Actress charmi

ఛార్మి కి బంపర్ ఆఫరే !

      ప్రతి సంవత్సరం నూతన సంవత్సర వేడుకల సమయంలో సినీ హీరోయిన్లకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే,ఈ ఏడాది ఆ డిమాండ్ గతంతో పోలిస్తే బాగా పడిపోయింది.   దీనితో, అనేక మంది తెలుగు సిని హీరోయిన్లు ఈ సారి రెండు, మూడు లక్షలకే వివిధ పార్టీల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. అయితే, వీరందరిలోకి చార్మి మాత్రం బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఆమెకు హైదరాబాద్ లో గల జూబ్లి క్లబ్ ఆ ఒక్క రోజుకు 15 లక్షల బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. జూబ్లి సభ్యులకు మాత్రమే సభ్యత్వం ఉండే ఆ క్లబ్ లో ఆ ఒక్క రోజు నృత్యం చేయడానికి ఆమెకు ఈ మొత్తం ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ఆ భామ కు సినిమా చాన్సులు పెద్దగా లేనప్పటికీ, ఈ బంపర్ ఆఫర్ రావడం పట్ల సిని పరిశ్రమ వర్గాలు  ఆశ్చర్యపోతున్నట్లు తెలుస్తోంది. అయితే, బాలీవుడ్ సుందరీ మణులతో పోలిస్తే, ఇది అసలు ఏ మాత్రం గొప్ప మొత్తం కాదు. ఎందు కంటే, వారికి ఆ ఒక్క రోజుకు కోట్లలో సంపాదన ఉంటుంది. 25 సంవత్సరాల ఈ భామ పంజాబీకి చెందిన, ముంబాయి లో పుట్టిన నటీమణి. ఆమె 2002 లో ‘నీ తోడూ కావాలి’ అనే చిత్రంతో పరిశ్రమలో ప్రవేశించింది.  

 Ram Charan Nayak release

'నాయక్' తో రికార్డ్ లు సృష్టించనున్న రామ్ చరణ్

      మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ "నాయక్" మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ఈ సినిమా పాటలు ఇటీవల విడుదలై విజయాన్ని సాధించాయి. నాయక్‌ చిత్రానికి సంబంధించిన చివరి పాట 'ఒయ్యారమంటే ఏలూరే..' చిత్రీకరణ పూర్తయింది. ఈ పాటతో మొత్తం సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. రామ్ చరణ్, వి వి వినాయక్ కాంబినేషన్ లో వస్తున్న నాయక్ సినిమా టాలీవుడ్ లో రికార్డ్ లు బ్రేక్ చేసి కొత్త రికార్డ్ లను సృష్టిస్తుందని నిర్మాత దానయ్య అన్నారు. రామ్ చరణ్ డాన్సులు ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుందని చెప్పారు. ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌, అమలాపాల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్‌, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, ఆశిష్‌ విద్యార్థి, ప్రదీప్‌రావత్‌, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్‌ సాయి, సంగీతం: తమన్‌.

Nayak movie

కొత్త రికార్డులు సృష్టిస్తున్న 'నాయక్' రామ్ చరణ్

      మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ చేసినవి ఐదు చిత్రాలైన రికార్డ్ వేటలో మాత్రం ముందుకు దూసుకు పోతున్నాడు. చెర్రీ 'నాయక్' చిత్రంతో కొత్త రికార్డ్ సృష్టించాడు. నాయక్ సినిమా హిందీ శాటిలైట్ హక్కులు మూడున్నర కోట్లకు అమ్ముడుపోయాయి. ఇంతవరకు తెలుగు సినిమాల్లో ఏ చిత్రానికి ఇంత భారీ ఆఫర్ రాలేదు. మహేష్ బాబు - వెంకటేష్ నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ "సీతమ వాకిట్లో సిరిమల్లె చెట్టు" కూడా మూడు కోట్లకే అమ్ముడుపోయింది. సినిమా విడుదలకు ముందే కొత్త రికార్డులు సృష్టిస్తున్న ఈ నాయక్, రిలీజ్ తరువాత ఎన్ని రికార్డులు తిరగారాస్తాడో వేచిచూడాలి. హిందీ  శాటిలైట్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడుపోవడం పట్ల మన నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హిందీ ఛానెళ్ళు తెలుగు సినిమాల మీద ఆసక్తి చూపడానికి కారణం, హిందీ సినిమాలకంటే మన సినిమాలు చాలా తక్కువ ధరకు దొరకడమేనని ఛానెల్స్ వర్గాలు అంటున్నాయి. 

