Venkatesh|Seethamma Vakitlo Sirimalle Chettu|mahesh babu svsc|Mahesh Babu

"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" స్పెషల్ షో చూసిన మహేష్, వెంకటేష్

        సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ నటించిన "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. నిన్న సిటి లో "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" స్పెషల్ ప్రిమియర్ షో వేశారు. ఈ ప్రిమియర్ కి వెంకటేష్, మహేష్ ఫ్యామిలితో కలిసి హాజరయ్యారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఫ్యామిలితో స్పెషల్ షో చూశారు. ఈ చిత్రం గురించి ఆయన మరిన్ని వివరాలు వెల్లడిస్తూ...దాదాపు 25 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ మల్టీ స్టారర్ ఈ సంక్రాంతికి మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా జనవరి 11న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నాము. తప్పకుండా అందరి ఎక్స్ పెక్టేషన్స్ ని ఈ సినిమా రీచ్ అవుతుంది. మా బేనర్ పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలవుతున్న ఈ చిత్రం మా బేనర్ ప్రెస్టేజ్ మరింత పెంచుతుంది. ఈ మల్టీ స్టారర్ ఇంత బాగా రావడానికి దోహద పడిన వెంకటేష్, మహేష్ బాబులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అన్నారు.

sunny leone

సన్నీలియోన్ పాపకు ఇంకా ట్రెయినింగు కావాలిట!

  నీలిచిత్రాల సుందరి సన్నీ లియోన్ ఏ ముహుర్తాన్నమనదేశంలో కాలు పెట్టిందో గానీ, నాటి నుండి మరి వెనుతిరిగి చూసుకోవలసిన అవసరమే పడలేదు ఆమెకు. ఒక ప్రైవేట్ హిందీ చానెల్ వాళ్ళు రెండు సం.ల క్రితం నిర్వహించిన ‘బిగ్ బ్రదర్’ రియాల్టీ షోలో పాల్గొన్న ఆమెకు బాలీవుడ్ రెడ్-కార్పెట్ పరిచి మరీ స్వాగతించింది. బహుశః ఆమె అప్పటికే నీలి చిత్రాలలో చాలా అనుభవం సంపాదించుకొని ఉందిగనుక, బాలీవుడ్ అవసరానికన్నా ఎక్కువే ఆమె నుండి పొందవచ్చుననే ఆశతో స్వాగతించినందుకు, సన్నీపాప కూడా వారిని ఎన్నడూ నిరాశాపరచకుండా అడిగినంతా అందాలు ప్రదర్శన చేస్తోంది.   మొదట ప్రజలు ‘అటువంటి పిల్లతో సినిమాలా’ అంటూ బుగ్గలు నొక్కుకోన్నపటికీ, ఆ తరువాత ఆమె బయటపెట్టిన తన అందాలకు దాసోహం అనక తప్పలేదు. ఆమె మొదటి సినిమా 'రాగిణి యం యం.యస్.' లో ఆమె అందాలకు దాసోహమన్న బాలీవుడ్ వెంటనే జిస్మ్-2 తో ఆమె నగ్న అందాలను దాదాపు తడిపి ఆరేసేసింది. నీలి చిత్రాలలో పడే శారీరిక శ్రమతో పోలిస్తే బాలీవుడ్ సినిమాలలో నటించడమే ఆమెకు తేలికగా కన్పించడమే గాకుండా,ఎన్ని నీలి చిత్రాలలో చేసినా రాని పేరు, సంపాదించలేని డబ్బు, పాపులారిటీ అన్నీకూడా కేవలం రెండే రెండు సినిమాలతో వచ్చి ఆమె ఒంటి మీద నిలవని కొంగులోపడటం, ప్రజలు, మీడియా రెండూ కూడా బ్రహ్మ రధం పట్టడం చూసిన నీలి చిత్రాల అందాల సుందరి లియోన్, ఇక బాలీవుడ్ లోనే ఉండి పోవలనుకొంటున్నట్లు ప్రకటించడంతో ఆమెనే నమ్ముకొని బ్రతుకుతున్న నిర్మాతలు, ఆమె అభిమానులు అందరూ కూడా మహదానంద పడిపోయేరు.   ఇటీవలే, ఆమెకు మరో హిందీ సినిమా ఆఫరు కూడా వచ్చింది. అది కూడా తానూ చేసిన ‘రాగిణి యం .యం.యస్.’సినిమాకి సీక్వెల్ కావడంతో తన పాపులారిటీకి తానే మురిసిపోయింది సన్నీ పాప. అయితే, రెండు హిందీ చిత్రాలలో ఒళ్ళు చూపించి ఎలాగో నెట్టుకొచ్చేసినా, చాలా నీలి చిత్రాలలో నటించిన అనుభవం తనకి ఉన్నపటికీ, బాలీవుడ్ సినిమాలకి పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నట్లు ఆమె భావించి, అదే విషయాన్నీతన కొత్త సినిమా దర్శకుడు భూషణ్ పటేల్ కు చెప్పి అతని సాయం కోరింది భారీ అందాలు భారంగా మోసుకు తిరుగుతున్న సన్నీపాప. కానీ, ఆమె అభిమానులు, దర్శక నిర్మాతలు అందరూ కూడా ఆమె నుండి కోరుకొంటున్నది నటన కాదని ఆమెకు ఎవరూ చెప్పలేదు.   అటువంటి అనుభవజ్నురాలయిన శిష్యురాలు దొరకడమే తన అదృష్టంగా భావించిన దర్శకుడు భూషణ్ కూడా శ్రమ అనుకోకుండా తనకు తెలిసినవి ఆమెకు నేర్పిస్తూ, ఆమెకు తెలిసినవి తానూ నేర్చుకొంటున్నాడని బాలివుడ్ సమాచారం. మరి మన తెలుగు నిర్మాతలు దర్శకులు ఆమె గురించి ఇంకా ఆలోచించినట్లు లేదు.

