English | Telugu

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన జబర్దస్త్ వినోద్

జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ బుల్లితెరకు పరిచయమయ్యారు. ఈ షో ద్వారా మంచి సక్సెస్ అందుకుని సినిమాల్లో చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే హోస్ట్ గా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ఈ జబర్దస్త్ షో స్టేజి ద్వారా పరిచయమైన ఒక కమెడియన్ వినోద్. లేడీ గెటప్స్ తో ప్రేక్షకులను మెస్మోరైజ్ చేసాడు. శారీ కట్టి స్కిట్ చేస్తే చాలు అచ్చంగా అమ్మాయేనా అన్నట్టుంటాడు. ఐతే ఇప్పుడు లేటెస్ట్ అప్ డేట్ ఏమిటి అంటే వినోద్ తండ్రి అయ్యాడు. ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చాడు. వినోద్ కన్నా కూడా వినోదినిగా చాలా ఫేమస్ అయ్యాడు.

జ‌గ‌తికి దండం పెట్టిన రిషీ

గుప్పెడంత మ‌న‌సు ఈ రోజు ఎపిసోడ్ లో రిషి క్లాస్ చెబుతూ వుండ‌గా అక్క‌డికి వ‌సుధార వ‌స్తుంది. లోప‌లికి రావ‌చ్చా స‌ర్ అని ప‌ర్మీష‌న్ అడుగుతుంది. వ‌సుపై కోపంతో బోర్డ్ పై చాక్ సీస్‌ని న‌లిపేసిన రిషీ స్టూడెంట్స్ కి ఒక లెక్క ఇచ్చి దాన్ని సాల్వ్ చేయ‌బ‌ని చెబుతాడు. త‌న‌పై రిషీకి ఇంకా కోపం పోలేద‌ని గ్ర‌హించిన వ‌సుధార అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది. అదే స‌మ‌యంలో రిషి బాధ‌ప‌డుతూ వెళ్లి వ‌సు కూర్చునే ప్లేస్ లో కూర్చుని త‌న‌తో మాట్లాడిన‌ట్టుగా భ్ర‌మ‌ప‌డ‌తాడు. క‌ట్ చేస్తే జ‌గ‌తి జ‌రిగిన విష‌యం గురించి మ‌హేంద్ర‌కు వివ‌రించ‌డంతో త‌ను షాక్ కు గుర‌వుతాడు.

అభిమన్యు చేతిలో యశ్ ఓటమికి వేద కారణమా ?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా సాగుతున్న ఈ సీరియ‌ల్ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ దూసుకుపోతోంది. రేటింగ్ ప‌రంగానూ మంచి ప్లేస్ లో కొన‌సాగుతోంది. ఏడేళ్ల క్రితం స్టార్ ప్ల‌స్ లో ప్ర‌సారం అయి సూప‌ర్ హిట్ అనిపించుకున్న `యే హై మొహ‌బ్బ‌తే` సీరియ‌ల్ ఆధారంగా తెలుగులో ఈ సీరియ‌ల్ ని రీమేక్ చేశారు. క‌న్న‌డ న‌టీన‌టులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. నిరంజ‌న్‌, కోల్ క‌తా న‌టి డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, బేబి మిన్ను నైనిక‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, ఆనంద్ త‌దిత‌నులు న‌టించారు.

కార‌ణం చెప్ప‌మ‌ని హిమ‌ని నిల‌దీసిన నిరుప‌మ్‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొన్ని వారాలుగా స‌రికొత్త మ‌లుపులు తిరుగుతూ ఆస‌క్తిక‌ర ట్విస్ట్ ల‌తో మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. జూన్ 1 బుధ‌వారం తాజా ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా సాగ‌బోతోంది. హిమ పెళ్లి చూపుల కోసం వ‌చ్చిన వారిన నిరుప‌మ్ ఎందుకు బెదిరించాడు?.. ఈ విష‌యం తెలిసి సౌంద‌ర్య, ఆనంద‌రావులు ఎలా రియాక్టయ్యార‌న్న‌ది ఈ రోజు ఎపిసోడ్ లో ఆస‌క్తిక‌రం. బుధ‌వారం ఎపిసోడ్ లో హిమ‌కు పెళ్లి ఫిక్స‌యింద‌ని నిరుప‌మ్ తో స్వ‌ప్న చెబుతుంది. ఆ మాట‌లు విన్న వెంట‌నే నిరుప‌మ్ కుప్ప‌కూలిపోతాడు.

హైపర్ ఆది ఇంట్లో మర్డర్

అనుకోకుండా హైపర్ ఆది ఇంట్లో మర్డర్ జరిగేసరికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వచ్చి అతన్ని అతని భార్యని ఎంక్వయిరీ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా అడివి శేష్ వస్తారు. ఆదిని హోస్ట్ ప్రదీప్ ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అసలు మర్డర్ ఎలా జరిగింది ? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఆదిని కన్ఫ్యూస్ చేస్తూ ఉంటారు. ఆది ఆన్సర్ తప్పు చెప్తే చాలు చేతికి, కాలికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. నీ ఫోన్ లో ఎక్కువగా లేడీస్ నంబర్స్ ఉన్నాయి కదా ? అని అడివి శేష్ అడిగేసరికి అలాంటివేమి ఉండవ్ అని చెప్తాడు ఆది. వెంటనే షాక్ తగులుతుంది ఆదికి. దాంతో ఒక్కసారిగా కెవ్వు మంటాడు.