Seethamma Vakitlo Sirimalle Chettu

'సీతమ్మ వాకిట్లో...' ఆడియో రిలీజ్ డీటైల్స్

      'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఆడియో ను ఈ రోజు గ్రాండ్ గా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నానక్‌రామ్‌గూడ రామానాయుడు స్డూడియో లో ఆడియో రిలీజ్ కోసం స్పెషల్ సేట్ ని వేశారు. దిల్ రాజు మాట్లాడుతూ కొత్త పద్దతిలో ఆడియో రిలీజ్ ను ప్లాన్ చేశామని అన్నారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లో మహేష్ బాబు , వెంకటేష్ గారి పాత్రలు అందరికి గుర్తుండిపోతాయి. ఈ సినిమాలో కుటుంబ విలువలకు పెద్ద పీట వేశాము. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఈ సినిమా నాంది అవుతుందని అన్నారు. జనవరి 11,2013 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల అవుతోంది. మిక్కీ జే మేయర్ అందించే సంగీతం సినిమాకు ప్లస్ అవుతుందని చెప్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్సకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.

Yeto Vellipoyindi Manasu talk

యూత్ ని ఆకట్టుకున్న ‘ఎటో వెళ్లి పోయింది మనసు’

      ఈగ తరువాత నాని, సమంత జంటగా నటించిన 'ఎటో వెళ్లి పోయింది మనసు' విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకి నాని, సమంత కెమిస్ట్రీ హైలైట్స్ గా చెబుతున్నారు. ఏ మాయ చేసావె తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న గౌతమ్ మీనన్ 'ఎటో వెళ్లి పోయింది మనసు' తో వారి అంచనాలను అందుకున్నారు. నెమ్మదిగా సాగిపోయే ప్రేమ సన్నివేశాలను గౌతమ్ మీనన్ అద్భుతంగా తెరకెక్కించారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గారి సంగీతం ఈ సినిమాకి ప్రాణం పోసింది. ఇళయరాజా పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి పెద్ద అస్సెట్. టినేజ్ ఆడియన్స్ కి అదరహో అని పించే ఈ సినిమా....ఆ పై వయస్సు వాళ్ళకి మాత్రం వాళ్ళ టెస్ట్ ప్రకారం ఉంటుందని అంటున్నారు.

pawan kalyan ramcharan

హాట్ ఫోటో: రామచరణ్, పవన్ కళ్యాణ్ సందడి

      దగ్గుబాటి వారి పెళ్ళి లో పవన్ కళ్యాణ్, రామచరణ్ సందడి చేశారు. డిసెంబర్ 5న నానక్ రామ్ గూడ రామానాయుడు స్టూడియోలో జరిగిన సురేష్ బాబు కూతురి పెళ్ళిలో వెంకటేష్, పవన్ కళ్యాణ్, రామచరణ్, శ్రీకాంత్ మాట్లాడుతూ ఇలా కేమెరాకు చిక్కారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాదారణంగా ప్రైవేటు ఫంక్షన్ లకు దూరంగా ఉంటారు. దీంతో ఆయన ఈ ఫంక్షన్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా మారారు.     ప్రస్తుతం పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ తమ చిత్రం కోసం అద్భుతమైన లొకేషన్లు వెతకడంలో భాగంగా యూరఫ్ ఖండంలోని స్పెయిన్ లో పర్యటిస్తున్నారు. ఈ వెతుకులాటలో తాజాగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా జాయిన్ అయ్యాడు. పనిలో పనిగా దేవిశ్రీ ఇక్కడే ఈ ఇద్దరితో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ వేయనున్నారు. ఈ సినిమా కోసం తను ప్రిపేర్ చేసుకున్న ట్యూన్లు వారికి వినిపించనున్నాడు. ఈ చిత్రంలో సమంత పవన్ కళ్యాణ్ హీరోయిన్ గా నటించనుంది.  

 sridevi hot

ఆంటీని కాదు...అతిలోకసుందరినే..!

      శ్రీదేవి నిర్మాత బోనీకపూర్ ని పెళ్ళిచేసుకుని ఇద్దరు అమ్మాయిలకు తల్లైన కూడా నేను ఆంటీని కాదు అతిలోకసుందరినే అనుకుంటోందట..! ఆంటీలకు ఇచ్చినట్లు నాకు చీప్ గా ఓల్డ్ రోల్స్ ఇవ్వద్దు...అలాంటి పాత్రలు చేయడానికి నాకు ఇష్టం లేదంటోంది. ఎంత అతిలోక సుందరైతే మాత్రం ఆంటీ అయ్యాక కూడా అంటీ రోల్స్ ఇవ్వంద్దంటే ఎలా అని చెవులు కోరుక్కు౦టున్నారు. ఇంగ్లిష్ వి౦గ్లిష్ మూవీతో సేకండ్ ఇనింగ్స్ చేసిన శ్రీదేవి తనలో ఇంకా ఏ మాత్రం పవర్ తగ్గలేదని నిరూపించుకుంది నిజమే....అయితే అంతమాత్రానికే అన్ని యంగ్ రోల్స్ కావాలనుకోవడానికి ఈవిడింకా "పదహారేళ్ళ వయస్సు" సినిమాలో శ్రీదేవి అనుకుంటుందా అని జనం కిసుక్కుమంటున్నారట! మాజీ అతిలోక సుందరి అప్పీల్ ను ఫిల్మ్ మేకర్లు ఎలా స్వికరిస్తారో మరి..! 

Seethamma Vakitlo Sirimalle Chettu Teaser

16 న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఆడియో ట్రైలర్

      ప్రిన్స్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో వస్తున్నా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఆడియో ఈ నెల 16 న విడుదల చేయనున్నారు. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆడియో విడుదల నానక్ రామ్ గూడా లో భారీ ఎత్తున చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రానికి సంబంధించి ఆడియో రిలీజ్ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.  ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించే విధంగా పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారని ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది . శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తుండగా, వెంకటేష్ సరసన జర్నీ ఫేం అంజలి మరో హీరోయిన్ రోల్ చేస్తోంది. సక్రాంతి కానుకగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

manisha koirala cancer

మనీషా కోయిరాల కేన్సర్ ఆపరేషన్ విజయవంతం

    మనీషా కొయిరాలకు అమెరికా వైద్యులు నిర్వహించిన కేన్సర్ సర్జరీ సక్సెస్ అయింది. కేన్సర్ బారిన పడి అనారోగ్యానికి గురైన మనీషా కొయిరాలకు సోమవారం వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. శస్త్ర చికిత్స అనంతరం కొయిరాలా కోలుకుంటోందని ఆమె మేనేజర్ సుబ్రతో ఘోష్ తెలిపారు. అమెరికాలో మనీషా వెంట ఆమె తల్లిదండ్రులు, సోదరుడు ఉన్నారు. అయితే మనీషాకు కేన్సర్ సోకిన విషయం ఇటీవలే బయట పడింది. అస్వస్థతకు గురైన ఆమె ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో చేరగా టెస్టుల్లో సర్వైకల్ కేన్సర్ ఉన్నట్లు తేలింది. ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి ఇండియాకు రానున్నారు.

Nayantara Getting Item Song Offers

ధనుష్, నయనతార హాట్ ఐటెమ్ సాంగ్

    ప్రభుదేవాతో ప్రేమాయణం ముగించిన తరువాత నయనతారకు ఆఫర్లు మీద ఆఫర్లు వస్తున్నాయి. రీసెంట్ గా రాణాతో 'కృష్ణం వందే జగద్గురుమ్' లో కనిపించిన ఈ అందాల బొమ్మ...త్వరలో ఓ ఐటెం సాంగ్ చేయనుంది. తమిళ్ హీరో ధనుష్ నిర్మిస్తున్న సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.   శివ కార్తీకేయన్, ప్రియా ఆనంద్ జంటగా ధనుష్ నిర్మిస్తున్న "ఎదిర్ నీచల్" సినిమాలో నయనతార హాట్ ఐటెం సాంగ్ చేస్తుంది. కొలవెరి పాటకు సంగీతం సమకూర్చిన అదే గ్యాంగ్‌నే ఎదిర్ నీచల్ చిత్రం బరిలోకి ధనుష్ దింపనున్నారు. నయనతార చేయనున్న ఐటెం సాంగ్ ను  ధనుష్ స్వయంగా రాసి, పాడనున్నారు. ఈ పాట కూడా మరో "కొలవెరి"కావాలని ఆశిద్దాం.

