పార్లమెంట్లో శ్రీశ్రీ ఈవెంట్ పై మళ్లీ దుమారం..కార్యక్రమానికి ప్రధాని మోడీ

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ పేరిట శ్రీశ్రీ రవిశంకర్ నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమంపై ఈరోజు కూడా మళ్లీ దుమారం రేగుతోంది. జేడీయూ నేత శరద్ యాదవ్ మాట్లాడుతూ.. కల్చర్ ఫెస్టివల్ వల్ల ఢిల్లీ నిర్వీర్యంగా మారిందని.. గ్రీన్ ట్రిబ్యునల్ రవిశంకర్ ను జరిమానా కట్టమని ఆదేశించినా.. తాను మాత్రం జరిమానా కట్టనని తేల్చి చెపుతున్నాడు.. ఆయన చట్టానికి అతీతుడా అని శరద్ ప్రశ్నించారు. మరో కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేశ్.. కల్చర్ ఈవెంట్‌తో పర్యావరణాన్ని పాడు చేస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను కూడా పట్టింకోని శివశంకర్ ఈవెంట్ పై వ్యతిరేకంగా కొత్త పిటిషన్‌ను దాఖలు చేయనున్నారు.   మరోవైపు ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నప్పటికీ ఈరోజు జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ వెళ్లి ప్రారంభించనున్నారు.

తెలంగాణ అసెంబ్లీ.. రాంరెడ్డి మృతికి సంతాపం.. సభ రేపటికి వాయిదా..

  తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మృతి తీరని లోటని అన్నారు. ఇంకా రాంరెడ్డి మృతిపై పలువురు పలు రకాలుగా స్పందించారు.   కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతూ రాంరెడ్డి నాకు చాలా సన్నిహితుడని.. ఆయన మృతి కాంగ్రెస్ పార్టీతో పాటు తనకు కూడా వ్యక్తిగతంగా చాలా లోటని అన్నారు.   మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ వెంకట్ రెడ్డి మరణం చాలా బాధాకరమైనదని.. ఆయన మన మధ్య లేకపోవడం చాలా చింతించాల్సిన విషయమని అన్నారు. మొదట మూడు సార్లు ఓటమిపాలైనా.. ఉపఎన్నికల్లో తొలిసారి గెలిచి వెనక్కి చూసుకోలేదని అన్నారు. కమ్యూనిస్టుల ప్రభంజనంలో కూడా ఆయన గెలిచారని గుర్తు చేశారు. నిండైన పంచకట్టుతో రైతు రూపంతో ఉండేవారని తెలిపారు.   పువ్వాడ అజయ్   రాంరెడ్డికి ఖమ్మం జిల్లా ప్రజలంటే ఎంతో ఇష్టమని తెలిపారు. వ్యవసాయం, పశుపోషణ అన్నా ఆయన ఎంతో ఇష్టమని తెలిపారు. ఊపిరిత్తుల క్యాన్సర్ ఉందని తెలిసినా ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రతిపాదన చేశారు. రాంరెడ్డి మరణించిన కారణంగా ఆయన నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో ఆయన కుటుంబంలోని ఎవరో ఒకరు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తారని చెప్పారు. రాంరెడ్డి సేవలకు గుర్తింపుగా అక్కడ టిఆర్ఎస్ పార్టీతోపాటు మరే పార్టీ కూడా పోటీ పెట్టకుండా ఏకగ్రీవానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.   ఇదిలా ఉండగా రాంరెడ్డి వెంకటరెడ్డి మృతికి సంతాపం తెలిపిన అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు మధుసూదనాచారి ప్రకటించారు.

మా ఊళ్లో ఆడపిల్ల పుట్టుక చావుతో సమానం..కంగనా తండ్రి!