chiranjeevi nayak sets

నాయక్ సేట్ లో మనవరాళ్లతో మెగాస్టార్ హల్ చల్

రామ్ చరణ్ 'నాయక్' సేట్ లో మెగాస్టార్ చిరంజీవి తన మనవరాళ్లతో కలిసి హల్ చల్ చేశారు. సుస్మిత, శ్రీజలా కుమార్తెలను తీసుకొని నాయక్ సేట్ కి వెళ్ళారు చిరు. అక్కడ రామ్ చరణ్, ఛార్మిల మీద ప్రత్యేక గీతాన్ని చిత్రించారు. అ టైం లో మానిటర్ దగ్గర కుర్చోని సాంగ్ ఎలా తీస్తున్నారో చూశారు. మామయ్య రామ్ చరణ్ వేసిన స్టెప్పులు చూసి చిన్నారులు సంబరపడ్డారని యూనిట్ సభ్యులు తెలిపారు.కేంద్ర మంత్రి అయిన తర్వాత తీరిక లేకుండా గడుపుతున్న చిరంజీవి ఇలా మనవరాళ్లతో తమ లొకేషన్లోకి రావడం ‘నాయక్' యూనిట్ సభ్యులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.      

Salman khan suresh babu Hyderabad

సురేష్ బాబు ఇంట్లో సల్మాన్ కబుర్లు !

    దగ్గుబాటి సురేష్ బాబు ఇంటికి ఇటీవల ఓ అనుకోని అతిధి వచ్చారు. ఆ కుటుంబంలో అందరితోనూ కలిసిపోయి డిన్నర్ కూడా చేసాడు. ఆయన ఎవరో కాదు.... బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్.   సురేష్ బాబు కుటుంబంతో సల్మాన్ కు మంచి స్నేహం ఉంది. మరీ ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ తో. వీరిద్దరూ తరచూ కలుస్తూ ఉంటారు. ఈ మధ్య జరిగిన సురేష్ బాబు కుమార్తె పెళ్ళికి సల్మాన్ ను కూడా ఆహ్వానించారు. అయితే, సల్మాన్ ఆ సమయంలో వేరే కార్యక్రమంలో బిజీగా ఉండటం వల్ల హాజరుకాలేక పోయారు. సల్మాన్ తన ‘దబాంగ్-2’ సినిమా ప్రమోషన్ కోసం ఇటీవల హైదరాబాద్ వచ్చిన సమయంలో ఆయన నేరుగా సురేష్ బాబు ఇంటికి వెళ్లారు.   వారిద్దరితో పాటు, అక్కడ రామానాయుడుతో కూడా సరదాగా కబుర్లు చెప్పారు. అక్కడ సల్మాన్ రెండు గంటలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే,తమ మధ్య జరిగిన చర్చల వివరాలను వెల్లడించడానికి మాత్రం సురేష్ బాబు నిరాకరించారు.

 ram charan chiranjeevi

రామ్ చరణ్ 'నాయక్' సేట్ లో మెగాస్టార్

      రామ్ చరణ్ "నాయక్" సేట్ లో సడన్ గా అనుకొని గెస్ట్ ప్రత్యక్షమయ్యారు. ఆయన ఎవరో కాదండీ..మన మెగాస్టార్ చిరంజీవి. ఆయన వెళ్ళేసరికి అక్కడ రామ్ చరణ్, ఛార్మి మీద ‘నెల్లూరే..' అనే ఐటం సాంగును షూట్ చేస్తున్నారు. ఈ ఐటెం సాంగ్ లో ఛార్మి డాన్స్ లు చూసి చిరు ఖుషి అయ్యారట ! ‘నెల్లూరే..' సాంగ్ లో  ఛార్మి డాన్సులు ఆదరగోట్టేసిందని, చిరు అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చి ఆ డాన్స్ ని ఆమె చేత మరింత రక్తి కట్టించారని టాక్. సేట్ లో అనుకొని అతిధి ని చూసి ఛార్మి పొంగిపోయింది. తనకు సూచనలు ఇచ్చినందుకు చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపింది. చిరు నేటికి డాన్సుల్లో అదే ఉపును కొనసాగించడం చూసి ఛార్మి ఆశ్చర్యపోయిందట. దాట్ ఇస్ చిరు..! 

