కేసీఆర్ మాటలకు జైకొట్టిన ఆంధ్రులు
posted on Oct 22, 2015 @ 1:56PM
అమరావతి శంకుస్థాపన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతుండగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షధ్వానాలు చేశారు. కేసీఆర్ ప్రసంగిస్తారని ఆహ్వానించగానే ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చింది, కేసీఆర్ ప్రసంగిస్తున్నంతసేపు ఏపీ ప్రజలు పాజిటివ్ గా స్పందించారు, ప్రపంచంలోనే అద్భుతమైన రాజధానిగా అమరావతి నిర్మాణం కావాలంటూ కేసీఆర్ చెప్పగానే హర్షధ్వానాలు చేశారు, అలాగే అమరావతి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం... అన్ని సహాయ సహాకారాలు అందిస్తుందని ప్రకటించిన కేసీఆర్... తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం తరపున ఏపీ ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు.