బెల్ షేప్ నుండి యాపిల్ షేప్ వరకు.. శరీర ఆకృతికి సరైన చీరను ఎలా ఎంచుకోవాలో తెలుసా!

Publish Date:Jun 18, 2026

బెల్ షేప్ నుండి యాపిల్ షేప్ వరకు.. శరీర ఆకృతికి సరైన చీరను ఎలా ఎంచుకోవాలో తెలుసా! చీర కట్టు మహిళలను ఎంతో హుందాగా చూపిస్తాయి.  ముఖ్యంగా భారతీయుల చీరకట్టు విదేశీయులను సైతం మెప్పిస్తుంది. మిగతా డ్రస్సుల లాగా చీరలను పెద్దగా ఎంచుకోవాల్సిన అవసరం లేదని,  ఏ చీర అయినా బాగుంటుందని అనుకుంటారు. కానీ శరీర ఆకృతికి తగ్గట్టు కూడా చీర ఎంచుకోవడం ముఖ్యమని అంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. కొందరు ఆన్‌లైన్‌లో చూసి  అందమైన చీరలు కొంటూ ఉంటారు.  కానీ కొన్నిసార్లు అది మోడల్ ధరించిన దానిలా  కనిపించదు. ఆ చీర మనకు బాగా కనిపించడం లేదని చాలా మంది అనుకుంటారు. కానీ  చీర ఫ్యాబ్రిక్,   దానిని ధరించే విధానం. కట్టుకునే శైలి బాగా కనిపించేలా చేస్తాయట.  శరీరం A లైన్ లో,  BELL షేప్ లో.. APPLE షేప్ లో.. ఇలా చాలా రకాల షేప్ లలో ఉంటుంది. శరీర ఆకృతికి తగినట్టు చీర ఫ్యాబ్రిక్,  చీర కట్టుకునే విధానం ఉండాలని చెబుతారు, దీన్ని ఎలా ఎంచుకోవాలో తెలుసుకుంటే.. బెల్ షేప్.. శరీరాకృతి గంట ఆకారంలో ఉంటే, అంటే  భుజాలు, తుంటి దాదాపు సమానంగా ఉండి, నడుము స్పష్టంగా కనిపిస్తే, షిఫాన్, జార్జెట్, క్రేప్ మరియు తేలికపాటి శాటిన్ వంటి వదులుగా ఉండే వస్త్రాలు బాగా సరిపోతాయి. ఈ వస్త్రాలు మీ శరీరం యొక్క సహజ వంపులను అందంగా కనిపించేలా చేస్తాయి. పియర్ షేప్.. పియర్ ఆకారపు శరీరానికి పైభాగం సాపేక్షంగా పొట్టిగా, తుంటి వెడల్పుగా ఉంటుంది. జార్జెట్, షిఫాన్ మరియు మృదువైన మైసూర్ సిల్క్ వంటి చీరలను ఇాలాంటి షేప్ ఉన్నవారు ఎంచుకోవాలి.  మందపాటి పల్లు, జరీ వర్క్ లేదా ప్రస్ఫుటమైన ప్రింట్లు పైభాగానికి మరింత బాలెన్స్డ్  రూపాన్ని ఇవ్వడానికి సహాయపడతాయి. ఆపిల్ షేప్.. ఆపిల్ ఆకారపు శరీరం ఉన్న మహిళలకు నడుము భాగం , వక్షోజాలు నిండుగా ఉంటాయి. మృదువైన టస్సర్ సిల్క్, తేలికైన కంజీవరం మరియు క్రేప్ వస్త్రాలు వారికి మంచి ఎంపికలు. పల్లును తెరిచి ఉంచడం వల్ల శరీరాకృతి పొడవుగా , మరింత సమతుల్యంగా కనిపిస్తుంది. అథ్లెటిక్ షేప్..  నడుము, ఛాతీ , తుంటి వెడల్పు సుమారుగా సమానంగా ఉంటే దాన్ని అథ్లెటిక్ షేప్ లేదా రెక్టాంగిల్ షేప్ అని అంటారు.  ఇలాంటివారు ఆర్గాంజా, టిష్యూ సిల్క్, లినెన్ , బనారసి బ్రోకేడ్ వంటి చీరలను ధరించవచ్చు. ఈ వస్త్రాలు అదనపు వాల్యూమ్‌ను సృష్టించి, వంపులు ఉన్నట్లుగా కనిపించేలా చేస్తాయి. V-షేప్.. తలక్రిందుల త్రిభుజాకార శరీర ఆకృతికి వెడల్పాటి భుజాలు , సాపేక్షంగా సన్నని తుంటి ఉంటాయి. బనారసి సిల్క్, రా సిల్క్ , స్ట్రక్చర్డ్ కంజీవరం చీరలు ఈ శరీర ఆకృతికి ఖచ్చితంగా సరిపోతాయి. స్ట్రెయిట్ పల్లు స్టైల్ నడుము కింది భాగాన్ని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. ఇది ముఖ్యం.. చీర అందం కేవలం దాని డిజైన్‌లోనే కాదు, అది  శరీరాకృతికి ఎంత చక్కగా సరిపోతుందనే దానిలో కూడా ఉంటుంది. సరైన వస్త్రాన్ని, కట్టుకునే శైలిని ఎంచుకోవడం ద్వారా,  ఏ చీరలోనైనా ఆకర్షణీయంగా, ఆత్మవిశ్వాసంతో కనిపించవచ్చు.                                    *రూపశ్రీ
[