Viswaroopam release postponed

విశ్వరూపం డీటీహెచ్ కంటే ముందే...

        నెల రోజుల నుంచి డీటీహెచ్ లలో విడుదల కావడం గురించి వార్తల్లో నిలుస్తూ సంచలనంగా మారిన విశ్వరూపం సినిమా విడుదలకు ముందే కష్టాలను ఎదుర్కొంటుంది. ఈ నెల 11 న విడుదల కావాల్సిన విశ్వరూపం సినిమా విడుదల వాయిదాపడింది ఈ చిత్రానికి థియేటర్లు దొరకక పోవడం వల్ల విడుదల వాయిదాపడినట్లు తెలుస్తోంది. ఇక మరో విశేషం ఏంటంటే..ఈ సినిమా డీటీహెచ్ విడుదలను కూడా వాయిదా వేశారు. కమల్ హాసన్, తమిళనాడు థియేటర్ల ఓనర్ల మధ్య రాజీ కుదిరింది. ఈ మేరకు సినిమాను జనవరి 25న విడుదల చేయాలని, సినిమా థియేటర్లలో విడుదలైన నాలుగు రోజుల తర్వాత(జనవరి 28న) డిటిహెచ్ ద్వారా సినిమాను నేరుగా టీవీల్లో ప్రసారం చేయాలనే నిర్ణయాన్ని ఇరు వర్గాలు ఆమోదించాయి. దీంతో వివాదం కాస్త సద్దుమనిగినట్లయింది.

