బందరు వైసీపీలో పీక్స్ కు వర్గ పోరు

బందర్ వైసీపీలో వర్గ పోరు పీక్స్ కు చేరింది. ఎంపీ వల్లభనేని బాలశౌరి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నానిల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండిపోయేంత స్థాయిలో వైరం కొనసాగుతోంది. ఏ చిన్న అవకాశం వచ్చినా పేర్ని నాని, బాలశౌరి తమ మధ్య విభేదాల్ని పబ్లిగ్గానే బయటపెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో బందరు పోర్టు పనుల విషయంలో కూడా ఇరువురూ పోటాపోటీగా పరస్పర  విరుద్ధ ప్రకటనలు చేశారు. పేర్ని నాని, బాలశౌరి మధ్య ఆధిపత్య పోరుతో వైసీపీ నేతలు, కార్యకర్తలు   తీవ్ర అయోమయంలో, గందరగోళంలో పడిపోతున్నారు. 2022 డిసెంబర్ లోనే బందరు పోర్టు పనులు ప్రారంభం అవుతాయని స్థానిక ఎంపీ  బాలశౌరి గతంలో ప్రకటించారు. అయితే.. ఆ ప్రకటనకు పూర్తి విరుద్ధంగా   పేర్ని నాని బుధవారం(నవంబర్ 30)న మరో కీలక ప్రకటన చేశారు. వచ్చే జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరిలో పోర్టు పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారన్నది ఆ ప్రకటన సారాంశం. డిసెంబర్ 21న మచిలీపట్నం పోర్టుకు శంకుస్థాపన అని ఎంపీ బాలశౌరి ఎందుకు అన్నారో తనకు తెలియదని నాని ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంతో వారిరువురి మధ్యా పవర్ పొలిటికల్ వార్ ఏ రేంజ్ లో ఉందో అర్దం చేసుకోవచ్చు. అంతే కాకుండా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణం ఆమోదం లభించిందనే ఆనందంలో బాలశౌరి ఉబ్బితబ్బిబ్బై పోర్టు పనుల ప్రారంభం గురించి తొందరపడిన కోయిలలా ముందే చెప్పేవారంటూ  సెటైర్ వేయడం గమనించదగ్గ అంశం. కొద్ది రోజుల క్రితం మచిలీపట్నంలో ఎంపీ బాలశౌరి పర్యటనను పేర్ని నాని ముఖ్య అనుచరుడైన కార్పొరేటర్ అస్ఘర్ అడ్డుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇనకుదురుపేటలోని ముస్లిం శ్మశానవాటిక అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్థానికులు కోరడంతో అక్కడికి బాలశౌరి వెళ్లినప్పుడు.. తనకు చెప్పకుండా తన డివిజన్ లో ఎంపీ పర్యటించడం సరికాదని కార్పొరేటర్ అస్ఘర్ అడ్డుకునేందుకు యత్నించారు. బాలశౌరి వెనుదిరిగి వెళ్లిపోవాలంటూ తన అనుచరులను మోహరించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కార్పొరేటర్ అస్ఘర్.. పేర్ని నాని ముఖ్య అనుచరుడు కావడంతో ఆ ఆందోళన వెనుక పేర్ని నాని హస్తం ఉందని బాలశౌరి వర్గం అప్పట్లోనే విమర్శిలు చేసింది. ఆరోపణలు గుప్పించింది.  ఎంపీ బాలశౌరి కూడా పేర్ని నానిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని నిప్పులు చెరిగారు. ప్రత్యర్థి పార్టీ టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణతో వారానికోసారైనా మాట్లాడకపోతే పేర్ని నానికి నిద్రపట్టదని బాలశౌరి దుమ్మెత్తి పోశారు. సొంత పార్టీ ఎంపీ అయిన తననే మచిలీపట్నం రానివ్వకుండా పేర్ని నాని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బందరు నీ జాగీరా? అని పేర్ని నానిని బాలశౌరి నిలదీశారు. ఇకపై బందరులోనే ఉంటా.. ఎవరేం చేస్తారో చూస్తా, ఎంపీ అంటే ఏంటో తెలిసివచ్చేలా చేస్తా అంటూ బాలశౌరి నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. ఒకప్పటి ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య జ్ఞాపకార్థం బందరులో మ్యూజియం, ఆడిటోరియం నిర్మించేందుకు ఎంపీ బాలశౌరి ప్రయత్నించారు. అయితే.. ఆ రెండు పనులు జరిగితే బాలశౌరికి ఎక్కడ క్రెడిట్ వచ్చేస్తుందో అనే భయంతో పేర్ని నాని అడ్డుపడ్డారనే ప్రచారం కూడా స్థానికంగా జరుగుతోంది. జగన్ కు పెద్ద పాలేరునని స్వయంగా ప్రకటించుకున్నా తన మంత్రి పదవి ఊడిపోవడానికి కారణం ఎంపీ వల్లభనేని బాలశౌరి అనే డౌట్ పేర్ని నానికి ఉందంటారు. సొంత సామాజికవర్గాన్ని హేళన చేసినా నానికి మంత్రి పదవి నిలబడలేదు. పేర్ని నానిని   సొంత సామాజికవర్గం కూడా దగ్గరికి రానివ్వడం లేదు. ఇలా రెండు విధాలా తనను భ్రష్టుపట్టించింది బాలశౌరి అనే ఆగ్రహం పేర్ని నానికి ఉందంటారు. బాలశౌరికి సీఎం జగన్ తో వ్యాపార భాగస్వామ్యం ఉందని పేర్ని నానికి తెలుసు. అందుకే బహిరంగంగా ఆయనను విమర్శించరు కాని ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎంపీ గా బాలశౌరిని బందరులో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ఆహ్వానించరు. అసలు బందరులో బాలశౌరి కాలు పెట్టనివ్వకుండా వెనక నుంచి అంతా చక్కబెట్టేస్తుంటారని పార్టీ శ్రేణులే అంటుంటాయి. వచ్చే ఎన్నికల్లో ఎంపీ బాలశౌరి బందరు అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగుతారనే ప్రచారం జరుగుతోంది. దీంతో సిటింగ్ ఎమ్మెల్యే పేర్ని నానిని భయం వెంటాడుతోందని, ఆ క్రమంలోనే బాలశౌరికి వ్యతిరేకంగా నాని పావులు కదుపుతూనే.. మరో పక్కన ఎంపీకి వ్యతిరేకంగా స్థానికంగా ఆందోళనలు, ఆరోపణలు, విమర్శలు చేయిస్తున్నారని పార్టీ శ్రేణుల్లోనే ఒక చర్చ అయితే జరుగుతోంది. దాంతో పాటు నియోజకవర్గంలోని మొత్తం తన సొంత సామాజికవర్గాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు పేర్ని నాని ప్రయత్నిస్తున్నారని, అది బాలశౌరికి నచ్చడం లేదని చెబుతున్నారు. మొత్తానికి పేర్ని నాని, బాలశౌరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయని, ఒకరు నంది అంటే ఇంకొకరు పంది అంటారనేది బందరులో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యంగా మారింది. ఒకే పార్టీలో ఉన్నా.. ఒకే సామాజికవర్గానికి చెందినా.. పేర్ని నాని- వల్లభనేని బాలశౌరి మధ్య ఇంతలా వైరం కొనసాగుతుండడం గమనించదగ్గ విషయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

తెలంగాణ తదుపరి డీజీపీ రవిగుప్తా?! సీవీ ఆనంద్ కు నిరాశే!

తెలంగాణ డిజీపీ ఎం. మహేందర్ రెడ్డి సరిగ్గా మరో నెలలో (డిసెంబర్ 31)  పదవీ విరమణ చేయనున్నారు. దీంతో రాష్ట్ర తదుపరి డీజీపీ ఎవరన్న చర్చ మొదలైంది. అయితే అందరూ ఇప్పటి వరకూ ఆటోమేటిగ్గా హైదరరాబాద్ సీసీ సీవీ ఆనంద్ డీజీపీగా ప్రమోట్ అవుతారని భావిస్తున్నారు. అయితే కేసీఆర్ మొగ్గు మాత్రం ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా ఉన్న రవి గుప్తాపై ఉందని అంటున్నారు. అందరూ ఊహిస్తున్నట్లుగా సీవీ ఆనంద్ కాకుండా మహేందర్ రెడ్డి సక్ససర్ గా తెలంగాణ డీజీపీ బాధ్యతలు రవిగుప్తా చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  వాస్తవంగా  సీనియారిటీ ప్రకారం ఐపీఎస్ అధికారులు ఉమేష్ షరాఫ్, గోవింద్ సింగ్, అంజనీకుమార్ గుప్త, రవిగుప్తా, రాజీవ్ రతన్, సీవీ ఆనంద్ లు డీజీపీ రేసులో ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకూ ఉన్న అంచనాల ప్రకారం కేసీఆర్ ఇస్తున్న ప్రాధాన్యత ఆధారంగా సీవీ ఆనంద్ కు డీజీపీగా పదోన్నతి దక్కుతుందని అంతా భావిస్తూ ఉన్నారు. అయితే కేసీఆర్ మాత్రం సీవీ ఆనంద్ విషయంలో ఒకింత అసంతృప్తిగా ఉన్నారనీ, అందుకే ఆయన రవి గుప్తా వైపు మొగ్గు చూపుతున్నారని పోలీసు వర్గాలలోనే వినిపిస్తోంది. అందుకే సీవీ ఆనంద్ ను ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసు దర్యాప్తునకు ఏర్పాటు చేసిన సిట్ నేతృత్వాన్ని సీవీ ఆనంద్ కు అప్పగించి సైడ్ ట్రాక్ చేశారని అంటున్నారు. అయితే డీజీపీ పదవి రేసులో బలంగా ఉండాలన్న ఉద్దేశంతో సీవీ ఆనంద్ సిట్ దర్యాప్తులో చురుకుగా, దూకుడుగా వ్యవహరిస్తూ మళ్లీ కేసీఆర్ మన్ననలు పొందాలని ప్రయత్నిస్తున్నారని పోలీసు వర్గాలు అంటున్నాయి. అయితే ఇప్పటికే కొత్త డీజీవీ ఎవరన్న విషయంలో కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చేశారని చెబుతున్నారు. ఇప్పటికే సీనియారిటీ ప్రకారం టాప్ లో ఉన్న 1989 బ్యాచ్‌కు చెందిన ఉమేష్‌ షరాఫ్ వచ్చే ఏడాది జూన్ లో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయనను డీజీపీగా నియమించే అవకాశాలు లేవు. ఇక సీనియారిటీ జాబితాలో 1990 బ్యాచ్ కు చెందిన  గోవింద్‌ సింగ్ గత నవంబర్ లోనే పదవీ విరమణ చేయడంతో ఆయన రేసులో లేకుండా పోయారు. ఇక  ఆ బ్యాచ్ కు చెందిన , అంజనీకుమార్, రవిగుప్తాలలో కేసీఆర్ మొగ్గు రవి గుప్తా వైపే ఉందని చెబుతున్నారు.  ఏడాది జూనియర్ అయినా సీవీ ఆనంద్ డీజీపీ రేసులో బలంగా ఉన్నారనీ, ఆయననే కేసీఆర్ ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయనీ ఇటీవలి కాలం వరకూ గట్టిగా వినిపించింది. అయితే కొన్ని కారణాల వల్ల కేసీఆర్ కు సీవీ ఆనంద్ పై విశ్వాసం తగ్గిపోయిందని అంటున్నారు. అందుకే ఆయనను కాదని రవి గుప్తా వైపే మొగ్గు చూపుతున్నారని పోలీసు వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. అందుకే సీట్ కు పంపించారని అంటున్నారు. ఇక రాష్ట్ర డీజపీ నియామకానికి సంబంధించి ప్యానల్ జాబితాను వచ్చే నెల 2వ వారంలో యూపీఎస్పీకి పంపే అవకాశం ఉందని అంటున్నారు. ఆ జాబితాలో పంపే పేర్లలో సీఎం మాత్రం రవిగుప్తా వైపే మొగ్గు చూపుతారని అంటారు.  రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ప్యానల్ జాబితా నుంచి యూపీఎస్పీ ముగ్గరు పేర్లను సూచిస్తుంది. ఆ ముగ్గిరిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం డీజపీపీగా నియమిస్తుంది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అభీష్ఠం మేరకే రవిగుప్తా ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ విరమణ తరువాత రాష్ట్ర కొత్త డీజీపీగా బాధ్యతలు చేపట్టే అవకాశాలే మెండుగా ఉన్నాయి. కొత్త సంవత్సరం మొదటి తేదీన రవిగుప్తా తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. డీజీపీ పోస్టు ఆశిస్తున్న సీవీ ఆనంద్ కు ఈ సారి అయితే నిరాశ తప్పదని పోలీసు వర్గాలే అంటున్నాయి. అయితే రాష్ట్ర పోలీసు క్యాడర్ లో నంబర్ 2 ర్యాంకుకు ఆయనకు పదోన్నతి లభించే అవకాశాలున్నాయని అంటున్నారు. బహుశా రవి గుప్తా పదవీ విరమణ అనంతరం అప్పటికీ మరో ఏడాదికి పైగా సర్వీసు ఉన్న సీవీ ఆనంద్ కు డీజీపీ అయ్యే అవకావం ఉంటుందని చెబుతున్నారు.  