actor nagarjuna

ఫైట్‌ మాస్టర్‌ల గొడవ: తెలుగువారికి నాగార్జున మద్దతు

      స్టంట్ మాస్టర్స్‌ యూనియన్‌లో సభ్యత్వం తీసుకోకుండా ఫైట్‌ మాస్టర్‌లు తెలుగు సినిమాలకు పనిచేయడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ స్టంట్ మాస్టర్స్‌ అసోసియేషన్‌ శనివారం అన్నపూర్ణ స్టూడియో ఎదుట ఆందోళనకు దిగింది. స్టంట్‌ యూనియన్‌లో సభ్యత్వం లేని విజయ్‌, రామ్‌-లక్ష్మణ్‌, వెంకట్‌, గణేష్‌లు సినిమాలకు పని చేయటాన్ని యూనియన్ ప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారు. ఇంతకు ముందే ఈ విషయమై హెచ్చరించిన వారు వారికి సహాయ నిరాకరణ చేస్తున్నారు. తెలుగు ఫైట్ మాస్టర్ల నిరసనకు ప్రముఖ హీరో అక్కనేని నాగార్జున సంఘీభావం ప్రకటించారు. వారికి మద్దతుగా ఈ రోజు తన షూటింగును రద్దు చేసుకున్నారు.

charmi ram charan

'నాయక్' తో రాత్రంతా గడిపిన ఛార్మి

      నాయక్ రామ్ చరణ్ తో ఛార్మి ఫుల్ నైట్ స్పెండ్ చేసింది. ఈ విషయం తానే స్వయంగా చెప్పింది. ఇందులో దాచటానికి ఏమి లేదు. సినిమా షూటింగ్ లో బాగంగానే ఛార్మి రామ్ చరణ్ తో రాత్రంతా గడపాల్సి వచ్చింది. వివి వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ 'నాయక్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో 'నెల్లూరే' అనే ఐటెం సాంగ్ లో ఛార్మి రామ్ చరణ్ తో కలిసి డాన్స్ చేసింది. ఈ సాంగ్ ను ఇటీవలె హైదరాబాద్ లో చిత్రీకరణ జరిపారు. ఈ విషయం గురించి చార్మి తన ట్విట్టర్లో పేర్కొంటూ.... ‘నాయక్ సినిమా కోసం ఫుల్ నైట్ షూటింగులో పాల్గొన్నాను. రామ్ చరణ్ తో కలిసి స్టెప్పులేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సాంగు సూపర్ హిట్టవుతుందనే నమ్మకం ఉంది. ఈ పాట కోసం జనవరి వరకూ వేచి చూడండి అని ట్విట్ చేసింది. ఈ సినిమాలో రామ్ చరణ్ పక్కన అమలపాల్, కాజల్ అగర్వాల్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా, కథ, స్క్రీన్‌ప్లే ఆకుల శివ రాశారు. ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నారు.  

nagababu ramcharan

దాసరి ని పట్టించుకోం... నాయక్ తరుపున స్వారీ : నాగబాబు

      'నాయక్' చిత్రం ఆడియో ఫంక్షన్ లో చిరు తనయుడు రామ్ చరణ్ తేజ చేసిన వ్యాఖ్యలను కూడా పట్టించుకోవద్దని నాగబాబు అన్నారు. చెర్రీ యువకుడు అయినందున అందులోని ఆవేదనను అర్ధంచేసుకోవాలని, ఆగ్రహాన్ని పట్టించుకోవద్దని నాగబాబు కోరారు. ఒకవేళ చరణ్ తప్పు మాట్లాడి ఉంటే తాను క్షమాపణ చెబుతున్నానని అన్నారు. అడ్రస్ లేని వాళ్లకు అడ్రస్ ఇచ్చా అంటూ దర్శకరత్న దాసరి నారాయణ రావు చేసి వ్యాఖ్యలు చిరంజీవి గురించేనన్న టాక్ వచ్చింది. అయితే ”ఆయన మాటలను పట్టించుకోవాల్సిన అవసరంలేదని” చిరంజీవి సోదరుడు, నటుడు నాగబాబు తేలిగ్గా తీసేశారు. దర్శకుడు సురేష్ కృష్ణ రాసిన “భాషాతో నేను” పుస్తకావిష్కరణ సంధర్భంగా గురువారం దాసరి చేసిన వ్యాఖ్యలు చిత్రరంగంలో పెనుదుమారం రేపాయి. అయితే నాగబాబు మాత్రం పట్టించుకోనట్లుగా మాట్లాడారు.