 Happy Birthday Nandamuri Balakrishna

నందమూరి నటసింహం బాలకృష్ణ బర్త్ డే స్పెషల్

  కొంత మంది చరిత్రలో తమకంటూ ప్ర్యతేక స్థానం సంపాదించుకుంటారు.. కాని కొంత మంది మాత్రం చరిత్ర సృష్టిస్తారు.. కాని అలాంటి చరిత్రను కొంత మంది మాత్రమే కొనసాగించగలుగుతారు.. అలా ఎన్టీఆర్‌ సృష్టిచిన అరుదైన చరిత్రను అంతే ఘనంగా కొనసాగిస్తున్న అద్భుతమైన నటుడు నందమూరి బాలకృష్ణ.. ఈ నటిసింహ పుట్టినరోజు సందర్భంగా బాలయ్య కెరీర్‌ పై ఓ లుక్‌..   తెలుగు సినిమాకు మాస్‌ఫార్ములా చూపించిన నటుడు ఎన్టీఆర్‌ అయితే ఆ అభిమానాన్ని ఆకాశం ఎత్తుకు తీసుకుపోయిన నటుడు బాలయ్య.. అందుకే నందమూరి వారి అబ్బాయిగా అభిమానులు తన మీద పెంచుకున్న నమ్మకానికి వంద శాతం న్యాయం చేశాడు బాలకృష్ణ. ఎన్టీఆర్‌ తనయుడి గా బాలయ్యకు సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఈజీగా లభించినా.. ఎన్టీఆర్‌ పేరుకు ఉన్న విలువ కాపాడం కోసం మాత్రం చాలా శ్రమించాడు.. 1974 లో తాతమ్మకల అనే చిత్రం ద్వారా 14 ఏళ్ల వయసులో ఆయన సినీరంగ ప్రవేశం జరిగింది. ఆ తరువాత ఆయన రామ్ - రహీం ... వేములవాడ భీమకవి చిత్రాల్లో ఇంపార్టెంట్‌ రోల్స్‌ లో నటించాడు.  తరువాత అన్నదమ్ముల అనుబంధం ... దానవీర శూర కర్ణ ... అక్బర్ సలీం అనార్కలి చిత్రాలు  నటుడిగా బాలకృష్ణ కి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. 1980 ల్లో వచ్చిన మంగమ్మగారి మనవడు సినిమాతో బాలకృష్ణ హీరోఇజానికి తెరతీస్తూ అఖండ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో పల్లెటూరి బుల్లోడిగా బాలక్రిష్ణని నటనకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు.. ఇక ఈ సినిమా తరువాత వచ్చిన ముద్దుల క్రిష్నయ్య ... అనసూయమ్మగారి అల్లుడు ... అపూర్వ సహోదరులు సినిమాలు  బాలయ్యకు భారీ సక్సెస్‌లతో పాటు మాస్‌ ఫాలోయింగ్‌ను కూడా అందించాయి.. ఇక బాలకృష్ణ కెరీర్‌లో మరో మైలురాయి సీతారామ కల్యాణం. అప్పటివరకూ బాలకృష్ణకి ఉన్న మాస్ ఇమేజ్ కి ఈ సినిమా రొమాంటిక్ టచ్ ఇచ్చింది. తరువాత వచ్చిన అల్లరి క్రిష్నయ్య ... మువ్వగోపాలుడు ... ముద్దుల మావయ్య వంటి చిత్రాలతో తాను ఎటువంటి పాత్రలకైన న్యాయం చేయగలనని నిరూపించాడు బాలయ్య.. బాలకృష్ణ పల్లెటూరి చిన్జ్నోడులా పంచె కట్టి కర్రచేత బడితే  ఆ సినిమా కాసులు వర్షం కురిపిస్తుంది అన్న క్రేజ్‌ సంపాదించాడు.. బాలకృష్ణ సినిమాల్లో ఓ డిఫరెంట్‌ మూవీగా గుర్తింపు తెచ్చుకున్న సినిమా ఆదిత్య 369 ఈ సినిమాలో లో హీరోగా కనిపించిన బాలయ్య కొన్ని సీన్స్‌ లో శ్రీకృష్ణ దేవరాయలుగా కనిపించి అలరించాడు...