ఫోన్ మిస్సింగ్ లోగుట్టేంటి?

వరుస ఐటీ, ఈడీ అధికారుల సోదాలతో తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీ నాయకులు హడలెల్తిపోతున్నారు. తాజాగా తెలంగాణ కార్మిక శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి నివాసంతోపాటు ఆయన సంస్థల్లో ఐటీ శాఖ సోదాల చేపట్టింది. ఆ క్రమంలో సదరు మంత్రిగారి వ్యవహారశైలిపై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోలింగ్ జరుగుతోంది. ఐటీ సోదాల నేపథ్యంలో మల్లారెడ్డి.. తన సెల్ ఫోన్‌ను డస్ట్ బీన్‌లో చెత్త మాటున దాచి పెట్టినట్లు సోషల్ మీడియా సాక్షిగా ఓ వార్త అయితే తెగ వైరల్ అవుతోంది.  అయితే ఆ ఘటన జరిగిన జస్ట్ 24 గంటల్లోనే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీకి చెందిన అత్యంత శక్తివంతమైన నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సెల్ ఫోన్.. నవంబర్ 21న పోయిందంటూ.. ఆయన వ్యక్తిగత కార్యదర్శి .. నవంబర్ 23వ తేదీన తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై సోషల్ మీడియా సాక్షిగా విజయసాయిరెడ్డిపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మాయల ఫకీర్ ప్రాణాలు.. సప్త సముద్రాల అవతల మర్రిచెట్టు తొర్రలో ఉన్నట్లు.. ఈ విజయసాయిరెడ్డిగారి గుట్టంతా.. ఆయనగారి ఐఫోన్‌లో ఉందని ఒకరు కామెంట్ చేస్తే..  ఈ మూడున్నరేళ్లలో ఈ ఏ2 గారు చేసిన అరాచకాలకు అసలు సిసలు సాక్షి.. ఆ సెల్ ఫోనే అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానిస్తూ పోస్ట్ పెట్టారు. మరోకరు అయితే ఇంకొంచెం ముందుకెళ్లి ఉత్తరాంధ్రలో రుషి కొండను చెక్కినా.. మైనింగ్ కోసం పాతాళం వరకు తవ్వినా... ఏదైనా.. దేనికైనా.. విజయసాయిరెడ్డి సెల్ ఫోనే అందుకు సాక్షి అని వారు సోషల్ మీడియా సాక్షిగా స్పష్టం చేస్తున్నారు. ఇంకొకరు అయితే.. నేడు తెలంగాణలోని మంత్రి మల్లారెడ్డి దాకా వచ్చింది... రేపు నా దాకా రాదనే గ్యారెంట్ అయితే లేదని.. ఆ క్రమంలోనే ఈ సాయిరెడ్డి..ముందుగానే తన సెల్ ఫోన్.. మాయం చేశారని మరొ నెటిజన్ తనదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ సెల్ ఫోన్‌ మాయం వెనుక పెద్ద మతలబే ఉండి ఉంటుందని మరో నెటిజన్ సందేహంతో కామెంట్ పెట్టారు.  మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. సూట్ కేసు కంపెనీలు.. వైయస్ జగన్ వ్యాపారం.. వేల కోట్ల రూపాయిల అక్రమాస్తుల ఎపిసోడ్‌కి కర్మ.. కర్త... క్రియా అంతా ఈ ఏ2 విజయసాయిరెడ్డి గారేననే చర్చ నాడే కాదు.. నేటికి నాంపల్లి పరిసర ప్రాంతాల్లో తరుచు వినిపిస్తోందని ఓ నెటిజన్ అయితే సెటైరికల్‌గా కామెంట్ పెట్టారు. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సైతం ఈ విజయసాయి రెడ్డి.. తన చదవిన చదువుకు మెరుగులు పెట్టి మరి... నీకు అది నాకు ఇది పథకానికి మరింత మెరుగు పెట్టారనే ఓ చర్చ సైతం.. ఫ్యాన్ పార్టీలో గుప్పు గుప్పుమంటోందని ఓ నెటిజన్... తన మార్క్ పొలిటికల్ థియరీతో అనాలసిస్ చేసేయడం విశేషం.    అయినా ఫ్యాన్ పార్టీ అధినేత వైయస్ జగన్ తర్వాత స్థానంలో ఉన్న ఈ విజయసాయి సెల్ ఫోన్ మాయం కావడం నిజంగా నిజమేనా? అంతా ఫుల్ సెక్యూరిటీ.. ఆయన గారి చుట్టు మంది మార్బలం ఎప్పుడు ఉంటారు. అయినా సాయిరెడ్డిగారి సెల్ ఫోన్ ఎప్పుడు పోయింది.. ఎక్కడ పోయింది.. ఎలా పోయిందంటూ ఓ నెటిజన్ తన దేహంలో పుట్టిన సందేహాలతో సోషల్ మీడియా సాక్షిగా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించేశారు. మరో నెటిజన్ అయితే.. ఒక్క సెల్ ఫోన్... లక్ష సందేహాలు లాగా పరిస్థితి తయారైందని ఎద్దేవా చేశారు.   ఇక మరోవైపు విజయసాయిరెడ్డి సెల్ ఫోన్ పోయిందంటూ అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేయడంతో ప్రతిపక్ష టీడీపీ ఆగమేఘాల మీద స్పందించింది. ఆ పార్టీలోని కీలక నేతలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి.. సెల్ పోయిందా లేక.. పారేశారా లేదంటే.. విజయసాయి రెడ్డి ఫోన్ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి బలవంతంగా లేగాసుకున్నారా? అంటు మీడియా సాక్షిగా ప్రశ్నల వర్షం కురిపించేశారు. అయినా విజయసాయి ఫోన్ పోయిందో లేదో కానీ.. ఆయనగారి ఒక్కగానొక్క సెల్ ఫోన్ మిస్సింగ్‌తో ఎంతో మంది అటు మీడియా సాక్షిగా ఇటు సోషల్ మీడియా సాక్షిగా తమదైన శైలిలో స్పందించడం విశేషం. ఏదీ ఏమైనా.. ఓ వేళ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ, ఐటీ శాఖలు  రంగంలోకి దిగితే... పాత్రదారులు, సూత్రధారులు పని పట్టడం ఎంత సేపు అనే ఓ చర్చ అయితే తెలుగు రాష్ట్రాల్లో కొన... సాగుతోంది.

గొప్ప నేతల జాబితాలో మోడీ టాప్

కీలక అంశాలలో మౌనం.. ఉద్వేగాలను రెచ్చగొట్టే విషయంలో అనర్గళ ప్రసంగాలు.. దేశంలో సమస్యలు వెల్లువెత్తుతున్నా పట్టించుకోని తీరు.. వెరసి గత ఎనిమిదేళ్ల మోడీ పాలనపై దేశంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమౌతోంది. అదే సమయంలో ఎన్నికలలో మాత్రం బీజేపీ వరుస విజయాలు అందుకుంటోంది. హిమాచల్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే నెల మొదటి వారంలో వెలువడనున్నాయి. హిమాచల్ అసెంబ్లీకి ఒకే విడతలో ఇప్పటికే ఎన్నికలు పూర్తి అయ్యాయి. గజరాత్  అసెంబ్లీ కి వచ్చే నెల1, 5 తేదీలలో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలూ వచ్చే నెల 8న వెలువడతాయి. అయితే రెండు రాష్ట్రాలలో కూడా బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవడం తథ్యమనే ఇప్పటి వరకూ వెలువడిన పలు సర్వేలు పేర్కొన్నాయి. ఒక వైపు వ్యతిరేకత వెల్లువెత్తుతున్నా.. జనం మాత్రం మోడీ పాలనవైపే మొగ్గు చూపుతున్నారు. ఇదేలా సాధ్యమంటే బీజేపీ వారు అదే మోడీ మ్యాజిక్ అంటారు. ఇదిలా ఉంటే.. ప్రపంచంలోని గొప్ప నేతల జాబితాలో మోడీ తన అగ్రస్థానాన్ని మరో సారి నిలబెట్టుకున్నారు. మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ గ్రూప్ ప్రపంచంలోని గొప్ప నేతలు ఎవరన్న అంశంపై నిర్వహించిన సర్వేలో మోడీ మరోసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఈ జాబితాలో 77శాతం రేటింగ్ తో మోడీ టాప్ గా నిలిచారు. మోడీ తరువాత రెండో స్థానంో ఉన్న ఆస్ట్రేలియా ప్రధానికి దక్కిన రేటింగ్ 56శాతం మాత్రమే. ఇక అగ్రరాజ్యం జోబెడెన్ 44శాతం రేటింగ్ తో మూడో స్థానంలో నిలిచారు. ఇంకా ఈ జాబితాలో టాప్ ఫైవ్ లో కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రుడో 39 శాతం రేటింగ్,  బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ 36శాతం రేటింగ్ ఉన్నారు. మొత్తం 22 దేశాల అధినేతల రేటింగ్స్ తో ఈ సంస్థ గొప్ప నాయకుల జాబితాను విడుదల చేసింది. ఈ సంస్థ ప్రభుత్వాలు, నేతల తీరును ట్రాక్ చేస్తుంటుంది. ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించిన సర్వేలో కూడా మోడీ 75 శాతం రేటింగ్ తో తొలి స్థానంలో నిలిచారు. అప్పటి కంటే తాజా సర్వేలో మోడీ రేటింగ్ మరో 2 శాతం పెరగడం గమనార్హం.