 ravi teja Sarocharu movie

రవితేజ 'సారోచ్చారు' టాక్

      మాస్ మహారాజ రవితేజ, కాజల్, రీచా గంగోపాధ్యాయ్ నటించిన "సారోచ్చారు" చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై౦ది. చాలా కాలం నుంచి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకి ఈ చిత్రం కూడా నిరాశనే మిగిల్చిందని అంటున్నారు. కాని రవితేజ గత చిత్రాలతో పోల్చితే ఈ చిత్రం పర్వాలేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ రోజు రిలీజైన ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. రవితేజ ఈ సినిమాలో మాస్ క్యారెక్టర్ కాకుండా డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించాడు. ఈ విషయం లో రవితేజ మాస్ అభిమానులను నిరుత్సాహపరిచాడని టాక్. సినిమా స్టొరీ బాగుంది కాని....డైరెక్టర్ పరశురామ్ స్క్రీన్ ప్లే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది. సినిమాలో క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సినిమా మొదటి బాగంలో రవితేజ, కాజల్ కెమిస్ట్రీ బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా ప్రేక్షకులను నిరాశపరిచాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మొత్తం మీద ఈ సినిమాలో రవితేజ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ను డైరెక్టర్ ఉపయోగించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు.            

dasari narayana rao| dasari narayana rao rajinikanth| dasari narayana rao chiranjeevi| dasari narayana rao rajinikanth book launch

మెగాస్టార్ ని అనలేదు ...రాద్ధాంతం చేయకండి : దాసరి

      దాసరి నారాయణ రావు చేసిన వ్యాఖ్యలు చిరును ఉద్దేశించి అన్న ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఓ న్యూస్ ఛానల్ చర్చకు ఆయనే ఫోన్ చేసి తాను అన్న వ్యాఖ్యలు చిరును ఉద్దేశించి కాదని చెప్పడంతో వ్యవహారం సద్దుమణిగినట్లు భావించవచ్చు. రజనీకాంత్ జీవితం మీద రాసిన  ‘ఒకే ఒక్కడు’ పుస్తకం విడుదల కార్యక్రమ౦లో దాసరి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అడ్రస్ లేని వాళ్లకు అడ్రస్ ఇచ్చా. వేశం కోసం నా ఇంటి చుట్టూ తిరిగిన వాళ్లు ఇప్పుడు నన్ను మరిచిపోయారు. నా జీవితం పణంగా పెట్టి ఎందరికో అవకాశాలు ఇచ్చాను. ఇలాంటి వారందరి చరిత్రను త్వరలో ఓ పుస్తకం రూపంలో బయటకు తెస్తా. వారందరి గుట్టూ విప్పుతా” అని దాసరి నారాయణ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.   నా జీవితాన్ని పణంగా పెట్టి కొందరికి జీవితాలు ఇచ్చానని, వేశాల కోసం నా ఇంటి చుట్టూ సైకిల్ మీద తిరిగిన వాళ్లు ఇప్పుడు వాళ్లు వచ్చినప్పుడు నేను లేవలేదని అంటున్నారని ఇలాంటి వాళ్ల గురించి రాయాలా వద్దా ? ఇలాంటి వారి నైజం బయట పెట్టాల్సిన ఆవసరం ఉందా ? లేదా ? అని దాసరి ప్రశ్నించారు. ఖచ్చితంగా పుస్తకం రాస్తా, కానీ ఎవరినీ నొప్పించను అని దాసరి అన్నారు.