Beauty

]

చర్మం మీద ముడతలు తగ్గాలంటే.. ఉదయాన్నే ఈ ఒక్క టిప్ ఫాలో అయిపోండి..!

Publish Date:Jul 2, 2026

 చర్మం మీద ముడతలు తగ్గాలంటే.. ఉదయాన్నే ఈ ఒక్క టిప్ ఫాలో అయిపోండి..! ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కాంతివంతమైన, మచ్చలేని చర్మాన్ని కోరుకుంటున్నారు.ముఖ్యంగా అమ్మాయిలకు మచ్చలేని, కాంతివంతమైన చర్మం కావాలని చాలా కోరికగా ఉంటుంది.  దీనిని సాధించడానికి, ఇందుకోసం అమ్మాయిలు  మార్కెట్లో దొరికే చాలా రకాల రసాయన ఉత్పత్తులను ప్రయోగిస్తుంటారు. అయితే  ఈ  రసాయన ఉత్పత్తులను  పూసిన తర్వాత కూడా ఎటువంటి  మార్పు కనిపించదు,  పైగా కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల చర్మం మరింత దారుణంగా కూడా మారుతుంది.కానీ కొన్ని ఇంటి చిట్కాలతో ముఖ చర్మాన్ని చాలా కాంతివంతంగా మార్చుకోవచ్చు.  ఉదయాన్నే కొన్ని టిప్స్ పాటిస్తే ఇది సాధ్యమవుతుంది. ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే.. మీరు ఉదయం నిద్రలేవగానే ఈ సులభమైన ఐస్ ప్యాక్‌ను మీ ముఖానికి పెట్టుకోవచ్చు. ఈ చిట్కా మీ ముఖానికి కాంతినిస్తుంది. ఇది సన్నని గీతలను కూడా తగ్గించవచ్చు. మెరిసే చర్మం కోస ఇంట్లోనే పాటించాల్సిన చిట్కా.. మెరిసే చర్మం కోసం ఉదయం నిద్రలేవగానే  ఒక గిన్నె తీసుకుని, దానిలో ఐస్ క్యూబ్స్ ను వేయాలి. అందులో నీటిని కూడా వేయాలి. తర్వాత ముఖాన్ని ఆ చల్లని నీటిలో ముంచాలి. ఈ చిట్కా  ముఖానికి మెరుపును తెస్తుంది. ప్రయోజనాలు..  ఉదయం కనీసం 15 నుండి 20 సార్లు ఈ నీటిలో  ముఖాన్ని ముంచాలి. చల్లటి నీటిలో ముఖాన్ని ముంచడం వల్ల  చర్మ రంధ్రాలు కుంచించుకుపోయి, చర్మం బిగువుగా మారుతుంది. చల్లటి నీటికి గురికావడం వల్ల ఉబ్బు , సన్నని గీతలు తగ్గుతాయి. 25 ఏళ్ల తర్వాత ముఖంపై సన్నని గీతలు కనిపిస్తాయి కాబట్టి, ఈ చికిత్స 25 ఏళ్లు పైబడిన మహిళలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ చికిత్స చిన్న పిల్లలకు తగినది కాదు. ఐస్ వాటర్ థెరపీ ముఖంపై అధిక నూనెను నియంత్రించడంలో సహాయపడుతుంది. తక్షణ మెరుపు కోసం ఐస్ వాటర్ థెరపీని ప్రయత్నించవచ్చు.                              *రూపశ్రీ.
[

Health

]

చాక్లెట్ తినడం వల్ల మహిళల పీరియడ్ పెయిన్ తగ్గుతుందా.. అసలు నిజమేంటంటే!