సీబీఐ చార్జ్ షీట్ లో కనిపించని మనీష్ సిసోడియా, శరత్ చంద్రారెడ్డి పేర్లు

ఢిల్లీ లిక్కర్ స్కాం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సీబీఐ, ఈడీలో పోటీలు పడి మరీ ఈ కేసు దర్యాప్తులో అంతులేని వేగం ప్రదర్శించాయి. దేశ వ్యాప్తంగా దాడులు నిర్వహించాయి. పలువురు ప్రముఖ రాజకీయ నేతల పేర్లు ఈ కుంభకోణం కేసులో వెలుగులోకి వచ్చాయి. అసలీ కేసులు ఏ1గా డిల్లీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడిగా పేరును సీబీఐ ఎఫ్ఐఆర్ పే పేర్కొంది. సరే పలువురిని ఈ కేసులో అరెస్టు చేయడం కూడా జరిగింది. అంతటి ప్రాధాన్యత కలిగిన ఈ కేసులో సీబీఐ ఢిల్లీ హైకోర్టులో శుక్రవారం తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. అయితే విచిత్రంగా ఎఫ్ఐఆర్ లో ఎ1 ముద్దాయిగా పేర్కొన్న మనీష్ సిసోడియా పేరును చార్జిషీట్ లో పేర్కొన లేదు. ఇంకా ఈ కేసులో దాఖలు చేసిన చార్జిషీట్ లో ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఉన్నారు. మరో ఐదుగురు ప్రైవుటు వ్యక్తులు ఉన్నారు. ఆ ప్రైవేటు వ్యక్తులలో తెలంగాణకు చెందిన అభిషేక్ రావు, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రచురితమౌతున్న ఒక ప్రముఖ దినపత్రిక ఎండీ ఉన్నారు. అలాగే మరో వ్యక్తి అరుణ్ రామచంద్రపిళ్లై ఉన్నారు. ఇదే కేసులో సీబీఐ అప్రూవర్ గా పేర్కొన్న దినేష్ అరోరా కూడా ఉన్నారు. కానీ ఈ కేసులో ఎ1గా ఎఫ్ ఐఆర్ లో సీబీఐ పేర్కొన్న మనీష్ సిసోడియా పేరు లేకపోవడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. అలాగే ఈ స్కాం కు సంబంధించి ఇటీవల అరెస్టయిన అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి పేరూ కూడా సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ లో లేదు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అంశమేమిటంటే.. శరత్ చంద్రారెడ్డి లిక్కర్ స్కాంలోనే అరెస్టయినా ఆయనను అరెస్టు చేసింది మాత్రం ఈడీ. సీబీఐ కాదు. అందుకే సీబీఐ చార్జ్ షీట్ లో ఆయన పేరు లేదంటున్నారు. మొత్తం మీద సీబీఐ చార్జిషీట్ లో మనీష్ సిసోడియా పేరు లేకపోవడంతో.. ఆప్ ఆరోపిస్తున్నట్లుగానే లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాను రాజకీయ కక్ష సాధింపు చర్యలలో భాగంగానే ఏ1గా నమోదు చేశారా అన్న అనుమానాలు మరోసారి తెరమీదకు వచ్చాయి. అయితే సిసోడియా సన్నిహితుడైన దినేష్ అరోరాను సీబీఐ అప్రూవర్ గా ప్రకటించడంతో ముందు ముందు మరేవైనా సంచలనాలు బయటపెట్టనుందా అన్న అనుమానాలూ వ్యక్త మౌతున్నాయి. ఇక నేడో రోపో ఇదే కేసులో ఈడీ కూడా చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఆ చార్జిషీట్ లో ఎవరెవరి పేర్లు ఉంటాయన్న ఆసక్తి రాజకీయ వర్గాలలో నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అవినీతి కోణాన్ని సీబీఐ, మనీల్యాండరింగ్ అంశంపై ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి విదితమే. 

ఏపీ నూతన సీఎస్ గా జవహర్‌రెడ్డి?

ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త  సీఎస్‌గా కేఎస్ జవహర్ ‌రెడ్డి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం. మరో సారి సమీర్ శర్మకు ఎక్స్ టెన్షన్ కోరుతారని తొలుత అంతా భావించినా.. జగన్ నుంచి అటువంటి కదలిక ఏదీ కనిపించలేదు. సమీర్ శర్మ పదవీ విరమణ సమయం సమీపిస్తుండటంతో ఆయనకు మరో ఏడాది పదవీ కాలం పొడగింపునకు జగన్ సర్కార్ ప్రయత్నిస్తోందన్న వార్తలు వినవచ్చాయి. అయితే జగన్ సర్కార్ కొత్త సీఎస్ గా జవహర్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రభుత్వ వర్గాలే చెబుతుండటంతో సమీర్ శర్మ పదవీ కాలం పొడగింపు ఊహాగానాలకు చెక్ పడింది. స్వయంగా సమీర్ శర్మ కూడా రిటైర్మెంట్ కే మొగ్గు చూపారనీ, ఇందుకు తన ఆరోగ్య పరిస్థితి కారణంగా చెప్పారని అంటున్నారు. దీంతో జగన్ కొత్త సీఎస్ గా జవహర్ రెడ్డి వైపు మొగ్గు చూపారని అంటున్నారు. ఆయన పేరును నేడో రేపో ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు.  అయితే జవహర్ రెడ్డి విషయానికి వస్తే.. జగన్ అధికార పగ్గాలు చేపట్టేంత వరకూ..   జవహర్ రెడ్డి ప్రధాన లేదా కీలక పదవులలో బాధ్యతలు నిర్వహించలేదు. అయితే ఆయనకు  జగన్  ముఖ్యమంత్రి అయిన తరువాత   ఎక్కడ లేని ప్రాధాన్యతా వచ్చి పడింది. కరోనా సమయంలో ఆరోగ్య శాఖ మొత్తం జవహర్ రెడ్డి కనుసన్నలలోనే పని చేసింది. తర్వాత ఆయన తనంత తానుగా  కోరుకుని మరీ   టీటీడీ చైర్మన్  పోస్టుకు వెళ్లారు. అయితే అది అతి కొద్ది కాలం మాత్రమే. తరువాత జగన్ ఆయనను ముఖ్యమంత్రి కార్యాలయానికి తెచ్చుకుని కీలక బాధ్యతలు అప్పగించారు.  ఇప్పుడు సీఎస్ గా ఆయన పేరునే పరిశీలిస్తున్నారు.   సమీర్ శర్మ రిటైర్మెంట్ తరువాత సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సీఎస్ గా అవకాశం ఇస్తారని ప్రచారం జరిగినా.. అది ప్రచారంగానే మిగిలిపోయింది. గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసులో శ్రీలక్ష్మికి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ జగన్ అక్రమాస్తుల కేసులో ఆమెపై కేసులు ఆలాగే ఉండటంతో ఆమెకు అవకాశం దక్కలేదని అంటున్నారు.   ఇక, సీఎస్‌గా పదవీ విరమణ చేయనున్న సమీర్ శర్మకు కాలుష్య నియంత్రణ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వనున్నట్టు సమాచారం. అలాగే, ఇనిస్టిట్యూట్ ఆఫ్ లీడర్ షిప్, ఎక్స్‌లెన్స్ అండ్ గవర్నెన్స్ (ఐఎల్ఈ అండ్ జీ) వైస్ చైర్మన్ ‌గానూ ఆయనను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. జవహర్ రెడ్డి  ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 