ఆ పాత్రలో బాలయ్య నటన చూసిన అభిమానులు మరోసారి ఎన్టీఆర్‌ ను గుర్తు చేసుకున్నారు.. బాలయ్య కెరీర్‌లో మరో అరుదైన రికార్డ్‌ బంగారు బుల్లోడు, నిప్పురవ్వ.. ఈరెండు సినిమాలను ఒకే రోజు విడుదల చేసిన బాలయ్య చరిత్ర సృష్టించాడు.. మరే హీరో కూడా అలాంటి సాహసం చేయలేని రికార్డ్‌ నెలకొల్పాడు.. ఆ తరవాత బాలయ్య జానపపద కథానాయకుడిగా తనను తాను నిరూపించుకున్న సినిమా భైరవధ్వీపం.. కమర్షియల్‌ సినిమాలో జోరులో కూడా ఓ ఫాంటసీలో భారీ సక్సెస్‌ కొట్టిన బాలయ్య బాక్సాఫీస్‌ మీద తన ఆదిపత్యాన్ని నిరూపించుకున్నాడు.. ఇక తెలుగు సినిమా ఫ్యాక్షన్‌ ట్రెండ్‌ తీసుకువచ్చిన హీరో కూడా బాలయ్యే. ఆయన సమరసింహా రెడ్డి చిత్రంతో ఫ్యాక్షన్ నేపథ్య  చిత్రాలకి శుభారంభాన్ని పలికారు. చాలామంది హీరోలు ఈ తరహా పాత్రలను చేసినా, ఎక్కువ మార్కులు బాలకృష్ణ కే దక్కాయి. అంతేకాదు బాలకృష్ణ కెరీర్‌ తడబడుతున్న కాలంలో కూడా మరోసారి ఫ్యాక్షన్‌ నేపధ్యంతో సాగే సింహా సినిమాతో మరోసారి సక్సెస్‌ అందుకున్నాడు బాలయ్య.. ఇక బాలయ్య చేసిన సినిమాలో అన్నింటికంటే ముఖ్యమైనవి పౌరాణికాలు.. తండ్రి వారసత్యంగా వచ్చిన నటనే కాదు ఆయన అలరించిన పాత్రలను కూడా తాను మాత్రమే చేయగలనని నిరూపించుకున్నాడు బాలయ్య.. శ్రీ కృష్ణార్జున విజయం, శ్రీరామరాజ్యం లాంటి సినిమాల లో పురాణ పురుషుడిగా నిరాజనాలు అందుకున్నాడు.. ప్రస్తుతం బాలకృష్ణ, అన్నగారు ఎన్టీఆర్ బయోపిక్లో నటిస్తున్నారు. బాలకృష్ణతో కలిసి 'గౌతమిపుత్ర శాతకర్ణి ' లాంటి అద్భుతమైన సినిమాని మనకి అందించిన 'క్రిష్' ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.. త్వరలోనే అన్నగారిగా బాలకృష్ణని మనం వెండితెర మీద చూడబోతున్నాం.. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేస్తున్నారు బాలయ్య .. బాలయ్య పని అయిపోయిందనే వ్యాఖ్యలు వినిపించిన ప్రతిసారి.. ఆ వ్యాఖ్యలకు చెంపపెట్టుగా ఓ సంచలన విజయం అందివ్వడం బాలయ్యకు అలవాటే. నేడు జన్మదినం జరుపుకుంటున్న నందమూరి బాలకృష్ణ మరెన్నో సంచలన విజయాలు సాధించాలని  మనస్ఫూర్తిగా కోరుకుంటు సెలవు.

Jr. NTR Ramcharan

రామ్ చరణ్ ‘నాయక్’ ఆడియో రిలీజ్ కు ఎన్టీఆర్ ?