ఆస్తుల అటాచ్.. జేసీ ప్రభాకరరెడ్డికి ఈడీ షాక్

తెలుగుదేశం నాయకుడు, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఆయనతో పాటు ఆయన కుమారుడి ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. వాహనాల కుంభకోణం కేసులో ఈడీ ఈ మేరకు చర్యలు తీసుకుంది. జేపీ ప్రభాకరరెడ్డి, ఆయన కుమారుడివి కలిపి మొత్తం 22.10 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.   బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్ లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.  బీఎస్ 3 వాహనాలకు నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించి బీఎస్ 4గా మార్చినట్టు ఈ దర్యాప్తులో ఈడీ గుర్తించింది. ఇందుకు సంబంధించి నాగలాండ్, కర్నాటక, ఏపీలో రిజిస్ట్రేషన్లు జరిగినట్టు గుర్తించింది. ఆర్టీవో అధికారులతో నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్స్ చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈడీ విచారణ ప్రారంభించిన సంగతి విదితమే. అలాగే అశోక్ లేలాండ్ నుంచి స్క్రాప్ లో వాహనాలు కొనుగోలు చేసినట్టు గుర్తించింది.  ఇలా ఉండగా రాజకీయ కక్షతోనే ఈడీ వేధిస్తోందని జేసీ ప్రభాకరరెడ్డి అంటున్నారు.   ఇంతకీ కేసేమిటంటే. బీఎస్ 3 వాహనాలను సుప్రీంకోర్టు నిషేధించింది. కానీ ఆ వాహనాలనుబీఎస్ -4 వాహనాలుగా చూపించి జేసీ ప్రభాకరరెడ్డి రిజిస్ట్రేషన్ చేయించారన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేసింది.  స్క్రాప్ కింద అశోక్ లేలాండ్ లో కొన్న 154 బస్సులను ఫోర్జరీ డాక్యూమెంట్లతో నాగాలాండ్ లో రిజిస్రేషన్ చేయించి  నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ)  పొందినట్లు ఏపీ రిజిస్ట్రేషన్ శాఖ ఆరోపించింది.   దీనితో జేసీ ట్రావెల్స్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించే ఇప్పుడు ఈడీ జేపీ ప్రభాకరరెడ్డి ఆస్తులను అటాచ్ చేసింది.

కడుపులో నాణేల గుట్ట!

అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన యువకుడికి ఎక్సరే తీసిన డాక్టర్లకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. అతడి కడుపులో ఏకంగా 187 నాణేలు కనిపించాయి. పొట్టలో అన్ని నాణేలు ఉండటం వల్లనే ఆ యువకుడు తరచూ వాంతులూ, కడుపు నొప్పితో బాధపడే వాడు. ఆ బాధకు కారణమేమిటని ఆస్పత్రికి వెడితే కడుపులో నాణేల గుట్ట ఉందని బయటపడింది. వైద్యులు శస్త్ర చికిత్స చేసి ఆ నాణేలను బయటకు తీశారు. ఇంతకీ అతడి కడుపులోకి అన్ని నాణేలు ఎలా వచ్చాయంటే.. ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. ఆ నాణేలన్నిటికీ అతడే మిగేశాడు. విచిత్రమైన మానసిక రుగ్మతతో బాధపడుతున్న అతగాడు అతనికి తెలియకుండానే నాణెం కనిపిస్తే గుటుక్కున మింగేస్తాడు. నాణేలను బయటకు తీసిన తరువాత ఆ యువకుడు కోలుకుంటున్నాడు. అయితే మళ్లీ మళ్లీ ఇదే సమస్య ఉత్పన్నమౌతుందని డాక్టర్లు అంటున్నారు. నాణేలను కడుపులోంచి తీసేసి చికిత్స చేసినంత మాత్రాన అతడు కోలుకున్నట్లు కాదనీ, ముందు అతడి మానసిక రుగ్మతకు చికిత్స చేయాలని వైద్యులు చెబుతున్నారు.  

ఒక కృష్ణుడు... ఇద్దరు రాధలు!

సినిమాలలో ట్రయాంగ్యులర్ లవ్ స్టోరీలు చాలానే చూశాం. ఒకే అబ్బాయిని ఇద్దరమ్మాయిలు ప్రేమించడం.. ఒకరి కోసం ఒకరు త్యాగాలకు సిద్ధపడటం సినిమాలలో చాలా కామన్. దసరాబుల్లోడు నుంచి అంతకు ముందూ, తరువాతా కూడా బోలెడన్ని ట్రయాంగ్యులర్ లవ్ సినిమాలు వచ్చాయి. సెంటిమెంట్ పండి విజయవంతమైన ఫార్ములా ఇది. అయితే.. వాస్తవంలో ఇలాంటి ట్రయాంగ్యులర్ లవ్ స్టోరీ ఎంత వయలెంట్ గా ఉంటుందో తెలుసా.. ఒకే అబ్బాయిని ప్రేమించిన ఇద్దరు అమ్మాయిలు ఆ అబ్బాయి కోసం రోడ్డున పడి కొట్టుకున్న ఈ సంఘటన వీళ్లసలు అమ్మాయిలేనా.. అసలు మనుషులేనా అనిపించేలా ఉంది. ఈ ఘటన బీహార్ లోని సోనేపూర్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే సోనేపూర్ లో  సంత జరుగుతోంది. అబాల గోపాలం ఆ సంతకు వచ్చారు. ఈ సంతకు వచ్చిన ఒక అమ్మాయికి తన ప్రియుడు మరో అమ్మాయితో కలిసి రావడం చూసింద. అంతే ఆగ్రహం పట్టలేక నా లవర్ తో తిరుగుతావా అంటే ఆమెతో గొడవకు దిగింది. నీ లవరేంటి నా లవర్ అంటూ ఆ అబ్బాయితో వచ్చిన అమ్మాయి కూడా గొడవకు సై అంది. అక్కడ నుంచీ మొదలైంది రచ్చ. అమ్మాయిల మధ్య గొడవ అలా ఇలా జరగలేదు. రచ్చ రచ్చ చేశారు ఇద్దరూ కలిసిజుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. బట్టలు చింపేసుకున్నారు. కాళ్లతో తన్నుకున్నారు. సంతలో ఉన్నవారందరికీ మంచి వినోదం పంచారు. అంతేనా ఒక అబ్బాయి కోసం ఇంత చేటు కొట్టుకుంటున్నారా అని జనం షాక్ అయ్యేలా చేశారు. ఇంతకీ ఆ ఇద్దరు అమ్మాయిల ముద్దుల ప్రేమికుడు కూడా వారి దెబ్బలాటకు భయపడి జారుకున్నాడు.  చివరాఖరికి పోలీసులు రంగ ప్రవేశం చేస్తే కాని వారి గొడవ ఆగలేదు.

ట్విస్టులేమీ లేవు... జవహర్ రెడ్డే ఏపీ కొత్త సీఎస్

ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్‌శర్మ పదవీ కాలం  నవంబర్ 30 (బుధవారం)తో ముగిసింది. ఆయన పదవీ విరమణ చేశారు.  ఈ నేపధ్యంలో  డిసెంబరు 1(గురువారం)న బాధ్యతలు చేపట్టబోయే కొత్త సీఎస్ ఎవరు అన్న సందిగ్ధతకు జగన్ సర్కార్ నవంబర్ 29(మంగళవారం) సాయంత్రం ఫుల్ స్టాప్ పెట్టేసింది.  కొత్త సీఎస్ విషయంలో పలు పేర్లు ప్రస్తావనలోకి వచ్చినట్లు పెద్దగా ప్రచారం జరిగినా.. చివరి నిముషంలో ట్విస్టులంటూ కొత్త పేరును తెరమీదకు తీసుకువచ్చినా చివరకు ఏపీ సీఎం జగన్ తానేం అనుకున్నారో అదే చేశారు.  1990 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి కెఎస్‌ జవహర్‌రెని  ఆంధ్రప్రదేశ్‌ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా  నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.  ప్రస్తుతం సీఎంఓలో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా పనిచేస్తున్న జవహర్‌రెడ్డి, ఏపీ సీఎస్‌గా 2024 జూన్‌ వరకూ ఆ పదవిలో కొనసాగుతారు. అంటే వచ్చే  అసెంబ్లీ ఎన్నికల వరకూ ఏపీ సీఎస్ గా జవహర్ రెడ్డే ఉంటారు. గురువారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. కొత్త సీఎస్ అన్న చర్చ వచ్చినప్పటి నుంచీ రేసులో ముందున్నది జవహర్ రెడ్డే. అయితే చివరి నిముషంలో మరో కొత్త పేరు తెరమీదకు వచ్చినా.. అది కేవలం ప్రచారంగానే మిగిలిపోయింది. అయితే ముందు నుంచి జవహర్ రెడ్డి వైపే మొగ్గుచూపిన ముఖ్యమంత్రి ఆఖరి క్షణంలో  పునరాలోచన చేయడం వెనక ఉన్న కారణం ఏమిటనే విషయంలో  మీడియాలో అయితేనేమి, రాజకీయ వర్గాల్లో అయితేనేమీ బారీ చర్చే జరిగింది. ముఖ్యమంత్రి జగన్ మనసు మార్చుకోవడం వెనక ( నిజంగా మార్చుకోలేదనుకోండి)   జవహర్ ‘రెడ్డి’ పేరే కారణం అంటూ మీడియాలోనూ, సోషల్ మీడియాలోనే కాక రాజకీయ వర్గాలలో కూడా పలు విశ్లేషణలు తెరమీదకు వచ్చాయి.  ప్రభుత్వంలో రెడ్డి డామినేషన్ అంటే వస్తున్న విమర్శల నుంచి బయటపడేందుకు జగన్ కొత్త సీఎస్ నియామకం విషయంలో పునరాలోచనలో పడ్డారని పలువురు తమతమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. అందుకు ఉదాహరణగా పార్టీ పదవుల విషయంలో  ముఖ్యమంత్రి కొంత మేరకు రెడ్డి ట్యాగ్ ప్రాధాన్యత తగ్గించి, బీసీలకు పార్టీ పదవుల్లో  ఒకింత ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు కూడా. అయితే జగన్ విమర్శలకు వెరవరనీ, ఎవరేమనుకున్నా పట్టించుకోరనీ జవహర్ రెడ్డినే అంటే తాను ముందు నుంచీ అనుకుంటున్న వ్యక్తినే ఏపీ కొత్త సీఎస్ గా నియమించారు. ముఖ్యమంత్రి మనసు మార్చుకున్నారు.. సీఎస్ గా జవహర్ రెడ్డి నియామకం విషయంలో పునరాలోచనలో పడ్డారంటూ వ్యక్తమైన అభిప్రాయాలలో మరో ముఖ్యమైనది ఏమిటంటే.. మోడీ జగన్ పై నజర్ పెట్టారు.. ఇంత కాలం ఇచ్చిన మద్దతు అండ ఇకపై ఉండదనడానికి నిదర్శనగానే కేంద్రం గిరిధర్ అమరణే పేరును తెరమీదకు తీసుకువచ్చింది.  అయతే ఎవరెన్ని విధాల విశ్లేషణలు చేసినా జగన్ జవహర్ రెడ్డి నియామకం విషయంలో మొదటి నుంచీ అదే అభిప్రాయంతో ఉన్నారు. పునరాలోచనలో పడలేదని నిర్దారణ అయిపోయింది.   జవహర్ రెడ్డి నియామకం కోసం జగన్ సర్కార్ బారీ కసరత్తే చేసింది.  మూడు బ్యాచ్‌లను కాదని, 1990 బ్యాచ్‌కు చెందిన జవహర్‌రెడ్డిని ఎంపిక చేసింది. నిజానికి 1987 బ్యాచ్‌కు చెందిన నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌,  1988 క్యాడర్‌కు చెందిన పూనం మాలకొండయ్య,  1989 బ్యాచ్‌కు చెందిన కరికల్‌ వలెవన్‌ను కాదని,  జవహర్‌రెడ్డిని సీఎస్‌గా ఎంపిక చేసింది.  అయితే ఇదేం కొత్త కాదు, ఇదే తొలి సారీ కాదు.. గతంలో కూడా అనేక ప్రభుత్వాలు సీనియర్లను కాదని.. తమకు నచ్చిన వారిని సీఎస్‌లుగా నియమించిన సంఘటనలు ఉన్నాయి. సంప్రదాయమూ ఉంది. ఇప్పుడు అదే సంప్రదాయాన్ని, జగన్‌ ప్రభుత్వం కొనసాగించింది. కాగా సీఎంఓలో ప్రస్తుతం జవహర్‌రెడ్డి స్థానాన్ని, సీనియర్‌ ఐఏఎస్‌ పూనం మాలకొండయ్య భర్తీ చేయనున్నారు. నిజానికి ఆమె కూడా సీఎస్‌ పదవి ఆశించారు. ముక్కుసూటి అధికారిగా పేరున్న పూనం, ఎవరు చెప్పినా వినరన్న ప్రచారం అధికారవర్గాల్లోనే కాదు జనసామాన్యంలో కూడా  ఉంది. నిజాయితీ పరురాలైన అధికారిణిగా ఆమెకు మంచి గుర్తింపు కూడా ఉంది. అందుకే సీఎస్ గా పూనం మాలకొండయ్య పేరును జగన్ కన్సిడర్ చేయలేదంటున్నారు.