కివీస్ పై ఇండియా చెత్త రికార్డు

న్యూజిలాండ్ పై ఓటముల్లో టీమ్ ఇండియా ఖాతాలో ఓ చెత్త రికార్డు నమోదైంది. ఆక్లాండ్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో శుక్రవారం జ‌రిగిన తొలి వ‌న్డేలో భార‌త జ‌ట్టు 7 వికెట్ల తేడాతో ఘోరంగా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఓటమితో టీమ్ఇండియా ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. వ‌న్డేల్లో న్యూజిలాండ్ పై వ‌రుస‌గా ఐదు మ్యాచుల్లో ఓడిన రికార్డును టీమ్ ఇండియా సాధించింది. 2019 ప్ర‌పంచ‌క‌ప్ సెమీఫైన‌ల్‌లో మొద‌లైన ఓట‌ముల ప‌రంప‌ర ఇప్పటి వరకూ కొనసాగింది. 2019 వన్డే ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్ లో భారత్ 18 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై పరాజయం పాలైంది.  ఆ త‌రువాత 2020లో విరాట్ కోహ్లీ నేతృత్వంలో భారత్ మరోసారి న్యూజిలాండ్‌లో పర్యటించింది. ఆ సిరీస్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ టీమ్ ఇండియా ఓటమినే మూటగట్టుకుంది. ఇప్పుడు శిఖర్ ధావన్ నాయకత్వంలోని భారత్  తొలి వన్డేలో ఓడిపోయింది. దీంతో  వన్డేల్లో న్యూజిలాండ్‌పై భారత్‌కు ఇది వరుసగా ఐదో ఓటమి. చ‌రిత్ర‌లో ఇలా వ‌రుస‌గా కివీస్ పై వ‌న్డేల్లో భార‌త్ ఐదు మ్యాచుల్లో ఎన్న‌డూ ఓడిపోలేదు. చివ‌రి సారిగా ఫిబ్రవరి 2019లో కివీస్ పై భార‌త్ విజ‌యం సాధించింది. ఆ మ్యాచ్‌లో అంబటి రాయుడు 90 పరుగులు చేయ‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 252 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సంతోష్ కు బిగ్ రిలీఫ్

ఎమ్మెల్యేలకు కొనుగోలు బేరసారాల కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో త‌మ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని తెలంగాణ‌ సిట్‌  నోటీసుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  తదుపరి విచారణను డిసెంబర్ 5కి వాయిదా వేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ ను నిందితుల జాబితాలో చేర్చి సీఆర్‌పీసీ 41ఏ కింద సిట్ ఆయనకు   నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని, నోటీసు ర‌ద్దు చేయాల‌ని బీఎల్ సంతోష్ న్యాయ‌స్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు లంచ్ మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. రోహిత్ రెడ్డి చేసిన ఫిర్యాదులో బీఎల్ సంతోష్ పేరు లేద‌ని, ఎఫ్ఐఆర్‌లో కూడా పేరు లేన‌ప్పుడు ఆయ‌న్ని నిందితుల జాబితాలో ఎలా చేరుస్తార‌ని అభ్యంత‌రం లేవ‌నెత్తారు. ఈ విష‌యాల‌ను అన్నింటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు బీఎల్ సంతోష్ కు ఊరట కలిగిస్తూ  ఆదేశాలు జారీ చేసింది.   కాగా ఈ కేసులో బీఎల్ సంతోష్ ప్రమేయంపై  ఆధారాలు ఉన్నాయని తెలంగాణ అడ్వకేట్ జనరల్ వాదించారు.ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల   కేసుకు సంబంధించి బీఎల్ సంతోష్, కేరళ ఎన్డీయే కన్వీనర్ తుషార్, డాక్టర్ జగ్గుస్వామి, న్యాయవాది శ్రీనివాస్ ను సిట్ నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే. 

డ్రాగన్ దేశంలో మళ్లీ కరోనా విలయం

కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తోందా? మరో సారి వైరస్ ముప్పు ముంచుకు రాబోతోందా? మళ్లీ లాక్ డౌన్ లో క్వారంటైన్ లూ తప్పవా? అంటే చైనా ఔననే అంటోంది. కరోనా వైరస్ పుట్టిన చైనాలో ఆ మహమ్మారి మరో సారి విజృంభిస్తోంది. డ్రాగన్ దేశంలో ఒకే రోజు 33వేల మందికి పైగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఒక్క సారిగా కరోనా కేసులు పెరిగిపోవడంతో చైనా బెంబేలెత్తిపోతోంది. గురువారం ఒక్కరోజే 32వేల 943 కేసులు నమోదయ్యాయి. వీటిలో 29వేల 840 కేసులు అసింప్టొమేటిక్, 3వేల 103 కేసులు సింప్టొమేటిక్ అని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ విధించినా, కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా.. రికార్డు స్థాయిలో వేల సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవడం భయాందోళనకు గురి చేస్తోంది. మళ్లీ ప్రబలుతున్న కరోనా మహమ్మారి.. చైనా ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీసింది. ఈ వ్యాప్తి వేగం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరో వేవ్ తప్పదా అన్న అనుమానాలకు తావిస్తోంది. ప్రపంచంలో చాలా దేశాలు మళ్లీ కరోనా జాగ్రత్తలు పాటించాలంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాయి.

ఫిఫా వరల్డ్ కప్.. వేల్స్ పై ఇరాన్ విజయం..చివరి నిముషాల్లో అద్భుతం

ఖ‌తార్ వేదిక‌గా జ‌రుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ 2022లో ఇరాన్ జ‌ట్టు బోణి కొట్టింది. వేల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో విజ‌యం సాధించి ప్రపంచ‌క‌ప్‌లో త‌మ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. ఆట అద‌న‌పు స‌మ‌యంలో రూజ్‌బే చేష్మీ (90+9 నిమిషం), రామిన్ రిజయాన్(90+11 నిమిషం)లో చెరో గోల్ చేయ‌డంతో ఇరాన్ అద్భుత విజ‌యాన్ని అందుకుంది.  ఇరు జ‌ట్లు హోరా హోరీగా తలబడ్డ ఈ మ్యాచ్లో వేల్స్ గోల్‌పోస్ట్‌పైకి ఇరాన్ ఆట‌గాళ్లు ప‌దే ప‌దే దాడులు చేసినా ఫ‌లితం లేక‌పోయింది. వేల్స్ డిఫెన్స్  స‌మ‌ర్థ‌వంతంగా వాటిని అడ్డుకుంది. దీంతో తొలి అర్థ‌భాగంలో ఇరు జ‌ట్లు ఒక్క గోల్ కూడా చేయ‌లేక‌పోయాయి. సెకండాఫ్‌లోనూ దాదాపుగా అదే ప‌రిస్థితి కొన‌సాగింది. ఆట మ‌రికాసేప‌ట్లో ముగుస్తుంద‌న‌గా వేల్స్ గోల్ కీప‌ర్ వేన్ హెన్నెస్సీ అత్యుత్సాహం ఆ జ‌ట్టు కొంప ముంచింది. ప్ర‌త్య‌ర్థి ఆట‌గాడిని అడ్డుకునే విష‌యంలో కాస్త దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డంతో రిఫ‌రీ అత‌డికి రెడ్ కార్డు చూయించాడు. దీంతో వేల్స్ 10 మంది ఆట‌గాళ్ల‌తోనే మ్యాచ్ కొన‌సాగించింది. అయిన‌ప్ప‌టికీ ప్ర‌త్య‌ర్థికి ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌లేదు. నిర్ణీత స‌మ‌యం ముగిసే స‌మ‌యానికి ఇరు జ‌ట్లు ఒక్క గోల్ కూడా చేయ‌లేక‌పోయాయి. అద‌న‌పు స‌మ‌యంలోనూ గోల్ చేయ‌డంలో విఫ‌లం కావ‌డంతో ఇక మ్యాచ్ దాదాపు డ్రా అనుకుంటున్న త‌రుణంలో ఇరాన్ ఆట‌గాళ్లు అద్భుతం చేశారు. 90+9 నిమిషంలో ఇరాన్ ప్లేయర్ రూజ్‌బే చేష్మీ బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించి ఖాతా తెరువ‌గా మరో రెండు నిమిషాల వ్యవధిలోనే ఆ ఆనందాన్ని డబుల్ చేస్తూ మరో ఇరాన్ ప్లేయర్ రామిన్ రిజయాన్ గోల్ కొట్టాడు. దీంతో ఇరాన్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ లోగా అద‌న‌పు స‌మ‌యం ముగియ‌డంతో మ్యాచ్ ఇరాన్ సొంతమైంది. త‌మ తొలి మ్యాచ్‌లో 6-2 తేడాతో ఇరాన్ ఓడిపోయింది. దీంతో ఈ టోర్నీలో ముందు అడుగువేయాలంటే ఈ మ్యాచ్‌లో త‌ప్ప‌క గెల‌వాల్సిన ప‌రిస్థితిలో గెలిచి రౌండ్ ఆఫ్ 16 ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది.

