అమరావతి శిలాఫలకంపై గల్లా అసంతృప్తి
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ నియోజకవర్గాల పరిధిలో అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జరగగా, కనీసం వీరిద్దరికీ సరైన ప్రాధాన్యతే దక్కలేదు, ప్రోటోకాల్ ప్రకారం చూసినా, అ స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేకి వేదికపై చోటు ఇవ్వాల్సి ఉండగా... వీళ్లిద్దరినీ పట్టించుకున్న పాపానపోలేదు, అమరావతి శంకుస్థాపన మహోత్సవంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఆటలో అరటిపండులా మారగా, తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ అసలు ఎక్కడున్నాడో కూడా తెలియదు. కనీసం శంకుస్థాపన చేస్తున్న సమయంలోనైనా స్థానిక ఎంపీ గల్లా జయదేవ్, స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ కి అవకాశం కల్పించాల్సి ఉంది, పైగా అమరావతి శంకుస్థాపన శిలాఫలకంపై గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ పేర్లు లేకపోవడంపై విమర్శలు చెలరేగుతున్నాయి, దీనిపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తంచేసిన గల్లా జయదేవ్... స్థానిక ప్రజాప్రతినిధులను ఇలా అవమానించడం సరికాదన్నారు.