English | Telugu

దొంగని కనిపెట్టిన అఖిల్

శ్యామా , అఖిల్ విగ్నేశ్వర అభిషేకానికి తయారవుతూ ఉంటారు. ఇంతలో బీరువా తీసేసరికి అక్కడ శంకర్ ఇచ్చిన కిరీటం కనిపించదు. అంతే ఒక్కసారి షాక్ అవుతుంది. అఖిల్ కి విషయం చెప్తుంది. ఇల్లంతా వెతికినా కనిపించదు. ఏం చేయాలో తెలియక ఇద్దరూ భయపడుతూ ఉంటారు.ఇంతలో వసంత వచ్చి బీరువా తాళాలు అడుగుతుంది. శ్యామాకి ఏం అర్థంకాక తాళాలు ఇచ్చేసి అఖిల్ ని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక శ్యామా ఈ గండం నుంచి గట్టెక్కించమని కన్నయ్యను కోరుకుంటుంది. ఇంతలో అఖిల్ కి ఆ రూమ్ కిటికీ తలుపు దగ్గర స్క్రూలు కనిపిస్తాయి. కిరీటం ఎవరో తెలిసిన వాళ్ళే దొంగతనం చేసారని తెలుసుకుంటారు. అంతలో కింద పట్టా మీద సగం కాలిన బీడీని చూస్తుంది శ్యామా. అది తోటమాలి కాలుస్తాడు అన్న విషయం గుర్తుతెచ్చుకుని అతన్ని వెతుకుతుంది.

పెరట్లో కనిపించకపోయేసరికి వాళ్ళింటికి వెళ్తారు ఇద్దారూ . వాళ్ళ ఫ్రెండ్ తో కలిసి తాగి ఎక్కడ పడిపోయాడో అంటుంది తోటమాలి భార్య. మరో వైపు శంకర్ తన కిరీటం కోసం వర్మ ఇంటికి వస్తాడు. ఐతే వర్మ ఒక గంట ఆగాక కిరీటం ఇస్తాను. ఎందుకంటే ఇందాకే రాహు కాలం వచ్చేసింది ఇలాంటి సమయంలో కిరీటం తీసుకెళ్లడం కరెక్ట్ కాదు అంటాడు. మిగతా ఎపిసోడ్ ఈరోజు మధ్యాహ్నం వచ్చే కృష్ణ తులసి సీరియల్ లో చూడొచ్చు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.