రస్తావన తీసుకొచ్చారని చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధాని పదవి గురించి బహిరంగంగా మాట్లాడకపోయినా.. లోలోపల మాత్రం హస్తిన సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. కేసీఆర్ కోసం ఆయన సామాజిక వర్గమంతా ఏకమై.. తమ వాడిని ఢిల్లీకి ప్రమోట్ చేయాలని మంత్రాంగం చేస్తున్నారట. వారు అనుకున్నది అనుకున్నట్టు వర్కవుట్ అయితే.. త్వరలోనే గులాబీ బాస్ ఎర్ర కోటపై కనిపించొచ్చని అంటున్నారు.  ఇటీవల హైదరాబాద్‌లో కేసీఆర్ కోసం ఓ రహస్య సమావేశం జరిగిందట. వెలమలంతా కలిసి మీటింగ్ పెట్టుకున్నారట. వెలమ వర్గానికి చెందిన అన్ని పార్టీలకు చెందిన పెద్ద స్థాయి నేతలు, బడా పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు, బిలయనీర్లు అయిన కొంతమంది ఎన్నారైలు ఈ సీక్రెట్ మీటింగ్‌కు హాజరయ్యారని చెబుతున్నారు. ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల్లో సెటిలైన వారు కూడా వచ్చారట. ఆ సమావేశం సారాంశమంతా ఒక్కటే. కేసీఆర్‌ను పీఎం చేయడమే. ఢిల్లీపై దండయాత్ర చేయాడానికి కావలసిన బలం, బలగంను ఎలా సమకూర్చాలో లెక్కలేశారట. జనాభా పరంగా వెలమల సంఖ్య తక్కువే. వారిలో.. వెరీ వెరీ రిచ్ పీపుల్ ఎక్కువే. పాపులేషన్ తక్కువైనా పాపులారిటీ, పవర్, పైసాకు కొదవ లేదు. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీలో వెలమ నేతలు కీలక స్థానంలో ఉన్నారు. ఇక, ఎన్నారైల గురించైతే చెప్పనవసరమే లేదు. దాదాపు ప్రతీ కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు ఫారిన్‌లో సెటిలైనవారే. ఇక, ఏ1 కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, పారిశ్రామిక వేత్తలకు కొదవే లేదు. ఇలా.. వెలమలంతా ఏకమై.. అంతా కలిసి ఆర్థిక వనరులు సర్దుబాటు చేసి.. కేసీఆర్‌ను ఢిల్లీ సింహాసనంపై కూర్చోబెట్టాలనేది వారి లక్ష్యం. అందుకు తగ్గట్టు కార్యచరణ సిద్ధం చేయడం కోసమే హైదరాబాద్‌లో ఆ రహస్య సమావేశం.  నాలుగైదు వేల కోట్ల వరకూ సద్దుబాటు చేసేలా సమావేశంలో చర్చలు జరిగాయట. వాటితో చిన్నా చితకా పార్టీలను, కొందరు ఎంపీలను మేనేజ్ చేసేలా సంప్రదింపులు జరిపే బాధ్యతను ఓ పారిశ్రామిక వేత్తకు అప్పగించారట. కేసీఆర్‌ ఢిల్లీ జర్నీకి కావలసిన సరంజామాను సమకూర్చేలా.. ఆ ప్రయాణంలో ఎదురయ్యే ఆటంకాలను ఎప్పటికప్పుడు సరి చేసేలా.. ఆయనకు అన్ని విధాల సహకరించారని నిర్ణాయానికొచ్చారు. వేరే పార్టీలో ఉన్న కీలక నేతలు సైతం తమ నాయకుడికి రూట్ క్లియర్ చేయాలని కుల పెద్దలంతా కలిసి ఓ అభిప్రాయానికి వచ్చారట.  ఆ మీటింగ్‌కు కేసీఆర్, కేటీఆర్ లాంటి వాళ్లు హాజరుకాకపోయినా.. ఆయన సన్నిహితులే వెలమ కుల ప్రముఖుల సమావేశం ఏర్పాటు చేశారని చెబుతున్నారు. సమావేశం పూర్తయ్యాక.. సారాంశం కేసీఆర్‌కు బ్రీఫింగ్ చేశారట. అందుకు, గులాబీ బాస్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక స్లో..గా పని ప్రారంభించే పనిలో ఉన్నారు వెలమ వర్గీయులు. ఈ లోగా.. కేసీఆర్ ప్రధాని అనే డైలాగ్‌ ప్రజల్లో ఉండేలా.. దానిపై తరుచూ చర్చ జరిగేలా.. తమకు అనుకూలమైన వారితో ఆ ప్రస్తావన తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారట. అయితే, ఆ నినాదం తమ సామాజిక వర్గ నాయకులు చేస్తే బాగుండదు కాబట్టి.. తెలంగాణలో అత్యంత బలమైన రెడ్డి నేతల నోటి నుంచే ఆ మాటను అనిపించారట. ప్రజల్లోకి మరింత వేగంగా వెళ్లేలా.. అసెంబ్లీలో ఆ డైలాగ్ వినిపించడం యాదృచ్చికం కాదంటున్నారు. పై నుంచి వచ్చిన ఆదేశాలతోనే మంత్రి మల్లారెడ్డి.. కేసీఆర్‌ను పీఎంగా చూడాలని ఉందంటూ అసెంబ్లీలో అన్నారని అంటున్నారు. ఇదంతా.. ఆఫ్ ది రికార్డ్ మేటర్. అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం.

