English | Telugu

ప్రపంచంలో ఇలాంటి కేసు ఎవరూ చూసుండరు!

Publish Date:Nov 11, 2025

  ఒకప్పుడు కామెడీ హీరోగా తనదైన ముద్ర వేసిన అల్లరి నరేష్.. ఇటీవల కాలంలో విభిన్న చిత్రాలతో అలరిస్తున్నాడు. ఈ క్రమంలోనే నవంబర్ 21న '12A రైల్వే కాలనీ' సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. (12A Railway Colony)   శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రానికి 'పొలిమేర' ఫేమ్ అనిల్ విశ్వనాథ్ కథ అందించడం విశేషం. నాని కాసరగడ్డ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల, సాయి కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.   '12A రైల్వే కాలనీ' ట్రైలర్ తాజాగా విడుదలైంది. దాదాపు రెండు నిమిషాల నిడివితో రూపొందిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఒక హత్య కేసు విచారణ నేపథ్యంలో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. అసలు ఈ కేసుతో అల్లరి నరేష్ కి సంబంధం ఏంటి? ఇన్వెస్టిగేషన్ లో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? అనే క్యూరియాసిటీని కలిగిస్తూ ట్రైలర్ ను కట్ చేశారు.   Also Read: అఖండ-2.. పక్కా ప్లానింగ్ తో పాన్ ఇండియా తాండవం!   ముఖ్యంగా "బహుశా ప్రపంచంలో ఇలాంటి కేసు ఎవరూ చూసుండరు" అంటూ సాయికుమార్ చెప్పిన డైలాగ్ తో.. ఈ సినిమాలోని మర్డర్ మిస్టరీ ఎంత కొత్తగా ఉండబోతుందో అర్థమవుతోంది.   ఊహించని మలుపులు, కట్టిపడేసే ఎమోషన్స్ తో '12A రైల్వే కాలనీ' మూవీ ఎంగేజింగ్ గా ఉంటుందని ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది. పొలిమేర తరహాలోనే క్షుద్ర పూజల ప్రస్తావన ఉంటుందని ట్రైలర్ లో హింట్ ఇచ్చారు.    చూద్దాం మరి '12A రైల్వే కాలనీ'తో అల్లరి నరేష్ మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంటాడేమో.    

Kaantha: Bhagyashri took inspiration from Sridevi and Savitri

Publish Date:Nov 11, 2025

Bhagyashree Borse, the leading lady of Dulquer Salmaan's highly anticipated period drama Kaantha, has expressed immense excitement about her role ahead of the November 14th release. Directed by Selvamani Selvaraj and jointly produced by Dulquer Salmaan and Rana Daggubati, the film also features Rana and Samuthirakani. Bhagyashri interacting with media, called Kaantha as a very special project, offering her a "pure performance-oriented character" named Kumari. She considered the role a blessing and a challenge, particularly due to its 1960s setting. Though Kaantha was the first script she signed, due to delays others films have released first.  Her preparation included watching classic films and drawing inspiration from legendary actresses like Sridevi and Savitri to authentically portray the era. She praised the positive work environment and the support from Director Selvaraj, who crafted the Kumari character beautifully.  Bhagyashri highlighted her enriching experience working with the producers. Having worked with major stars early in her career, she looks forward to the film's success. Her ultimate hope is that Kaantha will elevate her from a commercial performer to being recognized as a serious performer in the industry. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

73 ఏళ్ళ క్రితం సంచలన విజయం సాధించిన ‘దాసి’ చిత్రంలోని విశేషాలివే!

