Read more!

ద్వాత్రింశద్భుజ ఆంజనేయస్వామి అవతారం

 

ద్వాత్రింశద్భుజ ఆంజనేయస్వామి అవతారం

 

 

 

 

ఇది ముప్పై రెండు చేతులతో ముప్పై ఆయుధాలు కలిగిన విరాడ్రూపం. సోమదత్తుడు ద్వాత్రింశద్భుజ స్వామిని ఉపాసించి పూర్వం పోయిన రాజ్యాన్ని సోమదత్త మహారాజా మరలా పొందినట్లు పురాణం.


 

సోమదత్త మహారాజా


ద్వాత్రింశద్భుజ మారుతే: |


రాజ్య భ్రష్ఠగ తాశంకో


భూయో రాజ్య మవాపహ ||


అనే శ్లోకం వలన తెలుస్తుంది. పరాశరసంహితలో 4, 5 పటాల్లో సోమదత్తుని చరిత్ర వలన ద్వాత్రింశద్భుజాంజనేయస్వామి అనుగ్రహం వ్యక్తమవుతుంది. ఇది మహిష్మతీపుర హనుమత్పీఠ కాహ్రిత్ర. ఆ అవతారమూర్తి రూపధ్యానం ఇలా చెప్పబడింది.


ఖడ్గం ఖట్వాంగశైలద్రుమ పరశు గదాపుస్తకం శంఖచక్రే


పాశం పద్మం త్రిశూలం హల ముసల ఘటాన్ టంకశ క్త్యక్ష మాలాః |


దండం వా కుంత చర్మా చలిత కుశవరా పట్టిసం చాపబాణాన్


ఖేటం ముష్టిం ఫలం వా డమరు మభిభజే బిభ్రతం వాయుసూనుమ్ ||


ఈ శ్లోకం ద్వారా తెలిసిన మూర్తే సోమదత్తునికి సాక్షాత్కరించాడు. ఆయనకు గల ముప్పై రెండు ఆయుధాలు పై శ్లోకంలో చెప్పబడ్డాయి. ఈ ద్వాత్రింశద్భుజ ఆంజనేయుని ఉపాసనామంత్రం హుంకార హనున్మంత్రం. ఈ మంత్రం ఉపాసింపబడే స్వామి మూడు శిరస్సులు కలిగి వర్ణింపబడటం విశేషం. సోమదత్తున్ని అనుగ్రహించిన ద్వాత్రింశద్భుజుడు హనుమద్వ్రతం వలన సంతుష్టుడై సాక్షాత్కరించిన ప్రసన్నమూర్తి కాగా పద్మకల్ప దేవదానవ యుద్ధంలో సాక్షాత్కరించిన మూర్తి రూపధ్యానం.