అహంకారంతో ఓడిన జానారెడ్డి!

కుందూరు జానారెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత సీనియర్ నేత. 43 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు అనుభవించారు. నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఆయన మరోసారి పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఆయనకు ఇది పదకొండవ సారి. 11 సార్లు జానారెడ్డి ఒక ప్రాంతం నుంచే పోటీ చేశారు. ఏడు సార్లు చలకుర్తి నుంచి అసెంబ్లీకి పోటీ చేయగా.. మూడు సార్లు చలకుర్తి నుంచి కొత్తగా ఏర్పడిన నాగార్జున సాగర్ నుంచి పోటీ చేశారు. ఇప్పటివరకు  జానా రెడ్డి ఏడు సార్లు గెలుపొందగా... మూడు సార్లు ఓడిపోయారు. త్వరలో జరగనున్న నాగార్జున సాగర్ లో గెలిస్తే జానా రెడ్డి రికార్డ్ సాధించబోతున్నారు. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలవబోతున్నారు.  1978లో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు జానారెడ్డి. జనతా పార్టీ నుంచి తొలిసారి పోటీ చేసిన జానారెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి నిమ్మల రాములు చేతిలో ఓడిపోయారు. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించడంతో.. అన్నపార్టీలో చేరారు జానారెడ్డి. 1983లో టీడీపీ అభ్యర్థిగా చలకుర్తి నుంచి విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. నాదెండ్ల ఎపిసోడ్ తర్వాత ఎన్టీఆర్ అసెంబ్లీని రద్దు చేయడంతో 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లోనూ జానారెడ్డి గెలుపొందారు. తర్వాత ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. 1988లో ఎన్టీఆర్ ఒకేసారి 30 మంది మంత్రులను తొలగించారు. ఆ సమయంలో ఎన్టీఆర్ తో విభేదించి టీడీపీ నుంచి బయటికి వచ్చారు జానా రెడ్డి. తెలుగు మహానాడు పేరుతో సొంతంగా పార్టీ ప్రారంభించారు. అయితే కొంత కాలానికి అప్పటి ఏఐసీసీ ప్రెసిడెంట్ రాజీవ్ గాంధీ సమక్షంలో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు జానా రెడ్డి. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.  రాజకీయ ఉద్దండుడైన జానారెడ్డికి 1994 అసెంబ్లీ ఎన్నిక మచ్చలా మిగిలిపోయింది. 1989-94 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన జానా రెడ్డి..