Publish Date:Nov 3, 2025

చిత్ర పరిశ్రమలో నటీనటులైనా, సాంకేతిక నిపుణులైనా సాధించిన విజయాల వల్ల కొందరి పేర్లు మారు మోగిపోతూ ఉంటాయి. అయితే కొందరు చిత్ర పరిశ్రమ అభివృధ్దికి ఎంతో కష్టపడినప్పటికీ వారు పేర్లు మరుగున పడిపోతూ ఉంటాయి. వారి గురించి ఎవరూ మాట్లాడరు, వారి పేరు చర్చకు రాదు. అలాంటి ఓ దర్శకనిర్మాత సి.వి.రంగనాథదాస్‌. తను చేసిన సినిమాల వల్ల ఆయన ఎక్కువగా లాభపడకపోయినా ఎంతోమందికి లాభం చేకూరింది. 1950 దశకంలో ఎన్నో అద్భుతమైన సినిమాలకు ఆయన రూపకల్పన చేశారు. ఆ సినిమాల ద్వారా ఎంతో మంది నటీనటులు, దర్శకనిర్మాతలు విజయాలు సాధించారు. అలాంటి రంగనాథదాస్‌ మొదట ‘దాసి’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేశారు. తనే దర్శకత్వం వహిస్తూ ఆ చిత్రాన్ని ప్రారంభించారు. కానీ, కొంత షూటింగ్‌ పార్ట్‌ పూర్తయిన తర్వాత ఆర్థిక కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. దాంతో దాన్ని పక్కన పెట్టేసి ఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌లతో సంసారం చిత్రాన్ని నిర్మించారు. మొదట ఈ సినిమాలో సావిత్రిని కథానాయికగా తీసుకొచ్చారు రంగనాథదాస్‌. కానీ, ఎల్‌.వి.ప్రసాద్‌కి ఆమె నచ్చలేదు. లక్ష్మీరాజ్యంను కథానాయికగా ఎంపిక చేశారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇదే చిత్రాన్ని తమిళ్‌లో సంసారం పేరుతోనే జెమిని వాసన్‌ రీమేక్‌ చేశారు. అక్కడ కూడా పెద్ద హిట్‌ అవ్వడంతో అప్పటివరకు అప్పుల్లో వాసన్‌ ఈ సినిమాతో గట్టెక్కారు.  ఆ సమయంలో తను మొదట దర్శకత్వం వహిస్తూ నిర్మించాలనుకున్న ‘దాసి’ చిత్రాన్ని మళ్ళీ ప్రారంభించారు రంగనాథదాస్‌. అయితే అంతకుముందు తీసిన సినిమాని పక్కన పెట్టి మళ్ళీ కొత్తగా ప్రారంభించారు. ఈ చిత్రానికి నిర్మాతగా నటి లక్ష్మీరాజ్యం వ్యవహరించారు. ఎల్‌.వి.ప్రసాద్‌ పర్యవేక్షణలో రంగనాథదాస్‌ ఈ చిత్రాన్ని రూపొందించారు. 1952 నవంబర్‌ 26న విడుదలైన ఈ సినిమా చాలా పెద్ద హిట్‌ అయి సంచలనం సృష్టించింది. ఈ సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టడంతో లక్ష్మీరాజ్యం, ఆమె భర్త శ్రీధరరావు వెలైకరి మగళ్‌ పేరుతో తమిళ్‌లో నిర్మించారు. అయితే అక్కడ ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. 1950వ దశకంలోనే సంచలన విజయం సాధించిన ‘దాసి’ చిత్ర కథ ఏమిటి, ఈ సినిమా అంతటి ఘనవిజయం అందుకోవడం వెనుక కారణాలు ఏమిటి అనేది పరిశీలిద్దాం.  