మియావ్ మియావ్ పిల్లి.. సెంచరీ నాటౌట్?!

ఈ ఫొటోలో కనిపిస్తున్న పిల్లి వయస్సు 120 సంవత్సరాలు. నమ్మ లేకపోతున్నారు కదా! కానీ నమ్మక తప్పదు.  ఎందుకంటే ప్రపంచంలోనే అతి ఎక్కువ కాలం జీవించిన పిల్లిగా దీనికి గన్నిస్ బుక్ ఆప్ రికార్డ్స్ లో స్థానం లభించింది. ఈ పిల్లి బతికిన వయస్సును మనుషుల వయస్సుతో పోలిస్తే 120 ఏళ్లు అందుకే ఈ పిల్లి వయస్సు 120 ఏళ్లు అని చెబుతారు. వాస్తవానికి ఈ మార్జాలం 26 ఏళ్ల కిందట పుట్టింది. ఏ పిల్లైనా సరే మహా బతికితే ఓ 18 ఏళ్లు బతుకుతుంది. అలాంటిది ఈ పిల్లి 26 ఏళ్లుగా జీవిస్తూ ప్రపంచంలోనే అతి ఎక్కువ వయస్సున్న పిల్లిగా గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. మనుషుల జీవన ప్రమాణంతో పోల్చి చెప్పుకోవాలంటే..దీని వయస్సు ఇప్పుడు 120 ఏళ్లుగా చెప్పాలి.పిల్లి సగటు వయస్సును మించి ఇప్పటికే ఇది పదేళ్లు ఎక్కువగా బతికేసింది. ఈ

రేవంత్ సొంత అజెండాతో భవిష్యత్ కార్యాచరణ.?

తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం ఉంది. ఆ పార్టీ రాస్ట్ర నాయకుడిగా ప్రజాకర్షణ శక్తి ఉన్న యువనేత రేవంత్ రెడ్డి ఉన్నారు. అన్నీ ఉన్నా అదేదో అన్నట్లు.. కాంగ్రెస్ తనకున్న మద్దతులు ఓట్లుగా మలచుకోవడంలో మాత్రం విఫలమౌతోంది. ఇందుకు నేతల మధ్య విభేదాలు, గ్రూపుల ఘర్షణలూ కరణమే అయినా అది ఒక్కటే కారణం కాదు. రాష్ట్ర విభజనకు ముందు వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ చాలా బలంగా ఉందనడంలో సందేహం లేదు. అంతెందుకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందంటే అందుకే తెరాస సుదీర్ఘ ఉద్యమమొక్కటే కారణం కాదు. కేంద్రంలో అప్పటికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా విస్మరించడానికి వీలులేని ఒక కారణమే. కేంద్రం ఆమోదం లేకుండా రాష్ట్రం ఆవిర్బవించే అవకాశమే లేదు. తెలంగాణ కంటే ఉవ్వెత్తున ఎగసిన గూర్ఖాలాండ్ వంటి ఉద్యమాలు విజయవంతం కాకపోవడమే ఇందుకు ఉదాహరణ. ఇక తెలంగాణ విషయానికి వస్తే అప్పట్లో అధిష్ఠానాన్ని తెలంగాణకు అనుకూలంగా అంగీకరించేలా చేయడంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వాన్ని విస్మరించడం సాధ్యం కాదు. సరే అన్నీ కలిసి వచ్చి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఇందు కోసం కాంగ్రెస్ అధిష్ఠానం ఏపీలో పార్టీ కాడెను వదిలేసింది. ఏకంగా ఆ రాష్ట్రంలో పార్టీ శూన్యంగా మిగిలిపోతుందని తెలిసీ త్యాగానికి సిద్ధపడింది. ఆ మేరకు తెలంగాణలో పార్టీ బలోపేతం అవుతుందని అంచననా వేసింది. తెలంగాణలో రాష్ట్ర ఆవిర్భావానికి క్రెడిట్ అంతా తెరాస ఖాతాలో పడింది. అప్పటి నుంచీ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి తిరోగమనం నుంచి తిరోగమనంగా తయారైంది. ఈ పరిస్థితిలో  రాష్ట్ర విభజన తరువాత తన రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని అనివార్యంగా హస్తం గూటికి చేరిన నేత రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించింది కాంగ్రెస్ హై కమాండ్.   కేవలం ఒక రాజకీయ పార్టీలో వంద మంది నేతలలో ఒకరిగా మిగిలిపోయు వ్యక్తిత్వం కాదు రేవంత్ రెడ్డిది. తనదైన ప్రత్యేకత, రాజకీయ వ్యక్తిత్వం ఉన్న నాయకుడు. తెలుగుదేశం పార్టీలో  కూడా రేవంత్ రెడ్డి ఆ పార్టీలో ప్రత్యేకత ఉన్న ముఖ్య నేతగా ఎదిగారు. 2009 ఎన్నికల సమయంలో తన ప్రచారంతో రాష్ట్రాన్ని ఉర్రూతలూగించిన జూనియర్ ఎన్టీఆర్ కు ప్రసంగాలు చేయడంలో శిక్షణ ఇచ్చినది రేవంత్ రెడ్డే అని చెబుతారు. అలాంటి వ్యక్తి  రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ తెలుగుదేశం దాదాపుగా నిర్వీర్యమైపోయిందన్న భావనతో పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ లోనూ తన ప్రత్యేకత చాటుకుని పలువురు సీనియర్లను అధిగమించి మరీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాత్రం ఆయన పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు చందంగా సాగుతోంది. వాస్తవానికి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తరువాత గత ఎనిమిదేళ్లుగా ఎన్నడూ లేనంతగా కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. యువత పార్టీ వైపు ఎక్కువగా దృష్టి సారించింది. క్షేత్ర స్థాయిలో క్యాడర్ లో ఉత్సాహం ఉరకలేసింది. అయితే ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. మరో వైపు రేవంత్ పార్టీ పటిష్టత దిశగా వేసే ప్రతి అడుగునూ అడ్డుకోవడానికి కాంగ్రెస్ లోని ఆయన వ్యతిరేకులు అడుగడుగునా అడ్డం పడ్డారు. ఆయన ఒక అడుగు ముందుకు వేస్తే.. వారు రెండడుగులు వెనక్కు వేసి పార్టీ పురోగతికి అవరోధంగా నిలిచారు.  ఈ అవరోధాలను అధిష్ఠానం అండతో అధిగమించి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న పట్టుదలతో ఆయన అడుగులు వేసినప్పటికీ.. మునుగోడు ఉప ఎన్నికల ఫలితం తరువాత ఆయనకు కూడా తత్వం బోధపడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ కు బయటి శత్రువులు కంటే ఇంటి శత్రువులే ఎక్కువ అన్న నిర్దారణకు వచ్చిన ఆయన ఇప్పుడు తన భవిష్యత్ కార్యాచరణపై సీరియస్ గా దృష్టి పెట్టారు. రేవంత్ రెడ్డి  సన్నిహితుల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు రావడం అన్న మిషన్ ను పక్కన పెట్టి రేవంత్ రాష్ట్రంలో ఓ పాతిక నియోజకవర్గాలపై సీరియస్ గా దృష్టి సారిస్తారు. ఆ పాతిక నియోజకవర్గాలలోనే అధిష్ఠానాన్ని ఒప్పించి తన వర్గం వారికి పార్టీ టికెట్లు సాధిస్తారు. వాటిలో తన వారిని గెలిపించుకోవడంపైనే దృష్టిసారిస్తారు.  అలా గెలిపించుకున్న పాతిక మంది ఎమ్మెల్యేలతో రాష్ట్ర రాజకీయాలలో బలమైన శక్తిగా రేవంత్ అవతరించే అవకాశాలున్నాయంటున్నారు. మరో వైపు  తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కూడా పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కాసాని జ్ణానేశ్వర్ తెలంగాణ తెలుగుదేశం సారథ్య బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలు రానున్న జోరందుకోనున్నాయన్న అంచనాలున్నాయి. సెటిలర్స్ అధికంగా ఉన్ననియోజకవర్గాలతో పాటు మరి కొన్ని నియోజకవర్గాలలో తెలుగుదేశం అభ్యర్థులు గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాని పరిస్థితి ఏర్పడుతుందనీ, హంగ్ అనివార్యమనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడితే కింగ్ మేకర్ గా రేవంత్ అవసరిస్తారని అంటున్నారు. ఆ వ్యూహంతోనే రేవంత్ అడుగులు పడుతున్నాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 

