షణ్ముక్- దీప్తి సునయన లవ్ బ్రేకప్.. యూట్యూబ్ స్టార్స్ భావోద్వేగ పోస్టులు
posted on Jan 1, 2022 @ 2:12PM
అనుమానించినట్లే జరిగింది. కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారమే నిజమైంది. సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన దీప్తి సునయన, షణ్ముఖ్ జంట విడిపోయింది. కొత్త సంవత్సం రోజునే ఇద్దరు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా బ్రేకప్ ప్రకటించారు. తామిద్దరం విడిపోతున్నామంటూ వేరు వేరుగా ఎమోషనల్ పోస్టులు పెట్టారు.
సోషల్ మీడియాలో దీప్తి సునయన, షణ్ముఖ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు కలిసి పలు షార్ట్ ఫిలిమ్స్ తోపాటు కవర్ సాంగ్స్ లోనూ మెరిశారు. సోషల్ మీడియాలో ఈ ఇద్దరికీ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరు లవ్ లో ఉన్న విషయం కూడా అందరిలో తెలుసు. అయితే గత కొద్ది రోజులుగా వీరిద్దరు విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్చల్ చేశాయి. తాజాగా ఈ వార్తలు నిజమేనని తేలిపోయింది. షణ్ముఖ్ జశ్వంత్ తో విడిపోతున్నట్లు అతని ప్రేయసి దీప్తి సునయన తెల్చీ చెప్పేసింది. తామిద్దరం విడిపోతున్నామంటూ తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది దీప్తి.
దీనిపై షణ్ముఖ్ స్పందించాడు. నిర్ణయాలు తీసుకునే హక్కు దీప్తికి ఉందని. మా దారులు వేరని తెలిసిందని.. ఇక మా బంధం 5 ఏళ్ళు అందంగా గడిచిందని తెలిపాడు షణ్ముఖ్. నాకు తాను హ్యాపీగా ఉండటమే కావలి అంటూ రాసుకొచ్చాడు. ఈ ఐదేళ్లలో నీ సపోర్ట్ తో చాలా నేర్చుకున్నాను.. మంచి వ్యక్తిగా ఎదిగాను.. అని ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు షణ్ముఖ్.
ముందుగా దీప్తి సునయన ఇన్ స్టాలో బ్రేకప్ గురించి పోస్ట్ చేసింది. “నా శ్రేయోభిలాషులు మరియు స్నేహితులందరికీ ఎంతో ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. నేను, షణ్ముఖ్ పరస్పరం మా వ్యక్తిగత జీవితాలలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఈ ఐదు సంవత్సరాలు మేము సంతోషంగా ఉన్నాం. ప్రేమ, ఎదుగుల సమయంలో మాలోని రాక్షాసులతో పోరాటం చాలా కష్టం. మీరందరు కోరుకున్నట్టే మేమిద్దరం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది చాలా కాలంగా జరుగుతుంది. కానీ సోషల్ మీడియాలో కనిపించినంత సులభంగా మాత్రం కాదు. మేమిద్దరం కలిసి ఉండేందుకు ప్రయత్నించాము. కానీ జీవితానికి అవసరమైన వాటిని విస్మరించాం. మా మార్గాలు వేరని తెలుసుకున్నాం. అందుకే మా దారులలో వెళ్లేందుకు ఇద్దరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ క్లిష్ట సమయంలో మీరు మాకు అండగా ఉండండి. అలాగే మా ప్రైవసీకి భంగం కలిగించరని కోరుకుంటున్నాం.” అంటూ సుదీర్ఘ పోస్ట్ చేసింది దీప్తి సునయన.
బిగ్బాస్ షోలోకి రాకముందే షణ్ముఖ్ దీప్తి ప్రేమలో ఉన్నారు. కానీ బిగ్బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత షణ్ముఖ్ సిరితో ఎక్కువగా కనెక్ట్ అయ్యాడు. బిగ్బాస్ జర్నీలో వీరిద్దరి శ్రుతిమించిన ప్రవర్తన, హగ్గులు, ముద్దులు ప్రేక్షకులకు చిరాకు తెప్పించాయి. ఇరువురి కుటుంబసభ్యులు వచ్చి హగ్గులు తగ్గించండి అని చెప్పినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. అలాగే ప్రతిసారి ఫ్రెండ్ షిప్ హగ్ అంటూ చెప్పడంతో వీరిద్దరిపై మరింత నెగిటివిటి పెరిగింది. ఇవే కాకుండా.. ప్రతిసారి సిరిని షణ్ముఖ్ కంట్రోల్ చేయడం.. ఆమె ఎవరితో మాట్లాడిన సహించలేకపోవడం.. చూపులతోనే సిరిని కంట్రోల్ చేయడం వంటివి షణ్ముఖ్ ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేశాయి. దీంతో టైటిల్ రేసులో ముందంజలో ఉన్న షణ్ముఖ్ చివరిగా రన్నరప్ గా మిగిలాడు. కాగా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అనంతరం.. షణ్ముఖ్, దీప్తి విడిపోయారంటూ నెట్టింట్లో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ విషయంపై షణ్ముఖ్ స్పందిస్తూ… ప్రస్తుతం దీప్తి తనపై అలిగి బ్లాక్ చేసిందని.. త్వరలోనే హైదారాబాద్ వెళ్లి కలుస్తానంటూ చెప్పుకొచ్చాడు.