Publish Date:Jul 4, 2026

చాక్లెట్ తినడం వల్ల మహిళల పీరియడ్ పెయిన్ తగ్గుతుందా.. అసలు నిజమేంటంటే! ఒక వయసు వచ్చాక ప్రతి ఆడపిల్లకు, మహిళకు నెలసరి రావడం చాలా సహజం. ఇది ప్రకృతి సిద్దంగా జరిగిపోయే చర్య. అయితే మహిళల నెలసరిలో చాలా మంది కడుపు నొప్పి, పొత్తి కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం  నడుము నొప్పి,  తలనొప్పి  వంటి సమస్యలు ఎదుర్కుంటూ ఉంటారు.  అయితే చాలా మంది మహిళలు తమ పీరియడ్స్ సమయంలో చాక్లెట్ తినడానికి ఇష్టపడతారు.  చాక్లెట్ తినడం వల్ల నెలసరి  నెప్పి తగ్గుతుందని అంటుంటారు. ఇందులో నిజమెంత అనేది చాలామందికి తెలియదు.  అసలు పీరియడ్స్ టైంలో చాక్లెట్ తినడం వల్ల పీరియడ్స్ పెయిన్ నిజంగా తగ్గుతుందా? దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. పీరియడ్స్ సమయంలో చాక్లెట్.. పీరియడ్స్ సమయంలో చాక్లెట్ తినడం చాలామందికి మంచి ఉపశమనంలా అనిపిస్తుంది. ఎందుకంటే చాక్లెట్ లో మెగ్నీషియం ఉంటుంది. ఇది గర్భాశయ కండరాలను సడలించడానికి సహాయపడుతుంది. చాక్లెట్ తినడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి.  ఇవి నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. అందుకే పీరియడ్స్ సమయంలో చాక్లెట్ తింటే నెలసరి నొప్పి నుండి కాస్త ఉపశమనం గా అనిపిస్తుంది. చాక్లెట్ తినడం వల్ల సెరటోనిన్ పెరుగుతుంది.  సెరోటోనిన్ అనేది హ్యాపీ హార్మోన్..  చాక్లెట్ తిన్నప్పుడు ఈ హ్యాపీ హార్మోన్ అనేది పెరగడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే మూడ్ స్వింగ్స్,  చిరాకు,  అలసట, నీరసం వంటివి తగ్గుతాయి.  పీరియడ్స్ సమయంలో కూడా శరీరం చురుగ్గా ఉంటుంది. డార్క్ చాక్లెట్‌లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి, ఇవి నొప్పిని తగ్గించడంలో  కాస్త సహాయపడతాయి. ఏ చాక్లెట్ తినడం మంచిది? 70% లేదా అంతకంటే ఎక్కువ కోకో ఉన్న డార్క్ చాక్లెట్   తినడం మంచిది.  ఎక్కువ చక్కెర ఉన్న మిల్క్ చాక్లెట్‌లో కోకో తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రయోజనం కూడా తక్కువగా ఉండొచ్చు. అధికంగా చాక్లెట్ తింటే చక్కెర, కేలరీలు ఎక్కువగా తీసుకున్నట్లవుతుంది. ఇది బరువు పెరగడానికి,  డయాబెటిస్ రావడానికి కూడా కారణం అవుతుంది. ఎంత మోతాదులో తినాలి? రోజుకు సుమారు 20–30 గ్రాముల డార్క్ చాక్లెట్ చాలామందికి సరిపోతుంది. దీన్ని సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిది. దీని కంటే ఎక్కువ చాక్లెట్ తినకూడదు.                               *రూపశ్రీ.

ప్రెగ్నెన్సీ వచ్చిన మొదట్లో బొప్పాయి, పైనాపిల్ తింటే అబార్షన్ ఎందుకు అవుతుందో తెలుసా!