ఇదేం పని.. ఐటీ ఉద్యోగుల కష్టాలు పగోడికి కూడా వద్దు!

విపరీతమైన పని ఒత్తిడి, నెత్తిమీద వేలాడుతున్న రిట్రెంచ్ మెంట్ కత్తి.. మొత్తానికి ఐటీ కొలువు చేసేవారికి ఉద్యోగ భద్రత లేకుండా పోయింది.  దీంతో ఐటీ ఉద్యోగుల పరిస్థితి కుడితిలో పడ్ట ఎలుకలా కొట్టుకుంటున్నట్లు ఉంది. వేళా పాలా లేదు.. సమయం సందర్భం లేదు.. పని పని.. సెలవు కావాలంటే కొలువు వద్దంటారన్న భయం. చెప్పిన పని చెప్పిన వెంటనే చేయకుంటే.. ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో నిత్య నరకంగా మారిపోయింది ఐటీ ఉద్యోగుల జీవితం. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసిన సమయంలో మొదలైన వర్క్ ఫ్రం హోం.. ఐటీ ఉద్యోగుల పాలిట కరోనాను మించిన మహమ్మారిగా మారిపోయింది. కరోనా వీడిపోయి మామూలు పరిస్థితులు ఏర్పడినా ఐటీ ఉద్యోగులకు మాత్రం ఆఫీసుకు వెళ్లి రావడంతో కొలువు ఆ రోజుకు అయిపోయినట్లు కాదు.. ఇంట్లో కూడా పని చేయకతప్పని అనివార్య పరిస్థితులు వచ్చి పడ్డాయి. ఆర్థిక మాంద్యం కారణంగా ఉద్యోగులకు కంపెనీలు ఉద్వాసన పలుకుతున్న కారణంగా ఏం అంటే ఏమౌతుందోనన్న భయంతో యాజమాన్యం ఏం చెబితే అది, ఎలా చెబితే అలా పని చేయాల్సిన పరిస్థితి దాపురించింది. దీంతో ఐటీ ఉద్యోగులకు ఒత్తిడే ఉద్యోగంగా మారిపోయింది. అదిగో అలాంటి స్థితిలో ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది. పెళ్లి పీటల మీద కూర్చుని కూడా ఆఫీసు పనిని తదేక దీక్షతో చేస్తున్న ఆ యువకుడి పరిస్థితి ఐటీ ఉద్యోగుల దురవస్థకు అద్దం పడుతోంది. సమయం, సందర్భం అంటూ లేకుండా 24 గంటలూ పని చేస్తేనే కొలువు భద్రం అన్న భావనను ఉద్యోగులలో కల్పించి మరీ యాజమాన్యాలు వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాయని ఐటీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ఐటీ కొలువులు చేస్తున్న వారందరికీ పెళ్లి పీటల మీదా పనితో కుస్తీపడుతున్న ఈ యువకుడి వీడియో బాగా కనెక్టయ్యింది. సెలవులు లేవు, శాలరీ హైకులు లేవు.. పని మాత్రం అంతులేకుండా ఉంటుంది.  ఇలాంటి కష్టాలు పగవాడికి కూడా వద్దు బాబోయ్ అని నెటిజన్లు అంటున్నారు.

జగన్మాతా ఇదేంటి తల్లీ!

తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు   షర్మిల అరెస్ట్.. ఈ నేపథ్యంలో ఆమె తల్లి   విజయమ్మ.. మీడియాతో మాట్లాడుతూ... ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డితో.. ఆ రాష్ట్రంతో మనకేంటమ్మ.. ఆ రాష్ట్రంతో.. జగన్ మోహన్ రెడ్డితో మనకేంటి? అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై  నెటిజన్లు..ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.  జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయనను ముఖ్యమంత్రిగా చేయడం కోసం ఆయన తల్లిగా వైయస్ విజయమ్మ పెద్ద ఎత్తన ప్రచారం చేశారని... ఆ క్రమంలో  జగన్ వల్లే రాజన్న రాజ్యం సాధ్యం అంటూ ఆమె క్లియర్ కట్‌గా చెప్పారని నెటిజన్లు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అలాగే.. తన బిడ్డ  జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ ఆమె ప్రజల మధ్యకు వెళ్లి మరీ ఓట్లు  అడిగారని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇక తన సోదరుడు  జగన్ కోసం జగనన్న వదిలిన బాణాన్నంటూ   షర్మిల సైతం పాదయాత్ర చేపట్టిన సంగతిని గుర్తు చేస్తున్నారు. అ జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కే వరకు.. ఎంత చేయాలో  అంతా విజయమ్మ,   షర్మిల అంతా చేశారని.. కానీ ఆయన అందలం ఎక్కిన తర్వాత జగన్ వీరికి దూరంగా పెట్టడం వల్లనే .. వీరిద్దరు పక్క రాష్ట్రం తెలంగాణకు కాందిశీకుల్లా చేరుకున్నారనీ, ఆ తరువాత ఏపీవైపు చూసిందే లేదని నెటిజన్లు చెబుతున్నారు. గతంలో ఏపీలో జగన్ ను గద్దెనెక్కించడానికి అంతగా పాటుపడిన విజయమ్మకు ఇఫ్పుడు ఏపీ ప్రజలు సమస్యలతో సతమతమౌతుంటే  పట్టదా అని నిలదీస్తున్నారు.   జగన్ అధికార పీఠం ఎక్కిన తర్వాత..  రాజధాని అమరావతి  నుంచి నిన్న మొన్నటి ఆక్వా రైతుల సమస్యల వరకు  అన్ని సమస్యలేననీ, అలాగే మూడు రాజధానులు  సహా జగన్ నిర్ణయాలన్నీ ప్రజా వ్యతిరేకంగానే ఉన్నాయనీ, నాడు తన కుమారుడికి ఒక్క చాన్స్ ఇవ్వాలంటూ ప్రజల వద్దకు వచ్చి చేతులు జోడించి మరీ వేడుకున్న విజయమ్మకు.. ఇప్పడు ఏపీ సమస్యలు పట్టవా? ఏపీతో సంబంధం లేదా అని ప్రశ్నిస్తున్నారు.  మాట తప్పం.. మడం తిప్పం అంటూ జగన్ ఇచ్చిన హామీలూ, వాగ్దానాలు ఇంత వరకూ అమలు కాలేదనీ, వాటి గురించి మీ కుమారుడిని నిలదీయాల్సిన బాధ్యత నాడు జగన్ ను గెలిపించాలని కోరిన మీకు లేదా అని ప్రశ్నిస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి వైయస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా నాడు మద్దతు ప్రకటించారని.. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవీ ఏవీ జరగలేదని నెటిజన్లు   వివరిస్తున్నారు. వీటిపై స్పందించాల్సిన బాధ్యత నాడు జగన్ కోసం ప్రచారం చేసిన మీకు లేదా అని నిలదీస్తున్నారు.   తెలంగాణలో ప్రస్తుతం.. మీ కుమార్తే వైయస్ షర్మిల పడుతోన్న ఇబ్బందులే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష టీడీపీ నేతలు సైతం గత మూడున్నరేళ్లగా పడ్డుతున్నారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. మరీ ఈ అంశంలో నాడు మీరు స్పందించి ఉంటే.. నేడు ఈ పరిస్థితి మీ దాకా వచ్చేది కాదని వారు చురకలంటిస్తున్నారు. ఏదీ ఏమైనా నాడు రాజన్న రాజ్యం తీసుకు వస్తాడు నా బిడ్డ అంటూ మీ ఫ్యామిలీ ఫ్యామిలీ ప్రచారానికి దిగి ప్రచారం చేశారని.. మీ మాటలు నమ్మి..ప్రజలు ఓట్లు గంప గుత్తగా వేశారనీ...  కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో అందరు చూస్తూ.. ఇదేం ఖర్మ అనుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని నెటిజన్లు అంటున్నారు.  