      టాలీవుడ్ లో ఇద్దరు టాప్ హీరోలు ఓల్డ్ ట్రెడిషన్ ను ఫాలో చేయనున్నారు. తమ మధ్య ఉన్న ఇగో ఉందన్న వాదనలకు శుభం కార్డు వేయనున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒకే వేదికపై కనిపించనున్నారు. డిసెంబర్ 15 న నెక్లెస్ రోడ్డులని పీపుల్స్ ప్లాజా దద్దరిల్లబోతుంది. డిసెంబర్ 15 న జరగనున్న నాయక్ ఆడియో విడుదల కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరవుతాడని అంటున్నారు. ఇందుకు ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి. దర్శకుడు వివి వినాయక్ జూనియర్ కు బాగా సన్నిహితుడిగా గుర్తింపు ఉన్నవాడు, ఇప్పుడు చరణ్ తో సినిమా చేస్తున్నాడు! ప్రస్తుతం వినాయక్ కు కూడా మంచి హిట్ అవసరం ఉంది. కాబట్టి ఈ సినిమా విషయంలో మరింత హైప్ పెంచడానికి ఆడియో విడుదలకు జూనియర్ కు ఆహ్వానం పలకవచ్చు అంటున్నారు! ఇక ప్రస్తుతం చరణ్ , తారక్ లు ఇద్దరూ ఆర్ఎఫ్ సీలోనే గడుపుతున్నారు. ఎన్టీఆర్ ‘బాద్ షా’ విషయంలోనూ, చరణ్ ‘నాయక్’ విషయంలోనూ ఆర్ ఎఫ్ సీలో యాక్షన్ సీక్వెన్సుల చిత్రీకరణ లో బిజీగా ఉన్నారు. ఖాళీ సమయాల్లో వీరిద్దరూ సరదగా మాట్లాడుకుంటున్నారని అంటున్నారు. ఈ వార్త విని ఇరువురి ఫ్యాన్స్ లో ఆనందాలు రెట్టింపయ్యాయి. టాప్ హీరోలు ఒకే వేదికపై కనిపించను౦డడంతో వారి ఆనందాలకు హద్దులు లేకుండా పోయాయి.    

Tollywood Drugs Rocket

డ్రగ్స్ కేసులో దొరికిన సినీ నటుడు అభిషేక్

    డ్రగ్ రాకెట్ మళ్లీ టాలీవుడ్ ను తాకింది. తాజాగా మరో నటుడు డ్రగ్స్ వాడుతూ పట్టుబట్టాడు. ఐతే సినిమాతో పరిచయమై నువ్వొస్తానంటే నేనొద్దంటానా, గమ్యం వంటి సినిమాల్లో నటించిన అభిషేక్ డ్రగ్స్ తో పోలీసులకు దొరికిపోయాడు. గతంలో హీరో రవితేజ సోదరులు ఈ వివాదంలో పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులకు అభిషేక్‌ను హైదరాబాద్ లోని ఎస్ఆర్‌ నగర్ వద్ద పట్టుకున్నారు. అతని నుంచి పది గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అభిషేక్ పోలీసుల అదుపులో ఉన్నాడు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నాడు.

