విజయవాడ నుంచి వెళ్లే బస్సులకు 15 నుంచి పచ్చ జెండా
ఏప్రిల్ 15 నుంచి బస్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చని ఏ పీ ఎస్ ఆర్టీసీ పేర్కొంది. దీంతో, పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరగడం వల్ల లాక్డౌన్ పొడిగిస్తారని వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లైంది. ఇప్పటికే లాక్ డౌన్ ఎఫెక్ట్తో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా, వ్యాపార రంగాలు కుదేలయ్యాయి. మళ్లీ పొడిగిస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ప్రభుత్వం లాక్డౌన్ను పొడిగించాలన్న ప్రతిపాదనను పక్కన పెట్టేస్తుందని అధికార వర్గాల సమాచారం. వివరాల్లోకెళితే.. ఏపీఎస్ ఆర్టీసీ బుకింగ్స్ను ప్రారంభిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 15 నుంచి బస్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చని ఆర్టీసీ పేర్కొంది....