గుజరాత్ లో టెర్రర్ అలర్ట్ : రంగంలోకి దిగిన గార్డ్స్
గుజరాత్ లో టెర్రర్ ఎలర్ట్ ప్రకటించారు. జైషే మహ్మద్, లష్కర్ తోయిబా సంస్థలకు సంబంధించిన ఉగ్రవాదులు పదిమంది మిలిటెంట్లు, రాష్ట్రంలోకి ప్రవేశించినట్టు ఇంటిలెజన్స్ హెచ్చరించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సెక్యూరిటీని భారీగా పెంచారు. ముఖ్యంగా సముద్రతీరప్రాంతమంతా కోస్టల్ గార్డ్స్ గస్తీ తిరుగుతున్నారు. కుచ్ తీరం వద్ద గత మూడు నెలల్లో ఐదు పడవలు వదిలేసి వెళ్లడంతో అనుమానం బలపడింది.
పాకిస్థాన్ సెక్యూరిటీ అడ్వైజర్ నాసిర్ జంజువా 10 మంది గుజరాత్ లోకి ప్రవేశించారని కన్ఫామ్ చేశారు. ఈ నేపథ్యంలో గుజరాత్ అడిషనల్ సిఎస్ శనివారం, త్రివిధ దళాల అధిపతులతో భేటీ అయ్యారు. గుజరాత్ లో సోమ్ నాథ్ ఆలయం, ద్వారకేశ్వర ఆలయం, అక్షర్ థాం, సర్దార్ సరోవర్ డ్యాం లాంటి కీలక ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేశారు. పోలీసులు బస్ట్ స్టాప్ లు, రైల్వే స్టేషన్లను జల్లెడ పడుతున్నారు. అనుమానం వచ్చిన వారందరినీ చెకింగ్ చేస్తున్నారు. శివరాత్రి రోజున దేశంలో విధ్వంసానికి, ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నాయి.