Yasho Sagar's death

నటుడు యశోసాగర్ అంత్యక్రియలకు స్నేహా ఉల్లాల్

    గురువారం జరిగిన యువ నటుడు యశోసాగర్ అంతక్రియలకు నటి స్నేహా ఉల్లాల్ హాజరయ్యారు. ముంబయి లో ఉన్న స్నేహా ఉల్లాల్ యశోసాగర్ మరణ వార్త వినగానే షాక్ కి గురైంది. ఈ రోజు బెంగుళూరు వచ్చి యశోసాగర్ అంతక్రియలలో పాల్గొన్నారు. ఉల్లాసంగా ఉత్సాహంగా హీరో యశోసాగర్ బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. బెంగళూరు  దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా పడటంత వల్ల యశోసాగర్తో పాటు కారు డ్రైవర్ కూడా మృతి చెందాడు. యశోసాగర్ ప్రముఖ కన్నడ నిర్మాత బి.వి. సోము తనయుడు. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా హీరోయిన్  స్నేహా ఉల్లాల్   పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యేందుకు వెళుతూ  కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా పడటంతో ఈ దుర్ఘటన జరిగింది.

dasari narayana rao

నా జీవితం పణంగా పెట్టి ఎందరికో అవకాశాలు ఇచ్చా: దాసరి

      రజనీకాంత్ జీవితం మీద దర్శకుడు సురేష్ కృష్ణ రాసిన ‘ఒకే ఒక్కడు’ పుస్తకం విడుదల కార్యక్రమ౦లో దాసరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అడ్రస్ లేని వాళ్లకు అడ్రస్ ఇచ్చా. వేశం కోసం నా ఇంటి చుట్టూ తిరిగిన వాళ్లు ఇప్పుడు నన్ను మరిచిపోయారు. నా జీవితం పణంగా పెట్టి ఎందరికో అవకాశాలు ఇచ్చాను. ఇలాంటి వారందరి చరిత్రను త్వరలో ఓ పుస్తకం రూపంలో బయటకు తెస్తా. వారందరి గుట్టూ విప్పుతా” అని దాసరి నారాయణ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.   నా జీవితాన్ని పణంగా పెట్టి కొందరికి జీవితాలు ఇచ్చానని, వేశాల కోసం నా ఇంటి చుట్టూ సైకిల్ మీద తిరిగిన వాళ్లు ఇప్పుడు వాళ్లు వచ్చినప్పుడు నేను లేవలేదని అంటున్నారని ఇలాంటి వాళ్ల గురించి రాయాలా వద్దా ? ఇలాంటి వారి నైజం బయట పెట్టాల్సిన ఆవసరం ఉందా ? లేదా ? అని దాసరి ప్రశ్నించారు. ఖచ్చితంగా పుస్తకం రాస్తా, కానీ ఎవరినీ నొప్పించను అని దాసరి అన్నారు. రజనీకాంత్ ఓ సూపర్ స్టార్ అని, అది మామూలుగా రాదని, ఓ ఎన్టీఆర్,  ఓ ఎంజీఆర్ ఇలా అందరూ తమ తమ నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారని, అది ఈ భూమి ఉన్నంతవరకు వారి మీద అభిమానం అలాగే ఉంటుందని అన్నారు. తూర్పుపడమర చిత్రానికి ఒక్కరోజు ముందు మోహన్ బాబు ను బుక్ చేసుకున్నానని, ఆ తరువాత రజనీకాంత్ వచ్చి తన ఫోటోలు చూయించాడని ఒకవేళ మోహన్ బాబు లేకపోతే అందులో రజనీకాంత్ ఉండేవాడని అన్నారు. కానీ ఇప్పటికి రజనీ ఆ ఫోటోలు చూయించానని ఇప్పటికీ చెప్పడం ఆయన సంస్కారానికి నిదర్శనం అని, భారతదేశంలోనే రజనీ ఓ సూపర్ స్టార్ అని దాసరి అన్నారు.

నాయక్ రామ్ చరణ్ 'వెంట్రుక' ఛానెల్ ఇదేనా...?