ఇప్పటికీ దేశంలోని చాలాచోట్ల, ఆడపిల్లల పట్ల ఉన్న వివక్షను ప్రకటించింది బాలీవుడ్ కథానాయిక కంగనారనౌత్‌. తను తల్లిదండ్రులకు ఒక కొడుకు పుట్టి చనిపోయాడని, కాబట్టి ఆ కొడుకు మళ్లీ పుడతాడని వారు ఆశించారనీ, ఎప్పుడైతే తాను పుట్టానో వారి ఆవేదనని అంతులేకుండా పోయిందని చెప్పుకొచ్చింది కంగనా. తన కుటుంబంలోనే తాను ఒక అక్కర్లేని మనిషిగా పెరిగిందని బాధపడింది. తన ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరూ తను ఆడపిల్లననీ, చనిపోయిన కొడుకు బదులు పుట్టానని గుర్తుచేసేవారని వాపోయింది. ఈ విషయం మీద హిమాచల్‌ ప్రదేశ్‌లో నివసించే కంగనా తండ్రి కూడా నోరువిప్పారు. తాము నివసించే ప్రాంతంలో ఆడపిల్లలు పుడితే, ఆ ఇంట్లో ఏదో చావు సంభవించినంతగా జనం బాధపడిపోతారనీ, ప్రతిఒక్కరూ వచ్చి ఆడపిల్ల పుట్టినందుకు ఓదారుస్తారనీ చెప్పుకొచ్చారు. చనిపోయిన కొడుకు తిరిగి పుడతాడని ఆశించిన తాము, కంగనా పుట్టడంతో నిరాశ చెందిన మాట వాస్తవమే అని ఒప్పుకున్నారు. కంగనా జీవితమే ఇలాంటి ఆటుపోట్లతో కూడుకున్నదనుకుంటే, ఆమె అక్క రంగోళీ పరిస్థితి ఇంకా దారుణం. రంగోళీ వెంటబడిన ఓ కుర్రవాడు ఆమె మీద యాసిడ్‌ పోసి పారిపోయాడు. దాంతో ఆమె శారీరికంగా, మానసికంగా ఎన్నో కష్టాలను అనుభవించారు. తన అక్క ఎదుర్కొన్న కష్టనష్టాల కథనే తెరకెక్కించేందుకు ఇప్పడు కంగనా సిద్ధపడుతోంది.

మరో మలుపు తిరిగిన విజయ్ మాల్యా వ్యవహారం... వరుస ట్వీట్లు

  వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగనామం పెట్టిన విజయ్ మాల్యా దేశం విడిచి పారిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు దీనిపై పార్లమెంట్లో కూడా దుమారం రేగుతోంది.  దేశం వీడి పారిపోయేందుకు ఎన్డీయే ప్రభుత్వం అనుమతించిందని ఒక పక్క ప్రతిపక్షనేతల ఆరోపణలతో పార్లమెంట్ అట్టుడుకుతోంది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. తనపై వస్తున్న వార్తలకు స్పందించి..  తాను ఎక్కడికీ పారిపోలేదని, చట్టానికి కట్టుబడి ఉంటానని శుక్రవారం తెల్లవారుజామున వరుస ట్వీట్లు చేశారు. అంతేకాదు మీడియాపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.. కావాలనే తనపై బురద జల్లుతున్నారంటూ.. ఆస్తులు ప్రకటించలేదని మీడియా గగ్గోలు పెడుతోంది.. అసలు ఆస్తులు చూపించకుండానే బ్యాంకులు రుణాలు ఎలా ఇచ్చారు... ఏదో టీఆర్పీ రేటింగ్ కోసం ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు.  

అన్యాయం జరిగింది.. చేయూత ఇవ్వాలని కోరాం.. చంద్రబాబు

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలోని కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు.  కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయిన ఆయన విభజన చట్టంలోని పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికి విభజన జరిగి రెండు సంవత్సరాలు కావస్తున్న కేంద్రం నుండి తగినంత సహాయం ఏపీ రాష్ట్రానికి అందడంలేదని.. విభజనతో ఏపికి జరిగిన అన్యాయం నుండి బయట పడేందుకు చేయూత ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. అంతేకాదు ఇటీవలే ప్రధానిని కలిసి పరిస్థితి గురించి వివరించాను.. ఇప్పుడు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీని కలిసి మరోసారి పరిస్థితిని వివరించాను అని చెప్పారు.

ముద్రగడ కమెడియన్ అవుతున్నాడా..?

  ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందే అన్నట్టు ప్రస్తతం ముద్రగడ పద్మనాభం పరిస్థితి చూస్తుంటే. కాపులకు అన్యాయం జరుగుతుందంటూ... కాపులను బీసీల్లోకి చేర్చాలంటూ ఉద్యమం.. నాలుగైదు రోజులు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసి బాగానే ఫేమస్ అయ్యారు. ఆయన చేసిన దీక్షకు ఫలితంగా ప్రభుత్వం తన డిమాండ్లు తీర్చుతానని చెప్పడంతో ఏదో ఒక రకంగా సర్ధి చెప్పడంతో తన దీక్షను విరమించారు. ఇక అంతటితో పరిస్థితి కాస్త చక్కబడింది. అయితే ఆతరువాత ముద్రగడ దీక్షకు వెనుక జగన్ హస్తం ఉందని.. జగన్ వల్లే ముద్రగడ దీక్ష చేశారని పలు ఆరోపణలు వచ్చాయి.   అది అయిపోయిందంటే ఇప్పుడు మరో బాధ. ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచిపోయిందంటూ..  అదే విషయాన్ని నేను ప్రశ్నించినందుకు నన్ను ఓ దొంగ, ద్రోహీ అని టీడీపీ నేతలతో తిట్టించారు అని అన్నారు. నాపై వ్యతిరేకంగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు.. చంద్రబాబు.. మాట మీరు తప్పారా..? నేను తప్పానా..?.. కాపు డిమాండ్లను అవహేళన సమంజసమేనా.. అధికారంలో ఉన్నవాళ్లు అబద్దాలు చెబితే నిజమైపోతాయా అంటూ మళ్లీ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు ముద్రగడ. అంతేకాదు మరోసారి దీక్ష కూడా చేస్తానని చెప్పారు.   అయితే ఆయన మరోసారి దీక్ష సంగతేమో కానీ దీనివల్ల కాపులకు కాపులకు మధ్య విబేధాలు తెలత్తుతున్నాయి. ఆయన చేపట్టదలచిన దీక్ష నేపథ్యంలో జిల్లాల కాపు సంఘాల నేత‌లతో ముద్రగడ సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో కొంత మంది ప్రభుత్వానకి వ్యతిరేకంగా మాట్లాడితే.. మరికొందరు మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడటంతో వాగ్వాదం మొదలైంది. దీంతో సమావేశం కాస్త రసాభాసగా తయారైంది. దీంతో ఇక చేసేది లేక ముద్రగడ దీక్షను వాయిదా వేసేశారు.   మొత్తానికి ముద్రగడ పరిస్థితి అయోమయంలో పడినట్టు తెలుస్తోంది. రాను రాను ఆయన అందరూ ఆడించే బొమ్మలా తయారవుతున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. అంతేకాదు ఆయన ఇలానే చేస్తే ప్రభుత్వం కూడా ఆయన డిమాండ్లకు తలొగ్గే పరిస్థితులు ఉండవని.. ఆయన అలానే ఉంటే అందరికి కమెడియన్ లా అవుతారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. మరి ముందు ముందు ముద్రగడ పరిస్థితి ఇంకేలా తయారవుతుందో చూడాలి.

అమెరికాలో కాల్పులు... ఐదుగురి మృతి

  అమెరికాలో తుపాకీ సంస్కృతి మరో ఐదుగురిని పొట్టన పెట్టుకుంది. అక్కడి పిట్సబర్గ్‌ నగరంలో జరుగుతున్న ఒక పార్టీలో ఇద్దరు వ్యక్తులు తుపాకులను పట్టుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు ప్రాథమిక సమాచారం. ఈ దాడిలో ఐదుగురు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.పార్టీలో జరిగిన గొడవ ఏదన్నా ఈ కాల్పులకు దారితీసిందా, లేకపోతే ఇది ఉగ్రవాద చర్యా అన్నది ఇంకా తేలలేదు. పిట్సబర్గ్‌లోని విల్కిన్స్‌బర్గ్ అనే ప్రదేశంలో ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన తరువాత దుండగులు చల్లగా నడుచుకుంటూ వెళ్లిపోయినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఘటన జరిగిన ప్రదేశమంతా ఖాళీతూటాలతోనూ, రక్తపు మరకలతోనూ భయానక వాతావరణాన్ని తలపిస్తోంది. దాడిలో తమ ఆప్తులను పోగొట్టుకున్నవారి బంధువుల రోదనతో ఆ ప్రాంతం హృదయవిదారకంగా ఉంది. అమెరికాలో తుపాకుల సంస్కృతిని అంతమొందిస్తానంటూ ఆ దేశ అధ్యక్షుడే స్వయంగా శపథం చేసినా, దానికి వెక్కిరింతగా ఏదో ఒక సంఘటన ప్రతి వారమూ బయటపడుతూనే ఉంది.

వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి ప్రత్తిపాటి..

  2016-17 సంవత్సరానికి గాను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ రూ. రూ.16,250.58 కోట్లు గా మంత్రి పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని తక్కువ ఖర్చుతో లాభసాటిగా మార్చడమే లక్ష్యమని అన్నారు. ఇంకా ప్రత్తిపాటి ప్రతిపాదించిన అంశాలు   * ఉపాధి హామీకి రూ. 5,094 కోట్లు * ఉచిత విద్యుత్ కు రూ. 3 వేల కోట్లు * తుంపర సేద్యానికి రూ. 369 కోట్లు * వాతావరణ ఆధారిత బీమా పథకానికి రూ. 344 కోట్లు * వడ్డీ లేని రుణాలకు రూ.177 కోట్లు * పట్టు పరిశ్రమలో ప్రణాళికేతర వ్యయం రూ.125 కోట్లు * రైతు బజార్లు, ఉద్యాన యాంత్రీకరణకు రూ.102 కోట్లు * సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ కు రూ.95 కోట్లు * ఆయిల్ ఫాం మినీ మిషన్ కు రూ. 55 కోట్లు

ముదురుతున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ వివాదం..

ఆర్ట్‌ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ గురూజీ నిర్వహించతలపెట్టిన సాంస్కృతిక ఉత్సవాలకు సంబంధించి రాజ్యసభలో ఇప్పటికే దుమారం రేగుతూనే ఉంది. దీనిపై గ్రీన్ ట్రిబ్యూనల్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రవిశంకర్‌ గురూజీ కార్యక్రమం పర్యావరణానికి హాని కలిగిస్తోందని..ఇంత పెద్ద ఉత్సవాలకు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం మీకు లేదా అని పర్యావరణ మంత్రిత్వ శాఖను ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే సాయంత్రం లోపు రూ.5కోట్లు చెల్లించాలని రవిశంకర్ కు గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశించింది. దీనికి రవిశంకర్ మాత్రం జైలుకైనా వెళ్తాను కానీ జరిమానాను చెల్లించనని రవిశంకర్ స్పష్టం చేశారు.

కేసీఆర్, చంద్రబాబుపై జేసీ కామెంట్స్.. ఇద్దరూ ఇద్దరే..

  ప్రతిపక్ష పార్టీపైనే కాదు.. సొంత పార్టీమీద.. సొంత పార్టీ నేతలమీద కామెట్లు చేయాలంటే జేసీ దివాకర్ రెడ్డి తరువాతే. కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి మళ్లీ తన నోటికి పని చెప్పారు. ఈసారి ఏకంగా తెలుగు రాష్ట్రాల సీఎం గురించి వ్యాఖ్యానించడం గమనార్హం. చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ ఇద్దరే అని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరితే కేసీఆర్ పదవులు కాకపోయినా పనులైనా చేసిపెడతారని ఆశించి ఆ పార్టీలోకి చేరుతున్నారు.. కానీ ఏపీలో పరిస్థితి వేరు ఇక్కడ దానికి కుడా అవకాశం లేదని..తాను కూడా ఆకర్షణలో భాగంగానే టిడిపిలో చేరానని చెప్పారు. ఇక వైసీపీ నేతలు టీడీపీలోకి చేరడం గురించి మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలను డబ్బులిచ్చి కొనలేదు.. జగన్ తీరు నచ్చకే ఆపార్టీ నేతలు టీడీపీలోకి వస్తున్నారు అని వ్యాఖ్యానించారు.   ఇంకా రాష్ట్ర విభజన గురించి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సరికాదని తాను సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి చెప్పానని... దానికి సోనియా 20 ఏళ్ల తర్వాత అయినా రాష్ట్ర విభజన సమర్థనీయమని ప్రజలు చెప్తారని తనతో అన్నారని అన్నారు. అసలు ప్రత్యేక తెలంగాణ కంటే రాయల్ తెలంగాణ ఇచ్చుంటే బావుండేదని.. అప్పుడు సీమకు కష్టాలు వచ్చేవికావని అన్నారు.