అహంకారంతో తీసుకున్న నిర్ణయం ఆయనను రోడ్డున పడేసిందని చెబుతారు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో చలకుర్తి నుంచి మరోసారి పోటీ చేసిన జానారెడ్డి... తాను ప్రచారం చేయకుండానే గెలుస్తానని ప్రకటించారు. నియోజకవర్గాన్ని తాను ఎంతో అభివృద్ధి చేశానని, ప్రజలు తనను గెలిపించుకుంటారని తెలిపారు. జానారెడ్డి తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అతి విశ్వాసానికి వెళుతున్నారని కొందరు, అహంకారంతో మాట్లాడుతున్నారని మరికొందరు కామెంట్లు చేశారు. ఓటర్లను అవమానిస్తున్నారని కూడా కొందరు విమర్శించారు. అయితే జానారెడ్డి మాత్రం తన నిర్ణయం మార్చుకోలేదు. ఆ ఎన్నికల్లో ప్రచారం చేయలేదు. దీంతో 1994 అసెంబ్లీ ఎన్నికల్లో చలకుర్తిలో టీడీపీ నుంచి పోటీ చేసిన రాంమ్మూర్తి యాదవ్.. జానా రెడ్డిపై  విజయం సాధించారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రాంమ్మూర్తి యాదవ్.. బలమైన నేతగా ఉన్న జానారెడ్డిని చలకుర్తిలో ఓడించడం అప్పట్లో పెను సంచలనమైంది.  1994 అసెంబ్లీ ఫలితంతో జానా రెడ్డికి షాక్ తగిలింది. ఓటమిని ఆయన జీర్ణించుకోలేకపోయారు. 1994లో టీడీపీ ప్రభంజనం వీచింది. ఎన్టీఆర్ సునామీలో కాంగ్రెస్ పార్టీ అత్యంత ఘోరంగా  దెబ్బతిన్నది. కేవలం 24 అసెంబ్లీ సీట్లకే పరిమితమైంది. దీంతో ఎన్టీఆర్ హవా వల్లే తాను ఓడిపోయానని కవరింగ్ ఇచ్చుకున్నారు జనా రెడ్డి. తర్వాత  కసిగా పని చేసి నియోజకవర్గంలో మరింత బలపడ్డారు.  1999 ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2004లోనూ అక్కడి నుంచే గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో చలకుర్తి నియోజకవర్గం నాగార్జునసాగర్ గా అవతరించింది. 2009, 2014లో నాగార్జున సాగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. తెలంగాణ రాష్ట్రంలో 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో కేసీఆర్ హావా ఉన్నా గెలిచిన జానా రెడ్డి.. సీఎల్పీ లీడర్ గా పని చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన నోముల నర్సింహయ్య చేతిలో 7 వేల 770 ఓట్ల తేడాతో  ఓడిపోయారు.  ఏడుసార్లు ఎమ్మెల్సేగా గెలిచిన జానా రెడ్డి.. మంత్రిగానూ పలు రికార్డులు సాధించారు. ఎక్కువ కాలం మంత్రిగా పని చేసిన వ్యక్తిగా కాసు బ్రహ్మనందా రెడ్డి రికార్డును అధిగమించారు. మంత్రిగా హోంశాఖ, వ్యవసాయ శాఖ, సహకార, మార్కెటింగ్,  ఫారెస్ట్, పశు సంవర్థక శాఖ,  మత్స్య శాఖ, తూనికలు- కొలతల శాఖ, రవాణా, రోడ్లు- భవనాలు, హౌసింగ్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలోనూ కీలక పదవులు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేసులోనూ నిలిచారు. అత్యంత సీనియర్ నేత జానారెడ్డి.. నాగార్జుసాగర్ లో ఈసారి సర్వశక్తులు ఒడ్డుతున్నారు.  తన సొంత గడ్డలో పట్టు నిలుపుకోవాలని ఆరాటపడుతున్నారు. జానారెడ్డి గెలిస్తే.. రికార్డు అవుతుందనే చర్చ కూడా నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.  అయితే నియజకవర్గ ఓటర్లు జానా రెడ్డిని ఆదిరిస్తారో లేదో చూడాలి మరీ.. 