Publish Date:Jun 27, 2026

ప్రెగ్నెన్సీ వచ్చిన మొదట్లో బొప్పాయి, పైనాపిల్ తింటే అబార్షన్ ఎందుకు అవుతుందో తెలుసా! గర్భం దాల్చడం అనేది వివాహం అయిన ప్రతి మహిళ కల.  తల్లిని కావాలని, మాతృత్వాన్ని ఆస్వాదించాలని మహిళలు ఎన్నో కలలు కంటారు. గర్బం దాల్చిన తర్వాత కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మహిళలు గర్బం దాల్చిన తర్వాత కొన్ని ఆహారాలు తినకూడదని చెబుతుంటారు. వాటిలో బొప్పాయి,  పైనాపిల్ కూడా ఉంటాయి. మరీ ముఖ్యంగా గర్బం దాల్చిన మొదటి నెలల్లో పైనాపిల్, బొప్పాయి తినకూడదని, ఒకవేళ అవి తింటే అబార్షన్ లు అవుతాయని చెబుతారు.  ఇలా ఎందుకు జరుగుతుందనే విషయం చాలా మందికి తెలియదు. దీని గురించి వివరంగా తెలుుకుంటే.. బొప్పాయి ఇలా ఉంటే తినకూడదు.. పచ్చిగా లేదా సగం పండిన బొప్పాయి తినడం మంచిది కాదు. పచ్చి బొప్పాయిలో లేటెక్స్ , పాపైన్ వంటి సమ్మేళనాలు అధిక మొత్తంలో ఉంటాయి. కొన్ని పరిశోధనలు , ప్రయోగశాల అధ్యయనాలు ఈ సమ్మేళనాలు గర్భాశయాన్ని ఉత్తేజపరుస్తాయని ఫలితాలు ఇచ్చాయి.  ఈ కారణంగా  గర్భధారణ సమయంలో పచ్చి బొప్పాయి, లేదా సగం పండిన బొప్పాయి ప్రమాదకరమైనవిగా పరిగణించబడతాయి. ఈ సమ్మేళనాలు గర్భాశయ సంకోచాలను పెంచుతాయని చెబుతారు, అందువల్ల, గర్భం దాల్చిన తొలినాళ్లలో పచ్చి బొప్పాయిని తినకుండా ఉండమని సలహా ఇస్తారు. ఈ కారణంగానే పచ్చి లేదా ఆకుపచ్చ బొప్పాయిని గర్భిణీ స్త్రీలకు సురక్షితం కాదని చెబుతారు. పండిన బొప్పాయి.. పూర్తిగా పండిన బొప్పాయి భిన్నంగా ఉంటుంది. పండిన బొప్పాయిలో పాలు (లేటెక్స్) గణనీయంగా తగ్గి ఉంటాయి , ఇందులో విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్, ఇతర పోషకాలు కూడా ఉంటాయి. అందువల్ల, గర్భిణీ స్త్రీలు పండిన బొప్పాయిని మితంగా తీసుకోవడం ప్రమాదకరం కాదని కొంతమంది నిపుణులు చెబుతారు. అయితే వీటి గురించి పరిశోధకులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు  అందుకే పండిన బొప్పాయి అయినా చాలా మితంగా తీసుకోవడం మంచిదని చెబుతారు. పైనాపిల్.. పైనాపిల్ తింటే గర్భస్రావం అవుతుందనే మాటలు  తరచుగా చెబుతుంటారు. పైనాపిల్‌లో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ దీనికి కారణం. ఇది గర్భాశయ ముఖద్వారాన్ని మృదువుగా చేసి, గర్భాశయంపై ప్రభావం చూపుతుందని చెబుతారు. అయితే, మితమైన మోతాదులో పైనాపిల్ తినడం వల్ల గర్భస్రావం జరుగుతుందనడానికి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. దీనిని అధిక మోతాదులో తీసుకున్నప్పుడు లేదా శరీరం ఇప్పటికే సెన్సిటివ్ గా ఉన్నప్పుడు  సమస్యలు తలెత్తుతాయని చెబుతారు. అందుకే గర్భధారణ తొలినాళ్లలో బొప్పాయి, పైనాపిల్‌లను తినకూడదని, వీటి విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని చెబుతారు.  ముఖ్యంగా మహిళలకు గర్బం విషయంలో ప్రమాదాలు ఉన్నా,   గతంలో గర్భస్రావం జరిగి ఉన్నా, రక్తస్రావ సమస్యలు ఉన్నా ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించమని డాక్టర్ సలహా ఇస్తారు. ముఖ్యంగా పండ్లు తినే ముందు వైద్యుల సలహా తీసుకోమని చెబుతున్నారు.                           *రూపశ్రీ.
[

Yoga

]

మైగ్రేన్ వేధిస్తోందా? ఈ ఆసనం వెయ్యండి చాలు!