Nayak telugu movie review|Nayak review|Nayak movie review|Naayak movie review

నాయక్ హైలైట్స్

        మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ "నాయక్" తో కొత్త సంవత్సరంలో టాలీవుడ్ కి తొలి సూపర్ హిట్ ఇవ్వాలని ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ మూవీ హైలైట్స్ మీ కోసం:   నాయక్ గా రామ్ చరణ్ అద్బుతంగా నటించాడు. ఆయన వాయిస్ మొడ్యులేషన్ బాగా ఇంప్రూవ్ చేశారు. ఈ సినిమాలో చరణ్ డాన్సు లు చాలా బాగున్నాయి. “లైలా ఓ లైలా” మరియు  "హే నాయక్” పాటలలో చరణ్ డాన్సు తో అదరగొట్టాడు. కాజల్ సినిమాలో చాలా అందగా కనిపించింది. రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ కెమిస్ట్రీ బాగుంది. అమలా పాల్ కి పెద్ద ప్రాధాన్యం ఉన్న పాత్ర కాదు ఓన్లీ పాటల వరకే పరిమితమైంది.       బ్రహ్మానందం జిలేబి పాత్ర సినిమాకి హైలైట్. తన కామెడీ తో ఆడియన్స్ ని కడుపుబ్బనవ్విస్తారు.  కోల్ కత్తా లో  క్రిమినల్ గా పోసాని కృష్ణ మురళి చాలా బాగా నటించారు. సెకండ్ హాఫ్ లో వచ్చే చాక్లెట్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.    ఎంఎస్ నారాయణ సి.బి.ఐలో తాగుబోతు లిప్ రీడింగ్ స్పెషలిస్ట్ గా, రాహుల్ దేవ్ కి పెద్దన్న పాత్రలో జయప్రకాశ్ రెడ్డి బాగా నటించారు. నాయక్ ఫస్ట్ హాఫ్ రామ్ చరణ్, బ్రాహ్మనందం మధ్య కామెడీ సన్నివేశాలతో వేగంగా సాగుతుంది. సెకండ్ హాఫ్ లో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో కొంచే బోరింగ్ గా ఉంటుంది. వినాయక్ సెకండ్ హాఫ్ పై కొంచెం కేర్ తీసుకొని ఉంటే బాగుండేదని అంటున్నారు.      ఈ సినిమాకి చోటా కె నాయుడు సినిమాటోగ్రఫి ప్రధాన ఆకర్షణ గా చెప్పుకోవచ్చు. ఐస్ ల్యాండ్ లో  చిత్రీకరించిన పాటలు చాలా అద్బుతంగా ఉన్నాయి. తమన్ మ్యూజిక్ సినిమా విడుదల ముందే హిట్ అయింది. వి వి వినాయక్ "నాయక్" తో కథలో కొత్తదనం చూపించలేకపోయినా చిత్రాన్ని వినోదాత్మకంగా మరియు వేగవంతంగా నడిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

SVSC Censor Report|SVSC censor

"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" కి ‘U' సర్టిఫికెట్

          సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ నటిస్తున్న మల్టీస్టారర్ "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ ‘U' సర్టిఫికెట్ జారి చేసింది. అందరు అనుకున్నట్లుగానే సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సర్టిఫికెట్ దక్కిచుకుంది. 25 సంవత్సరాల తర్వాత టాలీవుడ్ లో వస్తున్న మల్టీస్టారర్ ఫిల్మ్ ఇది. ఈ చిత్రాన్ని జనవరి 11న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇటీవల విడుదలైన "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు. ఈ సినిమాలో మహేష్ పక్కన సమంత, వెంకటేష్ పక్కన అంజలి హీరోయిన్లు గా నటిస్తున్నారు.ప్రకాష్ రాజ్, జయసుధ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం ముఖ్యమైన పత్రాలను పోషిస్తున్నారు. ఈచిత్రానికి సంగీతం : మిక్కీజె మేయర్, ఎడిటింగ్ : మార్తాండ్ కె. వెంకటేష్, సినిమాటోగ్రఫీ : గుహన్, ఫైట్స్: విజయ్.    

Nayak Movie

1210 ధియేటర్లలో "నాయక్" గ్రాండ్ రిలీజ్

          మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ "నాయక్" రేపు రిలీజ్ కానుంది. ప్రపంచ వ్యాప్తంగా 1210 ధియేటర్లలో, ఓవర్సీస్ లో 140 ధియేటర్ లలో గ్రాండ్ గా విడుదల చేస్తున్నామని డైరెక్టర్ వినాయక్ చెప్పారు. ‘సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. తమన్ అందించిన సంగీతం మా సినిమాకు తొలి సక్సెస్. ఇప్పటికే సినిమాను చూసిన ప్రముఖులు అద్భుతంగా వచ్చిందని మెచ్చుకున్నారు. సినిమాల్లో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయి. ముఖ్యంగా బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డిల కామెడీ బాగా నవ్విస్తుంది. ఆకుల శివ కథ, మాటలు సినిమాకు మరో హైలెట్. నాయక్ సినిమా చరణ్ తో చేస్తున్నంత చేసే చిరంజీవితో చేసినట్లే అనిపించింది. సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అన్నారు.

nayak record theaters

హైదరాబాద్‌లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు పై నాయక్ రికార్డ్...!

