English | Telugu
సెన్సేషనల్ సింగర్.. ఊటీ డైరీస్!
Updated : Apr 18, 2021
సింగర్ మధుప్రియ చిన్నతనంలోనే "ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనని.." పాటతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తర్వాత కాలంలో ఓవైపు సింగర్గా మంచి పేరు తెచ్చుకుంటూ, మరోవైపు వార్తల్లోనూ నిలుస్తూ వచ్చింది. 2015లో మంగి శ్రీకాంత్తో ఆమె పెళ్లి టాక్ ఆఫ్ ద టౌన్గా, సంచలనంగా మారింది. ఒకవైపు భర్త, మరోవైపు తల్లిదండ్రుల ప్రేమ మధ్య చిక్కుకొని ఇబ్బందులు పడింది. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయి.
'ఫిదా' మూవీలో "వచ్చిండే పిల్లా మెల్లగ వచ్చిండే" సాంగ్తో సంగీత ప్రియులను తన హుషారైన గాత్రంతో అలరించింది. ఆ పాటతో బెస్ట్ ఫిమేల్ సింగర్గా ఫిల్మ్ఫేర్ అవార్డునూ అందుకుంది. అలాగే 2020 సంక్రాంతికి వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో హీరోయిన్ రష్మిక కోసం ఆమె పాడిన "హి ఈజ్ సో క్యూట్" సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. సోషల్ మీడియాలో మధుప్రియ బాగా యాక్టివ్. తరచూ తన సోలో పిక్చర్స్తో పాటు ఫ్యామిలీ ఫొటోలను కూడా షేర్ చేస్తుంటుందామె.
లేటెస్ట్గా ఆమె తన కుటుంబంతో ఊటీలో జాలీగా గడుపుతోంది. అమ్మానాన్నలు, అక్కచెల్లెళ్లతో కలిసి ఆడిపాడుతూ టైమ్ను ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని పిక్చర్స్ను తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది మధుప్రియ.
వాటిలో ఓ ఫొటోలో ఆమెను ఆమ్మానాన్నలు చెరో చెంపపై ముద్దు పెట్టుకుంటున్నారు. ఆ పిక్చర్కు "మామ్ డాడ్" అనే క్యాప్షన్ పెట్టింది. ఆమె షేర్ చేసిన వాటిలో అక్క, చెల్లెలితో కలిసున్న ఫొటోతో పాటు, ఊటీ తోటల మధ్య పాటలు పాడుతున్న వీడియోలు కూడా ఉన్నాయి.
వాటికి #ootydiaries అనే హ్యాష్ట్యాగ్ను జోడించింది మధుప్రియ. ఆ ఫొటోలు చూస్తుంటే ఆమె ఎంత ఆనందంగా ఊటీలో గడుపుతోందో అర్థమవుతోంది.
అంతకు ముందు మార్చి 18న అమ్మానాన్నలతో విడివిడిగా దిగిన ఫొటోలను షేర్ చేసి, వాటికి "ఈ దునియాల నిష్కల్మషంగా ఓ ప్రేమ ఉంది అంటే అది తల్లిదండ్రులదే. love you both mummy daddy forever. Happy Wedding Anniversary" అనే క్యాప్షన్ పెట్టింది.