ycp midhun reddy chevireddy

వైసీపీ నేతల హడావుడి.. సీసీ కెమేరాల్లో రికార్డు..

వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి తిరుపతి, రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో చేసిన హంగామా అందరికి తెలిసిందే. ఎయిర్ ఇండియా మేనేజర్ పై మిధున్ రెడ్డి చేయి చేసుకొని ఎయిర్ పోర్ట్ లో నానా హడావుడి చేశారు. ఈ విషయంలో వీరిద్దరిపై విమర్శలు తలెత్తాయి. కేసు కూడా నమోదైంది. అయితే ఈ ఘటన జరిగిన అనంతరం ఇద్దరూ ఈ వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదని వాదించారు. మొదట చెవిరెడ్డి కూడా తనకు ఎలాంటి సంబంధం లేదని వాదించినా తరువాత.. తానే లొంగిపోయాడు. ఇప్పుడు తాజాగా వీరిద్దరూ ఈ వివాదంలో ఇరుక్కుపోయినట్టు తెలుస్తోంది. ఎయిర్ పోర్ట్ లో ఎయిర్ ఇండియా ఉద్యోగి మీద చేయి చేసుకోవటంతో పాటు.. పార్టీ కార్యకర్తల హడావుడి ఎయిర్ పోర్ట్ లోని సీసీ కెమేరాల్లో రికార్డు అయినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు వీరిద్దరికి చిక్కులు తప్పవని అందరూ అనుకుంటున్నారు.

ap assembly 2015

వైసీపీ పై చంద్రబాబు ఫైర్.. ఇద్దరు వైసీపీ నేతలు సస్పెన్షన్..!

వాయిదా అనంతరం ఏపీ అసెంబ్లీ తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కాల్ మనీపై రేపు చర్చిద్దామని.. దీనిపై రేపు ప్రకటన చేస్తాం.. కాల్ మనీ వ్యవహారంలో ఎవరిని వదలం..నా ప్రకటన తర్వాత చర్చించి సాక్ష్యాలివ్వండి.. దోషులను శిక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని..దోషులు ఏపార్టీవారైనా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు సభలో ఆందోళన చేస్తున్న వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  వైసీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలి..అంబేద్కర్ పై చర్చించాల్సిన అవసరం ఉంది..నాగరిక సమాజం సిగ్గుతో తలవంచుకునేనా వైసీపీ నేతల వ్యవహారం ఉందని అన్నారు. సభ సజావుగా సాగేందుకు వైసీపీ నేతలు సహకరించాలని సూచించారు. అయినా వైసీపీ నేతలు వినకపోవడంతో స్పీకర్ ఆపార్టీకి చెందిన ఇద్దరు నేతలు శివప్రసాద్ రెడ్డిని, రామలింగేశ్వరరావుని రెండు రోజులపాటు సస్పెండ్ చేశారు.

chittoor corporator sivaprasad reddy suicide

కటారి దంపతుల హత్య కేసులో షాక్..కార్పోరేటర్ ఆత్మహత్య..!

చిత్తూరు జిల్లా కటారి దంపతుల హత్య కేసులో మరో షాక్ తగిలింది. చిత్తూరు నగర 38వ డివిజన్ కార్పోరేటర్ శివప్రసాద్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకూ ఎంతోమందిని విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే నిన్న పోలీసులు శివప్రసాద్ రెడ్డిని విచారించారు. అయితే విచారణ అనంతరం ఇంటికి వచ్చిన కార్పోరేటర్ శివప్రసాద్ రెడ్డి రాత్రి తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా పోలీసులు అసలు శివప్రసాద్ రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు ఏంటని విచారణ జరుపుతున్నారు. శివప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సికె రెడ్డి అనుచరుడు.

congress leader gaddam prasad

టీఆర్ఎస్ లోకి గడ్డం ప్రసాద్ కుమార్? కాంగ్రెస్ పట్టించుకోవడంలేదు..!

కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రి గడ్డం ప్రసాదకుమార్ కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లోకి చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ లోకి రావాలని కేసీఆర్ నన్ను ఆహ్వానించిన మాట వాస్తవమే అని తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ నన్ను పట్టించుకోవడంలేదు.. మాజీ మంత్రి చంద్రశేఖర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడంపై కూడా నన్ను సంప్రదించలేదు అని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ నాకు మంచి మిత్రుడు అని.. టీఆర్ఎస్ లో చేరే విషయంపై ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదని.. తన కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. అయితే రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి గెలుపుకు గాను మెజార్జీ తక్కువగా ఉన్న నేపథ్యంలో టిఆర్ఎస్‌కు సంఖ్యాబలం అవసరం ఉంది. దీంతో కావాలనే గడ్డం ప్రసాద్ కుమార్ టీఆర్ఎస్ గాలం వేసినట్టు కనిపిస్తోంది. అంతేకాదు ప్రసాద్ కుమార్ పార్టీలోకి వస్తే టిఆర్ఎస్‌లో అధిక ప్రాధాన్యం ఇవ్వడానికి, అసెంబ్లీ నియోజకవర్గం బాధ్యతలను అప్పగించడానికి కూడా టిఆర్ఎస్ నాయకత్వం రెడీగా ఉందంట. కాగా ప్రసాద్ కుమార్‌తో పాటు 30 మంది ఎంపిటీసిలు, కౌన్సిలర్లు టిఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు తెలుస్తోంది.

ap assembly 2015

ఏపీ అసెంబ్లీ.. జగన్ ప్రతిపక్షనేతగా దురదృష్టకరం..

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో కాల్ మనీపై చర్చించాలని వైసీపీ పట్టుబట్టింది. దీంతో సభ కాస్త ఇరు పార్టీ నేతల ఆందోళనలతో రచ్చ రచ్చగా మారిపోయింది. ఒకరి పై ఒకరు విమర్శల దాడికి దిగారు. 11 ఛార్జి షీట్లు ఉన్న జగన్ ప్రతిపక్షనేతగా ఉండటం దురదృష్టకరం.. జగన్ కు చరిత్ర, చట్టాలు, రాజ్యాంగం గురించి తెలియదు అని మంత్రి యనమల జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేయగా.. దానికి జగన్ అధికార పార్టీ రాజకీయాలకోసం అంబేద్కర్ ను అడ్డుపెట్టుకోవాలని చూస్తుంది.. అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తుంది అని విమర్శించారు. ఇక వైసీపీ నేతల ఆందోళనకు స్పీకర్ కూడా స్పందించి.. వైసీపీ ఎమ్మెల్యేలు పద్దతి మార్చుకోవాలని.. కెమెరాలకు అడ్డంగా వెళ్లడం.. ప్లకార్డులు పట్టుకొని ఆందోళనలు చేయడం సరికాదని హెచ్చరించారు. అయినా వైసీపీ నేతలు వినకపోవడంతో  ఇప్పటికే సభను 15 నిమిషాలు వాయిదా వేసిన స్పీకర్ కోడెల మళ్లీ 10 నిమిషాల పాటు సభను వాయిదా వేశారు.

call money

కాల్ మనీ.. పట్టుబడ్డవారు 118..వైసీపీ 44

కాల్ మనీ వ్యాపారులతో రాజకీయ నేతలకు ఉన్న లింకులు రోజు రోజుకు బయటపడుతున్నాయి. ఏపీ పోలీసులు తెలిపిన లెక్క ప్రకారం మొత్తం పట్టుబడిన వ్యాపారులు 118 కాగా అందులో ఎక్కువ 44 మంది వైసీపీ పార్టీకి సంబంధించిన వారు. .20 మంది టీడీపీకి.. 13మంది కాంగ్రెస్, ఆరుగురు సీబీఐ కు సంబంధించిన వారు.. మిగిలిన వారు ఏపార్టీకి చెందని వారిగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు పశ్చిమగోదావరి జిల్లాలో కూడా పోలీసులు నిఘా ఉంచారు. తాడేపల్లి గూడెం, పాలకొల్లు, చింతపూడి, ఏలూరు జంగారెడ్డి గూడెంలో ఈ కేసుకు సంబంధించి 12 కేసులు నమోదు.. 10 మందిని అరెస్ట్ చేశారు. కొంత మంది కాల్ మనీ వ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుపుతున్నారు.

ap assembly 2015

జగన్ దొంగల ముఠా నాయకుడు..కాల్వ

  ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన వెంటనే వైసీపీ కార్యకర్తలు కాల్ మనీ వ్యవహారంపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. అంతేకాదు చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ.. స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. దీంతో టీడీపీనేత యనమల కలుగజేసుకొని కాల్ మనీ గురించి రేపు మాట్లాడుకుందామని చెప్పినా వైసీపీ నేతలు వినకపోవడంతో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ సందర్భంగా కాల్వ శ్రీనివాసులు వైసీపీ పై మండిపడ్డారు. జగన్ దొంగల ముఠా నాయకుడని.. వైసీపీ నేతలు చంద్రబాబును విమర్శించడం విడ్డూరం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ap assembly

ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభం

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. ఈనెల 22 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. అంతకుముందు వైసీపీ నాయకుడు జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కలసి రవీంద్రభారతి నుంచి శాసనసభ వరకు ప్రదర్శనగా వచ్చారు. కాల్‌మనీ అంశం మీద వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించిన నేపథ్యంలో ఈ అంశం మీద చర్చించాల్సిందేనని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందిస్తూ, ప్రతిపక్షం సభ నిర్వహణకు సహకరించాలని, కాల్‌మనీ వ్యవహారం మీద శుక్రవారం నాడు చర్చిద్దామని అన్నారు.

TDP MLA

తెదేపా ఎమ్మెల్యేపై ఇళ్ళు, కార్యాలయాలపై ఐటి శాఖ దాడులు

  మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేట తెదేపా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఇళ్ళు, కార్యాలయాలు, ఆయనకి వైద్య, ఇంజనీరింగ్ కాలేజీల మీద ఆదాయపన్ను శాఖ అధికారులు నిన్న ఏకకాలంలో దాడులు చేసారు. విశేషమేమిటంటే కర్నాటకలోని బెంగళూరు, గుల్బర్గాల నుండి ఆదాయపన్ను శాఖ అధికారులు వచ్చి ఈ దాడులలో పాల్గొన్నారు. కర్ణాటకలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు విద్యార్ధుల నుండి 1-2 కోట్లు వరకు ఫీజులు వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కనుక అక్కడి మెడికల్ కాలేజీలపై ఆదాయపన్ను శాఖ అధికారులు చాలా కాలంగా దృష్టి పెట్టి అప్పుడప్పుడు దాడులు చేస్తూనే ఉన్నారు. బహుశః అక్కడి కాలేజీలతో రాజేందర్ రెడ్డి మెడికల్ కాలేజీకి కూడా ఏమయినా సంబంధాలు, లావాదేవీలు జరుగుతున్నందునే కర్ణాటకకు చెందిన ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దాడుల్లో సుమారు ముప్పై మందికి పైగా అధికారులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.

Andhra Pradesh

నేటి నుంచి ఐదు రోజులు ఏపి అసెంబ్లీ సమావేశాలు

  ఇవ్వాళ్ళ నుంచి ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశాలు జరుగుతాయి. ముందుగా ఉభయసభలలో చర్చించవలసిన అంశాల గురించి బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బిఎసి) సమావేశంలో చర్చించి అజెండా ఖరారు చేస్తారు. అసెంబ్లీ బిఎసి సమావేశానికి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, శాసనమండలి బిఎసి సమావేశానికి డా.ఎ. చక్రపాణి అధ్యక్షత వహిస్తారు. సమావేశాల అజెండా ఖరారు కాగానే ఉభయ సభలు సమావేశాలు మొదలవుతాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్ది సేపటి క్రితమే హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తెదేపా వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ కి నివాళులు అర్పించి శాసనసభకు బయలు దేరారు.   ఈసారి సమావేశాలు కేవలం ఐదురోజులు మాత్రమే నిర్వహించబోతున్నప్పటికీ తెదేపా ప్రభుత్వానికి అవి కత్తి మీద సాముగా మారే అవకాశాలే కన్పిస్తున్నాయి. కల్తీ మద్యం, కాల్ మనీ, సెక్స్ రాకెట్, బాక్సైట్ తవ్వకాలు, విజయవాడ పోలీస్ కమీషనర్ గౌతం సవాంగ్ శలవు వ్యవహారం మొదలయినవన్నీ ప్రధాన ప్రతిపక్షమయిన వైకాపాకు బలమయియన్ ఆయుధాలుగా అందివచ్చేయి. కనుక ఈసారి వైకాపాను ఎదుర్కోవడానికి అధికార పార్టీ చాలా ఇబ్బంది పడే సూచనలు కనిపిస్తున్నాయి.

call money

కాల్ మనీ.. వైసీపీ లీడర్సే ఎక్కువ..