allu arjun

ఇద్దరమ్మాయిలకోసం 60 డ్రెస్సులేసిన కుర్రోడు

  ఇద్దరమ్మాయిలకోసం 60 డ్రెస్సులేసిన కుర్రోడు మరెవరో కాదు...మన స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్. త్వరలో ‘ఇద్దరమ్మయిలతో’ సెట్స్ మీదకు వెళ్లనున్న అల్లుఅర్జున్ ఈ సినిమాకోసం 60 రకరకాల డ్రెస్సులేసుకొని ట్రయల్ చూసాడు. మంచి ఊపుమీదున్న పూరీజగన్నాథ్ ఈ సినిమాకి దర్శకుడు. ఇద్దరూ కలిసి ఆడ్రెస్సులలో అల్లుఅర్జున్ ఎలాఉంటాడో తెలుసుకొనేందుకు ఈ మద్యనే ఒక ఫోటోషూట్ కూడా హైదరాబాదులో నిర్వహించేరు. అంతే గాకుండా, వారిదరుకలిసి సినిమాకి లోకేషన్లు వెతికే పనిలో కారులో హైదరాబాదు పరిసర ప్రాంతాలన్నీకూడా చుట్టబెట్టివచ్చినట్లు తెలిసింది.   మహేష్ బాబుతో తీసిన ‘బిజినెస్ మ్యాన్’ ఊహించినంత బిజినెస్ చేయకపోయినా పరువాలేదనిపించింది. అందుకే, పూరి జగన్నాథ్ ఈ సినిమాని తమ కేరీర్లోనే పెద్ద హిట్టుగా మలచాలని పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే విదంగా బాక్స్ఆఫీసు వద్ద నీరసపడిన ‘జులాయి’ అర్జున్ కూడా మరో పెద్ద హిట్ట్ పట్టాలనే పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమయినప్పటికీ, పూరి, అల్లుఅర్జున్ కాంబినేషన్ అంటే వారి అభిమానులలో అంచనాలు వారి ఊహిస్తున్నదానికన్నా కొంచెం ఎక్కువే ఉంటాయి అని వారికి తెలుసు. ఈ సినిమాలో అందాలభామలు అమలాపాల్ మరియు కేతరేయిన్ అల్లుఅర్జున్తో జత కట్టి అలరించబోతున్నారు. డిసెంబర్ 10వ తేదిన ఈసినిమా సెట్స్ మీదకి వెళ్ళవచ్చునని నిర్మాత బండ్ల గణేష్ తెలియజేసారు. సినిమాకి సంబంధించి పూర్తీ వివరాలను త్వరలో తెలియజేస్తానన్నారు.

ileana d'cruz barfi

వయసెక్కువ మగాళ్ళ౦టే ఇష్టం: ఇలియానా

    టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వలస వెళ్ళిన ఇలియానాకి అక్కడి కల్చర్ బాగానే అలవాటైంది. తాను వయసెక్కువ మగవాళ్ల పట్ల తను ఎట్రాక్ట్ అవుతుంటానని ఈ గోవా బ్యూటీ తేల్చి చెప్పింది. ఆమె మాట్లాడుతూ..."కొంచెం వయసెక్కువ మగవాళ్లతో నేను కనెక్టవుతుంటాను. దీనికి కారణం నేనున్న వృత్తి వల్లేనని నా అభిప్రాయం'' అంది. అలా ఎట్రాక్ట్ అవటానికి కారణం చెప్తూ..."సినీ రంగంలోని ఆడవాళ్లు చిన్న వయసులోనే బాగా ఎక్స్ పోజ్ అవుతుంటారు. అందువల్ల చాలా వేగంగా వారు పరిణతి చెందుతారు. మా అమ్మానాన్నల మధ్య వయసు తేడా పన్నెండేళ్లు. అలాగే మా అక్కా బావల మధ్య వయసు తారతమ్యం పదేళ్లు. ప్రేమలో పడ్డాక, వయసనేది పెద్ద విషయం కాదు'' అని చెప్పింది ఇలియానా.

 IT raids on Brahmi

బ్రహ్మీ ఇంట్లో ‘లెక్క’ లేని బంగారం ?

    ఇటీవల ఆదాయపు పన్ను శాఖ హైదరాబాద్ నగరంలో పలువురు సిని, టివి ప్రముఖుల ఇళ్ళ ఫై దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, అధికారులకు వీరి ఇళ్లలో ఏమి దొరికాయనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది. అధికారులు కూడా ఇంత వరకూ వీటికి సంబందించిన వివరాలేమీ వెల్లడించలేదు.   రాజధానిలో షికారు చేస్తున్న పుకార్ల ప్రకారం బ్రహ్మానందం ఇంట్లో పెద్ద మొత్తంలో బంగారం దొరికినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే జరిగిన అయన కుమారుని వివాహం లో ఇచ్చిపుచ్చుకున్న బంగారమే ఇది అని సరిపెట్టుకోవడానికి లేదు గదా? ఆదాయపు పన్ను శాఖ వారికి లెక్కలు చూపించాల్సిందే కదా ? అలాగే, ఈ కమెడియన్ ఇంట్లో భారీగానే ఆస్తులకు సంబందించిన పత్రాలు కూడ లభించినట్లు సమాచారం.   ఇక గాయని సునీత ఇంట్లో అత్యంత ఖరీదైన ఫారిన్ గిఫ్టులు లభ్య మయినట్లు సమాచారం. అలాగే గీతా మాధురి విషయం కూడా. అయితే, అధికారులు పూర్తి సమాచారం ఇచ్చే వరకూ అంతా సస్పెన్సే.  