మోడీ బంగ్లా పర్యటన మరో దౌత్య విజయం

దేశాది నేతలు, ప్రభుత్వాధినేతలు విదేశీ పర్యటనలు చేయడం విశేషం కాదు. కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం జరిపిన బంగ్లాదేశ్ పర్యటనకు నిస్సందేహంగా ప్రత్యేకత,  ప్రాధాన్యత ఉన్నాయి. ప్రత్యేకత ఏమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, కరోనా కాలం మొదలైన తర్వాత ప్రధాని జరిపిన తొలి విదేశీ పర్యటన ఇదే కావడం, పర్యటన ప్రత్యేకత అయితే, పర్యటన సందర్భం, ఈ సందర్భంగా ప్రదాని మోడీ చేసిన ప్రసంగం పర్యటన ప్రాధాన్యతకు అద్దం పడుతోంది. బంగ్లాదేశ్ స్వాతంత్ర స్వర్ణోత్సవాలు, ఆ దేశ  జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ శత జయతి వేడుకలలో ప్రధానమంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. 2020కి సంవత్సరానికి గానూ, మన ప్రభుత్వం షేక్ ముజిబుర్ రెహమాన్’కు ప్రకటించిన గాంధీ శాంతి బహుమతిని,షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తె బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఆమె సోదరి  షేక్ రహీనాలకు అందచేశారు. ఈ విశేష కార్యక్రమాలు భారత్, బంగ్లా బంధాన్ని అనుబంధాన్ని మరోసారి గుర్తు చేశాయి. అంతే కాదు ఇరు దేశాల పొరుగు దేశం పాకిస్థాన్ దుష్ట పన్నాగాలను, దుర్మార్గ పోకడలను కూడా గుర్తు చేసింది. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ తమ ప్రసంగంలో అన్యాయాన్ని ప్రతిఘిటించి, ధర్మాన్ని కాపాడే క్రమంలో బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో త్యాగధనులు తమ జీవితాలను త్యాగం చేశారని అన్నారు. వంచన, అణచివేతపై సత్యం, ధైర్యం సాధించిన గొప్ప విజయానికి బంగ్లా విముక్తి పోరాటం గుర్తుగా నిలుస్తుందని ప్రస్తావించడం  ద్వారా  ఇప్పటికీ అదే రీతిన  సాగుతున్న పాకిస్థాన్ దుర్నీతిని ప్రపంచానికి గుర్తు చేశారు. అలాగే, ఉభయ దేశాల బంధాన్ని, ప్రధాని రక్త బంధంగా వర్ణించారు. భారత్, బంగ్లాదేశ్ సంబంధాలు కేవలం ఇరుగు పొరుగు దేశాల మధ్య ఉండే సబంధం, కాదు, మన మరో పొరుగు దేశం పాకిస్థాన్’తో ఉన్నటువంటి దాయాది వైరుధ్య బంధం కాదు, ఒకే అమ్మ రక్తం పంచుకు పుట్టిన రక్త సంబంధమని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.ఇంకా అనేక విధాలుగా ఉభయ దేశాల మధ్య గల స్నేహ సంబంధాలను ప్రస్తావించడం ద్వారా, ఉభయ దేశాల బంధాన్ని మరింతగా బలోపేతం చేసే ప్రయత్నం చేశారు.   ప్రస్తుతం మన దేశ సరిహద్దులలో నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో ప్రధాని బంగ్లాదేశ్ పర్యటనకు  దౌత్యపరమైన ప్రాధాన్యత  కూడా వుంది.అందుకే, పాక్, చైనా దుష్ట బంధాల నేపధ్యంలో ప్రధాని పర్యటనకు  ఎంతో ప్రాముఖ్యత ఉందని దౌత్య నిపుణులు పేర్కొంటున్నారు. నిజానికి, ప్రధాని నరేంద్ర మోడీ ఇంతవరకు జరిపిన ప్రతి విదేశీ పర్యటన, దౌత్య పరంగానే కాదు, ఆర్థికంగా, వ్యాపార వాణిజ్య సంబంధాల పరంగా, రక్షణ సంబంధాల పరంగా, ఎలా చూసినా, దేశ హితమే కనిపిస్తుంది. బంగ్లా పర్యటనలో కూడా అదే నీతి కనిపించింది.

డ్రైనేజీ బిల్లుల కోసం.. సర్పంచుల ఫైటింగ్..