ఏపీలో కాల్ మనీ దందా చేసిన అరాచకాలు తవ్వేకొద్ది బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఎంతోమంది పార్టీ నేతలు బయటపడుతున్నారు.. ఎంతోమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇప్పటివరకూ అరెస్ట్ అయిన వారిని బట్టి చూస్తే అందరికంటే వైసీపీ నేతలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు మొత్తం 80 మందిని పైగా అరెస్ట్ చేస్తే అందులో 27 మంది వైసీపీ నేతలు ఉండగా.. ముగ్గురు సీపీఐ నేతలు.. 44 మంది ఏ పార్టీకి చెందని వారు ఉన్నారు. దీంతో ఇప్పుడు టీడీపీ పై విమర్సలు చేసిన జగన్ పై .. ఆ పార్టీ నేతలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కాల్ మనీ కేసులో టీడీపీ నేతలు వైసీపీ నేతలను విమర్శించారు.. ఇప్పుడు అరెస్ట్ అయిన వారిలో వైసీపీ నేతలే ఎక్కువగా ఉన్నారు.. వైసీపీ నేతలకు టీడీపీని విమర్శించే అర్హత లేదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంక వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా అయితే వారికంటే ఎక్కువగానే మాట్లాడుతూ సీఎం అంటేనే కాల్ మనీ అంటూ రెచ్చిపోయారు. అంతేకాదు ఈ విషయంపై గవర్నర్ కు ఫిర్యాదు చేయడం.. అసెంబ్లీలో కూడా ఈ విషయంపై రచ్చ చేయాలని డిసైడ్ అయ్యారు జగన్. మరి ఇప్పుడు నోరు మొదుపుతారో లేదో చూడాలి. 

azam khan

మోడీ పీఎంగా అనర్హుడు..నన్ను ప్రధానమంత్రి చేయండి.. ఆజంఖాన్

ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజం ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఈసారి కూడా ప్రధాని మంత్రి నరేంద్ర మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా అనర్హుడని.. తాను రాజీనామా చేయాలని సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఉత్తర ప్రదేశ్ లో ఉపముఖ్యమంత్రిగా ఉండాలంటూ లక్నలో పోస్టర్లు వచ్చిన నేపథ్యంలో.. ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. అంతేకాదు  ''మీరు నన్ను అవమానిస్తున్నారు. నేను ప్రధానమంత్రి కావాలనుకుంటున్నాను. దానికి అన్నివిధాలా అర్హుడిని.. అందుకే ఉపముఖ్యమంత్రి కావాలంటూ వెలిసిన పోస్టర్లను తీయించేశాను' అని చెప్పారు. అక్కడితో ఆగకుండా ఎంపీలంతా తనను ఎన్నుకోవాలని.. అది దేశానికి  మంచి సందేశం ఇచ్చినట్లు అవుతుందని, దేశం ప్రతిరోజూ పురోగతి సాధిస్తుందని చెప్పుకున్నారు. ప్రధాని పదవికి తమ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కూడా తనకే మద్దతు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. మరి అజాంఖాన్ వ్యాఖ్యలకు ఎలాంటి దూమారం లేపుతాయో చూడాలి.

ap cabinet

ఏపీ క్యాబినెట్.. వైసీపీ సమావేశాలు.. ఒకటే అంశాలు

  ఏపీ క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈసందర్బంగా ముఖ్యంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆరు ప్రధాన బిల్లులపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కాల్ మనీ, కల్తీ మద్యంపై ప్రతిపక్షాలను ఎదుర్కోవడం.. కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలు అమలుపరచడం.. జనవరి 1 నుండి ప్రారంభంకానున్న జన్మభూమి విధానాలపై చర్చిస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలు కూడా సమావేశమయ్యారు. ఈసందర్బంగా వారు అసెంబ్లీలో ఏ అంశాలపై మాట్లాడాలో చర్చించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కాల్ మనీ, కల్తీ మందు, బాక్సైట్ తవ్వకాలు గురించి చర్చించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈసారి అధికార పార్టీని ఇరుకున పెట్టాలని ప్రతిపక్ష నేతలు, ప్రతిపక్ష నేతలను ఎదుర్కోవడానికి అధికార పార్టీ రెండూ కలసి అసెంబ్లీలో రచ్చ చేస్తారని ముందే అర్ధమవుతోంది.

