English | Telugu
తిండిలేక ఇబ్బంది పడ్డా.. 75 రూపాయలు ఇస్తే గొప్పగా ఫీలయ్యా!
Updated : Apr 23, 2021
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అంత ఈజీగా రాదు. టాలెంట్తో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఈరోజు ఇండస్ట్రీలో స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్న చాలా మంది ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడినవారే. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కూడా తన కెరీర్లో పడిన కష్టాల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. శేఖర్ మాస్టర్ ఒకప్పుడు కొరియోగ్రాఫర్ గానే పని చేసేవారు. కానీ ఇప్పుడు ఆయన బుల్లితెరపై ఓ స్టార్గా ఎదిగారు. పలు టీవీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. స్టార్ హీరోల సినిమా అంటే కచ్చితంగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఉండాల్సిందే.
చిరంజీవి, రామ్ చరణ్ లాంటి వాళ్లు శేఖర్ మాస్టర్ని ఎంతో బాగా ట్రీట్ చేస్తుంటారు. సినిమాలతో పాటు బుల్లితెరని కూడా బ్యాలెన్స్ చేస్తూ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కొన్నిరోజులుగా శేఖర్ మాస్టర్ 'ఢీ' షో నుండి జడ్జిగా తప్పుకున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఆయన 'ఢీ' షోలో కనిపించడం లేదు. సినిమాలతో బిజీగా ఉండడం వలన ఆయన షోకి రాలేకపోయారని అంతా అనుకున్నారు. అయితే అదే సమయంలో ఆయన 'కామెడీ స్టార్స్' అనే షోలో జడ్జిగా కనిపించారు. దీంతో ఆయన కావాలనే 'ఢీ' షోని వదిలేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం శేఖర్ మాస్టర్ 'కామెడీ స్టార్స్' షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో బయటకి వచ్చింది. అందులో అవినాష్ టీమ్ ఓ స్కిట్ చేసింది. ఆ స్కిట్ చూసిన శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు.. తిండి సరిగ్గా దొరికేది కాదని.. 75 రూపాయలు ఇస్తే ఎంతో గొప్పగా ఫీలయ్యాయని.. అన్నం కూడా దొరకని స్థితిలో ఉండేవాడ్ని అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన ఎమోషనల్ అవ్వడంతో స్టేజ్ మీద ఉన్న వారంతా కూడా కంటతడి పెట్టుకున్నారు. ఈ ప్రోమోకి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.