రామయ్య(ఎన్టీఆర్‌) జట్కా తోలుతుంటాడు. భార్య లక్ష్మీ(లక్ష్మీరాజ్యం) బద్రినాథ్‌(ఎస్వీఆర్‌) అనే సంపన్నుడి ఇంట్లో పాచిపని చేస్తుంటుంది. వారికి సుబ్బడు(చలం) అనే కొడుకు ఉంటాడు. బద్రినాథ్‌, పార్వతమ్మ(శాంతకుమారి) దంపతులకు నడి వయసు వచ్చినా సంతానం ఉండదు. సంతానం కోసం మరో పెళ్లి చేసుకోమని బంధువులు ప్రోత్సహిస్తారు. పార్వతమ్మ అన్న రామారావు (శ్రీవత్స) చెల్లెల్ని చూడటానికి వచ్చి జరిగిన కథ అంతా విని, బద్రీనాథ్‌ బంధువులు ఆయన ఆస్తి కోసం ఈ పన్నాగం పన్నారని తెలుసుకొని ఎత్తుకు పై ఎత్తు వేస్తాడు. పార్వతమ్మ దాసి లక్ష్మి గర్భవతిగా ఉంటుంది. పార్వతమ్మ అన్న రామారావు పార్వతమ్మను, తను గర్భవతిగా ఉన్నట్లు నటించి దాసి లక్ష్మికి పుట్టబోయే బిడ్డను రహస్యంగా పెంచుకోమని సలహా ఇస్తాడు. కానీ సమయం వచ్చేవరకు ఈ సంగతి లక్ష్మికి తెలియనీయవద్దని చెబుతాడు. పార్వతికి మరోదారి లేక దానికి అంగీకరిస్తుంది. పెద్ద దాసి నర్సమ్మకు ఈ విషయమంతా చెప్పి తగినట్లు ప్రవర్తించమంటారు. రామారావు, తరళ అనే లేడీడాక్టరుకు లంచమిచ్చి పార్వతి గర్భవతిగా ఉన్నదని బద్రీనాథ్కు చెప్పిస్తాడు. దానితో బద్రీనాథ్‌ రెండో పెళ్ళి ప్రయత్నం మానుకొంటాడు. లక్ష్మికి కలగబోయే బిడ్డనే తాను పెంచుకోదలచినందువల్ల పార్వతి లక్ష్మికి ప్రతిరోజూ పాలు, ఫలహారాలు ఇచ్చి ఎంతో ఆదరంగా చూస్తూ ఉంటుంది. పార్వతి లక్ష్మిపై చూపిస్తున్న ఆదరాభిమానాలను చూసి లక్ష్మి భర్త రామయ్య భార్యను అనుమానిస్తాడు. లక్ష్మికి నవమాసాలు నిండుతాయి. ఒకనాడు పార్వతమ్మ పెద్దదాసి నర్సమ్మ, రామారావు లక్ష్మి ఇంటికి వచ్చి లక్ష్మితో తామొక రహస్యం చెబుతామని, ఆ రహస్యం తన భర్తకు కూడా చెప్పకూడదని,ఒక్కగానొక్క కొడుకు మీద ఒట్టువేసుకొమ్మని అడుగుతారు. లక్ష్మి ఒట్టువేసుకొంటుంది. పార్వతి గర్భవతి కాదని, లక్ష్మికి పుట్టబోయే బిడ్డను పార్వతికిచ్చి పార్వతి మానప్రాణాలను కాపాడమని రామారావు లక్ష్మి చేతులు పట్టుకొని బ్రతిమాలతాడు. అదే సమయానికి వచ్చిన రామయ్య తన భార్య చేతులు రామారావు పట్టుకొని ఉండడాన్ని చూస్తాడు. రామారావు ఎందుకు వచ్చాడో చెప్పమని భార్యను అడుగుతాడు. కొడుకు మీద ఒట్టు వేసినందున లక్ష్మి భర్తకు నిజం చెప్పలేకపోతుంది. రామయ్య లక్ష్మిని ఇంట్లో నుండి వెళ్లగొడతాడు. లక్ష్మి ఏడుస్తూ పోయి పార్వతమ్మ కాళ్లమీదపడుతుంది. తన భర్తకు నిజం చెప్పి తన కాపురం నిలబెట్టమని ప్రార్థిస్తుంది. ఆ సమయంలో నిజం చెబితా రామయ్య ఉద్రేకంలో ప్రపంచమంతా చాటుతాడని తర్వాత నెమ్మదిగా రామయ్యకు నిజం చెప్తానని పార్వతమ్మ లక్ష్మిని సముదాయించి తన బంగళాలోనే ఉంచుతుంది. లక్ష్మికి పురిటి సమయం వస్తుంది. లేడీడాక్టరు తరళను పిలవడానికి పార్వతమ్మ అన్న రామారావు వెళతాడు. ఆ సమయంలో బద్రీనాథ్‌ మేనల్లుడు నారాయణరావు తరళ ఇంట్లో ఉంటాడు. నారాయణరావును ఆరాత్రి పార్వతమ్మ బంగళాకు రానీయకుండా చేయమని రామారావు తరళని బ్రతిమాలుతాడు. తరళ నారాయణరావును ఇంట్లో ఉంచి తాళం వేసి రామారావుతో పార్వ్తతమ్మ బంగళాకు వస్తుంది. పార్వతమ్మ పెద్దదాసి నిజంగా నొప్పులు పడుతున్న లక్ష్మిని నోరెత్తి అరవనీయదు. నొప్పులు లేని పార్వతమ్మను బిగ్గరగా అరవమంటుంది. లక్ష్మికి ఆడపిల్ల కలుగుతుంది. ఆ పిల్లను తెచ్చి