Publish Date:Jun 25, 2026

మైగ్రేన్ వేధిస్తోందా? ఈ ఆసనం వెయ్యండి చాలు..! నేటికాలంలో  అనారోగ్యకరమైన జీవనశైలి , సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల చాలా మంది మైగ్రేన్‌తో బాధపడుతున్నారు. మరీ ముఖ్యంగా మహిళల్లోనే మైగ్రేన్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.   మైగ్రేన్ నొప్పి తలకు ఒక వైపున రెండు గంటల నుండి కొన్ని రోజుల వరకు ఉంటుంది. . విచారించే విషయం ఏమిటంటే.. మైగ్రేన్ కు ఎలాంటి మందు లేకపోవడం.  ఒకసారి మైగ్రేన్ వస్తే దానికదే తగ్గేవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కానీ మైగ్రేన్ తగ్గడానికి యోగా చక్కగా సహాయపడుతుంది.  మైగ్రేన్ ను తగ్గించుకోవడానికి ఏ ఆసనం వేయాలి? తెలుసుకుంటే.. శశాంకాసనం.. శశాంకాసన యోగా మనస్సును ప్రశాంతపరచడానికి సహాయపడుతుంది. ఈ ఆసనం ఒత్తిడిని, మానసిక అలసటను తగ్గించగలదు. ఈ యోగాసనాన్ని రోజూ సాధన చేయడం వల్ల మైగ్రేన్ నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. శశాంకాసనం పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది, ఇది శరీరానికి విశ్రాంతినిస్తుంది. నాడీ వ్యవస్థను ప్రశాంతపరచడంలో ఈ ఆసనం ఎంతగానో సహాయపడుతుంది. ఎలా చేయాలి? మొదట వజ్రాసనంలో కూర్చోవాలి.  రెండు చేతులను తల పైకి ఎత్తి, లోతుగా శ్వాస తీసుకోవాలి.  శ్వాసను వదులుతూ నెమ్మదిగా ముందుకు వంగాలి. ఇప్పుడు, రెండు చేతులను ముందుకు చాచి, నుదుటిని నేలకు తాకించడానికి ప్రయత్నించాలి.  శరీరాన్ని పూర్తిగా విశ్రాంతిగా ఉంచుతూ సాధారణంగా శ్వాస తీసుకోవాలి. ఈ ఆసన భంగిమలో 20 నుండి 30 సెకన్ల పాటు ఉండాలి.  ఆ తరువాత తిరిగి ఇదే విధంగా కొనసాగించాలి. హస్తపాదాసనం..   హస్తపాదాసనం మెదడుకు రక్త ప్రసరణను పెంచుతుంది. ఈ యోగాసనం నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది, దీనివల్ల తలనొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.  ఎలా చేయాలి?   ఈ ఆసనం వేయడానికి, మొదట నిటారుగా నిలబడి  పాదాలను కలిపి ఉంచాలి. తరువాత లోతుగా శ్వాస తీసుకుని  చేతులను తల పైకి ఎత్తాలి. శ్వాస వదులుతూ, నడుము నుండి ముందుకు వంగి,  పాదాల పక్కన నేలపై అరచేతులను ఉంచాలి. మోకాళ్లను నిటారుగా ఉంచుతూ 20-30 సెకన్ల పాటు శ్వాస తీసుకోవాలి. పైన చెప్పుకున్న రెండు ఆసనాలు వేస్తుంటే మైగ్రేన్ సమస్య ఉన్నవారికి చాలా చక్కని ఉపశమనం లభిస్తుంది.                                *రూపశ్రీ.

పసిపిల్లల విసుగు పుట్టించే ప్రవర్తనతో విసిగిపోతున్నారా..ఈ షాకింగ్ నిజాలు తెలుసా!

Publish Date:Jul 4, 2026

పసిపిల్లల విసుగు పుట్టించే ప్రవర్తనతో విసిగిపోతున్నారా..ఈ షాకింగ్ నిజాలు తెలుసా! పిల్లలను పెంచడం ఎంత ఛాలెంజెస్ తో  కూడుకున్నదో, అంతే అందమైనది కూడా. ముఖ్యంగా ఇంట్లో పసిపిల్లలు, అంటే 1 నుండి 3 సంవత్సరాల వయస్సు గల పిల్లలు ఉన్నప్పుడు, వారి కొన్ని అలవాట్ల వల్ల తల్లిదండ్రులు తరచుగా ఇబ్బంది పడుతుంటారు. ప్రతిదానికీ 'వద్దు' అని చెప్పడం, చిన్న విషయాలకే ఏడవడం లేదా కోపగించుకోవడం, ఆహారాన్ని పారేయడం వంటి పనులు చేస్తుంటారు. తమ పిల్లలు ఇలా ఎందుకు చేస్తున్నారని తల్లిదండ్రులను ఆలోచించేలా చేస్తాయి. కానీ చిన్న పిల్లల వైద్య  నిపుణులు ఈ ప్రవర్తన చాలా వరకు సాధారణమైనవేనని, ఇవి పిల్లల ఎదుగుదలలో ఒక సహజమైన భాగమని అంటున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. పిల్లలు అన్నింటికి వద్దని చెబుతుంటే.. పిల్లలు ప్రతిదానికీ 'కాదు' అని చెబితే, అది మొండితనం  లేదా పెద్దల మాట వినడం లేదని అనుకోవడం కాదని చిన్న పిల్లల వైద్యులు చెబుతున్నారు.  నిజానికి అది  పిల్లలు తమకంటూ ఒక స్వతంత్ర గుర్తింపును ఏర్పరచుకోవడం నేర్చుకుంటున్నారనడానికి ఒక సంకేతమట. ఈ వయస్సులో, పిల్లలు తమకు తమ సొంత ఇష్టాలు, అభిప్రాయాలు ఉండవచ్చని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారట. 'కాదు' అని చెప్పడమనేది వారు తమ నిర్ణయాలను వ్యక్తపరిచే ఒక మార్గంగా మారుతుందట. ఆహారాన్ని పారవేసే అలవాటు.. భోజనం చేసేటప్పుడు పిల్లలు ఆహారాన్ని విసిరేయడం చాలా మంది తల్లిదండ్రులకు ఒక పెద్ద ఆందోళన కలిగించే విషయం. ఈ అలవాటు వల్ల కచ్చితంగా  పిల్లల చుట్టూ ఉన్న ప్రాంతం అంతా చిందరవందర అవుతుంది, అయితే  ఇది పిల్లలు నేర్చుకునే దశ..   పిల్లలు ఈ విధంగా కారణం-ఫలితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారని పిల్లల వైద్యులు చెబుతున్నారు. కొన్ని సార్లు పిల్లలు ఇలా చేయడం  వారి కడుపు నిండిపోయిందని, ఇంకా తినడానికి ఇష్టపడటం లేదని సూచించే ఒక సంకేతం కావచ్చని అంటున్నారు. ఏడుపు, కోపం.. పిల్లలు చిన్న చిన్న విషయాలకే గట్టిగా ఏడవడం లేదా కోపగించుకోవడం సర్వసాధారణంగా జరుగుతుంది. కొన్నిసార్లు, వారికి ఇష్టమైనది ఏదైనా దొరక్కపోయినా లేదా ఒక చిన్న మార్పు జరిగినా వారి మూడ్ పాడవుతుంది. ఈ వయస్సులో పిల్లల మెదడులో భావోద్వేగాలను నియంత్రించే భాగం పూర్తిగా అభివృద్ధి చెందదని చిన్న పిల్లల వైద్యులు వివరిస్తున్నారు. అందువల్ల, పెద్దలకు చిన్నవిగా అనిపించే విషయాలు పిల్లలకు చాలా ముఖ్యమైనవిగా ఉండవచ్చట. చాలామంది పసిపిల్లలు ఒకే కథను పదే పదే వినాలని, ఒకే పాటను వినాలని, లేదా ప్రతిరోజూ ఒకే దినచర్యను అనుసరించాలని కోరుకుంటారు. తల్లిదండ్రులకు ఈ అలవాటు విసుగుగా అనిపించవచ్చు, కానీ పునరావృతం పిల్లలకు భద్రతా భావాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. సుపరిచితమైన విషయాలు వారికి సౌకర్యవంతంగా అనిపించేలా చేసి, అభ్యసన ప్రక్రియను బలపరుస్తాయి. బొమ్మలు షేర్ చేసుకోవడం.. ఈ వయస్సు పిల్లలలో బొమ్మలు లేదా వస్తువులను పంచుకోవడానికి అస్సలు  ఒప్పుకోరు.  గొడవ చేయడం  కూడా సర్వసాధారణం. పసిపిల్లలు సహజంగానే స్వార్థపరులుగా ఉంటారని, పంచుకోవడం గురించిన నిజమైన అవగాహన సాధారణంగా మూడు నుండి నాలుగు సంవత్సరాల వయస్సులో అభివృద్ధి చెందుతుందిని, అందువల్ల పిల్లవాడు తన బొమ్మలు, వస్తువులు  పంచుకోవడానికి ఇష్టపడకపోతే, దానిని తప్పు ప్రవర్తనగా కాకుండా వారి వయస్సుకు తగినదిగా పరిగణించాలని పిల్లల వైద్యులు చెబుతున్నారు. కాబట్టి  ఎవరైనా సరే.. పిల్లల ప్రవర్తన పైన చెప్పుకున్న విధంగా ఉంటే.. తమ పిల్లలు దురుసు ప్రవర్తనతో ఉన్నారని, వారు తప్పు చేస్తున్నారని అనుకోకుండా.. పిల్లల కోణం నుండి ఆలోచించి, అది వారి అభివృద్దికి మంచిదే అని అర్థం చేసుకోవాలి.                             *రూపశ్రీ.

ఆడపిల్లలకు మొదటిసారి బ్రా కొనేముందు ప్రతి తల్లి ఇవి గుర్తుంచుకోండి!

Publish Date:Jun 23, 2026

ఆడపిల్లలకు మొదటిసారి బ్రా కొనేముందు ప్రతి తల్లి ఇవి గుర్తుంచుకోండి! బ్రా అనేది మహిళల వస్త్రధారణలో ఒక భాగం.  ఒక వయసుకు వచ్చాక చిన్న పిల్లల నుండి పెద్దల వరకు బ్రా ధరించడం జరుగుతుంది. సాధారణంగా నేటికాలంలో ఆడపిల్లలు చిన్న వయసులోనే మెచ్యూర్ అవ్వడం,  శారీరకంగా వారు అభివృద్ది చెందడం జరుగుతోంది.  ఆడపిల్లలకు వక్షోజాలు పెరగడం మొదలయ్యాక వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని తల్లులు పిల్లలకు బ్రా వేసుకోమని సూచిస్తుంటారు. అందుకోసం బ్రా కొనుగోలు కూడా చేస్తుంటారు. అయితే పిల్లల కోసం బ్రా కొనుగోలు చేసేముందు చాలామంది తల్లులు తప్పులు చేస్తుంటారు. మరికొందరు అవగాహన లేకుండా కొంటూ ఉంటారు. మొదటి సారి బ్రా కొనుగోలు చేసేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  ఏ విషయాలు పరిగణలోకి తీసుకోవాలి?  ఆడపిల్లలు ఉన్న ప్రతి  తల్లి తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. మొదటి తప్పు.. శరీరం ఎదుగుతున్నప్పుడు చాలామంది తల్లులు తమ పాపకు బ్రా వేస్తే మంచిదని అనుకుంటారు. అయితే మొదటి సారి ఎంచుకునే బ్రా చాలా వరకు తప్పుగా ఉన్నదే ఎంచుకోవడం జరుగుతుంది.  చాలా టైట్ గా ఉన్నదో లేదా చాలా లూజ్ గా ఉన్నదో.. ప్యాబ్రిక్ పరంగా చూస్తే సౌకర్యవంతంగా లేనిదో.. ఇలా చాలా రకాలుగా మిస్టేక్స్ జరుగుతాయి. సరైన వయసు.. చాలా వరకు చిన్న పిల్లలకు బ్రా వేసే వయసు 8 నుండి 12 సంవత్సరాల మద్య ప్రారంభం అవుతుంది. అయితే కొందరికి శారీరకంగా ఎదుగుదల ఉండి 8 ఏళ్లకే వక్షోజాలు పెరిగినట్టు కనిపిస్తుంది, మరికొందరికి 12 ఏళ్లు వచ్చినా ఎదుగుదల ఉండదు.  కానీ వయసు వచ్చింది కదా అని అవసరం లేకపోయినా బ్రా వేయడం తప్పు.. సరైన ఎంపిక లేకపోతే ఏం జరుగుతుంది? ఆడపిల్లలకు బ్రా వేయడం మంచిదే.. కానీ ఎంచుకునే బ్రా సరిగా లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది. పిల్లలది ఎదిగే వయసు కావడంతో కాలంతో పాటు వక్షోజాల పరిమాణం కూడా పెరుగుతూ ఉంటుంది. మధ్యతరగతి కుటుంబాలలో చాలామంది మహిళలు పిల్లలు పెద్దగా అవుతారు కదా అని లూజ్ గా, పొడవుగా ఉన్న  దుస్తులు కొంటారు. కానీ బ్రా మాత్రం అలా లూజ్ గా ఉన్నవి కొనకూడదు.  లూజ్ గా ఉన్ బ్రా ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. బాగా టైట్ గా ఉన్న బ్రా ధరించడం వల్ల పిల్లలకు చాలా అసౌకర్యంగా ఉంటుంది.  పెరిగే వయసు కాబట్టి వక్షోజాల పెరుగుదలకు ఆటంకం కలగడం,  వక్షోజాల్లో నొప్పి వంటివి ఎదురవుతాయి. బ్రా రకం.. పిల్లల కోసం ఎంచుకునే బ్రా రకం కూడా చాలా ముఖ్యం.పెద్దవాళ్లు ఎంచుకున్నట్టు బ్రాను ఎంపిక చేయకూడదు.  బనియన్ టైప్ లో ఉన్న బ్రా లేదా స్పోర్ట్స్ బ్రా లాంటివి పిల్లలకు బాగుంటాయి. ప్యాబ్రిక్.. పిల్లల కోసం ఎంచుకునే బ్రా ఫ్యాబ్రిక్ కూడా చాలా ముఖ్యం.  క్లాత్ బాగా స్మూత్ గా ఉండాలి,  స్కూల్ యూనిఫార్మ్ లేదా డ్రస్ మీద అసలు కనిపించనట్టు ఉండాలి,  పెద్దవాళ్ల లాగా రఫ్ గా ఉన్నవి ఎంచుకోకూడదు.  మరీ ముఖ్యంగా పెద్దవాళ్లు వేసుకున్నట్టు కప్ బ్రా లు పిల్లల కోసం అస్సలు ఎంపిక చేయకూడదు. వక్షోజాల నిపుల్స్ కు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండేలాగా బ్రా ఎంపిక ఉండాలి. బలవంతం వద్దు.. వయసు పెరుగుతోంది కాబట్టి బ్రా ఖచ్చితంగా వేసుకోవాలి అని పిల్లలను బలవంతం చేయకూడదు. దాని బదులుగా పిల్లలకు బ్రా వేుకోవడం ఎంత ముఖ్యం, అది ఎంత సౌకర్యంగా ఉంటుంది అనే విషయం అర్థమయ్యేలా చెప్పాలి. పిల్లలు స్కూల్ కు వెళ్లడం రావడం మాత్రమే కాకుండా, ఆటలు ఆడేటప్పుడు, పరిగెత్తేటప్పుడు.. ఇలా వారికి బ్రా ఉండటం వల్ల ఎలాంటి సౌకర్యం ఉంటుందో అర్థమయ్యేలా చెప్పాలి. బ్రా వేసుకోవడానికి పిల్లలను మానసికంగా సిద్దం చేసిన తర్వాతే  బ్రా కొనుగోలు చేయడం,  పిల్లలకు వేయడం చేయాలి. ఇలా చేస్తే ఎంతో సున్నితమైన విషయాన్ని కూడా పిల్లలు చాలా బాగా అర్థం చేసుకుంటారు.                                     *రూపశ్రీ.

Makara Sankranthi Special Muggulu

Publish Date:Jan 14, 2026

 

Pongal Muggulu

Publish Date:Jan 13, 2025