        టాలీవుడ్ లో ఈ సంక్రాంతి కి బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు మెగా సినిమాలు పోటిపడుతున్న సంగతి తెలిసిందే. అవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న "నాయక్", సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న మల్టీస్టారర్ "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు". అయితే రికార్డుల పరంగా ఏ సినిమా పై చేయి సాధిస్తుందనేది అభిమానుల్లో చర్చనీయాంశం గా మారింది.   తెలుగు సినిమా కలెక్షన్ లకు హార్ట్ గా భావించేది నైజాం ఏరియా, అందులో ఎక్కువగా వసూళ్ళు  హైదరాబాద్ నుంచె వస్తుంది. కనుక హైదరాబాద్ లో ఎక్కువ ధియేటర్లను దక్కించుకొనేందుకు ఈ రెండు సినిమాలు పోటిపడుతున్నాయి. అయితే ఈ పోటిలో రామ్ చరణ్ నాయక్ ఎక్కువ ధియేటర్లు దక్కించుకున్నట్లు సమాచారం.         హైదరాబాద్ వ్యాప్తంగా నాయక్ చిత్రానికి తొలి రోజు 110 స్క్రీన్లు దక్కినట్లు తెలుస్తోంది. మహేష్, వెంకటేష్ నటిస్తున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రానికి 80 నుంచి 90 మధ్య  థియేటర్లు దక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ రెండు చిత్రాలను నైజా౦ ఏరియాలో  దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు. "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" కి దిల్ రాజు నిర్మాత కూడా. ఈ నేపథ్యంలో దిల్ రాజు నాయక్ కంటే తన సొంత సినిమాను ఎక్కువ థియేటర్లు కేటాయిస్తారనే ప్రచారం జరిగింది. కానీ చిరంజీవి ప్రభావమో లేక అల్లు అరవింద్ మహిమో తెలియదు కానీ, మొత్తానికి ‘నాయక్' చిత్రం హైదరాబాద్ ఏరియాలో అత్యధిక థియేటర్లు దక్కించుకుంది.  

NTR nayak movie

నాయక్ ఫస్ట్ షో చూడనున్న జూనియర్ ఎన్టీఆర్

      మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన "నాయక్" ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. నాయక్ ఫస్ట్ డే ఫస్ట్ షో ని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చూడబోతున్నారని సమాచారం. హైదరాబాద్ కాచిగూడ లోని పాత ధియేటర్లో ఒకటైన తారకరామ ధియేటర్ గత కొంత కాలంగా నవడటం లేదు. దాని స్థానంలో ఇప్పుడు కొత్త ధియేటర్ ను నిర్మించారు. నాయక్ సినిమాతో ఈ ధియేటర్ పున:ప్రారంభం కానుంది. ఈ ధియేటర్ ప్రారంభానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరై రామ్ చరణ్ "నాయక్" ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తారని అంటున్నారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు.  కొత్త ధియేటర్ ని ఆదునిక సౌకర్యాలతో నిర్మించారని...దీనిలో లేటెస్ట్ జేబిఎల్ సౌండ్ సిస్టం, లగ్జరీ సీటింగ్, మల్టీప్లెక్స్ సినిమా ఎక్స్పీరియన్స్, భారీగా పార్కింగ్ సౌకర్యం కలదు.  

viswaroopam kamal hassan

కమల్ హాసన్ కు ‘విశ్వరూపం’ మూవీ కష్టాలు..!

      కమల్ హాసన్ కు అనేక రూపాల్లో కష్టాలు ముంచుకొస్తున్నాయి. సినిమాను విడుదలకు ముందే డీటీహెచ్ ద్వారా ప్రసారం చేసి, సరికొత్త స్టైల్లో క్యాష్ చేసుకుందామనుకుంటున్నకమల్ కు ఇప్పుడు కరెంటు రూపంలో కష్టాలుముంచుకొస్తున్నాయి. ఇవి ఆయనలో చాలా ఆందోళన రేపుతున్నాయి. కొందరు అగంతకులు కమల్ కు ఫోన్ చేసి చిత్రమైన బెదిరింపు చేశారు. డీటీహెచ్ ద్వారా విశ్వరూపం సినిమాను ప్రసారం చేస్తే ఆ సమయంలో కరెంటు సరఫరా లేకుండా అడ్డుకుంటామంటూ ఓ ఫోన్‌కాల్ వచ్చింది కమల్ కు. దీనిపై కమల్ పోలీసులను ఆశ్రయించాడు. కమల్‌హాసన్ నటిస్తూ దర్శకత్వం వహించిన ‘విశ్వరూపం’ విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ బెదిరింపు కాల్ వచ్చింది. ఈ నెల 11న సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుండగా, ముందు రోజు రాత్రి డీటీహెచ్ ద్వారా సినిమాను బుల్లితెరపై వీక్షించేందుకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే బెదిరింపు కాల్ కేవలం కమల్ నే కాదు, చాలా మంది ప్రేక్షకుల్లో కూడా ఆందోళన రేపుతోంది. వీరు డీటీహెచ్ ద్వారా సినిమా చూద్దామనుకునే సమయానికి తమ ఏరియాలో కరెంటు పోతే! అంతే సంగతులు. ముందుగా డబ్బుచెల్లించి, సినిమా ప్రసారం అయ్యే టైమ్ కు గానీ ఏమైనా ట్రబుల్ ఎదురైతే… సొమ్ము పోగా, సినిమా కూడా అయిపోతుంది!