      రామ్ చరణ్ నాయక్ ఆడియో ఫంక్షన్ లో చేసిన 'వెంట్రుక' అనే కామెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మా కుటుంబం గురించి, అనుబంధాల గురించి అడ్డగోలుగా రాసే ఆ పేపర్, ఛానల్ వార్తలు నా 'వెంట్రుక'తో సమానం అని చరణ్ అన్నాడు. రామ్ చరణ్ మీడియా పేరు చెప్పకపోయినా అది ఓ ప్రముఖ తెలుగు ఛానెల్ ని ఉద్దేశించి అన్నాదేనని అభిమానులు అనుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఓ ప్రముఖ తెలుగు పేపరు సైతం అంతే ఘాటుగా స్పందించినట్టుగానే ఉంది. మంగళవారం ఎడిషన్ లో (18/12/2012)  'చిరుత'నయుడి నోటి దురుసు అనే టైటిల్ తో ఓ ప్రముఖ తెలుగు పేపరు ప్రచురించిన కధనం మీ కోసం:    " సాధారణ నటుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించిన చిరంజీవి మాటతీరు.. ఎదిగిన కొద్ది ఒదిగే ప్రవర్తన ఆయనను . మెగాస్టార్ హోదాను సంపాదించుకునేలా చేసింది (రాజకీయాల్లో కాదులే). అయితే ఆయన వారసుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన రాం చరణ్ తేజ సినిమా అనుభవం ఐదు చిత్రాలే.. అయితే చెర్రీ (చరణ్) వయస్సు ప్రభావమో.. లేక అనుభవిస్తున్న మానసిక ఒత్తిడి మూలంగానో సోమవారం హైదరాబాద్ లో జరిగిన 'నాయక్' చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో కొంచెం అతిగా మాట్లాడటం కొంత వివాదానికి చోటిచ్చింది. ప్రస్తుతం ‘జంజీర్' చిత్రంలో రామ్‌చరణ్ యాంగ్రీ మాన్ పాత్ర పోషించడం కారణంగానో ఏమో.. తెరపైనే కాదు ‘నాయక్' ఆడియో ఆవిష్కరణ వేడుకలో కూడా చరణ్ ఆ విధంగానే కనిపించారు. పేరు చెప్పకుండా ఒక టీవీ చానల్, పేపర్‌ను టార్గెట్ చేసి, దూషించారు. చాలా సాదాసీదాగా ప్రసంగాన్ని ప్రారంభించిన చరణ్ .. కాస్త ఉద్వేగానికి లోనయ్యాడు. జీవితమంటే నున్నటి బాటపై బెంజ్ కార్లలో ప్రయాణించడమంత సులభం కాదనే విషయం అప్పుడే అర్ధం కాదు అని చరణ్ వ్యాఖ్యలపై పలువురు వ్యాఖ్యానించారు. చిరంజీవి సినీ జీవితాన్ని దగ్గరగా చూసిన చరణ్.. జీవితమంటే ఎన్నో ఆటుపోట్లు ఉంటాయని గ్రహించ లేకపోవడం తప్పేనంటున్నారు. చిన్న చిన్న విషయాలకు అతిగా నోరుపారేసుకోకుండా ఉండటం అనేది చరణ్ కు కాలం, అనుభవం నేర్పుతుందేమో చూడాల్సిందే. చరణ్ లాంటి నవతరం హీరోలను మీడియా ఆకాశానికి ఎత్తకపోతే గింజుకుంటారనేది కాదనలేని వాస్తవం. 'మీడియా మీ గురించి మాట్లాడటం ఆపేస్తే.. ఏమవుతుందో ఊహించుకోండి' అంటూ కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో బాబాయి పవన్ కళ్యాణ్ కొట్టిన డైలాగ్స్ ను చరణ్ ఓ సారి గుర్తు చేసుకుంటే మంచిదని సినీ విమర్శకులు అంటున్నారు. సుదీర్ఘ కాలం ప్రజా జీవితంలో ప్రయాణించాల్సిన వారు ఆదిలోనే తప్పటడుగులు వేయడం ఎవరూ హర్షించరనే విషయాన్ని చరణ్ గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది" అంటూ రాసుకొచ్చింది.