భారత్ జోడో యాత్రలో రాహుల్ డ్యాన్స్

రాజకీయాలలో కాంగ్రెస్ పతనం, వరుసగా రాష్ట్రాలలో అధికారం కోల్పోతుండటం.. ఇప్పటికే పూర్తయిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధిస్తుందో లేదో తెలియని అయోమయం.. అలాగే వచ్చే నెలలో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరిస్థితి ఏమిటో తెలియని గందరగోళం.. ఇవేమీ పట్లకుండా తన మానాన తాను భారత్ జోడో యాత్రలో ఉత్సాహంగా నడిచేస్తున్నారు రాహుల్ గాంధీ. పార్టీ జయాపజయాలతో సంబంధం లేకుండా సాగుతున్న ఆయన యాత్రకు జనం పోటెత్తుతున్నారు. ప్రజా సమస్యలపై ఆయన చేస్తున్న ప్రసంగాలను శ్రద్ధగా వింటున్నారు. ఆయనకు తమ సమస్యలను ఏకరవు పెడుతున్నారు. తన యాత్రకు రాజకీయాలతో సంబంధం లేదనీ, దేశంలో ద్వేష పూరిత వాతావరణాన్ని రూపుమాపి.. ఐక్యత సాధించడమే లక్ష్యమని రాహుల్ చెబుతున్నారు. కానీ ఆయన భారత్ జోడో యాత్ర విజయవంతంపైనే కాంగ్రెస్ పార్టీ కోటి ఆశలు పెట్టుకుంది. ఇప్పటికిప్పుడు కాకున్నా 2024 సార్వత్రిక ఎన్నికలలో బారత్ జోడో యాత్ర ఫలితం తప్పకుండా కనిపిస్తుందని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక రాహుల్ గాంధీ పాదయాత్ర విషయానికి వస్తే ఆయన జనసమూహాలను ఆకర్షిస్తున్నారు. ఇంత కాలం డైనాస్టీ ద్వారా నాయకుడయ్యారన్న ముద్ర నుంచి రాహుల్  క్రమంగా బయట  పడుతున్నారు. ప్రజానాయకుడిగా అవతరిస్తున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున ఆయనతో అడుగుకలుపుతున్నారు. సెలబ్రిటీలు సైతం రాహుల్ తో కలిసి నడుస్తున్నారు. ఇక తన తీరుతో, వ్యవహార శైలితో రాహుల్ జనంలో మమేకమౌతున్నారు. బుల్లెట్ నడుపుతున్నారు. పరుగులు పెడుతున్నారు.  స్థానికులతో కలిసి సహపంక్తి భోజనాలూ చేస్తున్నారు. ఇలా ఆయన జనాన్ని ఆకర్షిస్తున్నారు. తాజాగా ఉజ్జయినిలో ఆయన డ్యాన్స్ చేసి జనాలను సమ్మోహనపరిచారు.రాహుల్ తో పాటు  మాజీ ముఖ్యమంత్రులు కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్, పలువురు కాంగ్రెస్ నేతలు కూడా స్కూల్ పిల్లలతో కలిసి డ్యాన్స్ చేశారు. రాహుల్ పాదయాత్ర  ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో ఉత్సాహంగా ఈ యాత్ర సాగుతోంది. ఝార్ఖండ్ ముక్తి మోర్చా, గోవా ఫార్వర్డ్ పార్టీ నేతలు కూడా ఈ యాత్రలో పాలుపంచుకుంటున్నారు.

షర్మిల పాదయాత్రకు హైకోర్టు ఓకే.. బట్ కండీషన్స్ అప్లై

ఇప్పటి వరకూ వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల ఎలాంటి ఆంక్షలూ, అడ్డంకులూ లేకుండా తెలంగాణలో పాదయాత్ర సాగిస్తూ వచ్చారు. అయితే సోమవారం(నవంబర్ 29) వరంగల్ జిల్లా నర్సంపేట వద్ద ఆమె యాత్రను అడ్డుకోవమే కాకుండా పోలీసులు ఆమె యాత్రకు అనుమతి రద్దు చేశారు. దీంతో మూడు వేల కిలోమీటర్లకు పైగా నిరాటంకంగా నడిచేసిన షర్మిల నడకకు బ్రేక్ పడినట్లైంది. దీంతోనే వైఎస్సార్ టీపీ నాయకుడు రవీంద్రనాథ్ రెడ్డి మంగళవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పాదయాత్రకు టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డంకులు సృష్టించారని పిటిషన్ లో పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టు ఈ పిటిషన్ ను విచారించి షర్మిల యాత్రకు అనుమతి ఇస్తూ తీర్పు వెలువరించింది. అదే సమయంలో షర్మిలకూ కొన్ని కండీషన్లు పెట్టింది. సీఎం కేసీఆర్ పై ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలూ చేయరాదని షరతు విధించింది. అలాగే షర్మిల పాదయాత్రకు ఎలాంటి అడ్డంకులూ సృష్టించవద్దని పోలీసులను ఆదేశించింది. 

బండి యాత్ర, భైంసా సభ తుస్సు.. షర్మిల ఎపిసోడే హైలైట్.. కేసీఆర్ డైవర్షన్ పాలిటిక్సేనా?

బీజేపీ అంటేనే గోరంత చేసి కొండంత ప్రచారం పొందే పార్టీ అన్నది రాజకీయ వర్గాలలో బాగా నానుతున్న ప్రచారం. అలాంటిది తెలంగాణలో తాజా ఘటనల నేపథ్యంలో బీజేపీ ఆ ప్రచారం పొందడం సంగతి అటుంచి.. అసలు ఎంతో ఆర్భాటం చేసి మరీ ప్రారంభమైన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఐదో విడత పాదయాత్ర.. ఆ సందర్భంగా భైంసాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అసలు గుర్తింపే లేకుండా పోయింది.   వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల అరెస్టు, తదననంతతర పరిణామాలు. తెలుగు రాష్ట్రాలలో మీడియా అటెన్షన్ నే కాదు.. ప్రజల అటెన్షన్ ను తన వైపు లాగేసుకుంది. షర్మిల అరెస్టు, న్యాయమూర్తి ముందు హాజరుపరచడం, వెంటనే వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల కావడం మొత్తం పోలిటికల్ హైడ్రామా నడిచింది.   మంగళవారం (నవంబర్ 29) ఉదయం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి షర్మిల ప్రగతి భవన్ ముట్టడి పేరుతో నిరసన కార్యక్రమం తలపెట్టారు.ఈ కార్యక్రమానికి సోమవారం(నవంబర్ 28) నర్సంపేటలో టీఆర్‌ఎస్ కార్యకర్తల దాడిలో పాక్షికంగా ధ్వంసమైన తన కారును స్వయంగా నడుపుకుంటూ ఆమె ప్రగతి భవన్ వైపు వచ్చారు. దీంతో, పోలీసులు ఆమెను పంజాగుట్ట సర్కిల్ వద్ద అడ్డుకుని.. వాహనంలో నుంచి దిగాలని కోరారు. అందుకు ఆమె నిరాకరించి డోర్ లాక్ చేసుకొని కారులోనే ఉండిపోయారు. వైఎస్సార్‌టీపీ ఆందోళనతో పంజాగుట్ట మార్గంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో  షర్మిల కారును పోలీసులు క్రేన్ సాయంతో లాక్కెళ్లారు. ఆ సమయంలో కూడా షర్మిల  వాహనంలోనే ఉన్నారు. పంజాగుట్ట నుంచి అమీర్‌పేట, మైత్రివనం మీదుగా ఆమె వాహనాన్ని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఆమెను అదుపులోకి తీసుకొని ఎస్సార్‌నగర్ పీఎస్‌లోకి తరలించి.. వైద్య పరీక్షలు నిర్వహించి, జడ్జి ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.  నాంపల్లి కోర్టులో షర్మిలకు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు అయింది. ఇక, ఆమెను పరామర్శించేందుకు షర్మిల తల్లి విజయమ్మ వెళ్లేందుకు ప్రయత్నించగా ఆమెను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో విజయమ్మ లోటస్‌పాండ్‌లోని నివాసంలో నిరశన దీక్షకు దిగారు. షర్మిలను అరెస్టు చేసిన విషయం ఆమె భర్త అనిల్ కుమార్‌కు కూడా సమాచారం ఇచ్చారు.  ఈ మొత్తం వ్యవహారంలో..  బండి సంజయ్ పాదయాత్ర, భైంసా సభ ఎవరూ గుర్తించని కార్యక్రమంలా మిగిలిపోయింది.  సీఎం కేసీఆర్ ను వ్యతిరేకించినందుకే షర్మిలను అరెస్ట్ చేశారని కొందరంటుంటే.. ఇది పక్కా టీఆర్ఎస్ ప్రణాళిక అంటే మరి కొందరు అంటున్నారు.    భైంసాలో బండి సంజయ్ పాదయాత్ర, బీజేపీ బహిరంగ సభ జరిగింది. అయితే షర్మిల అరెస్ట్ తో ఉదయం నుండి మీడియాలో, సామాజిక మాధ్యమంలో షర్మిల అరెస్టు, విజయమ్మ ఆందోళనకు సంబంధించిన సమాచారంతో నిండిపోయింది.  మరికొందరు కామెంట్లతో పెద్ద వార్ నడుస్తుంది.  మొత్తం మీద   మీడియాను, సామాజిక మాధ్యమాన్ని వాడుకుని నిత్యం వార్తలలో ఉండటం ద్వారా పాపులర్ అవుతుండే బీజేపీకి షర్మిల ఎపిసోడ్ దారుణంగా ఫెయిలయ్యింది.  తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నిర్మల్ జిల్లాలో మొదలుపెట్టిన 5వ విడత పాదయాత్రను షర్మిల  ఎపిసోడ్ కారణంగా ఎవరూ పట్టించుకోలేదు. మరో వైపు రాష్ట్రంలో నిర్విరామంగా అలసట లేకుండా పాదయాత్ర చేస్తున్నా.. పాదయాత్రలో మూడు వేల కిలోమీటర్ల మైలు రాయిని దాటేసినా రాని గుర్తింపు షర్మిలకు మంగళవారం నాటి అరెస్టుతో  వచ్చేసింది. అయితే పరిశీలకులు మాత్రం షర్మిల అరెస్టు వ్యవహారమంతే ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహ రచన ప్రకారమే జరిగిందని అనుమానిస్తున్నారు. ఇన్ని రోజులూ లేనిది ఇప్పుడు ఎందుకు షర్మిల పాదయాత్రపై దాడి జరిగింది?.. అలాగే ప్రగతి భవన్ ముట్టడికి వచ్చిన షర్మిలను అత్యంత నాటకీయంగా కారులో ఉండగానే క్రేన్ తో కారును లాక్కెళ్లి మరీ అరెస్టు చేయాల్సిన అవసరమేమొచ్చింది అని ప్రశ్నిస్తున్నారు. అలాగే షర్మిల అరెస్టుకు నిరసనగా విజయమ్మ దీక్ష కూడా మీడియా కవరేజ్ ను బండి యాత్ర, భైంసా సభ నుంచి డైవర్ట్ చేసింది. ఇదంతా కేసీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే జరిగిందన్న చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది. 

జగనన్నా.. ఎక్కడన్నా!

వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి.. హైదరాబాద్‌లోని ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అదీకూడా.. ఆమె కారులో ఉండగా.. కారును క్రేన్ తో  లాక్కెళ్లి మరీ ఆమెను  పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమెను గట్టి భద్రత నడుమ సంకెళ్లు వేసి.. పీఎస్‌లోకి పట్టుకెళ్లారు.     అయితే ఈ మొత్తం వ్యవహారంలో వైయస్ షర్మిల సొంత సోదరుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కనీసం స్పందించకపోవడం పట్ల ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ విస్మయం వ్యక్తమౌతోంది.  దేశంలో ఎక్కడో కాదు... పక్క రాష్ట్రంలో.. అదీ మరో తెలుగు రాష్ట్రంలో సొంత చెల్లికి ఇంత అన్యాయం జరుగుతోంటే.. జగన్.. ఇలా ఉలుకు పలుకు లేకుండా... బెల్లం కొట్టిన రాయిలా ఉండడం ఏమిటని తెలుగు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాటి ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్.. ఒకటి.. రెండు కాదు.. దాదాపు 16 నెలలు చంచల్ గూడ జైలులో ఉంటే.. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ.. సోదరుడు   జగన్ కోసం వైయస్ షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయడమే కాదు.. జగన్ అధికారంలోకి రావడం కోసం బస్సు యాత్ర సైతం చేశారనీ.. అలాగే జగనన్నతోనే రాజన్న రాజ్యం సాధ్యం అంటూ..  నాటి ముఖ్యమంత్రి చంద్రబాబును ఇంటి సాగనంపండని ప్రజలకు బై బై బాబు అనే కొత్త స్లోగన్‌ అందించి..... తన సోదరుడు వైయస్ జగన్‌కు ముఖ్యమంత్రి పీఠం ఎక్కించే వరకు అలుపెరగకుండా ఆమె ఓ విధమైన దీక్ష బూనారనీ.. అలాంటి తొబుట్టువు షర్మిల పట్ల సొంత సోదరుడిగా వైయస్ జగన్ ఇలా బాధ్యతా రహితంగా వ్యవహరించడంపై ఏపీ ప్రజలే కాదు..  వైసీపీ శ్రేణులు...   వైయస్ఆర్ టీపీలోని ముఖ్య నేతలు ఔర ఔర అంటూ ముక్కున వేలేసుకొంటున్నారు. జగన్ ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత..  ఆయన తల్లి  విజయమ్మ, సోదరి  షర్మిలలు... పక్క రాష్ట్రం తెలంగాణకు వెళ్లిపోయి.. కొత్త పార్టీ స్థాపించారు.   షర్మిల.. రాష్ట్రంలో ప్రజా సమస్యలు తెలుసుకోనేందుకు.. ఓ వైపు పాదయాత్ర చేస్తూ... మరో వైపు రైతులు, విద్యార్థుల సమస్యలపై ప్రతి మంగళవారం దీక్షలు చేస్తున్నారు. ఆ క్రమంలో కేసీఆర్ ప్రభుత్వ పరిపాలనలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై ఆమె చాలా బలంగా గళం విప్పుతున్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతిపై ఒకటికి రెండు సార్లు ఆమె నేరుగా ఢిల్లీకి వెళ్లి.. సీబీఐ, కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్‌ను సైతం కలిసి ఫిర్యాదు చేసి వచ్చారు.    అలాగే ఆమె పాదయాత్రలో కూడా.. ఆయా ప్రాంతాల్లోని అధికార టీఆర్ఎస్  ఎమ్మెల్యేల అవినీతిపై ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. ఆ క్రమంలో వైయస్ షర్మిలపై దాడి జరిగింది. అలాంటి వేళ.. సొంత చెల్లికి ఇంతలా అన్యాయం జరుగుతోంటే.. పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి కూడా స్పందించకపోవడం పట్ల  జగన్‌పై తెలుగు ప్రజలు మండిపడ్డుతున్నారు. అయితే గతంలో   జగన్ పాదయాత్ర సందర్బంగా చేసిన వ్యాఖ్యలను ఈ సందర్బంగా వారు మరోసారి గుర్తు చేస్తున్నారు. అక్క చెల్లెమ్మలకు అంటూ.. నాడు ప్రతిపక్ష నేతగా  జగన్ ఒకటికి వంద సార్లు చెప్పారని.. కానీ నేడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత.. పక్క రాష్ట్రంలో సొంత చెల్లి, తల్లికే దిక్కు లేకుండా పోయిందనే ఓ చర్చ అయితే తెలుగు ప్రజల్లో వాడి వేడిగా  సాగుతోంది. అంతేకాదు.. సొంత చెల్లికి ఇంత  అన్యాయం జరుగుతోంటే.. సోదరుడు   జగన్ ఎక్కడ? అనే ఓ ప్రశ్న   సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతంది. ఏమైనా ఇవాళ కాకుంటే.. రేపు అయినా.. షర్మిల అంశంలో జగన్ జోక్యం చేసుకుంటారని తెలుగు ప్రజలు తెగ ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి సీఎం జగన్ ఏం చేస్తారోనని తెలుగు  ప్రజలంతా తెగ ఆతృతగా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారనే ఓ చర్చ అయితే.. తెలుగు రాష్ట్రాల్లో వాడి వేడిగా   నడుస్తోంది.

జగన్ తో మాకు సంబంధం లేదన్న విజయమ్మ.. తలెక్కడ పెట్టుకుంటావ్ జగన్ రెడ్డీ అన్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఒకే రోజు రెండు విషయాలలో ఎదురుదెబ్బలు తగిలాయి. ఒకటి సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు ఇవ్వడం అయితే రెండోది కన్న తల్లి విజయమ్మ జగన్ తో మాకేంటి సంబంధం అంటూ వ్యాఖ్యానించడం. ఈ రెండూ కూడా జగన్ ప్రతిష్టను మసకబార్చే సంఘటనలే. వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు పురోగతిని జగన్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా నీరుగారుస్తోందంటూ వివేకా కుమార్తె, జగన్ సోదరి డాక్టర్ సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై సునీత చెప్పిన విషయాలన్నీ అక్షర సత్యాలంటూ ఈ హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ కూడా సుప్రీం కు నివేదించింది. దీంతో కేసు దర్యాప్తును వేరే రాష్ట్రానికి బదలీ చేస్తూ సుప్రీం కోర్టు మంగళవారం(నవంబర్ 29) ఉత్తర్వులు వెలువరించింది. సుప్రీం నిర్ణయం కచ్చితంగా ఏపీ సర్కార్ ప్రతిష్టకు, స్వయంగా జగన్ ప్రతిష్టకు మచ్చే అనడంలో సందేహం లేదు. ఈ తీర్పుపై స్పందిస్తూ విపక్షాలు విమర్శలు గుప్పించాయి. జగన్ రెడ్డీ తలెక్కడ పెట్టుకుంటావ్ అంటూ విపక్ష నేత చంద్రబాబు నిలదీశారు. బాబాయ్ కేసు హైదరాబాద్ కు అబ్బాయ్ చంచల్ గూడ జైలుకూ అంటూ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్వీట్ చేశారు. అచ్చన్నాయుడు, బోండా ఉమ తదితరులు ఈ తీర్పు వివేకా హత్య కేసు నీరుగార్చడంలో ప్రభుత్వం ప్రమేయం ఉందని నిర్ద్వంద్వంగా తేలిపోయిందని వ్యాఖ్యలు చేశారు. ఫేస్ సేవింగ్ కోసం సకల శాఖల మంత్రి సజ్జల మీడియా ముందుకు వచ్చి వివేకా హత్య కేసు తెలంగాణకు మారడం వల్ల ప్రభుత్వ ప్రతిష్టకు ఏం భంగం కాదని చెప్పుకున్నారు అది వేరే సంగతి.   వివేకా హత్య కేసు విషయంలో సుప్రీం తీర్పు వెలువరించిన గంటల వ్యవధిలోనే సీఎం జగన్ కన్నతల్లి విజయమ్మ.. తన కుమారుడు జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ తో మాకేంటి సంబంధం అన్నారు. ఈ మాటలు ఆమె మీడియా ముందే బహిరంగంగా చెప్పారు. ఆమె జగన్ కు స్వయాన తల్లి, ఇటీవలి కాలం వరకూ వెసీపీ గౌరవాధ్యక్షురాలు అలాంటి విజయమ్మ  జగన్ మోహన్ రెడ్డితో.. ఆంధ్ర రాష్ట్రంతో  మాకేంటి అని వ్యాఖ్యానించారు.  మాట రావడం చర్చనీయాంశమైంది.  తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్ టీపీ) అధినేత్రి షర్మిలను మంగళవారం(నవంబర్ 29) పోలీసులు అరెస్టు చేసిన సందర్భంగా పోలీసులు ఆమెను పోలీసు స్టేషన్ కు రానీయకుండా అడ్డుకోవడంతో ఇంట్లోనే విజయమ్మ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె జగన్ తో, ఏపీతో మనకేంటి సంబంధం అని ఒక విలేకరి ప్రశ్నకు సమాధానమిచ్చారు. సొంత తల్లే కొడుకుతో సంబంధం లేదని వ్యాఖ్యానించడం చూస్తే..జగన్ తీరు పట్ల ఆమె ఎంతగా విసిగిపోయారో అర్ధం అవుతుంది. ఏపీలో జగన్ అధికారం చేపట్టేందుకు కుమార్తె షర్మిలతో కలిసి విజయమ్మ చేసిన ప్రచారం, జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని నడిపి నిలబెట్టిన తీరును ఇప్పుడు వైసీపీ శ్రేణులే గుర్తు చేసుకుంటూ.. విజయమ్మ వ్యాఖ్యలు జగన్ తల్లి సోదరి పట్ల వ్యవహరించిన తీరుకు అద్దం పడుతున్నాయని చర్చించుకుంటున్నాయి.   

ఏపీ సర్కార్ కునిధుల కొరత.. ఉద్యోగులకు వేతనాలు జాప్యం?

ఏపీలో డిసెంబర్  మొదటి తేదీకి ఉద్యోగులకు వేతనాలు అందడం దాదాపు అసాధ్యం అన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.ఇందుకు ప్రభుత్వం సాంకేతిక కారణాలను చూపుతున్నా.. ఉద్యోగులు మాత్రం నిధుల కొరత కారణంగానే ప్రభుత్వం డిసెంబర్ మొదటి తేదీ నాటికి జీతాలు చెల్లించడం లేదని అంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం సీఎఫ్ఎంఎస్ సర్వర్ డౌన్ అయ్యిందని.. స్లోగా ఉందని అంటున్నారు. ఈ  సమస్య సోమవారం నుంచీ ఉందని చెబుతున్నా ఇప్పటి వరకూ రెట్టిఫై చేయకపోవడమేమిటని ఉద్యోగులు అంటున్నారు. ప్రభుత్వం ఉద్దేశ  పూర్వకంగానే సాంకేతిక కారణాలు చూపుతోందని ఉద్యోగ  సంఘాలు అంటున్నాయి. డ్రాయింగ్ అండ్ డిస్పర మెంట్ అధికారులు జీతాల  బిల్లులు అప్ లోడ్ చేయడంలో కావాలనే జాప్యం చేస్తూ సాంకేతిక కారణాలను చూపుతున్నారని అంటున్నారు. సబ్ ట్రెజరీ కార్యాలయాల నుంచి వేతనాల బిల్లులు ఈ నెల 30లోగా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో బుధవారం(నవంబర్ 30)నాటికి బిల్లులు  అప్ లోడ్ అవ్వడం అన్నది అనుమానంగా ఉంది.జీతాలూ పెన్షన్ల కోసం ప్రభుత్వానికి ప్రతి నెలా 5,500 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. 

కమల దళానికి చీలిక ఓట్లే శ్రీరామ రక్ష!

