ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. మే 19 కౌంటింగ్
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ ఐదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేశారు. పశ్చిమ్బంగాలే, తమిళనాడు, కేరళ, అస్సాం మరియు పుదుచ్చేరికి ఎన్నికల నోటిఫికేషన్ను విడుదలైంది. అసోంలో 126, తమిళనాడులో 234, బంగాల్లో 294, పుదుచ్చేరిలో 30శాసనసభా స్థానాలకు ఎన్నికల నిర్వహించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. మొత్తం 5 రాష్ట్రాల్లో 1070 మిలియన్ల ఓటర్లు ఉన్నట్లు తెలిపారు.
అస్సాం
అస్సాంలో రెండు దశల్లో ఎన్నికల పోలింగ్
ఏప్రిల్ 4 న మొదటి దశ
ఏప్రిల్ 11న రెండో దశ
పశ్చిమ్బంగాల్
పశ్చిమ్బంగాల్ లో 6దశల్లో ఎన్నికల పోలింగ్
ఏప్రిల్ 4, 11న మొదటి దశ, 17 న రెండో దశ, 21 న మూడో దశ, 23 నాలుగు, 30 ఐదు, మే 5న అఖరి దశ
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో మే 16న పోలింగ్
ఐదు రాష్ట్రాల్లో మే 19 న ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది.