ప్రతి కొత్త వేవ్ లో ఫార్మాకు లాభాల వేవ్.. వాక్సిన్ కంపెనీల మాయాజాలమే ఒమిక్రాన్?
కొవిడ్ కొత్త వేరియంట్, ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచాన్ని చుట్టే స్తోంది. ఇంతవరకు మరే వేరియంట్ విస్తరించనంత వేగంగా ఒమిక్రాన్ పరుగులు తీస్తోంది. ఒమిక్రాన్ తొలి కేసు నమోదైన 26 రోజుల్లోనే, వందకు పైగా దేశాలకు పాకింది. వంద వేలమంది కంటే ఎక్కువ మందికి సోకింది. మరో వంక ఒమిక్రాన్ కరోనా మహామ్మారి వేరియంట్లలో ఆఖరి వేరియంట్ అని, ఒమిక్రాన్ తో మహమ్మారి మరణిస్తుందని ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి. ఆశ పడుతున్నాయి. కొత్త సంవత్సరం 2022లో మహమ్మారి మాయమై పోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం నమ్మ బలుకుతోంది... కానీ, అది జరగదు. 2022 లో మహమ్మారి ప్రపంచాన్ని వదిలి పోదు .. మనతోనే ఉంటుంది.
ఎందుకంటే, మహమ్మరి కంటే మరింత ప్రమాదకరమైన వైరస్ ఫార్మా కంపెనీలు. ఈ కంపెనీలు వ్యూహాన్ మహమ్మారి వెళ్ళిపోతానన్నా .. వెళ్ళనీయవు. ఎందుకంటే వ్యూహాన్ వైరస్ ఫార్మా కంపెనీల పాలిట కల్పతరువు. కాసుల పంట పండించే బంగారు ఖని. ప్రతి కొత్త వేవ్’లో ఫార్మా కంపెనీలు లాభాల వేవ్’నే చూస్తున్నాయి. ఎన్ని వేవులు వస్తే అంతగా ధనవంతులు కావచ్చని కంపెనీలు కొత్త వేరియంట్ల కోసం ఎదురు చూస్తున్నాయి.. ముఖ్యంగా ఫైజర్, మోడెర్నా ఫార్మా కంపెనీలకు మహమ్మారి ఆరాధ్య దైవం. మహామ్మారి పుణ్యాన, ఈ రెండు కంపెనీలు అనూహ్య లాభలు సొంత చేసుకుంటున్నాయి. అమెరికా పార్లమెంట్ సభ్యుడు, బర్నీ స్టాండర్డ్, ఒమిక్రాన్ వేవ్ మొదలైన వారం రోజుల్లోనే ఈ రెండు కంపెనీలలో పెట్టు పదులు పెట్టిన ఎనిమిది మంది సంపద 10 బిలియన్ డాలర్లు పెరిగింది . అంటే వారం రోజుల్లో ఈ ఎనిమిది మంది 10 బిలియన్ డాలర్ల లాభాలు పొందారు, సని వివరించారు. అయిందేదో అయింది .. ఇక నైనా ధనాపేక్ష కాస్త తగ్గించుకోమని ఆ రెండు కంపెనీలను కోరారు.
ఫైజర్, మోడెర్నా ఫార్మా కంపెనీలు గడచిన రెండు సంవత్సరాలలో బిలుయన్ల డాలర్ల లాభాలను పొందాయి. 2020లో మోడెర్నా బిలియన్ డాలర్ల నష్టాల్లో వుంది. కానీ, అదే కంపెనీ, 2021లో 7 బిలయన్ డాలర్లు లాభాలు అర్జించింది. అయితే ఫైజర్ తో పోల్చుకుంటే అది తక్కువే .. ఫైజర్ 2020 లో 8 బిలియన్ డాలర్లు లాభాలు అర్జించింది, 2021లో ఇంతవరకు 19 బిలియన్ డాలర్లు లాభాలను ఆర్జించాయి. అంటే ఒకే ఒక్క సంవత్సర కాలంలో ఫైజర్, 124 శాతం లాభాలు అర్జించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు, ప్రభుత్వాలు,శాస్త్రవేత్తలు, డాక్టర్లు కరోనా మహమ్మరి మరణాన్ని కోరుతున్నారు, కానీ ఫార్మా కంపెనీలు ... ఇంకా ఇంకా అనేక వేరియంట్లు, వేవులు రావాలని కోరుకుంటున్నాయి. ప్రార్ధనలు చేస్తున్నాయి అంటే ఆశ్చర్య పోనవసరం లేదంటున్నారు.