కోమటిరెడ్డి జోస్యం.. 2019 ఎన్నికల్లో 95 స్థానాలు..

  ప్రస్తుతం తెలంగాణలోని అధికార పార్టీలోకి వలసలు పర్వం సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష పార్టీ నేతలందరూ వరుసపెట్టి.. టీఆర్ఎస్ లోకి జంప్ అవుతున్నారు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్యో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశార. ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. 2017 వరకూ తాము రెస్ట్ లో ఉన్నామని.. 2018 నుండి తిరిగి రంగంలోకి దిగుతామని అన్నారు. అంతేకాదు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 95 స్థానాలు గెలుచుకుంటామని జోస్యం కూడా చెప్పారు. మరి వెంకటరెడ్డిగారు ఇంత కాన్ఫిడెంట్ గా ఉండటానికి కారణం ఏంటో...

2016 -17 ఏపీ బడ్జెట్.. ముఖ్యాంశాలు..

  ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు 2016 -17 కు గాను బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ లోని ముఖ్యాంశాలు.. * 206-17 బడ్జెట్ - 1,35,688.99 కోట్లు * ప్రణాళికా వ్యయం - 49,134.44 కోట్లు * ప్రణాళికేతర వ్యయం - 86,554.55 కోట్లు * గతేడాది కంటే 20.13 శాతం పెరిగిన ఏపీ బడ్జెట్ * సాగునీటి రంగానికి రూ.. 3,512 కోట్లు * రుణమాఫీకి రూ.. 3,512 కోట్లు, ఇరిగేషన్ రూ.. 7,325 కోట్లు * 10.9 శాతం వృద్దిరేటు లక్ష్యం * 15 నుండి 18 వేల కోట్లు అమరావతి నిర్మాణానికి అవసరం * ఆర్ధిక లోటు 20 వేల 4 వందల 97 కోట్లు * గత ఏడాదితో పోలిస్తే 20.13 శాతం బడ్జెట్ వృద్ధి * తాగునీటికి 3,300 కోట్లు కేటాయింపు * ఏపీ రెవెన్యూ లోటు రూ. 4,868 కోట్లు * వృద్ధి రేటు లక్ష్యం10.9 శాతం * పారిశ్రామిక రంగంలో వృద్ధిరేటు 11.43 శాతం * వ్యవసాయ రంగలో వృద్ధిరేటు 8.4 శాతం * రాష్ట్రాభివృద్దికి ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు * ఇరిగేషన్ కు రూ. 7,325 కోట్లు * భూపరిపాలనకు రూ.3119 కోట్లు * ఎస్సీ సంక్షేమానికి రూ.8724 కోట్లు * ఎస్టీ సంక్షేమానికి రూ.3100 కోట్లు * బ్రాహ్మణ కార్పోరేషన్‌కు రూ.65 కోట్లు * కాపు కార్పోరేషన్‌కు రూ.1000 కోట్లు * సాంఘిక భద్రత పింఛన్ల కోసం రూ.2998 కోట్లు * యువత సాధికారత కోసం రూ.252 కోట్లు * మహిళా సాధికారత కోసం ప్రత్యేక ప్రాజెక్టు * మహిళా సాధికారకతకు రూ.642 కోట్లు * క్రీడాశాఖకు రూ.215 కోట్లు * నైపుణ్యాల అభివృద్ధిలో భాగంగా లక్షమందికి శిక్షణ * ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రూ.377 కోట్లు * ఉపాది హామీ పథకానికి రూ.4,764 కోట్లు *  పట్టణ పరిపాలనకు రూ.4,728 కోట్లు