పార్వతమ్మ ప్రక్కలో పడుకోబెట్టి బద్రీనాథ్కు కూతురు పుట్టిందని చెబుతారు. అతడు సంతోషంతా ఉప్పొంగిపోతాడు. బిడ్డకు కమల అనే పేరు పెడతాడు. పార్వతమ్మ ప్రక్కనున్న పిల్ల ఏడుస్తున్నా గమనించదు. బిడ్డ ఏడ్చినప్పుడెల్లా లక్ష్మి వచ్చి బిడ్డను తీసికొంటుంది. లక్ష్మి మాతృప్రేమ వల్ల ఎక్కడ అసలు రహస్యం బయట పడుతుందోనని పార్వతమ్మ తన ఒంట్లో బాగాలేదని, చికిత్స కోసం మద్రాసు వెళ్తానని భర్తతో చెప్పి లక్ష్మికి తెలియకుండా ఒకరాత్రి మద్రాసుకు వెళ్లిపోతుంది. తెల్లవారగానే లక్ష్మి పార్వతమ్మ ఇంటికి వచ్చి కమల కనబడకపోవడంతో కంగారుపడుతుంది. పెద్దదాసి నర్సమ్మ లక్ష్మిని తిట్టి ఇంటినుండి వెళ్ళగొడుతుంది. లక్ష్మి ఏడుస్తూ భర్తదగ్గరకు వస్తుంది. భర్త రామయ్య ఆ సమయంలో దుర్గి (కనకం) అనే ఆమెను పెళ్ళి చేసుకోవడం చూస్తుంది. భర్త కాళ్లమీదపడి రక్షించమని బ్రతిమాలుతుంది. రామయ్య లక్ష్మి జుట్టు పట్టుకొని యీడ్చి యింటి నుండి వెళ్లగొడతాడు. ఇక తనకు చావే శరణ్యమనుకొని లక్ష్మి అక్కడి నుండి వెళ్లిపోతుంది. సవతి కొడుకు సుబ్బడిని చూస్తే గిట్టని దుర్గ వాడిని నీళ్లలో తోసి వాడే నీళ్లలో పడ్డాడని గోలపెడుతుంది. రామయ్య కొడుకు కోసం ఏటిలో దూకి వెదుకుతాడు కానీ కొడుకు దొరకలేదు. అదే సమయంలో జీవితం మీద విరక్తి చెంది లక్ష్మి ఇంకో ఒడ్డు నుండి ఏటిలో దూకుతుంది. ఆమెకు ప్రవాహంలో కొట్టుకొస్తూ కొన వూపిరిలో ఉన్న కొడుకు సుబ్బడు కనిపిస్తాడు. ఆమె వాడిని కాపాడి ఒడ్డుకు వచ్చి డాక్టరు దయాకర్‌ (డాక్టర్‌ దామోదరం) వద్దకు తీసుకువస్తుంది. దయాకర్‌ సుబ్బడిని బ్రతికిస్తాడు. లక్ష్మి దయాకర్‌ ఇంట్లో దాసిగా పనిచేస్తుంది. సుబ్బడు దయాకర్‌ పిల్లల్తో కలిసి చదువుకుంటాడు. రామయ్య రెండోభార్య దుర్గకి నాటకాలు, సినిమాలు అంటే పిచ్చి. భర్తకు తెలియకుండా ఒక నటుడితో స్నేహంచేసి ఇంట్లోనుండి లేచిపోతుంది. మద్రాసులో పార్వతమ్మ కూతురు ఏడేండ్ల బిడ్డ అవుతుంది. ఇంటివద్ద బద్రీనాథ్‌ చనిపోతాడు. కమల (వసంత) దాసి లక్ష్మి కూతురు అని తెలిసి బద్రీనాథ్‌ బంధువులు ఆస్తికోసం దావా వేస్తారు. దేశం అంతా ఈ విషయం తెలిసిపోతుంది. లక్ష్మి నిర్దోషి అని రామయ్య తెలుసుకుంటాడు. తాను చేసిన పనికి పశ్చాత్తాపపడి సన్యాసులలో కలిసిపోతాడు. డాక్టర్‌ దయాకర్‌ బద్రీనాథ్‌ ఆస్తి గురించిన దావావిషయాలు పేపర్లో చదివి భార్యతో చెప్తుంటే లక్ష్మి విని మద్రాసుకు బయలుదేరుతుంది. కోర్టులో కమల పార్వతమ్మ కూతురే కాని నా కూతురు కాదని లక్ష్మి సాక్ష్యం ఇస్తుంది. దానికి ఆధారంగా డాక్టర్‌ తరళ ఇచ్చిన కాగితాలను చూపుతుంది. దానితో కోర్టు కేసును కొట్టివేస్తుంది. తన ఆస్తిని కాపాడినందుకు పార్వతమ్మ లక్ష్మిని కౌగిలించుకొని తప్పును క్షమించమని కోరుతుంది. పార్వతమ్మ లక్ష్మిని మద్రాసులోనే వుండమని బ్రతిమాలుతుంది. లక్ష్మి అంగీకరిస్తుంది. దయాకర్తో