పంచాయితీ సాక్షిగా..సర్పంచ్ ఉప్పుసర్పంచుల గుద్దులాట. ఆ గుద్దులాట ఏ గ్రామా అభివృద్ధికోసమో కాదు. డ్రైనేజీ బిల్లుల కోసం. అంగీలు పట్టుకొని గుండీలు చినిగేలా సచివాలయంలోనే పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. భీముడు దుర్యోధనుడిలా నువ్వు ఒకటి కొడితే నేను రెండు కొడుతా అంటూ సినిమా రేంజ్‌లో కిందపడేసి కాళ్లతో తన్నుకున్నారు. వాళ్లను అదుపుచేసేందుక తోటివారు తీవ్రంగా శ్రమించారు. కానీ వారి శ్రమ వృధాగానే మిగిలింది. మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండలం ముట్రాజ్ పల్లిలో ఈ ఘటన సచివాలయం లైటు కింద వెలుగుచూసింది.  చివరికి  డ్రైనేజీ బిల్లుల విషయంలో ఇరువురికీ వివాదం తలెత్తినట్లు సమాచారం. పంచాయతీ నిధులను సర్పంచ్ తలారి సాయిలు వాడుకుంటున్నారని ఉపసర్పంచ్ వెంకటేశ్ ఆరోపించారు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో కార్యాలయంలోనే సర్పంచ్, ఉపసర్పంచ్ బాహుబలి ఫైట్ చేస్తూ పిడిగుద్దులు గుద్దుకున్నారు. అక్కడైతే ఆగక  పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ప్రజాప్రతినిధులు నిధుల దుర్వినియోగానికి పాల్పడుతూ.. బిల్లుల విషయంలో కొట్టుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

లేడీ సింగం సూసైడ్.. కారకుడు అతడేనా.. 

తాను ఒక లేడీ సింగం. ఆమె అంటే అటవీ మాఫియా హడలు. ధైర్యానికి మరో రుద్రమాదేవి. అందుకే ఆమె లేడీ సింగం గా ఫేమస్. సాటి అధికారి లైంగిక వేధింపులపు గురిఅయింది. తన వాంఛ తీర్చలేదని  తన పై అధికారి గర్భవతిగా ఉన్నపుడు పెట్రోలింగ్ పేరుతో మూడు రోజులు డ్యూటీ చేయించాడు ఆ నీచుడు. అలాగే అడవిలో చాలా  మైళ్ళు నిడిపించాడు ఆ నీచుడు. రక్త స్రావం అవుతున్న డ్యూటీ చేయమన్నాడు.  వాడి మగ వాంఛ కరగలేదు.  ఇలాంటి సమస్యలను ఎదురుకోవడంలో తన దైర్యం ఓడిపోయింది. తన సిన్సియారిటీ తన ఆత్మహత్యకే కారణం అయింది. చివరికి తన సర్వీస్ గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది.     అమరావతి మహారాష్ట్ర ‘లేడీ సింగమ్‌’గా గుర్తింపు పొందిన అటవీ అధికారిణి దీపాలీ చవాన్ ‌(28)  తన అధికారి ఒకరు తనను లైంగికంగా తీవ్ర వేధింపులకు గురిచేశాడని, ఆయన చేతిలో తాను చిత్రహింసలకు గురయ్యానంటూ సూసైడ్ కి ముందు ఆమె రాసిన లేఖ బీభత్సము సృష్టిస్తోంది. మెల్గాట్‌ టైగర్‌ రిజర్వు సమీపంలోని హరిసాల్‌ గ్రామంలోని తన అధికారిక నివాసం(క్వార్టర్స్‌)లో ఆమె సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని దీపాలి చవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ధైర్య సాహసాలతో అటవీ మాఫియా ఆటలు కట్టించిన దీపాలీ చవాన్‌ ‘లేడీ సింగమ్‌’గా పేరు సంపాదించుకున్నారు. ఆమె భర్త రాజేశ్‌ మొహితే చిఖల్‌ధారలో ట్రెజరీ అధికారి. దీపాలి తల్లి తన సొంతూరైన సతారాకు వెళ్లిన సమయంలో ఆమె ఈ తీవ్ర చర్యలకు పాల్పడ్డారు. దీపాలీ ని వేధింపులకు గురిచేసిన అటవీశాఖ డిప్యూటీ కన్జర్వేటర్‌(డీసీఎఫ్‌) వినోద్‌ శివకుమార్‌ను పోలీసులు నాగ్‌పుర్‌ రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. అక్కడినుండి నేరుగా అమరావతికి తరలించి కేసు నమోదు చేశారు. శివకుమార్‌ తనను కొన్ని నెలలుగా లైంగికంగా, మానసికంగా ఎలా వేధించిందీ దీపాలీ ఆ లేఖలో వివరించారు. శివకుమార్‌ ఆగడాలపై పలుమార్లు ఆయన సీనియర్‌, ఎంటీఆర్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఎన్‌.శ్రీనివాస్‌ రెడ్డికి ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదని ఆమె లేఖలో రాశారు. ఈ ఏడాది ఫిబ్రవరి మొదట్లో గర్భవతిగా ఉన్న కూడా  మూడు రోజుల పాటు పెట్రోలింగ్‌ నిర్వహించాల్సి ఉందంటూ శివకుమార్‌ తనతో పాటు బలవంతంగా అడవిలోకి తీసుకెళ్లాడని ఆమె సన్నిహితురాలు ఒకరు తెలిపారు. గర్భిణి అని తెలిసి కూడా కిలోమీటర్ల దూరం నడిపించాడని, గర్భస్రావం కావడంతో దీపాలీ తీవ్ర మనోవేదనకు గురైందని వివరించారు. దీపాలి లేఖలోని ఆరోపణలపై ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ మాట్లాడుతూ... అన్ని కోణాల్లో విచారణ జరిపిస్తామని, నిందితులను వదిలిపెట్టేది లేదని. నిందితుడు శివకుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ అటవీశాఖ ముఖ్య కన్జర్వేటర్‌(మంత్రాలయ) అరవింద్‌ ఆప్టే శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంటీఆర్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఎన్‌.శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలను మరొక అధికారికి బదిలీ చేసినట్లు అరవింద్‌ ఆప్టే వెల్లడించారు.    

కనగరాజ్ కరివేపాకా?

జస్టిస్ కనగరాజ్.. కొన్ని రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా చేసిన వ్యక్తి.  తమకు కొరకరాని కొయ్యలా మారిన నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ ను  ఎస్‌ఈసీగా తొలగించి.. ఆయన స్ధానంలో తమిళనాడుకు చెందిన జస్టిస్ కనగరాజ్‌ను ఆగమేఘాల నియమించింది జగన్ రెడ్డి ప్రభుత్వం. కరోనా కల్లోల సమయంలో సరిహద్దు మూసివేతను దాటి, ఆయనను తమిళనాడు నుంచి ఏపీకి తీసుకువచ్చి స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌ బాధ్యతలు అప్పగించింది. ఎస్ఈసీగా కనగరాజ్ నియామకం కోసం నిబంధనలు కూడా మార్చేసింది. రిటైర్డ్ ఐఏఎస్, ఐపిఎస్‌లు రాజకీయ నాయకుల వద్ద పనిచేశారు కాబట్టి వారిలో పారదర్శకత ప్రశ్నార్ధకంగా మారుతుంది.. అందుకే రిటైర్డ్ జడ్జి కనగరాజ్‌ను ఎస్‌ఈసీగా నియమిస్తున్నామని గొప్పగా ప్రకటించుకున్నారు సీఎం జగన్. అంతవరకు బాగానే ఉన్నా విషయం కోర్టులకు వెళ్లడంతో జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఎస్ఈసీగా కనగరాజ్ నియామకాన్ని కోర్టు కొట్టివేసింది. దీంతో ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమారే కొనసాగగా... జగన్ సర్కార్ తీసుకొచ్చిన కనగరాజ్ తిరిగి తన సొంత రాష్ట్రానికి వెళ్లిపోయారు. అయితే ఎన్నికల నిర్వహణలో పారదర్శకత కోసమే ఐఏఎస్, ఐపిఎస్‌లు కాకుండా రిటైర్జ్ జడ్జిని తీసుకోచ్చామని చెప్పుకున్న జగన్.. ఇప్పుడు మాత్రం ఐఏఎస్ నీలం సాహ్నీకే ఆ పోస్టు కట్టబెట్టారు. అంతేకాదు ఎస్‌ఈసీ ఎంపిక కోసం జగన్ ప్రభుత్వం పంపిన ముగ్గురు పేర్లలో కనగరాజ్ పేరే లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.   నిమ్మగడ్డ పదవీకాలం ఈనెలతో ముగియనుండగా.. కొత్త ఎస్‌ఈసీ ఎంపిక కోసం ప్రభుత్వం నీలం సహానీ, ప్రేంచంద్రారెడ్డి, శామ్యూల్ పేర్లు గవర్నర్ పరిశీలనకు పంపించారు. అయితే వారిలో  గతంలో ప్రభుత్వం తానే  చొరవ తీసుకుని తీసుకువచ్చిన కనగరాజ్ పేరు లేకపోవడం రాజకీయ వర్గాలను విస్మయపరిచింది. ఆ ముగ్గురిలో ఎవరూ రిటైర్డ్ జడ్జిలు లేకపోవడం  ప్రతిపక్షాలకు రాజకీయ అస్త్రంగా మారింది. కనగరాజ్‌ను ఏపీ సర్కారు ఖంగుతినిపించిందనే ఆరోపణలు వస్తున్నాయి. జస్టిస్ కనగరాజ్ ను జగన్ కరివేపాకుగా వాడుకున్నారనే విమర్శలు వస్తున్నాయి.   ముగ్గురు అధికారుల పేర్లు సిఫార్సు చేయడం ద్వారా, జగన్ తన సిద్ధాంతాలను తానే తుంగలో తొక్కారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. ‘‘రాజకీయ నాయకుల వద్ద పనిచేసిన అధికారులలో పారదర్శకత ఉండదు కాబట్టి, ఆ పారదర్శకత కోసమే రిటైర్డ్ జడ్జిని నియమించానని అప్పట్లో చెప్పిన జగన్, ఇప్పుడు మళ్లీ అదే రిటైరయిన అధికారుల పేర్లను ఎలా సిఫార్సు చేశారు? అంటే ఈ ముగ్గురిలోనూ పారదర్శకత ఉండదని జగన్ అంగీకరించినట్లేనా’ అని  వర్ల రామయ్య ప్రశ్నించారు. నిత్యం రచచ్బండ పేరుతో జగన్ సర్కారు నిర్ణయాలను ప్రశ్నిస్తున్న వైసీపీ నర్సాపురం రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా, కనగరాజ్‌ను ఎస్‌ఈసీగా ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. దాన్ని బట్టి‘ మాట తప్పడం మా విధానం అని’ జగన్ పరోక్షంగా స్పష్టం చేశారు. కనగరాజ్‌కు సానుభూతి తెలపడం తప్ప మరేమీ చేయలేనని రాజు వ్యంగ్యాస్తాలు సంధించారు.  తాను సిఫార్సు చేసిన వారికి సాంకేతిక కారణాలతో పదవులు దక్కకపోతే, ఏదో ఒక మార్గంలో గానీ, లేదా అవకాశం వచ్చినప్పుడు గానీ వారికి న్యాయం చేస్తారన్న పేరు జగన్ కు ఉంది. కానీ కనగరాజ్ విషయంలో మాత్రం ఆయన పేరును పరిగణనలోకి తీసుకోకపోవడం జగన్ అభిమానులను సైతం విస్మయపరిచింది. పోనీ మానవ హక్కుల కమిషన్ చెర్మన్‌గా నియమిస్తారనుకున్నా దానికీ మాజీ న్యాయమూర్తిని ఇటీవలే నియమించారు. గతంలో జస్టిస్ కనగరాజ్ బస చేసిన రూమ్ అద్దె కూడా చెల్లించలేదనే వార్తలు వచ్చాయి. మొత్తంగా ఎస్ఈసీ విషయంలో కనగరాజ్ జగన్ చేతిలో పావుగా మారిపోయారనే అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తోంది. 

సచిన్ కి పాజిటివ్!

