English | Telugu

వేసవి సెలవులు రద్దు! లాక్‌డౌన్ ఏప్రిల్ 30 వరకు పెంపు!

తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో కోర్టు లాక్‌డౌన్ ను ఏప్రిల్ 30 వరకుపొడిగించి, వేస‌వి కోర్టు సెలవులను రద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. న్యాయమూర్తులు ప్రస్తుత పరిస్థితిపై బార్ లీడర్లు, వైద్య నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. అనంతరం ఏప్రిల్ 30 వరకు కోర్టుల లాక్‌డౌన్ పొడిగించి, ఈ ఏడాది వేసవి సెలవులను రద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. హైకోర్టుతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కోర్టులు ఈ ఏడాది మే 1 నుంచి జూన్ 5 వరకు చేస్తాయి.

ఏప్రిల్ 25న మరోసారి పరిస్థితిని సమీక్షిస్తామ‌ని రిజిస్ట్రార్ జనరల్ ఎ.వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. అప్పటి వరకూ వర్చువల్‌‌గా కోర్టులు అత్యవసర కేసులను విచారణ జరుపుతాయన్నారు. రాష్ట్రంలోని కోర్టు ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని చీఫ్ జస్టిస్ రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చారు. ఏప్రిల్ నెలలో ఒక రోజు వేతనాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వ‌నున్నారు.