చెప్పి లక్ష్మి మద్రాసు చేరుతుంది. సుబ్బడు దయాకర్‌ పిల్లలతోనే చదువుకుంటూ ఉంటాడు. పది సంవత్సరాలు గడిచాయి. సుబ్బడు సుబ్బారావుగా మారి ప్లీడరు పాసై మద్రాసులో ప్రాక్టీసు పెడతాడు. కమల యుక్తవయస్కురాలు అవుతుంది. కాని లక్ష్మిని దాసిగానే భావిస్తుంటుంది. కమల రామారావు కొడుకు ప్రేమనాథ్ను (జనార్ధనం) ప్రేమిస్తుంది. రామారావు భార్య దేవకి దాసిపిల్ల అయిన కమలను తన కొడుకుకు చేసుకోవడానికి ఇష్టపడదు. భిక్షాటన చేస్తూ సన్యాసి వేషంలో ఉన్న రామయ్య తన రెండవ భార్య దుర్గిని చూసి అసహ్యించుకొంటాడు. రాత్రి ఆమెను హతమార్చాలని అనుకొంటాడు. కానీ ఈ లోపుగానే దుర్గి ప్రియుడే ఆమెను హత్యచేసి పారిపోతాడు. రామయ్య మీదకు ఆ కేసు వస్తుంది. రామయ్యను సుబ్బారావు కేసునుండి తప్పిస్తాడా? లక్ష్మి తన కన్నతల్లి అని కమల తెలుసుకొంటుందా? రామారావు భార్య తన కొడుకు ప్రేమనాథ్‌ దాసి కూతురు కమలను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తుందా? అనేవి మిగిలిన కథ. చిట్టితల్లి నవ్వవే చిన్నారి పాపవే కన్నతల్లి చూడవే కన్నీరు మానవే - పి.లీల జోర్సే చేలో నా రాజ ఘోడా హవాకే ఘోడా జల్దీ చలో - పిఠాపురం నాగేశ్వరరావు కలకలలాడే పండుగ నేడే బిరబిర రారండి మా పాపను చూడండి - జిక్కి బృందం మారాజుల చాకిరిచేసి దొరసాని వచ్చావే ఈ పూటకు బువ్వేమైన - పిఠాపురం, పి.లీల (తెరపై ఎన్‌ టి ఆర్‌, లక్ష్మీ రాజ్యం) టైటిల్‌ పాత్రను లక్ష్మీ రాజ్యం పోషించారు. పాతాళ భైరవి లో అందాల తోట రాముడిగా , ప్రజల నాయకుడిగా పల్లెటూరులో నటించిన ఎన్‌ టి ఆర్‌ , అంతగా ప్రాముఖ్యం లేని దాసి సినిమాలో నటించడం కొంత ఆశ్చర్యమే. సినిమాలో చాలా పాత్రలు కొంత సినిమా తర్వాత నడి వయసుకు చేరుకుంటాయి. ఎన్‌ టి ఆర్‌ కూడా నడి వయసులో కనిపిస్తారు. అయినా చక్కగా కనిపిస్తారు ఎన్‌ టి ఆర్‌. ప్రేమనాధ్‌ గా వేసిన జనార్ధనం తరవాత ఎన్‌ ఏ టి వారికి మేనేజర్గా పని చేసారు. ఎన్‌ టి ఆర్‌ కొడుకుగా వేసిన చలానికి ఇది మొదటి సినిమా. ఈ సినిమా తెలుగు, తమిళాలలో పూర్తిగా గాని, పాటలు కానీ యూ ట్యూబ్‌ లో దొరకడం లేదు. అంత చిన్న వయసులో ఎన్‌ టి ఆర్‌ నడి వయసు పాత్ర ఎలా వేసారో చూడాలి. ముఖ పుస్తక మిత్రులెవరిదగ్గరైనా వీడియో ఉంటే కామెంట్లలో పంచుకోగలరు. ఎన్‌ టి ఆర్‌ కు పిఠాపురం పాడటం ఒక విశేషం. ఈ చిత్రానికి నిర్మాత: సి.లక్ష్మీరాజ్యం, దర్శకుడు: సి.వి.రంగనాథదాస్‌, పర్యవేక్షణ: ఎల్వీ ప్రసాద్‌, కథ, మాటలు: వెంపటి సదాశివబ్రహ్మం, పాటలు: ఆచార్య ఆత్రేయ, ఛాయాగ్రహణం : ఎం.ఎ.రహమాన్‌, ఎన్‌.సి.బాలకృష్ణన్‌, మారి, శబ్దగ్రహణం: రంగస్వామి, ఎడిటర్‌: మాణిక్యం, కళ: టి.వి.ఎస్‌.శర్మ, సంగీతం: సి.ఆర్‌.సుబ్బురామన్‌, సుసర్ల దక్షిణామూర్తి, నేపథ్యగానం: పి.లీల, జిక్కి, పిఠాపురం నాగేశ్వరరావు, సంగీతం : సి.ఆర్‌. సుబ్బరామన్‌, సుసర్ల దక్షిణామూర్తి. 