ఆ ఛానెల్..ఆ పేపర్ నా వెంట్రుక : రామ్ చరణ్ ఫైర్

    ‘నాయక్’ ఆడియో విడుదల వేదికపై మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్ తేజ రెచ్చిపోయాడు. 'రచ్చ' ఆడియో ఫంక్షన్ కు బాబాయ్ పవన్ కళ్యాణ్ రాలేదని ఓ పత్రిక, ఓ ఛానల్ వార్తలు రాసి మా కుటుంబంలో విభేదాలు ఉన్నట్లు పలు కథనాలు అల్లారు. ఇప్పుడు ఈ ఫంక్షన్ కు బాబాయ్ వచ్చాడు. నాన్న రాలేకపోయాడు. ఈ వేదిక మీద నాన్న లేని లోటును బాబాయ్ తీర్చాడు. నా తరువాతి ఫంక్షన్ కు బాబాయ్ రాకపోవచ్చు. మా అనుబంధాల గురించి అడ్డగోలుగా రాసే ఆ పేపర్, ఛానల్ వార్తలు నా వెంట్రుకతో సమానం” రామ్ చరణ్ అన్నారు.   రామ్ చరణ్ వ్యాఖ్యలతో కార్యక్రమ ప్రాంగణం వేడెక్కింది. కార్యక్రమాలకు హాజరుకాకపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. అంతమాత్రాన ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తారా ? అని ప్రశ్నించాడు.   

సీతమ్మ వాకిట్లో...స్పెషల్ గెస్ట్

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో అభిమానులకు మహేష్ బాబు, వెంకటేష్ సడన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. సూపర్ స్టార్, విక్టరీ వెంకటేష్ లు ఉండగా ఆడియో ఫంక్షన్ కు గెస్ట్ లు ఎవరురారని అనుకున్నారందరు, కాని సడన్ గా ఇద్దరు గెస్ట్ లు అక్కడ ప్రత్యక్షమయ్యేసరికి వాతావరణం అంతా కోలాహలంగా మారింది. వారెవరో కాదు వెంకటేష్ కుమారుడు అర్జున్, మహేష్‌బాబు తనయుడు గౌతమ్‌ కృష్ణ. అర్జున్, గౌతమ్‌ కృష్ణ లు నిన్న జరిగిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఫంక్షన్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.  ఆడియో వేదిక పైకి  మహేష్ బాబు తన కుమారుడు గౌతమ్‌ కృష్ణ తో, వెంకటేష్ తన తనయుడు అర్జున్ తో కలిసి వచ్చారు. అప్పటి వరకు సూపర్ స్టార మీద ఫోకస్ చేసిన కెమెరాలు అన్ని ఈ చిన్ని సూపర్ స్టార్ల ఫోటోలు తీయడంలో నిమగ్నమైపోయాయి. తొలి ఆడియో సీడీని వెంకటేష్‌ కుమారుడు అర్జున్‌ ఆవిష్కరించి మహేష్‌బాబు తనయుడు గౌతమ్‌ కృష్ణకి అందజేశారు.   

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఆడియో విశేషాలు

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. వెంకటేష్ కుమారుడు అర్జున్, మహేష్‌బాబు తనయుడు గౌతమ్‌ కృష్ణ ఈ ఆడియో ఫంక్షన్ కి గెస్ట్ లు గా వచ్చారు. ఆడియో రిలీజ్ స్టేజిపై వెంకటేష్, మహేష్‌లు నిజమైన అన్నదమ్ములా మెలిగారు. తొలి సీడీని వెంకటేష్‌ కుమారుడు అర్జున్‌ ఆవిష్కరించి మహేష్‌బాబు తనయుడు గౌతమ్‌ కృష్ణకి అందజేశారు. దిల్ రాజు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌లో ఓ మంచి మల్టీస్టారర్‌ చిత్రాన్ని మా సంస్థ నిర్మించడం.. అందులో ఇద్దరు అగ్ర హీరోలు వెంకటేష్, మహేష్‌లు నటించడం, వీరికి సరిపడే కథను తయారు చేసిన ఈ చిత్ర దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాలకు ధన్యవాదాలు చెపుతున్నా అని అన్నారు. ఇది చాలా కాలం తర్వాత వస్తున్న కుటుంబ కథా చిత్రమని ఆయన చెప్పారు.