Veena Malik MMS

వీణా మాలిక్ సెక్స్ ఎంఎంఎస్ వీడియో..పబ్లిసిటీ కోసమేనా?

    వీణా మాలిక్ బికినీలు, న్యూడ్ ఫోజులను జనాలు పెద్దగా పట్టించుకోక పోతుండటంతో పబ్లిసిటీ కోసం కొత్తరూట్లో ట్రై చేసింది. తన సహనటుడు తో సెక్స్లో పాల్గొన్న వీడియోతో వార్తల్లోకి ఎక్కింది. వీణా మాలిక్, రాజన్ వర్మతో కలిసి సెక్స్‌లో పాల్గొన్న ఎంఎంఎస్ వీడియో ఇంటర్నెట్‌లో లీక్ అయి హల్ చల్ చేస్తోంది. ఇదంతా కావాలని పబ్లిసిటీ కోసం చేసిన స్టంటే అని ఆ వీడియో చూస్తే ఇట్టే అర్థమవుతోంది. ప్రస్తుతం వీణా మాలిక్ తెలుగులో ‘నగ్న సత్యం' అనే చిత్రంలో నటిస్తోంది. అనురాధా ఫిలిమ్స్‌ పతాకంపై చదలవాడ శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. రామారావు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

అలా చేయడం వల్లే...!

    బొద్దుగా ముద్దుగా ఉండే దీక్షాసేత్ కి ఇప్పుడు అందులో అనుభవం బాగా వచ్చిందట. చాలామంది హీరోలు డైరక్టర్లతో చేశాకకానీ తనకి అసలు ఒడుపు తెలియలేదనికూడా చెబుతోందీ తెల్లతోలు సుందరి. ఇక నుంచి అడిగినవాళ్లకల్లా ఛాన్సివ్వడం కుదరదని చెప్పేస్తోందట. బాగా నచ్చినవాళ్లతోనే చేస్తానని కచ్చితంగా చెబుతున్న దగ్గర్నుంచీ చాలామంచి ఆఫర్లొస్తున్నాయటకూడా.. ఇంతకు ముందు సినిమాల్లో కేవలం తన క్యారెక్టర్ ని గురించి ఆలోచించడంవల్ల అంతగా వర్కవుట్ కాలేదనీ, ఇప్పుడు డైరెక్టర్, హీరో, కోఆర్టిస్టులు ఎవరో పూర్తిగా తెలుసుకున్నాకే కొత్త ఆఫర్ ని ఒప్పుకుంటోదట దీక్ష.. ఇంతకు ముందు ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోకపోవడంవల్ల ఫ్లాపుల పరంపరలో పడిపోయానని తెగ బాధపడిపోతోందీ సుందరి.

మనీషా కొయిరాలకు కేన్సర్

      బాలీవుడ్ ని ఒకప్పుడు ఓ ఊపు ఊపిన అందాల సుందరి మనీషా కొయిరాలా ఇప్పుడు కేన్సర్ బారిన పటడింది. కేన్సర్ ప్రభావాన్ని తీవ్రంగా అనుభవిస్తున్న మనీషా కొంతకాలంగా ఆమె జస్లోక్ ఆసుపత్రిలో  ట్రీట్మెంట్ తీసుకుంటోంది. మనీషా కేన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయాన్ని ఇంతకాలం దాచిపెట్టగలిగినా  ఇప్పుడా రహస్యం బైటపడిపోయింది.   నేపాల్ రాజ కుటుంబానికి చెందినా మనీషా కొయిరాలా  1991 లో సౌదగర్ చిత్రం తో హిందీ పరిశ్రమలో కాలుపెట్టింది. రజనీకాంత్, కమల్ హసన్ , షారుక్ ఖాన్ లాంటి సూపర్ స్టార్స్ తో సినిమాలు చేసి ఎందరినో అలరించింది. మనీషా కేన్సర్  మహమ్మారిని జయించి త్వరలో ఆరోగ్యం పుంజుకోవాలని కుటుంబసభ్యులతోపాటు అప్పట్లో ఆమెని పిచ్చిగా ఆరాధించిన అభిమానులుకూడా కోరుకుంటున్నారు. 