5 లక్షలకు సింగర్‌ నేహా కక్కర్‌ మోసం... ఆమెకు సంబంధం లేదట!

Publish Date:Nov 10, 2025

మోసాలు పలు రకాలు. ఒకప్పుడు ఒకరిని మోసం చెయ్యాలంటే దానికి ఎంతో ప్రాసెస్‌ ఉండేది. దాని కోసం ఎన్నో రోజులు కేటాయించాల్సి వచ్చేది. కానీ, కాలం మారింది. దానితోపాటే టెక్నాలజీ మారింది. దాంతో మోసం చేసే తీరు కూడా మారింది. ఈమధ్యకాలంలో ఎవరూ ఊహించని విధంగా సైబర్‌ మోసాలు జరుగుతున్నాయి. ఇలా కూడా మోసం చేస్తారా అనే రేంజ్‌ అవి ఉంటున్నాయి. తాజాగా అలాంటి ఓ మోసం వెలుగులోకి వచ్చింది.  ముంబై వేదికగా జరిగిన ఈ మోసంలో బాలీవుడ్‌ టాప్‌ సింగర్‌ నేహా కక్కర్‌ పేరు ప్రధానంగా వినిపించింది. అయితే ఈ కేసుతో ఆమెకు ఎలాంటి సంబంధం లేకపోయినా పేరు మాత్రం ఆమెదే ఉంది. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని వర్లి ప్రాంతానికి చెందిన మహిళా న్యాయవాది షబ్నం మహమ్మద్‌ హుసేస్‌ సయ్యద్‌ ఈ మోసానికి బలయ్యారు. బాలీవుడ్‌ సింగర్‌ నేహా కక్కర్‌ ఒక ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌ అని తెలిపే వీడియోలు, కథనాలను చూశారు షబ్మమ్‌. వాటిని ఆమె నమ్మారు. ఇది 2025 జూన్‌లో జరిగింది. జూన్‌ 18 నుండి అక్టోబర్‌ 9, 2025 వరకు మొత్తం రూ. 5 లక్షల మొత్తాన్ని ఫోన్‌ పే ద్వారా పలు ఎకౌంట్స్‌కి ట్రాన్స్‌ఫర్‌ చేశారు షబ్నమ్‌.  ఆ తర్వాత ఆ కంపెనీ నుంచి ఎటువంటి అప్‌డేట్‌ రాకపోవడంతో తను మోసపోయినట్టు గ్రహించారు షబ్నమ్‌. దాంతో వర్లి పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐటీ చట్టం మరియు భారత శిక్షాస్మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీన్నిబట్టి సైబర్‌ మోసగాళ్ళు ఎంత తెలివిగా అమాయకుల్ని వల్లో వేసుకొని డబ్బు దండుకుంటున్నారో అర్థమవుతుంది. ఒక సెలబ్రిటీ పేరును వాడుకొని ఈ విధమైన మోసం చేయడంతో బాలీవుడ్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 

చైతన్య మాష్టర్ కి 5 లక్షలు ఇచ్చా సినిమా కార్డు కోసం....

Publish Date:Nov 11, 2025

ఢీ 10 రాజు అంటే ఢీ షోలో ఫుల్ ఫేమస్ అలాంటి రాజు ఈ సీజన్ లో పండు, అభి మాష్టర్స్ తో పోటాపోటీగా డాన్స్ చేస్తున్నాడు. ఐతే ఒక ఇంటర్వ్యూలో తన కష్టాలను ఇలా చెప్పుకొచ్చాడు. "చైతన్య మాష్టర్ కి 5 లక్షలు ఇచ్చాను. ఆయన యూనియన్ లో ఇంకో మాష్టర్ కి ఇచ్చారు. నాకు కార్డు కోసం అని. ఆ డబ్బులు ఏమయ్యాయో తెలీదు. ఇచ్చి కూడా నాలుగేళ్లు ఐపోయింది. నాకు ఇంకా కార్డ్ కూడా రాలేదు. ఆయన డబ్బులు ఎవరికీ ఇచ్చారో తెలీదు. కార్డు లేకుండా కోరియోగ్రఫీ చేయలేను. చాలా మూవీ ఆఫర్స్ వచ్చి వెనక్కి వెళ్లిపోయాయి. ఇప్పుడు మూవీ కార్డు తీసుకోవాలంటే 6 లక్షలు కట్టాలి. నాకు ఆస్తులేమీ లేవు. అప్పట్లో రెండు ఇల్లు, అమ్మ వాళ్ళ ఊరిలో తోటలు ఉన్నాయి. డాడీ మొత్తం అమ్మేశారు. నాకంటూ ఇప్పుడు ఏమీ లేదు. పేరు ఉంది కానీ డబ్బులు లేవు. ఫామిలీని నేనే చూసుకోవాలి కాబట్టి డబ్బులు ఎన్ని వచ్చినా ఐపోతున్నాయి. కార్డు వస్తుంది అని ఆశలు పెట్టుకున్నా. కానీ డబ్బుదేముంది ఇప్పుడు మనిషే పోయాడు కదా అని బాధగా ఉంది. అలాగే నా లైఫ్ లో ఇంకో కష్టం ఉంది. రెంట్ కోసం తిరుగుతున్నప్పుడు ఎక్కడికెళ్లినా డాన్సర్ అంటే రెంట్ కి ఇవ్వము అని చెప్పేవాళ్ళు. దాంతో నాకు కోపం వచ్చి డైరెక్ట్ విల్లా దగ్గరకు వెళ్లి రెంట్ అడిగితె నెలకు 60 వేలు అన్నారు. ఎం చేస్తావని అడిగితె డాన్సర్ అని చెప్పాను. ఐతే సాఫ్ట్ వేర్ వాళ్లకు తప్ప డాన్సర్స్ కి ఇవ్వము అని చెప్పారు. 70 వేలైనా రెంట్ ఇస్తాను అన్నాను. కానీ ఇవ్వము అని చెప్పారు. త్వరలో సొంత ఇల్లు ఎలాగైనా కొనుక్కోవాలి" అని చెప్పాడు ఢీ 10 రాజు.

