డెల్టా, లాంబ్డా వేరియంట్లతో మహా ముప్పు! ప్రపంచ దేశాలకు WHO అలర్ట్..
posted on Jul 7, 2021 @ 11:27AM
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ముప్పు ఇప్పట్లో పోదా? వైరస్ మరింతగా విజృంభించబోతుందా? అంటే అవుననే అంటున్నాయి వైద్య సంస్థలు. కాలానికి తగ్గట్టుగా మార్పులు చేసుకుంటున్న కరోనా… కొత్త వేరియంట్ల రూపంలో విరుచుకుపడబోతోందని చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే చెబుతోంది. కరోనా ముప్పు ఇంకా ఉందని, ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని ప్రపంచ దేశాలకు తాజాగా హెచ్చరికలు జారీ చేసింది డబ్ల్యూహెచ్ వో. ప్రస్తుతం డెల్టా వేరియంట్ పలు దేశాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. డెల్టాతో పాటు లాంబ్డా వేరియంట్ల మళ్లీ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ వేరియంట్ను గతంలో C.37 గా ప్రకటించింది WHO. కరోనా వైరస్ నుంచి రూపాంతరం చెందుతున్న ఏడవ సరికొత్త వేరియంట్గా దీన్ని వెల్లడించింది.
భారత్ లో సెకండ్ వేవ్ కల్లోలానికి కారణమైంది డెల్టా వేరియంట్. ఇప్పుడది 96 దేశాల్లో విస్తరించింది. పలు దేశాల్లో డెల్టా ప్లస్ కలవరపెడుతుంటే..మరికొన్ని దేశాల్లో లాంబ్డా వణుకు పుట్టిస్తోంది.దక్షిణ అమెరికా, లాటిన్ ఆమెరికా దేశాల్లో లాంబ్డా వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. లాంబ్డా ధాటికి గజగజలాడిపోతోంది బ్రిటన్. కొత్త వేరియంట్ డెల్టా కంటే లామ్డా చాలా ప్రమాదకరమైనదని బ్రిటన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు అంతర్జాతీయ ప్రయాణికుల్లో 6 కేసులు నమోదయ్యాయి. గత నాలుగు వారాల్లో బ్రిటన్తో పాటు..మరో 30 దేశాలకు వ్యాప్తించింది ఈ లాంబ్డా వేరియంట్. దీంతో ఈ స్ట్రెయిన్పై ఫోకస్ పెట్టాల్సిందేనని ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ
పెరూ దేశంలో తొలి లాంబ్డా వేరియంట్ ఉద్భవించిందని ప్రపంచ ఆరోగ్య శాఖ భావిస్తోంది. ఈ వైరస్ ద్వారా దాదాపు 80% ఇన్ఫెక్షన్లు వ్యాప్తిస్తున్నట్లు తెలిపింది. ఇది డిసెంబర్ 2020 నాటి నమూనాలలోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది పొరుగున ఉన్న చిలీలో కూడా లాంబ్డా వేరియంట్ ప్రబలుతోంది. లాంబ్డా అనుమానాస్పద సమలక్షణ చిక్కులతో అనేక ఉత్పరివర్తనాలను కలిగి ఉందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఈ జన్యుసంబంధమైన మార్పులతో సంబంధం ఉన్న పూర్తి స్థాయిలో ప్రస్తుతం పరిమిత సాక్ష్యాలు ఉన్నాయి. ప్రతికూల చర్యలపై ప్రభావాన్ని బాగా అర్థం చేసుకోవడానికి, వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి సమలక్షణ ప్రభావాలపై మరింత బలమైన అధ్యయనాలు అవసరమని WHO ఒక ప్రకటనలో తెలిపింది టీకాల నిరంతర ప్రభావాన్ని ధృవీకరించడానికి మరిన్ని అధ్యయనాలు చేయాల్సి ఉందని పేర్కొంది. ప్రపంచ దేశాలు కరోనా పోయింది అనుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని హెచ్చరించింది.