అనుతో ఆర్యకు చెక్ పెట్టిన రాగసుధ
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. గత కొన్ని వారాలుగా విజయవంతంగా సాగుతోంది. థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సీరియల్ అనుక్షణం ఉత్కంఠభరిత మలుపులతో సాగుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంతోంది. ఇందులో `బొమ్మరిల్లు` ఫేమ్ శ్రీరామ్ వెంకట్, రామ్ జగన్, జయలలిత, జ్యోతిరెడ్డి, బెంగళూరు పద్మ, విశ్వమోహన్, అనుష సంతోష్, రాధాకృష్ణ, మధుశ్రీ, సందీప్, ఉమాదేవి తదితరులు నటించారు. అర్థ్రాంతరంగా చనిపోయిన ఓ యువతి మర్దర్ మిస్టరీ చుట్టూ తిరిగే కథగా ఈ సీరియల్ ఉత్కఠభరిత మలుపులతో సాగుతోంది.