తాప్సిమీద మనసుపడ్డ లారెన్స్

      బొద్దు సుందరి తాప్సీ అందాల్ని చూసి లారెన్స్ ఫ్లాటైపోయాడు. ఒక్కసారి.. కనీసం ఒక్క ఛాన్సైనా కావాలనుకున్నాడు.. వెంటనే ఆఫరిచ్చాడు. లారెన్స్ తో చేయడానికి తాప్సీకూడా ఇష్టపడింది. ఇద్దరి దూకుడుని చూసి అటు తమిళ సినీ వర్గాలు, ఇటు తెలుగు సినీ వర్గాలూ ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నాయి.  ఇదంతా లారెన్స్ కొత్త సినిమా ముని 3 కి సంబంధించిన వ్యవహారం. తెల్లతోలు సుందరి అందం తన పక్కన నిలబడితే రెట్టింపౌతుందన్న ధ్యాసకూడా లేనంతగా లారెన్స్ ఫ్లాటయ్యాటంటే తాప్సీ ఈ మధ్య గ్లామర్ ఎంతగా పెంచిందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి తాప్సీ తెలుగులో చేసిన సినిమాలన్నీ ఫట్టయ్యాయి. ఒక్క మిస్టర్ పర్ ఫెక్ట్ మాత్రం కాస్తో కూస్తో మంచి టాక్ తీసుకొచ్చింది. అందులోకూడా తాప్సీ సెకండ్ హీరోయిన్ గానే చేసింది. తాప్సీ తమిళంలో చేసిన సినిమాల్నిచూసి పడిపోయిన లారెన్స్ తన లేటెస్ట్ మూవీలో ఛాన్సిచ్చాడు. ఈ సినిమా షూటింగ్ జనవరినుంచి మొదలవుతుందని నిర్మాత బెల్లంకొండ సురేష్ చెబుతున్నారు.  

శ్వేతా మీనన్ కాన్పు కథ

    మళయాళనటి శ్వేతామీనన్ నిజ జీవితంలోకూడా నటించింది. కడుపుతో ఉన్న దగ్గర్నుంచి పాపను కనేవరకూ నిజజీవతంలోనూ నటనలో జీవించింది. గర్భం ధరించిన రోజు దగ్గర్నుంచి వివిధ దశల్లో తనలో వస్తున్న మార్పుల్ని, తొమ్మిదో నెలలో తను కనిపించిన తీరుని “కలిమన్ను”  సినిమా డైరెక్టర్ షూట్ చేసి పెట్టుకున్నాడు.     శ్వేతకు నొప్పులొస్తున్న సమయంలో లేబర్ రూమ్ లో చకచకా కెమెరాల్ని అమర్చి కాన్పుని చిత్రీకరించారుకూడా. ఈ దృశ్యాల్ని నేరుగా అలాగే సినిమాలో ఉపయోగించారు. దీనిపై కేరళ అసెంబ్లీ స్పీకర్ తీవ్ర స్థాయిలో అసహనాన్ని వ్యక్తం చేశారు. కాన్పు వ్యక్తిగత వ్యవహారమని, దాన్ని పబ్లిక్ ఇష్యూ చేసి, తెరకెక్కించి డబ్బు చేసుకోవాలని చూడడం అవివేకమని వ్యాఖ్యానించారు.     ప్రకటనల్లో మహిళల్ని అసభ్యంగా చూపిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆక్షేపణలు తెలిపే మహిళా సంఘాలు ఈ విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నాయంటూ కేరళ అసెంబ్లీ స్పీకర్ మహిళా లోకాన్ని నిలదీశారు. శ్వేత మాత్రం తాము చేసింది తప్పేమీ కాదంటూ కలిమన్ను దర్శకుడిని వెనకేసుకొస్తోంది. తాను మాతృత్వ మాధుర్యాన్ని చవిచూసే సమయంలో తన భర్తకూడా లేబర్ రూమ్ లో ఉన్నాడని చెబుతోంది.