viswaroopam movie

విశ్వరూపంతో కమల్ హాసన్ మరో కొత్త ప్రయోగం..!

  దాదాపు రూ.160 కోట్ల భారి బడ్జెట్టుతో కమల్ హస్సన్ నటించి దర్శకత్వం వహిస్తున్న ‘విశ్వరూపం’ సినిమా ఈ నెల 11వ తేదిన ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. తమిళ్, తెలుగు మరియు హిందీ బాషలలో ఒకేసారి విడుదల అవుతున్న ఈ సినిమా పై భారి అంచానాలు ఉన్నాయి.   ఇంతవరకు అంతాబాగున్నపటికీ, తన సినిమాలతో నిత్యం ప్రయోగాలు చేసే కమల్ ఈసారి కూడా మరో ప్రయోగం చేయబోతున్నాడు. అయితే, ఈ ప్రయోగం కొందరికి మోదం, మరి కొందరికి ఖేదం కలిగిస్తోంది. ఈ సినిమాను సినిమా థియేటర్లలో విడుదలకు ఒక రోజుముందే అనగా ఈ నెల 10వ తేదీనే డి.టి.హెచ్. ద్వారా టీవీ ఛానాళ్లలో విడుదల చేయాలనే కమల్ యొక్క ఈ కొత్త ప్రయోగం సినీ పరిశ్రమని, ప్రజలను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇదొక అద్భుత ప్రయోగం, భారతీయ సినీ పరిశ్రమకి ఒక కొత్త మలుపునిస్తుంది అని సినిమా నిర్మాతలు, దర్శకులు కమల్ ను ప్రశంశలతో ముంచచెత్తుతుంటే, మరోవైపు అయన ప్రయోగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు తమిళనాడుకి చెందిన సినిమా పంపిణీదారులు, థియేటర్ల యజమానులు.   కేవలం రూ.1000 లతో ఇంట్లో వారే కాకుండా ఇరుగుపొరులతో సహా అందరూ సినిమాని విడుదలకి ముందే చూసేస్తే ఇక థియేటర్లకి ఎవరొస్తారు, ఎందుకు వస్తారు? అని ప్రశ్నిస్తున్నారు. అంతేగాకుండా, పైరసీదారులు సినిమాని మరింత సౌకర్యంగా కాపీలుచేసుకొని, మరింత చవకగా వీదుల్లో బెట్టి అమ్మేస్తే, ఇక సినిమా హాలుకి జనం ఎందుకు వస్తారు?అని ప్రశ్నిస్తున్నారు. తద్వారా సినిమా తొలివారం కలెక్షన్లు దెబ్బతింటే, ముందుగా నష్టబోయేది తామే తప్ప నిర్మాతలు, హీరోలు మాత్రం కారని సినిమా పంపిణీదారులు, థియేటర్ల యజమానులు వాపోతున్నారు.   తమవల్లనే ఈ స్థాయికి జేరుకొన్న కమల్ హస్సన్, ఇప్పుడు ఏరు దాటేక తెప్ప తగలేస్తున్నట్లు ఈవిదంగా తమ జీవితాలతో చెలగాటం ఆడుకోవడం సబబు కాదని వారు అంటున్నారు. అంతే గాకుండా, ఇప్పుడు కమల్ హస్సన్ చేపటిన ఈ ప్రయోగం గానీ విజయవంతం అయినట్లయితే మున్ముందు చిన్నా, పెద్ద నిర్మాతలు కూడా ఇదే దారిని అనుసరిస్తే ఇక తాము సినిమా హాళ్ళు మూసుకొని వీధినపడవలసిందే అని వాపోతున్నారు.   తమిళనాడుకి చెందిన సినిమా పంపిణీదారులు, థియేటర్ల యజమానులు కమల్ హస్సన్ ని హెచ్చరిస్తూ ఇప్పటికయినా ఈ ప్రయోగం మానుకోకపొతే, తాము విశ్వరూపం చూపించి అతని సినిమాని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సినిమా హాళ్ళలో ఎక్కడా ప్రదర్శించకుండా నిషేధం విదిస్తామని అన్నారు. గానీ, కమల్ వారివాన్ని అర్ధంలేని భయాలే అని తన ప్రయోగం అమలు చేయడానికే నిశ్చయించుకొన్నాడు.