గుజరాత్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల ప్రచారం (మంగళవారం, నవంబర్ 29) ముగిసింది. డిసెంబర్  1 వ తేదీన, ఫస్ట్ ఫేజ్  లో పోలింగ్ జరిగే, 89 నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం మంగళవారం చివరి రోజున, కేంద్ర మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్, బీజేపే అధ్యక్షుడు జేపీ నడ్డ సహా పలువురు బీజేపే సీనియర్ నాయకులు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గ్గే సహా పలువురు సీనియర్ నాయకులు రోడ్ షో లో పాల్గొన్నారు. మొదటిసారిగా ముక్కోణపు పోటీ జరుగతున్న నేపధ్యంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి.  గుజరాత్  ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత షా, బీజేపీఅగ్రనేత ఎల్కే అద్వానీల స్వరాష్ట్రమే కాకుండా, బీజేపీ మార్క్ రాజకీయాలకు, డెవలప్మెంట్ నమూనాకు, రోల్ మోడల్ గా నిలిచిన రాష్ట్రం. అలాగే, జాతీయ స్థాయిలో బీజేపీ ఎదుగుదలకు, ఉత్తర ప్రదేశ్ (రామ జన్మ భూమి) తొలి కేంద్ర బిందువు అయితే, కమలదళం కలను సాకారం చేసిన రాష్ట్రం గుజరాత్. నరేంద్ర మోడీ నాయకత్వంలోగుజరాత్ మోడల్ నినాదంతోనే, 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయం సాధించింది. మాడు పదుల చరిత్రను తిరగ రాసింది. మూడు దశాబ్దాలలో తిలిసారిగా. లోక్ సభ బీజేపీ, మిత్ర పక్షాలతో కలిసి ఎన్డీఎ కూటమిగా పోటీ చేసినా, సొంతగానే  సంపూర్ణ మెజారిటీ సాధించింది. ఈ అన్నిటినీ మించి, 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ‘హట్రిక్’ కు రేపటి గుజరాత్ ఎన్నికల ఫలితాలు కీలకం కానున్నాయి.  అలాగే, మొదటి సారిగా గుజరాత్ లో త్రిముఖ పోటీ జరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటుగా, ఆమ్ ఆద్మీ పార్టీ ( ఆప్) కూడా సీరియస్ ఎన్నికల  బరిలో నిలిచింది.అయితే ఇటు పాతికేళ్ళకు పైగా, రాష్ట్ర్రంలో అధికారంలో ఉన్న కమల దళాన్ని, ఇన్నేళ్ళుగా ప్రతిపక్షలో ఉన్నా, గత ( 2017) అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం పైగా (41.44) ఓట్లు, 77 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా నిలించిన హస్తం పార్టీని తట్టుకుని  ఆప్’ ఏ మేరకు ప్రభావం చూపుతుంది అనేది చూడవలసి ఉందని పరిశీలకులు అంటున్నారు. ఇంతవరకు ఆప్ చేస్తున్న విస్తరణ ప్రయత్నాలు ఒక్కపంజాబ్ లో తప్ప ఇంకెక్కడా ఫలించలేదు. ఈ నేపధ్యంలో  డిసెంబర్ 8 ఎనిమిదిన ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వతగానీ, గుజరాత్లో  చీపురు (ఆప్ చిహ్నం) బలమేమిటో తేలదు. కానీ, ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ‘పంజాబ్’ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, ఊపు మీదున్న ఆప్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రధాన ప్రత్యర్ధి పార్టీలు,బీజేపీ, కాంగ్రెస్;కు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా, అధికారంలోకి రావడం ఖాయం అన్న విశ్వాసంతో ముందుకు సాగుతోంది. ఆప్ జాతీయ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ చాలా ముందునుంచే గుజరాత్ పోల్స్ పై ఫోకస్ పెట్టి, పెద్ద ఎత్తున ప్రచారం సాగించారు. మోడీ గుజరాత్ మోడల్ పేరున దేశంలో కాషాయ జెండా ఎగరేస్తే, కేజ్రీవాల్ ఢిల్లీ మోడల్ పేరున గుజరాత్ లో  తమ  జెండా ఎగరేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉచిత విద్యుత్, మహిళకు నెలకు వెయ్యి రూపాయల పెన్షన్, మెరుగైన ఉచిత విద్య, వైద్య సదుపాయాల  వంటి ఉచిత హామీలతో గుజరాతీలను ఆకట్టుకునే గట్టి ప్రయత్నమే కేజ్రీవాల్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఉచిత వరాల మీదనే దృష్టి కేంద్రీకరించింది.అయితే, 2017 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ మరింత బలహీన పడిందని పరిశీలకులు భావిస్తున్నారు. పటేల్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ సహా ఇంచుమించుగా ఓ డజను మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు.బీజేపీ,ఆప్ పార్టీలతో పోలిస్తే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కొంత వెనక బడింది. భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల గాంధీ మొక్కుబడిగా రెండు మూడు రోజులు ప్రచారంలో పాల్గొన్నారే తప్ప.పెద్దగా మనసు పెట్టి ప్రచారం సాగించలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత జరుగతున్న తొలి ఎన్నికల్లో, హుషారుగా ప్రచారంలో పాల్గొన్నారు.కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా, ఇతర ముఖ్యనేతలు కొంతవరకు ప్రచారంలో పాల్గొన్నా,మోడీ, షాల ప్రచార హోరుతో పోటీ పడలేక పోయారనే, పరిశీలకులు బావిస్తున్నారు.   మరోవంక ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా,బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర బీజేపీ సీనియర్ నాయకులు ఎన్నికల ప్రకటకు ముందు నుంచే సుడిగాలి పర్యటనతో రాష్ట్రాన్ని చుట్టేశారు. అదలా ఉంటే, ప్రధాని నరేంద్ర మోడీని రావణాసురుడితో పోలుస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు గుజరాత్ ఎన్నికల ప్రచారాన్ని మరింతగా వేడెక్కించాయి. ఆయన వ్యాఖ్యలను కమలనాథులు తప్పుబట్టారు. గుజరాత్ పుత్రుడిని కాంగ్రెస్ అవమానిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ఎన్నికల వేడిని తట్టుకోలేకనే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మాట తూలారని, ప్రధానమంత్రిని రావణునితో పోల్చారని అమిత్ మాలవీయ ట్వీట్‌లో ఖండించారు. ఖర్గే మాట్లాడిన వీడియోను కూడా షేర్ చేశారు. మౌత్ కా సౌదాగర్ నుంచి 'రావణ్' వరకూ కాంగ్రెస్ అనేక సార్లు విమర్శలు చేస్తూ గుజరాత్‌ను, గుజరాత్ పుత్రుడిని పదేపదే అవమానిస్తోందని అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 1,5 తేదీల్లో జరగనున్నాయి. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడుతాయి. అయితే, గుజరాత్ లో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ప్రీ పోల్ సర్వేలు చెపుతున్న జోస్యాలను రాజకీయ పరిశీలకులు కూడా సమర్ధిస్తున్నారు. ఓ పక్క నుంచి ఆప్ మరో వైపు నుంచి 13 ముస్లింల ఆధిపత్యం ఉన్న 13 కీలక స్థానల్లో ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ ఓటుకు గండికోడతాయని, ఫలితంగా  గత ఎన్నికల్లో గెలిచిన 99 స్థానాలు అదనంగా మరో 20 నుంచి 25 స్థానల్లో  విజయం సాధించి, బీజేపీ మరో సారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అంటున్నారు.  ఈ ఎన్నికల కోసం 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలు ఉన్నాయి. వీటిలో 142 జనరల్ కాగా..17 ఎస్సీ, 23 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న 1621 మంది అభ్యర్థుల్లో 330 మందిపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది. క్రిమినల్ కేసులు ఉన్న వాళ్లలో 61 మంది అభ్యర్థులతో ఆప్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. కాంగ్రెస్ నుంచి 60 మంది, బీజేపీ నుంచి 32 మంది క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

తెలంగాణ ముందస్తు ఎన్నికలపై సుప్రీం ధర్మాసనం కామెంట్స్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్ర శేఖర రావుకు దైవ భక్తి కొంచెం చాలా ఎక్కువ. ఆయన చేసినన్ని యజ్ఞాలు, యాగాలు ఇంకో ముఖ్యమంత్రి, మరో రాజకీయ నాయకుడు ఎవరూ చేసి ఉండక పోవచ్చు. నిజానికి, ఒకానొక సందర్భంలో, ప్రధాని నరేంద్ర మోడీ కంటే తానే పెద్ద హిందువును అని చెప్పుకునే సందర్భంలో, ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు.అవును, దైవ భక్తితో పాటు,,జ్యోతిష శాస్త్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కొంచెం చాలా ఎక్కువగానే నమ్ముతారు. జాతక చక్రాలు, మంచి చెడు, ముహూర్తాలతో పాటుగా, వాస్తు శాస్త్రాన్ని గట్టిగా విశ్వసిస్తారు. నిజం అవునో కాదో కానీ, వాస్తు దోషం కారణంగానే, ముఖ్యమంత్రి పాత సెక్రటేరియట్ భవనాన్ని కూల్చి, కొత్త భవనం కట్టిస్తున్నారని అంటారు. అలాగే, ముఖ్యమంత్రి ఏ నిర్ణయం అయినా ముహూర్తం చూసుకునే తీసుకుంటారని, ఏ పని, పథకం ప్రారంభించాలన్నా,ముహూర్తం చూసుకుంటారని అంటారు.  మొన్నటికి మొన్న, టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్’గా మారుస్తూ పార్టీ సమావేశంలో చేసిన తీర్మానంపై, తెరాస అధ్యక్షుని హోదాలో ముఖ్యమంత్రి కేసీఆర్, నిముషాలు, ఘడియలు చూసుకుని, అక్టోబర్ 5,విజయ దశమి రోజున మధ్యాన్నం 01.19 నిమిషాలకు సంతకం చేశారు. సరే, అయినా, టీఆర్ఎస్ పేరు మార్పు ఇంతవరకు ముడిపడలేదనుకోండి అది వేరే విషయం.  అదలా ఉంటే  కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ కూడా,  కేసీఆర్ నమ్మకాలను అంధవిశ్వాసాలంటూ వ్యంగ్య బాణాలు విసిరారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న మోడీ, సాధువైన యోగి  (ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్) టెక్నాలజీని నమ్ముతుంటే అంధ విశ్వాసాలను నమ్మేవాళ్లు తెలంగాణను పాలిస్తున్నారని, పరోక్షంగా కేసీఆర్ కు చురకలంటించారు. అలాగే, 21వ శతాబ్దంలోనూ సీఎం అంధ విశ్వాసాలను నమ్ముతున్నారని సటైర్ వేశారు. మూఢనమ్మకాలను విశ్వసించే వ్యక్తులు తెలంగాణకు ఎలాంటి న్యాయమూ చేయలేరన్న మోడీ.. అలాంటి వ్యక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని రాజకీయ ముక్తాయింపు (పిలుపు)నిచ్చారు.  సరే, మోడీ అంటే, ఏదో రాజకీయంగా ముఖ్యమంత్రిని దెప్పిపొడిచారని అనుకోవచ్చును కానీ, ఇప్పడు సుప్రీం కోర్టు, ధర్మాసనం కూడా కేసీఆర్ సర్కార్ పై అదే విధమైన కామెంట్స్ చేసింది. తెలంగాణలో ఎన్నికలు జ్యోతిష్యం ప్రకారమే జరుగుతాయని వ్యాఖ్యానించింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను అనర్హుడిగా ప్రకటించేలా నోటీసులు జారీ చేయాలంటూ.. టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రేంసింగ్ రాథోడ్ తరపు న్యాయవాది సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణ సందర్భంగా.. రాజాసింగ్ పై అనేక క్రిమినల్ కేసులున్నందున ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు.  రాజాసింగ్ కు ఇంకా ఏడాది కాలం మాత్రమే పదవి గడువు ఉందని న్యాయవాది పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం..తెలంగాణలో ఎన్నికలు జ్యోతిష్యం ప్రకారమే జరుగుతాయని వ్యాఖ్యానించారు. ఈ కేసు విచారించాలంటే అన్ని గ్రహాలు ఒకే వరుసలోకి రావాలని ధర్మాసనం కామెంట్ చేసింది. అలాగే, 2018లో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లిన విషయాన్ని ఈ సందర్భంగా సుప్రీం గుర్తుచేసింది. ఆఫ్కోర్స్, సుప్రీం కోర్టు ధర్మాసనం, ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసిందో ఏమో, కానీ, ముఖ్యమంత్రి మూఢనమ్మకాలను నమ్ముతారని, చెప్పడంతో పాటుగా, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, కొంచెం సీరియస్ కామెంట్స్ కూడా జోడించి ఆసక్తి పెంచింది. ముఖ్యంగా, ముందస్తు ఎన్నికలపై వ్యూహాగానాలు వినిపిస్తున్న సమయంలో సుప్రీం కోర్టు ధర్మాసనం చేసిన కామెంట్స్ మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