Nazeeruddin Shaik wins aha Telugu Indian Idol 3

Publish Date:Sep 23, 2024

In a thrilling grand finale streamed on aha OTT, 19-year-old Nazeeruddin Shaik from Andhra Pradesh emerged victorious as the winner of aha Telugu Indian Idol Season 3. His captivating performances throughout the competition earned him both the prestigious title and a cash prize of Rs. 10 lakh. Recently clearing his CA intermediate examinations, Nazeeruddin also received the exciting opportunity to lend his voice to the highly anticipated upcoming film starring Pawan Kalyan, OG. His remarkable journey to victory was characterised by consistent excellence, which endeared him to both the audience and the judges. Anirudh Suswaram secured second place, winning Rs. 3 lakh, while GV Shri Kerthi claimed third place with a prize of Rs. 2 lakh. The show, which concluded after nearly 26 weeks of fierce competition, was judged by the esteemed Thaman S, Geetha Madhuri, and Karthik, all of whom noted that this season showcased extraordinary talent. Judge Geetha Madhuri said, "aha Telugu Indian Idol Season 3 was an incredible experience filled with talented contestants. It truly felt like a celebration of music. Choosing the finalists was extremely challenging, and every elimination was painful." Nazeeruddin was born on November 2, 2004, in Tadepalligudem to Shaik Baji, a motor mechanic, and Madeena Beebi, who passed away a year ago. His sister, Vahida Rehman, has stepped in to support him after their mother's passing. He completed his schooling at Vignana Vikas E.M School and continued his education at GSR E.M School. He pursued his Junior College and CA Intermediate at Sri Medha Commerce College in Guntur, aspiring to become a Chartered Accountant while nurturing his passion for music. Nazeeruddin's musical journey has been profoundly shaped by his maternal grandparents, Kasim Saheb and Fatima Bee. His maternal grandmother, a Carnatic music guru, played a pivotal role in cultivating his talent. Growing up listening to the iconic songs of Ghantasala ignited his dedication to music. Reflecting on his victory, Nazeeruddin shared, "My journey with music began when I was just four years old. It was my grandfather, Kasim garu, and his sister whom I affectionately call Nani, who introduced me to this world. She enrolled me in Carnatic music lessons, while my grandfather taught me the nuances of cinematic music. Having sung for Ghantasala garu, his admiration for him has never wavered. For 47 years, he has honored Ghantasala's memory by observing his death anniversary in our village, Tadepalligudem. Thanks to my grandfather's efforts, a statue of Ghantasala garu stands in our village." "Winning the title of Telugu Indian Idol Season 3 is a key milestone for me. Performing in front of Thaman sir, Geetha Madhuri ma’am, and Karthik sir was an honor. Their feedback, along with lessons from my fellow contestants, has shaped my growth as a singer. Moving forward, I aim to be a leading musician in the industry while pursuing a career in finance, " he added. The competition began with over 15,000 aspiring singers, showcasing immense talent throughout the season. Initial auditions took place on May 4, 2024, in New Jersey and Hyderabad. The top 12 finalists included Bharat Raj, Keerthana, Keshav Ram, Hari Priya, GV Shri Kerthi, Nazeeruddin, Skanda, Duvvuri Sridhruthi, Rajani Sree, Sai Vallabha, Khushal Sharma, and Anirudh Suswaram. After rigorous eliminations and public voting across 28 episodes, the competition culminated in a final showdown featuring the top five contestants: Anirudh Suswaram, Skanda, Keerthana, Sri Keerthi, and Nazeeruddin. The finalists dazzled in vibrant attire during the blockbuster finale, which included special performances from the judges and contestants. Judge Geetha Madhuri, in a striking red outfit, captivated the audience with her exceptional performance. The Judges Thaman and Karthik also presented outstanding performances during the blockbuster finale episode. The blockbuster finale, streamed on September 20-21, 2024, celebrated the remarkable journeys of these talented singers. If you missed the thrilling finale episode, catch it now only on aha.

