కేంద్ర, రాష్ట్ర సర్కారులకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణుల ధర్నా
posted on Oct 23, 2015 @ 1:04PM
ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ ఏపీ ప్రత్యేక హోదాపైన కాని.. ప్రత్యేక ప్యాకేజీ పైన కాని ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకుస్థాపన రోజున ఏదో ప్రకటన చేస్తారని చూసిన తెలుగు ప్రజల ఆశలపై మోడీ నీరు జల్లారని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏపీ ప్రజలను మోసం చేశారని.. ఈనేపథ్యంలో ఆందోళనలు చేపడతామని చెప్పారు. దీనిలో భాగంగానే వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. కడప, కర్నూలు, అనంతపురం, విజయనగరం, కృష్ణా జిల్లాలో పలువురు వైసీపీ నేతల ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అక్కడక్కడ కొంతమంది నిరసన కారులను పోలీసులు అరెస్ట్ చేశారు.