చట్టానికి ఎవరు అతిథులు కారు అన్నట్లు అని ఎలా అయితే చెప్పుకుంటామో. కరోనా కి కూడా ఎవరు అతిథులు కారు. అది బెంజులో తిరిగేవరైనా గంజి నీళ్లు తాగేవారైనా.. అందరూ కరోనా కాటు భారీన పడాల్సిందే. సంవత్సరం ప్రపంచాన్ని వణికించిన కరోనా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది.. ఈ ఇన్నింగ్ లో ముఖ్యంగా సెలబ్రెటీలు బాగా గురవుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ నటులు ఆమీర్ ఖాన్, మాధవన్ కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. తాజాగా క్రికెట్  దిగ్గజం, మాస్టార్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కరోనా భారీన పడ్డాడు.  కరోనా పరీక్షలో సచిన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని సచిన్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ఎప్పటికప్పుడు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నాను. కరోనా లక్షణాలు స్వల్పంగా కనిపించడంతో తాజాగా మరోసారి పరీక్ష చేయించుకున్నా. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మా ఇంట్లో మిగిలిన అందరికీ నెగిటివ్ వచ్చింది. నేను ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంటూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాను. నాకు మద్దతుగా నిలుస్తున్న వైద్య సిబ్బందికి, దేశవ్యాప్తంగా ఉన్న నా శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. అందరూ జాగ్రత్తగా ఉండండ`ని సచిన్ ట్వీట్ చేశాడు.    ఇది ఇలా ఉండగా లింగం మాయ్యా కు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.. లింగం మాయ్యా అంటే ఎవరని అనుకుంటున్నారా అందేనండి శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మామ పాత్రలో నటించిన బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ కరోనా బారిన పడ్డారు. షూటింగ్ సమయంలో నీరసంగా ఉండటంతో టెస్ట్ చేయించుకున్నాడు. దీంతో కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ ఉంది. డాక్టర్ల సలహా మేరకు హోమ్ క్వారంటైన్‌లో ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు.

సాగర్ బీజేపీలో తిరుగుబాటు? 

నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక బీజేపీలో తిరుగుబాటుకు కారణమవుతుందని తెలుస్తోంది. సాగర్ నామినేషన్ల ప్రక్రియలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించక ముందే ఆ పార్టీ నాయకురాలు కంకణాల నివేదిత శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నివేదిత రెడ్డి పోటీ చేశారు. నివేదిత భర్త శ్రీధర్ రెడ్డి నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. నాగార్జున సాగర్ టికెట్ కోసం ఆయన పోటీ పడుతున్నారు. నియోజకవర్గంలో వీళ్లు ప్రచారం కూడా చేస్తున్నారు.  పార్టీ తనకే టికెట్‌ ఖరారు చేస్తుందన్న నమ్మకంతో  నామినేషన్‌ దాఖలు చేసినట్లు నివేదితా రెడ్డి చెబుతున్నారు. అయితే అభ్యర్థి ఎంపికపై అధిష్ఠానం ఇంకా  ఏ నిర్ణయం తీసుకోక ముందే నివేదిత నామినేషన్‌ దాఖలు చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ పార్టీ ఆమెకు టికెట్‌ కేటాయించని పక్షంలో రెబల్‌గా బరిలో ఉంటుందా.? లేక ఉపసంహరించుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. నివేదిత నామినేషన్‌ దాఖలు చేసి ఓ రకంగా ఆ పార్టీని ఇరకాటంలో పడేసిందని అంటున్నారు.  నాగార్జున సాగర్ లో అభ్యర్థి ఎంపికపై బీజేపీ తర్జనభర్జన పడుతోంది. కాంగ్రెస్ నుంచి జానా రెడ్డి పోటీ చేస్తుండగా.. టీఆర్ఎస్ ఇంకా ఎవరిని ఖరారు చేయలేదు. అధికార పార్టీ నుంచి బీసీ వ్యక్తి అభ్యర్థిగా ఉంటారని తెలుస్తోంది. టీఆర్ఎస్ క్యాండిడేట్ ఖరారు అయ్యాకా... సామాజిక కోణంలో తమ అభ్యర్థిని ఎంపిక చేయాలని బీజేపీ భావిస్తోంది. సాగర్ లో యాదవులతో పాటు ఎస్టీలు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఈ రెండు వార్గాల నుంచే బీజేపీ అభ్యర్థి ఉండవచ్చని చెబుతున్నారు. కడారి అంజయ్య యాదవ్, రవి నాయక్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పార్టీ ఆలోచన ఇలా ఉంటే.. కంకణాల నివేదితా రెడ్డి నామినేషన్ వేయడం ఇప్పుడు బీజేపీలో కాక రేపుతోంది.  నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటివరకు మొత్తం 20 మంది అభ్యర్థులు 23 నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్‌ సింగ్‌ తెలిపారు.  ఈ నెల 27, 28, 29 తేదీలు సెలవు దినాలు కావడంతో నామినేషన్లకు అవకాశం ఉండదు. 30వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. 31న నామినేషన్ల పరిశీలన.. ఏప్రిల్ 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. ఏప్రిల్ 17న పోలింగ్‌ జరగనుండగా.. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితం ప్రకటించనున్నారు.