న్యూజిలాండ్ తో వన్డే సీరిస్ తొలి మ్యాచ్ లో టీమ్ ఇండియా చిత్తు

న్యూజిలాండ్ తో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమ్ ఇండియా 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇండియా..నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగుల స్కోరు చేసింది. అయితే భారత్ నిర్దేశించిన 307 పరుగుల విజయ లక్ష్యాన్ని న్యూజిలాండ్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 17 బంతులు అంటే 2.5 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది. ఛేదనలో న్యూజిలాండ్ కు గొప్ప ఆరంభమేమీ దక్కలేదు. 35 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన కివీస్ స్కోరు బోర్డుపై 88  పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయి క్లిష్ట పరిస్థిల్లో ఉన్న సమయంలో స్కిప్పర్ కేన్ విలియమ్సన్, లాథమ్ లు ఇన్నింగ్స్ ను చక్కదిద్దడమే మరో వికెట్ పడకుండా లక్ష్యాన్ని ఛేదించారు.  ఒక విధంగా భారత్ చేసిన 306 పరుగులు భారీ స్కోరే. అయితే బౌలర్ల వైఫల్యంతో కొండ లాంటి లక్ష్యం కూడా న్యూజిలాండ్ ఉఫ్ మని ఊదేసింది. న్యూజిలాండ్ కెప్టెన్ 94 నాటౌట్ తో కలిసి లాథమ్ 145 నాటౌట్ న్యూజిలాండ్ కు సునాయాస విజయాన్ని అందించారు. అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియాకు శుభారంభం దక్కింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభమన్ గిల్ లుతొలి వికెట్ కు 124 పరుగుల భాగస్వామ్యం సాధించారు.   స్కిప్పర్ శిఖర్ ధావన్  72, ఓపెనర్ శుభమన్ గిల్ 50, శ్రేయస్స అయ్యర్స్ 80 అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ 16 బంతుల్లో 2 ఫోర్లు, 36 సిక్సర్లతో 37 నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.  భారీ స్కోరును ఢిఫెండ్ చేయడంతో టీమ్ ఇండియా బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఉమ్రాన్ 2 వికెట్లు పడగొట్టగా, వాషింగ్టన్ సుందర్ కు ఒక వికెట్ దక్కింది. వీరిద్దరితో సహా టీమ్ ఇండియా బౌలర్లందరూ ధారాళంగా పరుగులివ్వడంతో న్యూజిలాండ్ సునాయాసంగా విజయం సాధించింది. లాథమ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

కేంద్రం కరుణిస్తేనే జీతాలు, పెన్షన్లు ...

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అర్జెంటుగా వైద్యులు కావాలి ... వైద్యులంటే డాక్టర్లు కాదు. సుమతీ శతకకారుడు చెప్పిన, అప్పిచ్చు వైద్యులు కావాలి. అవును, రాష్ట్ర ఆర్ధికఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. అప్పు పుట్టందే పూట గడిచే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను వెంట పెట్టుకుని ఢిల్లీకి పయనమై వెళ్ళారు. ఎసరు పోయి మీద పెట్టి బియ్యం అప్పు కోసం ఇరుగుపొరుగు ఇళ్లకు పరుగులు తీసినట్లు,మరో వారం రోజుల్లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు చెల్లించవలసి ఉండగా ఆర్థిక మంత్రి బుగ్గన ‘అప్పు ప్లీజ్’ అంటూ హస్తినకు పరగులు తీశారని అంటున్నారు.  జీతాలు, పెన్షన్లు చెల్లించేందుకు కూడా ఖజానాలో కాసులు లేని పరిస్థితి. అందుకే, ఆర్థిక మంత్రి బుగ్గన, అధికారులను వెంట పెట్టుకుని ఢిల్లీకి వెళ్ళారని, అధికార వర్గాల సమాచారం.   నిజానికి  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ళ నుంచి ఇదే పరిస్థితి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మీటలు నొక్కి ఖాజానా ఖాళీ చేయడం,అవసరానికి ఆర్థిక మంత్రి బుగ్గన అక్కడా ఇక్కడా తిరిగి అప్పులు తెచ్చి అవసరాలకు సర్దుబాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే అర్హిక మంత్రిని అయిన వాళ్ళే ముద్దుగా అప్పుల మంత్రి అంటుంటారు, అలాగే, మంత్రివర్గ విస్తరణలో బుగ్గన వద్దంటున్నా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పట్టుపట్టి మళ్ళీ బుగ్గనకే ఆర్థిక శాఖను అప్పగించింది కూడా, అందుకే అంటారు. అప్పులు చేయడంలో ఆయనకున్న అనుభవ, సామర్ధ్యాలను గుర్తించే ముఖ్యమంత్రి బుగ్గనకు మళ్ళీ ఆర్థిక శాఖను ఇచ్చారని అంటారు.   అయితే, ఇప్పడు ఇక అప్పులు పుట్టే పరిస్థితి లేదు సరికదా, రాష్ట్ర అప్పులు ఎఫ్ఆర్బీఎం గీత దాటిన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం, అప్పులపై ఆంక్షలు విధించింది. కేంద్రం అనుమతి ఇస్తేనేగానీ, కొత్త అప్పులు చేసేందుకు లేకుండా కేంద్ర ప్రభుత్వం,ఎఫ్ఆర్బీఎం చట్టానికి సవరణలు చేసింది. ఈ సవరణలు అన్ని రాష్ట్రాలకు వర్తించేవే అయినా, ఇతర రాష్టాలు అంతో ఇంతో ఆర్థిక క్రమశిక్షణతో బండి లాగిస్తున్నాయి.కానీ, ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడోనే, 175కు 175 యావలోపడి  ఆర్థిక క్రమ శిక్షణను పక్కకు తప్పించారు.   మీటలు నొక్కడమే తప్ప మరో ఆర్థిక సూత్రం ఏదీ తెలియదని ముఖ్యమంత్రి తేల్చేశారు.  ఇక అక్కడినుంచి బుగ్గనకు కొత్త తిప్పలు మొదలయ్యాయి. ముందు అప్పిచ్చు వాడిని వెతుక్కోవాలి,ఆ తర్వాత కేంద్రం అనుమతి తీసుకుని అప్పు తెచ్చుకోవలసిన పరిస్థితి వచ్చింది.  అందుకే కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకుని, వచ్చే మంగళవారం, ఆర్బీఐ బాండ్లు వేలం వేసి జీతాల గండం గట్టేక్కేందుకు బుగ్గన ఢిల్లీ యాత్ర పెట్టుకున్నారని అంటున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కరుణించి వేలంలో ఆర్బీఐ బాండ్లు పాడుకునేందుకు అనుమతివ్వాలని వేడుకునేందుకే బుగ్గన బృందం ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. నిజానికి, కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా జగన్ రెడ్డి పభుత్వం పట్ల కొంత సానుకూల వైఖరినే అవలబిస్తూ వస్తోంది. పొరుగు రాష్ట్రం తెలంగాణ ఎంతగా మొర పెట్టుకున్నా, కొత్త అప్పులకు ససేమిరా అంటున్న మోడీ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ విషయంలో మాత్రం కొంచెం చాల ఎక్కువ వెసులుబాటు కలిపిస్తోందని తెలంగాణ మంత్రులు, అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టి, వివక్ష చూపుతోందని, తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు సహా పలువురు మంత్రులు ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, బుగ్గన అభ్యర్ధను ఓకే చేస్తారా లేక,  లేదు పొమ్మంటారా, అనే దానిపై, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపు ఆధారపడి ఉంటుంది.  అదలా ఉంటే, కేంద్ర ప్రభుత్వం, బీజేపీఫై  ప్రత్యక్ష యుద్ధం సాగిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్ తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం చట్టానికి చేసిన సవరణలకు వ్యతిరేకంగా కేంద్రాన్నిఅసెంబ్లీ వేదికగా కడిగి పారేసేందుకు సిద్దమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా ఆర్థిక దిగ్భందనం సృష్టించి రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటోందని, ముఖ్యమంత్రి ఆరోపించారు. వచ్చె నెల ( డిసెంబర్) లో జరిగే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో, ఇదే విషయంపై కేంద్రాన్ని  ఎండగడతామని  ప్రకటించారు. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అభ్యర్ధనను ఏ మేరకు అనుమతిస్తుంది అనేది అనుమానమే అంటున్నారు. అదే నిజమై, బుగ్గన బృందం వట్టి చేతులతో వెనక్కి వస్తే, డిసెంబర్ నెల జీతాలు, పెన్షన్లు అనుమానమే అంటున్నారు. అయితే, ఇలా జీతాలు, పెన్షన్లు ఆలస్యం కావడం కొత్తమే కాదు, ఒక విధంగా జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన  తర్వాత, గత సంవత్సరం సంవత్సరంన్నర కాలంగా  ఉద్యోగుల జీతాలు సకాలంలో వస్తాయనే నమ్మకం ఉద్యోగులకు లేకుండా పోయిందని అంటున్నారు. జీతాలు, పెన్షన్లు ఎప్పుడొస్తాయో, ఎవరికీ తెలియని పరిస్థితే ఉందని అంటున్నారు.

