లేడీ సింగం సూసైడ్.. కారకుడు అతడేనా..
posted on Mar 27, 2021 @ 11:48AM
తాను ఒక లేడీ సింగం. ఆమె అంటే అటవీ మాఫియా హడలు. ధైర్యానికి మరో రుద్రమాదేవి. అందుకే ఆమె లేడీ సింగం గా ఫేమస్. సాటి అధికారి లైంగిక వేధింపులపు గురిఅయింది. తన వాంఛ తీర్చలేదని తన పై అధికారి గర్భవతిగా ఉన్నపుడు పెట్రోలింగ్ పేరుతో మూడు రోజులు డ్యూటీ చేయించాడు ఆ నీచుడు. అలాగే అడవిలో చాలా మైళ్ళు నిడిపించాడు ఆ నీచుడు. రక్త స్రావం అవుతున్న డ్యూటీ చేయమన్నాడు. వాడి మగ వాంఛ కరగలేదు. ఇలాంటి సమస్యలను ఎదురుకోవడంలో తన దైర్యం ఓడిపోయింది. తన సిన్సియారిటీ తన ఆత్మహత్యకే కారణం అయింది. చివరికి తన సర్వీస్ గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది.
అమరావతి మహారాష్ట్ర ‘లేడీ సింగమ్’గా గుర్తింపు పొందిన అటవీ అధికారిణి దీపాలీ చవాన్ (28) తన అధికారి ఒకరు తనను లైంగికంగా తీవ్ర వేధింపులకు గురిచేశాడని, ఆయన చేతిలో తాను చిత్రహింసలకు గురయ్యానంటూ సూసైడ్ కి ముందు ఆమె రాసిన లేఖ బీభత్సము సృష్టిస్తోంది. మెల్గాట్ టైగర్ రిజర్వు సమీపంలోని హరిసాల్ గ్రామంలోని తన అధికారిక నివాసం(క్వార్టర్స్)లో ఆమె సర్వీసు రివాల్వర్తో కాల్చుకుని దీపాలి చవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ధైర్య సాహసాలతో అటవీ మాఫియా ఆటలు కట్టించిన దీపాలీ చవాన్ ‘లేడీ సింగమ్’గా పేరు సంపాదించుకున్నారు. ఆమె భర్త రాజేశ్ మొహితే చిఖల్ధారలో ట్రెజరీ అధికారి. దీపాలి తల్లి తన సొంతూరైన సతారాకు వెళ్లిన సమయంలో ఆమె ఈ తీవ్ర చర్యలకు పాల్పడ్డారు.
దీపాలీ ని వేధింపులకు గురిచేసిన అటవీశాఖ డిప్యూటీ కన్జర్వేటర్(డీసీఎఫ్) వినోద్ శివకుమార్ను పోలీసులు నాగ్పుర్ రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. అక్కడినుండి నేరుగా అమరావతికి తరలించి కేసు నమోదు చేశారు. శివకుమార్ తనను కొన్ని నెలలుగా లైంగికంగా, మానసికంగా ఎలా వేధించిందీ దీపాలీ ఆ లేఖలో వివరించారు. శివకుమార్ ఆగడాలపై పలుమార్లు ఆయన సీనియర్, ఎంటీఆర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్.శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదని ఆమె లేఖలో రాశారు. ఈ ఏడాది ఫిబ్రవరి మొదట్లో గర్భవతిగా ఉన్న కూడా మూడు రోజుల పాటు పెట్రోలింగ్ నిర్వహించాల్సి ఉందంటూ శివకుమార్ తనతో పాటు బలవంతంగా అడవిలోకి తీసుకెళ్లాడని ఆమె సన్నిహితురాలు ఒకరు తెలిపారు. గర్భిణి అని తెలిసి కూడా కిలోమీటర్ల దూరం నడిపించాడని, గర్భస్రావం కావడంతో దీపాలీ తీవ్ర మనోవేదనకు గురైందని వివరించారు. దీపాలి లేఖలోని ఆరోపణలపై ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ మాట్లాడుతూ... అన్ని కోణాల్లో విచారణ జరిపిస్తామని, నిందితులను వదిలిపెట్టేది లేదని. నిందితుడు శివకుమార్ను సస్పెండ్ చేస్తూ అటవీశాఖ ముఖ్య కన్జర్వేటర్(మంత్రాలయ) అరవింద్ ఆప్టే శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంటీఆర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్.శ్రీనివాస్రెడ్డి బాధ్యతలను మరొక అధికారికి బదిలీ చేసినట్లు అరవింద్ ఆప్టే వెల్లడించారు.