కారు కమలం మధ్య కాదేదీ కయ్యానికి అనర్హం

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస పార్టీల మధ్య, యుద్ధం నడుస్తోంది. నిజమే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విబేధాలు తలెత్తడం, అదే విధగా కేంద్రంలో, రాష్ట్రంలో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు, ఆ పార్టీల మధ్య రాజకీయ విబేధాలు తలెత్తడం సహజమే. కానీ, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న,తెరాసల మధ్య అదీ ఇదీ కాకుండా ఫలితం ఉందని ‘మూడో’ రకం యుద్ధం నడుస్తోంది.  నిజానికి, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెరాస ఒకేసారి, 2014లో అధికారంలోకి వచ్చాయి. అలాగే, అక్కడ కమలం,ఇక్కడ కారు, వరసగా రెండవసారి, (కారు 2018లో కమలం 2019లో) అధికారంలోకి వచ్చాయి. అయినా, తొలి ఐదేళ్ళలో కేంద్రంలో, రాష్ట్రంలో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నా, రెండు పార్టీల మధ్య రాజకీయ, సిద్ధాంత విబేధాలున్నా,రెండు పార్టీల నడుమ శతృమిత్ర సంబంధాలు అంతగా గీత దాట లేదు. ఒక విధంగా హనీమూన్ జంటలా కమలం,కారు కలిసిమెలిసి ప్రేమ ప్రయాణం సాగించాయి. 2018లో తెలంగాణ శాసన సభకు ముందస్తు ఎన్నికలు జరిగినా, 2019 సార్వత్రిక ఎన్నికల వరకు, ఆ తర్వాత కూడా, తెరాస కేంద్ర ప్రభుత్వంతో సమోధ్య  కొనసాగించింది. ఎన్ఆర్సీ,సిఎఎ, వ్యవసాయ చట్టాలు సహా, జీఎస్ టి, పెద్ద నోట్లరద్దు సహా అనేక కీలక బిల్లులకు రాజ్యసభలో ప్రత్యక్ష, పరోక్ష మద్దతు ఇచ్చింది.   అయితే, ఆ తర్వాత క్రమక్రమంగా పరిస్థితి మారుతూ వచ్చింది. ఇప్పడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. అంతే కాదు, ఇప్పడు, కాదేదీ కయ్యాని అనర్హం అన్నట్లుగా, అయిన దానికి కాని దానికీ బీజేపీ, తెరాస నాయకులు ఒకరిపై ఒకరు కత్తులు దూస్తున్నారు. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు సరేసరి, ఇప్పడు ఆ స్థాయి దాటి, ఒక వంక భౌతిక దాడులు, మరో వంక కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థల పరస్పర దాడులు, న్యాయ పోరాటాలు వరకు పరిస్థితి, దిగజారింది. తమల పాకుతో  నువ్వొకటంటే, తపులుపు చెక్కతో నేను నాలుగంటా అన్నట్లుగా కారు, కమలం నేతల మధ్య వివాదాల పరంపర కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పడు కొత్తగా నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి ఘటనకి కొత్త తగువొకటి తెర మీదకు వచ్చింది. ఈ దాడికి  సంబంధించి ఎంపీ అర్వింద్, ఎమ్మెల్సీ కవిత మధ్య గత కొంత కాలంగా సాగుతున్న యుద్ధం, మరో మలుపు తిరిగింది. ఈ దాడికి ఎమ్మెల్సీ కవిత కారణమని ఆరోపిస్తున్న అరవింద్, కవిత తనను చంపేస్తానంటూ చేసినట్లు చెపుతున్న వ్యాఖ్యలపై హైకోర్టును ఆశ్రయించారు. కవితపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తనను చంపుతానంటూ మీడియా వేదికగా బహిరంగంగా కామెంట్లు చేసిన కవితపై తక్షణమే చర్యలు తీసుకోవాలని హైకోర్టును కోరారు. కాగా, ఎంపీ అర్వింద్ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం(నవంబర్ 29) హైకోర్టులో విచారణ జరిగింది. తాను ఇంట్లో లేని సమయంలో తన ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. తన ఇంట్లో అద్దాలు, ఫర్నీచర్, వస్తువులు ధ్వంసం చేశారని తెలిపారు. దాడికి పాల్పడ్డ వారితో పాటు తనను చంపేస్తానంటూ వ్యాఖ్యలు చేసిన కవితపై పోలీసులు చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును కోరారు. తాను ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.వివాదం వివరాలోకి వెళితే, ఇందులో అంతగా రెచ్చిపోయే విషయం ఏదీ లేదు. వడ్ల గింజలో బియ్యపు గింజ.  నిజానికి, స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ తేనె తుట్టెను కదిల్చారు. కొద్ది రోజుల క్రితం, బీజేపీ నాయకులు ఎమ్మెల్సీ కవితని తమ పార్టీలోకి రావాలని వత్తిడి  చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ విలేకరుల సమావేశంలో, అయన భాషలో ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి  వ్యాఖ్యలపై స్పందించిన అరవింద్, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆ పార్టీ  అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఫోను ద్వారా చర్చలు జరిపారని, కవిత పార్టీ ఫిరయింపునకు సంబదించి మరో ‘రహస్యాన్ని’  మీడియా ముందు  తెర మీదకు తెచ్చారు. అరవింద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు అర్వింద్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఆయన ఇంట్లోని ఫర్నీచర్‌ ద్వంసం చేశారు.ఈ ఘటన జరుగుతుండగానే కవిత ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి అర్వింద్‌పై విరుచుకుడ్డారు. అర్వింద్‌ను నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతానంటూ ఘాటుగా స్పందించారు. ఇంకో అడుగు ముందుకేసి అరవింద్ ను చంపేస్తామంటూ కవిత తీవ్ర హెచ్చరిక చేశారు, ఇప్పడు  అరవింద్ ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. ఈ కేసుకు సంబంధించి కోర్టులు ఎలాంటి తీర్పులు ఇస్తాయనేది పక్కన పెడితే, రాజకీయ రచ్చ మాత్రం కొనసాగుతుంది. 2019 ఎన్నికల్లో తెరాస సిట్టింగ్ ఎంపీగా ఉన్న కవిత, బీజేపీ అభ్యర్ధి అరవింద్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి, ఆ ఇద్దరి మధ్య  రాజకీయ వైరం కొనసాగుతూనే ఉంది. అంతే కాకుండా, ఇప్పడు తాజగా మళ్ళీ   అరవింద్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే, తాను అక్కడ నుంచే పోటీ చేసి అరవింద్ ను ఓడిస్తాని కవిత శపధం కూడా చేశారు. సో... బీజేపీ, తెరాస మధ్య జరుగతున్న ముగింపు లేని యుద్ధంలో మరో అధ్యాయానికి తెర లేచింది. చూస్తూనే ఉండండి.

కేసీఆర్ డైవర్షన్ పాలిటిక్స్.. షర్మిల ఎవరి చేతిలో అస్త్రం?

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, కుమార్తె, అవశేష ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్సార్  టీపీ పార్టీ స్థాపించి సంవత్సరం దాటింది.  అప్పటి నుంచి ఇప్పటివరకు, ఆమె రాజకీయాల్లో  క్రియాశీలంగానే  ఉన్నారు.   అయితే ఆమె పార్టీలో ఆమె కాకుండా ఇంకెవరైనా నాయకులు ఉన్నారా అంటే సమాధానం చెప్పడం అంత సులువు కాదు. ఒక విధంగా షర్మిల సింగిల్ విమెన్ ఆర్మీగానే పార్టీని నడుపుతున్నారు.  షర్మిలకు రాజకీయాలు కొత్తకాదు. రాజశేఖర రెడ్డి కుమార్తేగానే కాదు, జగన్ రెడ్డి సోదరిగానూ, ఆమె రాజకీయ ఆటుపోట్లను రుచి చూశారు. రాజశేఖర రెడ్డి ఉన్నంతవరకు ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించక పోయినా, ఆయన మరణం తర్వాత, మరీ ముఖ్యంగా జగన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైసీపీ, స్థాపించిన తర్వాత షర్మిల పార్టీ వ్యవహరాల్లో చురుకైన పాత్రను పోషించారు. చివరకు ఆమె   తెలంగాణలో పార్టీ  పెట్టారు? అన్న జగన్ రెడ్డితో ఆస్తి  తగవో, రాజకీయ వివాదమో ఏదైనా ఉంటే,ఆయన్ని రాజకీయంగా ఎదుర్కోవాలని అనుకుంటే, ఆమె పార్టీ పెట్ట వలసింది, అన్నతో పోరాడ వలసింది, ఏపీలో కదా?  కానీ ఆమె తెలంగాణలోనే తన పార్టీని స్థాపించారు.  ఆమె తెలంగాణలో పార్టీ పెట్టడం వెనక,ఎ వరెవరిదో ప్రమేయం, ఏవేవో వ్యూహాలు ఉన్నాయని కథనాలు మీడియాలో పుంఖానుపుంఖాలుగా వచ్చాయి. నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ ఆమె పార్టీ వెనక  తెరాస ఉందనీ,  బీజేపీ పార్టీల వరకు ఎవరి హస్తమో  ఉందని, ఉందనీ, అసలు జగన్ రెడ్డే, ఆమె వెనక ఉన్నారనే ప్రచారం కూడ అప్పట్లో విస్తృతంగా జరిగింది.  అయితే, తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ బయలు దేరిన షర్మిల రాష్ట్రంలో అంచెలంచెలుగా  అలుపెరుగని పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె అలా వేల  కిలోమీటర్లు నడిచేశారు. ఇంకా నడుస్తున్నారు పాద యాత్ర పొడుగునా ఆమె తెరాస ప్రభుత్వం పై కత్తులు దూస్తున్నారు. పదునైన విమర్శల శరాలు సంధిస్తున్నారు. ముఖ్యమత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత.. ఇలా వీళ్ళు వాళ్ళని కాదు, మంత్రులు, తెరాస నాయకులు ఎవరినీ వదిలి పెట్ట కుండా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కొండొకచో వ్యక్తీ గత విమర్శలూ గుప్పిస్తున్నారు. ఆశ్చర్యకరంగా ఆమె విమర్శలను తెరాస నేతలెవరూ ఖండించడం లేదు.  దేశ ప్రధాని, రాష్ట్ర గవర్నర్ సహా తమకు ప్రత్యర్ధులు అనుకున్న ప్రతి ఒక్కరినీ విమర్శలతో ఎండగట్టే  తెరాస నాయకులు, షర్మిల తెరాస నాయకులు, చివరకు ముఖ్యమంత్రి కేసేఆర్ పై పరుష పదజాలంతో విమర్శలు గుప్పించినా పట్టించుకోవడం లేదు. కనీసం ఖండించడం లేదు. అందరినీ ఎండగట్టే కేసీఆర్, కీటీఆర్ సహా తెరాస నాయకులు ఒక్క షర్మిల విషయంలో మాత్రమే ఎందుకు మౌనం వహిస్తున్నారు?    ఎందుకంటే షర్మిల పార్టీ తెరాస అధినేత కేసీఆర్ స్పాన్సర్డ్ పార్టీ అని పరిశీలకులు చెబుతున్నారు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును భారీగా చీల్చే పార్టీగా షర్మిల నాయకత్వంలోని వెఎస్సార్ టీపీ తెరమీదకు వచ్చిందని అంటున్నారు. కేసీఆర్ స్వయంగా ఈ పార్టీకి అండదండలు అందిస్తున్నారని చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే..  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ లో సిద్ధహస్తుడు. ఆయన వ్యూహ చతురుడు కూడా. ప్రత్యర్థి పార్టీల ఊహకు అందని వ్యూహాలతో ఎప్పటికప్పుడు వారిని గందరగోళంలో పడేస్తారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్, వ్యూహచతురతతోనే కేసీఆర్ గత ఎనిమిదేళ్లుగా తెలంగాణలో ఎదురు లేని నాయకుడిగా కొనసాగుతున్నారు. ప్రభుత్వం ఇబ్బందుల్లో పడిన ప్రతిసారీ దాని నుంచి బయటపడేందుకు  ప్రజల దృష్టిని, విపక్షాల దృష్టినీ మళ్లీం చే వ్యూహాలకు ఆయన పదును పెడతారు. సరే ఇప్పుడా విషయం ఎందుకంటే.. డిల్లీ లిక్కర్ స్కాం, మంత్రులపై ఐటీ దాడుల స్పీడుతో కేసీఆర్ సర్కార్ ఒకింత ఇబ్బందుల్లో పడింది. జనం దృష్టి అంతా ఈ కుంభకోణం, దర్యాప్తు సంస్థల దాడులపైనే ఉంది. విపక్షాలన్నీ కూడా కేసీఆర్ పాలనలో అవినీతి, ఆయన కుటుంబం అవినీతే లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా కేసీఆర్ ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది. సరిగ్గా ఈ సమయంలోనే గత ఏడాదికి పైగా ఎలాంటి అడ్డంకులూ, ఆంక్షలు, అవాంతరాలూ లేకుండా సాగుతున్న షర్మిల పాదయాత్రపై దాడి జరగడం, ఆమె యాత్రను భగ్నం చేసి అరెస్టు చేసి ఇంటికి పంపించడం జరిగింది. ఇదేదో కాకతాళీయంగా జరిగిన సంఘటనగా అనుకోవడానికి వీల్లేదని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. దర్యాప్తు సంస్థల దూకుడు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందకు కేసీఆర్ వ్యూహ రచనకు అనుగుణంగానే షర్మిల పాదయాత్రపై రాళ్ల దాడి, వాహనం ధ్వంసం వంటి సంఘటనలు జరిగాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏడాది కాలంలో షర్మిల పాదయాత్రకు రాష్ట్రంలో రెడ్ కార్పెట్ పరిచి మరీ కొనసాగించేందుకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు ఉరుములేని పిడుగులా ఆమె పాదయాత్రపై ఉక్కుపాదం మోపడం వెనుక ఉన్నది డైవర్షన్ పొలిటికల్ స్ట్రాటజీయే అంటున్నారు. వాస్తవంగా వరుసగా రెండో సారి తెలంగాణలో  తెరాస అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ప్రోది అవుతున్న ప్రభుత్వ వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని షర్మిలను తెలంగాణలో పార్టీ పెట్టేందుకు ఆహ్వానించినది కేసీఆరేనంటున్నారు. ఆమె ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చాలన్నదే  కేసీఆర్ వ్యూహంగా చెబుతారు. అందుకే గత ఏడాది కాలంగా షర్మిల కేసీఆర్ ప్రభుత్వంపై, కేసీఆర్ కుటుంబం అవినీతిపై ఎన్ని విమర్శలు చుస్తున్నా ప్రభుత్వం పట్టనట్టుగానే వ్యవహరించింది. ఆమె పాదయాత్రకు ఎటువంటి అడ్డంకులూ సృష్ఠించలేదు. అదే బండి సంజయ్ పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తోంది. దీంతో షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం వెనుక ఉన్నది కేసీఆర్ అన్న వాదనకు బలం చేకూరుతోంది. ఇటీవలి కాలంలో షర్మిల విమర్శల వేడి పెరిగినా.. కేసీఆర్ కానీ.. తెరాస శ్రేణులు కానీ పెద్దగా పట్టించుకోలేదు. చివరాఖరికి ఢిల్లీ వెళ్లి కాళేశ్వరం అవినీతిపై ఫిర్యాదులు చేసినట్ల ఆమె మీడియా సమావేశంలో ప్రకటించినా అందుకు సంబంధించిన ఫిర్యాదు కాపీని ఆమె మీడియాకు విడుదల చేయకపోవడంతో ఆమె నిజంగా ఫిర్యాదు చేశారా అన్న అనుమానాలు వెల్లువెత్తాయి. అలాగే షర్మిల వైఎస్సార్ టీపీ పార్టీ ఏర్పాటు వెనుక జగన్ ఉన్నారని కూడా రాజకీయవర్గాలలో విస్తృతంగా వినిపిస్తోంది.  2019 ఎన్నికలలో తాను ఏపీలో అధికారంలోకి రావడానికి కేసీఆర్ చేసిన సహాయానికి రిటర్న్ గిఫ్ట్ గా ఏపీ సీఎం జగన్ షర్మిల చేత తెలంగాణలో తండ్రి పేర పార్టీ ఏర్పాటు చేయించారని కూడా చెబుతుంటారు. ఏది ఏమైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం కోసమే షర్మిల వైఎస్సార్ టీపీ పార్టీకి కేసీఆర్, తెరాస సర్కార్ అన్ని విధాలుగా అండదండలు అందిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణలకు తగినట్టుగానే సోమవారం (నవంబర్ 28) షర్మిల పాదయాత్రపై దాడి, ఆమె అరెస్టు ఘటనల తరువాత రాష్ట్రంలో దర్యాప్తు సంస్థల దూకుడు, లిక్కర్ స్కాం, ఐటీ దాడులు, మల్లారెడ్డి ఓవర్ యాక్షన్ వంటి ఏ అంశాలూ చర్చలోకి కాదు కాదు సోదిలోకి లేకుండా పోయాయి. రాష్ట్రం మొత్తం షర్మిల పాదయాత్రపై జరిగిన దాడి, ఆమె అరెస్టుపైనే చర్చ జరుగుతోంది. దీనికి కొనసాగింపు అన్నట్లుగా మంగళవారం (నవంబర్ 29)ప్రగతి భవన్ ముట్టడి అంటూ మరో డ్రామాకు తెరలేచింది. ఇక్కడ కూడా హై డ్రామా మధ్య షర్మిలను పోలీసులు అరెస్టు చేసి ఎస్ ఆర్ నగర్ పీఎస్ కు తీసుకువెళ్లారు. ప్రగతి భవన్ ముట్టడికి బయలు దేరిన షర్మాను రాజ్ భవన్ రోడ్ లో పోలీసులు అడ్డుకున్నారు. అమె కారులోంచి దిగడానికి నిరాకరించడంతో క్రేన్ సహాయంతో కారును పీఎస్ కు తరలించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు మీడియాలోనూ సామాజిక మాధ్యమంలోనే హల్ చల్ చేస్తున్నాయి. రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల పోటాపోటీ విచారణలు సహా అన్ని రాజకీయ అంశాలూ మరుగున పడిపోయాయి. కేసీఆర్ వ్యూహం కూడా ఇదేననీ, ప్రజల దృష్టిని ప్రధాన సమస్యల నుంచి మళ్లించే వ్యూహంలో ఆయన సక్సస్ అయ్యారనీ పరిశీలకులు అంటున్నారు. 