ఔను జనవరి 27 నుంచి పాదయాత్ర.. మంగళగిరి బాధ్యత ఇక మీదే.. లోకేష్

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి కుమారుడు నారా లోకేష్ వచ్చే నెల27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు అదికారికంగా ధృవీకరించారు. మంగళగిరి పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయనీ విషయం ప్రకటించారు. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర తన పాదయాత్ర సాగుతుందన్నారు.   మంగళగిరి నియోజకవర్గంలోని నూతక్కి గ్రామంలో శుక్రవారం బాదుడే బాదుడు కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో తన పాదయాత్ర నాలుగు రోజుల పాటు ఉంటుందన్నారు. పాదయాత్ర కారణంగా తాను నియోజకవర్గానికి దాదాపు ఏడాది కాలం దూరంగా ఉంటానని లోకేష్ ఈ సందర్బంగా చెప్పారు. పార్టీకి మంగళగిరి కంచుకోటగా మారిందనీ, వచ్చే ఎన్నికలలో ఇదే నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానని లోకేష్ ఆ సందర్భంగా చెప్పారు. తనను ఓడించేందుకు సీఎం జగన్ కుయుక్తులను పార్టీ నాయకులు, కార్యకర్తలు సమర్థంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.  మంగళగిరి బాధ్యతలను మీకు అప్పగించి,   రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు తాను పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. ఇంత కాలం తండ్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి నీడలోనే రాజకీయంగా ఎదిగినా ఇప్పుడు.. పూర్తిగా పరిణితి చెందిన నేతగా ఎదిగారు. అయితే అది అంత సునాయాసంగా మాత్రం జరగలేదు. రాజకీయాలలో తొలి అడుగులు వేసే సమయంలోనే రాజకీయ ప్రత్యర్థులు ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. బాడీ షేమింగ్ చేశారు. ఆహారం, ఆహార్యంపై ఎగతాళి చేశారు. పప్పు అన్నారు. అడుగడుగునా విమర్శలు చేశారు. అయితే అన్నిటినీ తట్టుకుని తనదైన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుని ఇప్పుడు ప్రత్యర్థులకు సింహస్వప్నంగా ఎదిగారనడంలో సందేహం లేదు.  ఇప్పడు లోకేష్ అంటే సమస్య ఎక్కడ ఉంటే అక్కడ బాధితులకు అండగా నిలబడతారు. ప్రత్యర్థుల విమర్శలను దీటుగా తిప్పి కొడతారు. ఆయన పర్యటనలు పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపడమే కాదు.. ప్రజలకు భరోసానూ ఇస్తున్నాయి.  అతి తక్కువ సమయంలో లోకేష్ తనను తాను ఒక ప్రజానాయకుడిగా మార్చుకున్నారు.  తండ్రి చాటు బిడ్డగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన లోకేష్ ఇప్పుడు ఆ ఛాయ నుంచి బయటపడి తనకంటూ సొంతంగా ఒక వ్యక్తిత్వం ఏర్పరుచుకున్నారు.  ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఆయన పాదయాత్ర తెలుగుదేశం పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే జిల్లాల పర్యటనలతో ప్రజలలో తెలుగుదేశం పార్టీకి ఒక సానుకూల వాతావరణాన్ని పార్టీ అధినేత చంద్రబాబు ఏర్పరిచారు. ఇప్పుడు దానికి మరింత ముందుకు తీసుకుపోవడానికి లోకేష్ పాదయాత్ర దోహదపడుతుందనడంలో సందేహిం లేదు. పార్టీ కార్యక్రమాలు ఉన్నప్పుడే పచ్చ కండువా కప్పుకుని జనంలోకి వచ్చి ఆ తరువాత ఇంటికే పరిమితమయ్యే కొందరు సీనియర్ నాయకుల బద్ధకాన్ని ఈ పాదయాత్ర వదిలిస్తుందని భావిస్తున్నారు. అలాగే యువతను భారీగా తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షించడానికి లోకేష్ యాత్ర ఒక కెటలిస్ట్ అవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడు లోకేష్ స్వయంగా తాను పాదయాత్ర ప్రారంభించే తేదీని అధికారికంగా ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీలో ఆనందోత్సాహాలు వ్యక్తమౌతున్నాయి.

అయ్యప్ప దీక్షలో ముస్లిం టోపీ.. మరో వివాదంలో మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్

ఏపీ రాజకీయాలలో నిత్యం వివాదాలతో సహవాసం చేసే వారి జాబితాలో కచ్చితంగా వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కచ్చితంగా ముందు వరుసలా ఉంటారు. వివాదాలను ఆయన ఆహ్వానిస్తారో.. లేక వివాదాలే ఆయనను వెతుక్కుంటూ వస్తాయో తెలియదు కానీ.. కచ్చితంగా వివాదాలకు కేంద్ర బిందువుగా మాత్రం ఆయన తరచూ నిలుస్తుంటారు. తాజాగా ఆయన మరో వివాదానికి కేంద్రంగా మారారు. ప్రస్తుతం అయ్యప్ప దీక్షలో ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హిందువులన అవమానించారన్న ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్నారు. మండలం రోజులు(40 రోజులు) నియమ నిష్టలతో, భక్తి శ్రద్ధలతో నల్లటి దుస్తులు ధరించి పాటించాల్సన అయ్యప్ప దీక్షలో ఉన్న మంత్రి ముస్లిం టోపీ, కండువా వేసుకోవడంపై  తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ అనిల్ కుమార్ యాదవ్ తీరుపై మండి పడుతోంది. దీక్షా నియమాలను ఉల్లంఘించిన ఆయనను శబరిమలై వెళ్లకుండా అడ్డుకోవాలని డిమాండ్  తెరపైకి వచ్చింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ అనిల్ కుమార్ యాదవ్ పై విమర్శలు గుప్పించారు. నిర్లక్ష్యం, అహంకారంతో అనిల్ కుమార్ యాదవ్ వ్యవహరిస్తున్నారని అన్నారు. దీక్షా నియమాలను పాటించని మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ను శబరిమలై వెళ్లకుండా అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. 

మంత్రి రోజాకు డ్యాన్సుల మోజేమిటో?