సెలవులు రద్దు చేసుకుంటున్నా.. గౌతమ్ సవాంగ్

విజయవాడలో కాల్ మనీ రగడ సమయంలో సీపీ గౌతమ్ సవాంగ్ సెలవులు కోరడంపై అనేక అనుమానాలు వ్యక్తమయిన సంగతి తెలిసిందే. కాల్ మనీ వ్యాపారుల నుంచి రాజకీయంగా వస్తున్న ఒత్తిళ్లే కారణమని.. అందుకే తాను సెలవులు తీసుకున్నారని పలువురు విమర్శించారు. దానికి గౌతమ్ సవాంగ్ నెలరోజుల క్రితమే సెలవులు కావాలని కోరారని.. కాల్ మనీ దీనికి సంబంధం లేదని డీజీపీ రాముడు కూడా స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు గౌతమ్ సవాంగ్ కూడా ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన కాల్ మనీ కేసు దృష్ట్యా సెలవులు రద్దు చేయాలని డీజీపీని కోరానని..నేను సెలవులు రద్దు చేసుకుంటున్నానని తెలిపారు.ఇంకా కాల్ మనీ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది..రాష్ట్రవ్యాప్తంగా పలు ఫైనాన్స్ కార్యలయాలపై దాడులు చేస్తున్నాం.. పలువురిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టామని గౌతమ్ సవాంగ్ తెలిపారు

కలెక్టర్లకు చంద్రబాబు క్లాస్..కోటు, టై కట్టుకోవడం కాదు..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు నిర్లక్ష్యంగా పనిచేస్తే ఎలాంటి మొహం మాటం లేకుండా వారికి క్లాస్ పీకుతుంటారు. ఇలాంటి సందర్భాలు చాలానే చూశాం. మళ్లీ నిన్న కలెక్టర్లతో సమావేశమయిన చంద్రబాబు వారికి కూడా క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. మన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సహజ వనరులు ఉన్నాయి.. వాటిని సద్వినియోగం చేయడంపై దృష్టి సారించాలి.. అంతేకాని కలెక్టరంటే కోటు, టై కట్టుకుని బ్రిటీష్‌ తరహాలో ఎసి గదుల్లో కూర్చుని పని చేయడం కాదు, పోటీతత్వంతో పని చేయాలని ఆదేశించారంట. ఈ సందర్భంగా కలెక్టర్లు రాబోయే ఆరు నెలల్లో తాము చేయాల్సిన పనుల నివేదికను సీఎంకు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం.. కలెక్టర్ల పని విధానం మారాలని, జిల్లాల్లో ఏంచేయాలో వారే సూచనలు చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. ఇంకా అనేక అంశాలపై చంద్రబాబు కలెక్టర్లతో చర్చించినట్టు తెలుస్తోంది. అవి * మలేషియాలో పెమాండూ విధానాన్ని ఇక్కడ అమలు చేయడం * గృహనిర్మాణంలో నూతన పద్ధతులు * ప్రభుత్వ భూములు, గ్రామ కంఠాలు, అసైన్డ్‌ భూములకు జియో ట్యాగింగ్‌ చేయాలని.. * రాష్ట్రంలో 13 జిల్లాల్లో 1.60 వేల కిలోమీటర్ల మేర మ్యాపింగు.. * నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ తో పాటు ఉద్యోగాలు కల్పించేందుకు అవసరమైన కంపెనీలతో టైఅప్‌ చేసుకోవాలని * స్వయం సహాయ సంఘాల సభ్యులకు నైపుణ్య శిక్షణలు

అమెరికాలో ఇండియన్ మీద కాల్పులు

  అమెరికాలో భారతీయుల మీద కాల్పులు జరగడం సర్వ సాధారణమైపోయింది. అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు ఇది చాలా భయాన్ని కలిగిస్తోన్న అంశం. ఈ భయం నేపథ్యంలోనే అమెరికాలోని మరో భారతీయుడి మీద కాల్పులు జరిగాయి. బిచిగాన్‌లో ఇంద్రజిత్ సింగ్ అనే వ్యక్తికి చెందిన ఒక స్టోర్‌లో భారత సంతతికి చెందిన ఒక యువకుడు క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. ఆ స్టోర్‌లోకి ఓ దుండగుడు మాస్క్ ధరించి ప్రవేశించాడు. డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. అయితే ఆ యువకుడు డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో దుండగుడు అతని మీద కాల్పులు జరిపి, డబ్బు తీసుకుని పరారయ్యాడు. అయితే అదృష్టవశాత్తూ బుల్లెట్లు ఆ యువకుడికి ప్రాణాపాయం కలిగించే ప్రాంతాల్లో తగలకపోవడంతో అతను బతికి బయటపడ్డాడు. ప్రస్తుతం అతనికి చికిత్స జరుగుతోంది.