పీకే ఎక్కడ ?

ప్రశాంత్ కిశోర్.. పీకే పేరు విని చాలరోజులు, కాదు నెలలు అయింది కదూ.. అవును, ఒకప్పడు దేశ రాజకేయాల్లో ప్రముఖంగా వినిపించిన ఎన్నికల వ్యూహకర్త పీకే అని పిలవబడే ప్రశాంత్ కిశోర్, ఇప్పడు ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడా వినిపించడం లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో, అధికార పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా సేవలు అందిస్తున్న పీకే ఊసే లేదు. ఒకప్పుడు పీకే ను భుజానికి ఎత్తుకుని, ఆయనతో తనకు ఎనిమిదేళ్ళకు పైగా చాలా ‘క్లోజ్ రిలేషన్స్’ ఉన్నాయని చెప్పుకొచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, ఆయన్నే నమ్ముకుని రెండవసారి అధికారంపై ఆశలు పెంచుకున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ, ఇప్పుడు పీకే పేరే తలచుకోవడం లేదు.  అదలా ఉంటే, తెలుగు రాష్ట్రాలలోనే కాదు, ఒక్క ఆయన స్వరాష్ట్రం బీహార్ లో మినహా మరెక్కడా ఆయన పేరు అంతగా ప్రస్తావనకు రావడం లేదు. అయితే, ఈ సంవత్సరం (2022) ప్రారంభంలో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలలో, తృణమూల్  కాంగ్రెస్ విజయం తర్వాత పీకే ప్రతిష్ట పతాక స్థాయికి చేరింది. అయితే, అదే సమయంలో పీకే రాజకీయ వ్యూహకర్త వేషం చాలిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, ప్రత్యక్ష రాజకీయాల విషయంలోనూ అంతగా ఆసక్తి లేదని, చెప్పుకొచ్చారు. కానీ, ఆ తర్వాత, జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు చాలా చాలా ప్రయత్నాలు చేశారు. ఒక దశలో కాంగ్రెస్ పార్టీ పునర్జీవనానికి నడుం బిగించారు. ‘వ్యూహ’ రచన చేశారు. చివరకు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కుడా పీకే   సిద్ధమయ్యారు. అయితే, కారాణాలు ఏవైనా, ఆ రెండు ప్రయత్నాలు విఫల మయ్యాయి. ఆ తర్వాతనే, పీకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చేతులు కలిపారు. తెలంగాణలో తెరాసను మూడవసారి గెలిపించడంతో పాటుగా, జాతీయ స్థాయిలో కేసీఆర్ కు పొలిటికల్ స్పేస్ క్రియేట్ చేసేందుకు డీల్ కుదుర్చుకున్నారు. అయితే, ఎందుకనో గానీ,కొద్ది నెలలుగా పీకే పేరు తెలంగాణలో వినిపించడం వినిపించడం లేదు. అలాగే, ఎపీలోనూ పీకే .ఐ ప్యాక్ టీం పనిచేస్తున్నా పీకే మాత్రం దూరంగానే ఉంటున్నారు.  ప్రస్తుతం పీకే, బీహార్ రాజకీయాలలో ప్రత్యక్ష భూమిక కోసం పావులు కదుపుతున్నారు. బీజేపీతో తెగతెంపులు చేసుకుని పాత మిత్రుడు లాలూ ప్రసాద్ యాదవ్, ఆర్జేడీతో జట్టు కట్టిన, ముఖ్యమంత్రి, జేడీ(యు) లీడర్ నితీష్ కుమార్ ఓడించడమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నారు, ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంట్రీకి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.అయితే, ఇక్కడ ఆసక్తికర విషయం ఏమంటే, పీకే భూమి గుండ్రంగా ఉంటుందని మరోమారు నిరూపించారు. ఆయన ఎక్కడి నుంచి రాజకీయంగా తొలి అడుగు వేశారో, మళ్ళీ అక్కడికే వచ్చినట్లు తెలుస్తోంది. బీహారులో లాలూ – నితీష్ జోడీని ఓడించేందుకు బీజేపీతో జట్టు కట్టేందుకు సిద్ధమైనట్లు బీహార్ రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తోంది. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారని అంటున్నారు. అందుకే.. వైసీపీ, టీఆర్ఎస్ లను వదిలేశారని అనుమానిస్తున్నారు.  అదొకటి అలాఉంటే, ప్రశాంత్ కిశోర్ ను మంచి ఎన్నికల వ్యూహకర్త అనాలా, మంచి పొలిటికల్  బిజినెస్ మాన్ అనాలా? అంటే, రాజకీయ విశ్లేషకులు పీకే, ఓ మంచి బిజినెస్ మాన్ అనే అంటున్నారు. రాజకీయ పార్టీల బలహీనతలను సొమ్ము చేసుకున్నారని, అంటున్నారు. అలాగే, పీకే ఖాతాలో చేరిన ఎన్నికల విజయాలు నిజంగా ఆయన వ్యూహబలంతో సాధించిన విజయాలేనా,అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ప్రశాంత్ కిశోర్ తొలిసారిగా గెలిచే పార్టీలతో అయన డీల్ కుదుర్చుకున్నారే గానీ, ఆయన వ్యూహాల కారణంగానే  ఏ పార్టీ గెలిచింది లేదనీ కొందరు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ తొలి సారిగా, 2012లో గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేద్ర మోడీ గెలుపు కోసం పని చేశారు. నిజానికి అప్పటికి, ఆయన పూర్తి స్థాయి ఎన్నికల వ్యూహకర్తగా స్థిరపడలేదు.అలాగే,అప్పటికే రెండుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా   దేశంలోనే కాదు,  అంతర్జాతీయంగానూ నరేంద్ర మోడీకి ప్రత్యేక గుర్తింపు వుంది. మేథావి వర్గాల్లో గుజరాత్ మోడల్’ పరిపాలన గురించి చర్చ అప్పటికే మొదలైంది. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నఎన్నారైలు, అనేక మంది 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ గెలుపుకోసం వచ్చిన అనేక మంది ఎన్నారైలలో ప్రశాంత్ కిశోర్ ఒకరు.  గుజరాత్,  హెల్త్ మోడల్ ను విశ్లేషిస్తూ ఒక ఆంగ్ల పత్రికలో రాసిన వ్యాసం,ఆయన్ని మోడీ దగ్గరకు చేర్చింది. ఆ ఎన్నికలో పీకే, మోడీ గెలుపు కోసం పనిచేశారు. అయితే, 2012 ఎన్నికలలో మోడీ సాధించిన హట్రిక్ విజయం పూర్తిగా పీకే ఖాతాలో వేసుకున్నా, అది నిజం కాదు. మోడీతో పరిచయం ఏర్పడిన తర్వాతనే,2012లో సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ (సిఎజి) అనే ఎన్నికల ప్రచార బృందం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో సిఎజి బీజేపీ పక్షాన పనిచేసింది.ఆ విధంగా పీకే 2013 మేలో, కిషోర్ సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ (సిఎజి) ను స్థాపించారు. కిషోర్ మోడీతో విడిపోయాక, (సిఎజి) ను స్పెషలిస్ట్ పాలసీ సంస్థ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-పిఎసి) గా మార్చారు. ఇక ఆతర్వాత ఏమి జరిగింది అన్నది తెలిసిందే.