ఏపీ టూరిజం మంత్రి రోజా ఏమి చేసినా ఏదో వివాదంగానో, సంచలనంగానో మారి తీరుతుంది. ఇదొక ఆనవాయితీగా మారిపోయింది.  రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న స్వర్ణోత్సవాన్ని సాంస్కృతిక సంబరాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. అందులో భాగంగా కొద్ది రోజుల క్రితం తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో పర్యాటక మంత్రి రోజా విద్యార్థినులతో కలిసి స్టేజిపై డ్యాన్స్ చేశారు. అప్పట్లో అది సంచలనం సృష్టించింది. ఆ తరువాత గుంటూరులో జరిగిన జగనన్న స్వర్ణోత్సవ సంబరాల్లో మరోసారి ఆమె వేదికపై చెక్కభజన కళాకారులతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ డ్యాన్స్ కూడా నెటిజన్లను ఆకర్షించింది.  జగనన్న స్వర్ణోత్సవ సంబరాల్లో రోజా డ్యాన్సుల వీడియోలు యూట్యూబ్ లో, సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. రాష్ట్ర పర్యాటక మంత్రి బాధ్యతల్లో ఉన్న రోజా ఇలా జగనన్న స్వర్ణోత్సవ సంబరాల్లో  వేదికలపై డ్యాన్సులు చేయడంపై మాత్రం నెటిజన్లు ఓ రేంజ్ లో  ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యమంత్రిపై అభిమానం ఉండటాన్ని ఎవరూ ప్రశ్నించరు కానీ.. ఇలా స్థాయి, హోదా మరచి వేదికలపై గంతులేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు.  ఆమె తీరు, శైలి మంత్రి పదవికి గౌరవం తెచ్చిపెట్టేదిగా ఎంత మాత్రం లేదనీ, పైపెచ్చు మొత్తం కేబినెట్ కే మచ్చగా మారేలా ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు.  రాక రాక  వచ్చిన మంత్రి పదవిని సద్వినియోగం చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడాల్సింది పోయి.. ఆ పదవిని కూడా జబర్దస్త్ గా కామెడీ చేస్తున్నట్లు రోజా వ్యవహరిస్తున్నారని నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. మంత్రి పదవి చేపట్టిన తరువాత జబర్డస్త్ షో నుంచి రోజా తప్పుకున్న రోజా.. తన డ్యాన్సుల మోజును ఇలా తీర్చుకుంటున్నారా అని నిలదీస్తున్నారు.   రోజాకు ఎట్టకేలకు మంత్రి పదవి అయితే దక్కింది కానీ, ఆమాత్య పదవి దక్కిన క్షణం నుంచే అది ఎప్పుడు ఊడుతుందా అన్న టెన్షన్ రోజాకు పట్టుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అసలే రోజా ఫైర్ బ్రాండ్. దానికి జగనన్న మద్దతు ఉందనే ధైర్యం తోడైంది. దాంతో తన నియోజకవర్గంలోని పార్టీ నేతలతో నిత్యం ఏదో ఒక పేచీ పెట్టుకుంటూనే వస్తున్నారు. దాంతో నియోజకవర్గంలో స్థానిక నేతల నుంచి రోజాకు ఏమాత్రం మద్దతు లభించడం లేదు.  దాంతో పాటు ఆమెను ద్వితీయ శ్రేణి నేతలు కూడా ఖాతరు చేయని పరిస్థితి నగరి నియోజకవర్గంలో నెలకొని ఉంది. ప్రోటోకాల్ కూడా పట్టించుకోకుండా రోజాను ఆహ్వానించకుండానే పార్టీ కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిపించేస్తున్నారు.  ఈ క్రమంలోనే రోజా జగన్ కు ఫిర్యాదు కూడా చేశారు. నగరి నియోజకవర్గంలోని ఓ వర్గం వైసీపీ నేతలు తనను అవమానిస్తున్నారని, ఇలా అయితే.. రాజకీయాలు చేయడం కష్టం అని రోజా వాపోయినట్లు ఓ ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. మరో పక్కన జగన్ చేయించుకుంటున్న సర్వేల్లో ఎమ్మెల్యేగా, మంత్రిగా రోజా పెర్ఫార్మెన్స్ పై వ్యతిరేక అభిప్రాయాలు వచ్చాయంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఇదే విషయాన్ని నియోజకవర్గాల బాధ్యులు, ఎమ్మెల్యే సమీక్ష సందర్భంగా జగన్ రెడ్డి కుండబద్దలు కొట్టిన విషయం బయటకు వచ్చింది. ఇలా అయితే.. వచ్చే ఎన్నికల్లో సీటు ఇచ్చేది లేదని కరాఖండిగా జగన్ చెప్పేశారు కూడా. దాంతో పాటు వచ్చే ఎన్నికల లోపు జగన్ తన మంత్రివర్గాన్ని మరోసారి పునర్వ్యవస్థీకరిస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. అదే జరిగితే రోజాకు మంత్రి పదవీ గండం తప్పదనే అంచనాలు వస్తున్నాయి. మంత్రి పదవి వచ్చినప్పటి నుంచీ రోజా స్వామీజీల చుట్టూ తిరుగుతున్నారు. గుడులు, గోపురాలకు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ పదవి కాస్తా ఊడిపోయే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉండడంతో స్వామీజీలను ఆశ్రయించడం వల్లో.. దేవుళ్లను మొక్కడం వల్లో పదవిని కాపాడుకోవచ్చనే ధైర్యం రోజాలో సన్నగిల్లిందేమో అంటున్నారు. అందుకే జగనన్న సంబరాల్లో తన నటనా వైదుష్యాన్ని, నాట్య కౌశలాన్ని ప్రదర్శించి ఆయననే మెప్పించాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఉన్నారంటున్నారు. అందుకే ఇలా సాంస్కృతిక వేదికలపై ప్రదర్శనలిస్తున్నారంటున్నారు. పర్యాటక మంత్రి బాధ్యతలంటే.. ఇలా చెక్క భజనలు చేయడమా? అని జనం ప్రశ్నిస్తున్నారు. రోజా తన ధోరణిని మార్చుకోకపోతే.. ఇక చెక్క భజనే చేసుకోవాల్సి ఉంటుందేమో అని జనం చెప్పుకుంటున్నారు.

ప్రపంచాన్ని అబ్బుర పరిచిన జపాన్ సాకర్ ప్లేయర్స్, అభిమానుల స్వచ్ఛ సేవ

ప్రపంచం మొత్తం ఫిఫా వరల్డ్ కప్ ఫీవర్ తో ఊగిపోతోంది. తమ అభిమాన జట్ల విజయాన్ని అభిమానులు సంబరాలతో వేడుకలు చేసుకుంటున్నాయి. కిక్కిరిసిన స్టేడియంలలో కూడా ఈ విజయోత్సాహాలు ఆకాశమే హద్దుగా సాగుతున్నాయి. అయితే వీటికి భిన్నంగా విజయం సాధించిన తరువాత జపాన్ ఆటగాళ్లు, ఆ జట్టు అభిమానులూ వేడుక జరుపుకున్న తీరుకు ప్రపంచం మొత్తంఫిదా అయిపోయింది.   నెటిజన్లు  జపాన్ ఆటగాళ్లనూ, ఆ జట్టు అభిమానులనూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా బుధవారం జర్మనీ, జపాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో జపాన్ విజయం సాధించింది. వెంటనే స్టేడియంలో ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నంటుతాయని అంతా భావించారు. కానీ జపాన్ ఫ్యాన్స్ మాత్రం ఎవరూ ఊహించని రీతిలో, ప్రపంచం మొత్తం మెచ్చుకునేలా సంబరాలు జరుపుకున్నారు.   జ‌ర్మ‌నీపై జ‌పాన్ విజ‌యం సాధించిన త‌రువాత ఆ జ‌ట్టు అభిమానులు స్టేడియంలోని గ్యాల‌రీలలో చెత్త‌ను శుభ్రం చేశారు. మ్యాచ్ చూసే స‌మ‌యంలో ఆహార‌ ప‌దార్థాల‌ను తినిప‌డేయ‌డం, కూల్ డ్రింక్స్ బాటిల్స్‌, ఇత‌ర వ‌స్తువుల ప్యాకెట్లు స్టేడియంలో పడేయడం తెలిసిందే. వీటిని తొల‌గించేందుకు స్టేడియం సిబ్బంది ప్రేక్షకులంతా స్టేడియంను ఖాళీ చేసేసిన తరువాత శ్రమిస్తారు. వారికి ఆ శ్రమ ఎందుకు అనుకున్నారో ఏమో జపాన్ ఫుట్ బాల్ జట్టు అభిమానులు తమ జట్టు విజయం సాధించిన సందర్భాన్ని ఇలా స్టేడియంలో స్వచ్ఛ సేవ చేయడం ద్వారా జరుపుకున్నారు. స్టేడియంలో ప్రేక్షకులు చెల్లా చెదురుగా పాడేసిన వస్తువులన్నిటినీ సంచులన నింపి ఒక చోటుకి చేర్చారు. తమ అభిమానులతో జపాన్ ఫుట్ బాల్ జట్టు సభ్యులు కూడా చేతులు కలిపారు. జ‌ర్మ‌నీపై  విజ‌యం త‌రువాత జపాన్ ఆటగాళ్లు   డ్రెసింగ్ రూంలో  ఎంజాయ్ చేయ‌డం మానుకొని మరీ స్వచ్ఛ సేవలో పాల్గొన్నారు. ఇదంతా ప్రపంచాన్ని అబ్బుర పరిచింది. జపాన్ ఫుట్ బాల్ జట్టు ఆటగాళ్లు, అభిమానుల స్వచ్ఛ సేవ సెలబ్రేషన్స్ సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి.  వారి స్వచ్ఛ దీక్షకు ప్రపంచం నీరాజనాలర్పిస్తోంది. 