ఫార్మా కంపెనీలకు ఇంతింత లాభాలు ఎలా వస్తున్నాయని చూస్తే ...ఇంకా ఇంకా ఆశ్చర్యం వేస్తుంది. ఫైజర్ ఒక డోస్, ఒక షాట్ వాక్సిన్ తయారు చేయడానికి చేసే ఖర్చు ఎంతో తెలుసా, బ్రిటిష్ పత్రికలో వచ్చిన కథనం ప్రకారం, ఒక్క ఫైజర్ షాట్ తయారు చేయడానికి అయ్యే కర్చు కేవలం ఒకే ఒక్క డాలర్ ,బ్రిటిష్ కరెన్సీలో అయితే 76 పెన్నీస్ అదే డోస్, అదే షాట్’ను ఫైజర్ బ్రిటీష్ ప్రభుత్వానికి 30 డాలర్లకు/ 22 పాండ్స్’ కు అమ్ముతుంది. అంటే, 30 రెట్లు ఎక్కువకు అమ్ముతుంది. మోడెర్నాకు సంబందించి ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేక పోయినా ఉత్పాదక వ్యయం కంటే 4 నుంచి 14 రెట్లు ఎక్కువకు అమ్ముతోందని సమాచారం. ఇటీవల దక్షిణ అఫ్రికాకు మోడెర్నా ఒమిక్రాన్ కట్టడికి ఒక్కొక్క డోసు వాక్సిన్ను 30 నుంచి 42 డాలర్స్ కు విక్రయించింది. ఇది ... ఉత్పాదక వ్యయం కంటే, 15 రెట్లు ఎక్కువ ఉటుందని అంటున్నారు.
అయితే కంపెనీల వాదన ఇంకోలా వుంది. రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ - R &D కి ఖర్చు చేసిన సొమ్మును కూడా రికవరీ చేసుకుంటున్నామని అంటున్నాయి .. కానీ, R &D కి అమెరికా ప్రభుత్వమే, ఫైజర్ కు రెండు బిలయన్ డాలర్లు, మోడెర్నాకు రెండున్నర బిలియన్ డాలర్లు నిధులు సమకూర్చింది. ఇవి గాక, జర్మనీ ముందస్తు కొనుగోలు ఒప్పందంలో భాగంగా మరో రెండు బులియన్ డాలర్లు సమకూర్చింది. అంతే ఈ రెండు కంపెనీలు ప్రభుత్వ పరిశోధనా సంస్థలతో కలిసి, వాక్సిన్ డెవలప్ చేశాయి. ప్రభుత్వ సంస్థలలో పనిచె శాస్త్రవేత్తలు ఇందులో భాగస్వాములయ్యారు. అయినా ... పేటెంట్ హక్కులు కంపెనీల చేతుల్లో పెట్టి ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయించి ప్రజలను, ప్రభుత్వాలను దోచుకుంటున్నా నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి.
అయితే వాక్సిన్ పేటెంట్ హక్కులు వ్యూహాన్ వైరస్ నుంచి అనూహ్య లాభాలు అర్జిస్తున్న ఫైజర్, మోడెర్నా చేతుల్లో ఉన్నత వరకు మహమ్మారి మనల్ని వదిలి పోదని అంటున్నారు. అందుకే అమెరికా పార్లమెంట్ సభ్యుడు అన్నట్లుగా ఫైజర్, మోడెర్నా .. అయిందేదో అయింది ఇకనైనా ... ధన దాహాన్ని తగ్గింసుకుంటేనే ప్రపంచానకి వ్యూహాన్ మహామ్మారి నుంచి మానవాళికి విముక్తి లభిస్తుంది