మహేష్ డైరెక్టర్ తో సూర్య మూవీ.. దిల్ రాజు డేరింగ్ స్టెప్!

Publish Date:Oct 30, 2025

  మరో తెలుగు దర్శకుడితో సూర్య మూవీ మహేష్ డైరెక్టర్ కి ఓకే చెప్పిన తమిళ హీరో! దిల్ రాజు నిర్మాణం..?   కోలీవుడ్ హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. విజయ్ 'వారసుడు' చేయగా, ధనుష్ 'సార్, కుబేర' సినిమాలు చేశాడు. ఇక ఇప్పుడు సూర్య వంతు వచ్చింది. ఇప్పటికే వెంకీ అట్లూరితో ఓ మూవీ చేస్తున్న సూర్య.. మరో తెలుగు దర్శకుడితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. (Suriya)   సాలిడ్ కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న తమిళ హీరో సూర్య.. తన 45వ సినిమా 'కరుప్పు'ని ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో చేస్తున్నాడు. అలాగే తన 46వ సినిమా కోసం తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో చేతులు కలిపాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక ఇప్పుడు సూర్య మరో తెలుగు దర్శకుడితో చేతులు కలబోతున్నట్లు సమాచారం.   Also Read: రష్మిక సినిమాలో సందీప్ రెడ్డి.. ఆడియెన్స్ నవ్వుతారు!   సోలో, గీత గోవిందం వంటి సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు పరశురామ్.. కొంతకాలంగా హీరోల వేటలో ఉన్నాడు. మహేష్ బాబుతో చేసిన 'సర్కారు వారి పాట' పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. విజయ్ దేవరకొండతో చేసిన 'ది ఫ్యామిలీ స్టార్' నిరాశపరిచింది. వీటికి తోడు, రకరకాల కారణాల వల్ల తెలుగు హీరోలు పరశురామ్ కి అందుబాటులో లేకుండా పోయారు. దీంతో తమిళ హీరో కార్తీతో ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కించడానికి ప్రయత్నించాడు. ఎందుకనో అది వర్కౌట్ కాలేదు. అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా కార్తీ సోదరుడు సూర్యతో మూవీ చేసే అవకాశం దక్కించుకున్నాడన్న వార్త ఆసక్తికరంగా మారింది.   పరశురామ్ చెప్పిన కథకు సూర్య ఇంప్రెస్ అయ్యాడట. ఈ ప్రాజెక్ట్ ని దిల్ రాజు నిర్మించనున్నాడని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని వార్తలొస్తున్నాయి.  

After NTR even Aamir shelves Dadasaheb Phalke biopic

Publish Date:Nov 11, 2025

NTR and Aamir Khan have been at a race to star in the biopic of Father of Indian Cinema, Dadasaheb Phalke. The news reports have suggested that SS Rajamouli is going to produce the film with NTR while Rajkumar Hirani will direct Aamir Khan's version. Recently, NTR has dropped out of the project.  While his close sources have denied that NTR even considered to be part of the biopic, the recent reports have given his fans a sigh of relief. They did not want their action hero to play such a period film, at this juncture. Now, reports suggest that Aamir Khan and Rajkumar Hirani have decided to shelve their project.  Close sources have revealed that the actor did not feel the movie could live up to expectations risen by their union after films like 3 Idiots and PK. He felt that any other script would do justice rather than this one. Even Hirani agreed and started working on his next without Aamir in consideration.  Aamir Khan is busy finalising his next film script and he is apparently hearing to 25 scripts and he might announce his next in a couple of months. For now, Dadasaheb Phalke biopic is not happening in any language of Indian Cinema.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

కృష్ణలీల

Publish Date:Nov 7, 2025

జటాధర

Publish Date:Nov 7, 2025

ఆర్యన్

Publish Date:Nov 7, 2025

The Girl Friend

Publish Date:Nov 7, 2025

The Great Pre-Wedding Show

Publish Date:Nov 7, 2025

Jatadhara

Publish Date:Nov 7, 2025

Aaryan

Publish Date:Nov 7, 2025

Mass Jathara

Publish Date:Oct 31, 2025