తల మాసిందా.. గుండు తప్పదు.. ఎంప్లాయీస్ కుఎయర్ ఇండియా హెచ్చరిక

ఎయిరిండియా.. టాటా యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిన తరువాత ప్రయాణీకులకు సేవల విషయంలో గణనీయమైన పురోగతి సాధించింది. అలాగే ఆదాయ మార్గాలను పెంచుకుంటూ.. నష్టాల భర్తీలో శరవేగంగా ముందుకు సాగుతోంది. ఇందుకోసం  టాటాయాజమాన్యం వినూత్న పద్ధతులను అవలంబిస్తోంది. అలాగే ప్రయాణీకులను గౌరవించే విషయంలోనూ, వారికి మర్యాదల విషయంలోనూ కూడ అందరి ప్రశంసలూ పొందుతూ ముందుకు సాగుతోంది. కొత్త యాజమాన్యం వచ్చిన తరువాత సేవలలో నాణ్యత భేష్ అన్న ప్రశంసలూ అందుకుంటోంది. అయితే ఈ క్రమంలో సిబ్బంది ఆహార్యం విషయంలో సంస్థ యాజమాన్యం పెడుతున్న కండీషన్స్ ఒకింత కఠినంగా ఉంటున్నాయని చెప్పక తప్పదు. సంస్థలో పని చేసే వారంతా శుభ్రతకు పెద్ద పీట వేయాలని చెబుతూ కొత్త నిబంధనలను విధించింది. ముఖ్యంగా ఎయిర్ హోస్టింగ్ విషయంలో మగవారి జట్టు విషయంలో అత్యంత కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నది. పురుషులలో హెయిర్ ఫాల్ ఉంటే మాత్రం గుండు చేయించుకు తీరాల్సిందే అంటోంది. అంతే కాదు మగవారు జుట్టు పొడుగ్గా పెంచుకునే స్టైలిష్ విధానాలకు తిలోదకాలివ్వాల్సిందేనని స్పష్టం చేసింద. ఇక సిబ్బందిలోని ఆడవారి విషయంలోనూ కొత్త విధానాలకు శ్రీకారం చుట్టింది. మహిళా సిబ్బంది ముత్యాల చెవి రింగులు ధరించడానికి వీల్లేదని నిబంధన విధించింది. వేళాడే చెవికమ్మలపై నిషేధం విధించింది. అలాగే ఉంగరాలు కూడా చిన్నచిన్నవి అయితే మాత్రమే అనుమతిస్తామని చెప్పింది. అంతే కాదు ఒక చేతికి ఒక ఉంగరం మాత్రమే ఉండాలి.  అలాగే చీర లేదా ఇండో-వెస్ట్రన్ డ్రెస్‌ ఏదైనా సరే చెప్పులు ధరించడం తప్పనిసరి. అలాగే ముఖాన బొట్టు తప్పని సరి చేసింది.

పతంజలి పేరుతో లో దుస్తుల వ్యాపారమా?.. బాబా రామ్ దేవ్ పై బీజేపీ ఎంపీ ఫైర్

యోగాగురు రామ్ దేవ్ బాబా.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. పతంజలి బ్రాండ్ తో ఆయుర్వేద ఉత్పత్తులను విస్తృతంగా మార్కెటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా కోవిడ్ సమయంలో ఆయన చేసిన ప్రచారం, ప్రకటనలు వివాదాస్పదమయ్యాయి. పతంజలి బ్రాండ్ తో బాబారామ్ దేవ్, ఆ గ్రూప్ ఎండి బాలకృష్ణలు కోట్లాది రూపాయల టర్నోవర్ తో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా.. కాషాయ వస్త్రధారణతో బాబా రామ్ దేవ్ హిందుత్వకు ప్రతీకగా దర్శనమిస్తుంటారు. అలాగే ఆయన మాటలు, ప్రసంగాలతో తాను కేంద్రంలోని అధికార బీజేపీకి దగ్గర మనిషినన్న బిల్డప్ ఇస్తుంటారు. అయితే ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి హిందుత్వ కార్డ్ ఉపయోగించడం, అలాగే ఆధునిక యోగా పితామహుడు పతంజలి పేరును తమ వ్యాపారాలకు బ్రాండ్ గా చేసుకోవడంపై బీజేపీ గుర్రుగా ఉంది. ఇది తగదని హెచ్చరిస్తోంది.  ఆయుర్వేదిక్ ఉత్పత్తుల బ్రాండ్ గా పతంజలి పేరును ఉపయోగించుకోవడంపై బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ విమర్శలు గుప్పించారు. మామూలుగా పతంజలి అనే పేరు ఆధ్మాత్మికతకు మారుపేరుగా అందరూ భావిస్తారు. ఆధునిక యోగా పితామహుడిగా మహర్షి పతంజలి పేరు ప్రసిద్ధి పొందింది. అటువంటి పేరును తమ వ్యాపారానికి సోపానంగా మార్చుకోవడాన్ని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తప్పుపట్టారు. కేవలం పతంజలి పేరు కారణంగానే నాణ్యత గురించి పట్టించుకోకుండా జనం పెద్ద ఎత్తున బాబారామ్ దేవ్ ఆయుర్వేదిక్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారన్నారు. పతంజలి పేరును ఉపయోగించుకోవడం మాని సొంత పేరుతో బ్రాండ్ నిర్మించుకోవాలని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్  బాబారామ్ దేవ్ కు సూచించారు.  పతంజలి పేరును వారి వ్యాపార సంస్థకు తీసివేయాలని,  అలా చేయకుండా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, అలాగే న్యాయపరమైన చర్యలకు దిగుతామని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ లోని మహర్షి పతంజలి జన్మస్థలమైన కొండార్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ హెచ్చరికలు చేశారు.   రామ్‌దేవ్ వారి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడాన్ని తాన తప్పు పట్టడం లేదనీ,  పంతంజలి పేరుమీద నెయ్యి, నూనె, సబ్బు, మసాలాలు, లోదుస్తుల వ్యాపారం చేయడాన్ని తప్పుపడుతున్నాననీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు.

కేసీఆర్ పై హత్య కేసు.. బండి డిమాండ్ కు కారణమేంటి?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై హత్య కేసు నమోదు చేయాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. అంతటి తీవ్ర డిమాండ్ కు కారణమేమిటంటే. ఫారెస్టు అధికారి శ్రీనివాసరావు రెండు రోజుల కిందట భద్రాద్రి జిల్లాలో పోడు సమస్యలపై ఉద్యమిస్తున్న గుత్తి కోయల దాడిలో మరణించిన నేపథ్యంలో ఆ హత్యకు కేసీఆర్ దే బాధ్యత అని బండి సంజయ్ ఆరోపించారు. ఫారెస్టు అధికారి చంద్రశేఖరరావుది ప్రభుత్వ హత్యేనని ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సీఎం కేసీఆర్ పై హత్య కేసు నమోదు చేయాలన్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని, పోడు సాగు చేసుకునే రైతులకు పట్టాలిస్తాననీ కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ నెరవేర్చడంలో విఫలమైనందునే పోడు రైతులు ఆందోళన బాట పట్టారన్నారు. ఇచ్చిన హామీలను విస్మరించి కేంద్రాన్ని బదనాం చేయడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారని బండి అన్నారు. పోడు సమస్యల విషయంలో కేసీఆర్ వ్యవహరించిన తీరే పోడు రైతుల ఆగ్రహానికి కారణమన్న బండి సంజయ్ వారి ధర్మాగ్రహం ఫారెస్టు అధికారిని బలితీసుకుందన్నారు. ఇలా ఉండగా ఫారెస్టు అధికారి శ్రీనివాసరావుది ప్రభుత్వ హత్యేనని ఇప్పటికే కాంగ్రెస్ విమర్శలు గుప్పించిన సంగతి విదితమే.  ఇక దర్యాప్తు సంస్థల తకిణీలూ, సోదాలపై రాజకీయ విమర్శలు చేయడాన్ని కూడా బండి సంజయ్ తప్పుపట్టారు. ప్రజలను వేధించి, అడ్డగోలుగా ఆస్తులు సంపాదించిన వారిని తెరాస వారైనందుకు వదిలేయాలా, వారిపై దర్యాప్తు సంస్థలు నజర్ పెట్టద్దా అని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీపై కూడా సీబీఐ, ఐటీ, ఈడీ దాడులు జరిగిన సంగతిని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. దర్యాప్తు సంస్థలు ప్రభుత్వ నియంత్రణలో పని చేయవనీ, అవి స్వతంత్ర సంస్థలనీ బండి సంజయ్ అన్నారు.