రాజీవ్ గాంధీ హంతకులను వదిలిపెట్టకూడదు.. సుప్రీం
రాజీవ్ గాంధీ హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది. గతంలో రాజీవ్ గాంధీ హత్య కేసులు నిందితులుగా ఉన్న ఏడుగురికి మరణశిక్ష పడిన సంగతి తెలిసిందే. అయితే తమిళనాడు ప్రభుత్వం.. మరణశిక్ష పడిన మురుగన్, శంతన్, అరివు అనే ముగ్గురు దోషులను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాదు వారితో పాటు నళిని, రాబర్ట్ పియూస్, జయకుమార్, రవిచంద్రన్లను కూడా విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. కానీ దానికి కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒప్పుకోలేదు. దీంతో ఈ విషయం సుప్రీంకోర్టుకు వచ్చింది. అయితే దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. రాజీవ్ గాంధీ హత్య కేసులో ఉన్న నిందుతులకు శిక్ష తగ్గించే అధికారం తమిళనాడు ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పింది. రాజీవ్ గాంధీ హంతకులను వదిలిపెట్టకూడదని ఆదేశించింది. అంతేకాదు ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొన్ని సూచనలు కూడా చేసింది. కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా దోషులను వదలిపెట్టే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని.. శిక్షల విషయంలో ఉపశమనం కలిగించే అధికారం గానీ హక్కు గానీ రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని చెప్పింది.