 Ram charan Nayak movie

నాయక్ తో రచ్చరచ్చ చేయనున్న రామ్ చరణ్

      రామ్ చరణ్ నాయక్ మూవీ ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. సెన్సార్ నుంచి "ఏ" సర్టిఫికేట్ అందుకున్న నాయక్ సినిమా రిలీజ్ డేట్ ట్రైలర్లను విడుదల చేశారు. సినీ వర్గాలలో ఈ సినిమా టాక్ చాలా బాగుంది. నాయక్ మూవీ లో ఇంటర్వెల్ బ్లాక్ ఈ సినిమాకి హైలైట్ నిలుస్తుందని సమాచారం.   ఓ పక్కా మాస్ మూవీ ఏవేవి ఎక్కడేక్కేడ కుదరాలో, నాయక్ సినిమాలో అవన్ని కరెక్ట్ గా సమకురాయని ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రచ్చ చేయడం ఖాయమని అంటున్నారు. రామ్ చరణ్  ఫైట్స్, డాన్సులు మెగా అభిమానులను కనువిందు చేస్తాయట. హిట్స్ లేక సతమతమవుతున్న వినాయక్ "నాయక్" తో తన రేంజ్ ఏంటో చూపిస్తాడని అంటున్నారు.       రామ్ చరణ్ నాయక్ తో రచ్చ కంటే పెద్ద హిట్ కొడతాడు, కాని "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" నుంచి ఎదురయ్యే పోటిని ఎంత వరకు తట్టుకోగాలడో వేచి చూడాలి..!       

sherlyn chopra ready for being raped| sherlyn chopra ready for rape| sherlyn chopra rape

హాట్ షెర్లిన్ చోప్రా హాట్ ఆఫర్....!

        " నన్ను రేప్ చేస్తే ఇకా ఇండియాలో అసలు రేప్ లు జరగకుండా ఉంటాయంటే నేను రేప్ చేయించుకోవడానికి రెడీ" అని షెర్లిన్ చోప్రా ట్విట్టర్ లో ప్రకటించింది. ఆమె చేసిన ఈ సంచలన ప్రకటన అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పోయి పోయి పచ్చిగా రేప్ చేయించుకుంటాను అని చాంటింపు వేసిందేంటా అని నోరెళ్ల బెడుతున్నారు.. ఈ బాలీవుడ్ తారలు ఏ సమస్య మీద ఎలా స్పందిస్తారో అర్థంకాదు. ఢిల్లీ గ్యాంగ్ రేప్ సంఘటనపై దేశమంతట నిరసనలు పెలుబికుతుంటే...ఈ బాలీవుడ్ హాట్ స్టార్ మాత్రం కొత్త సవాల్ లు విసురుతోంది. షెర్లిన్ చోప్రా చేసిన ట్విట్:     (“Dear HATERS, u say that I should be raped. IF my rape can guarantee no further rapes of India’s daughters, then I am ready by all means# No fear”)

Sesh adivi kiss|Sesh adivi|kiss telugu movie|kiss telugu film

"కిస్" తో వస్తున్న అడివి శేష్

      పంజా అండ్ కర్మ ఫేం అడివి శేష్ నటిస్తున్న కొత్త సినిమా "కిస్" మూవీ షూటింగ్ రీసెంట్ గా మొదలు పెట్టారు. మిస్ కెనడా టైటిల్ గెలుచుకున్న 'ప్రియ బెనర్జీ' ఇండో కెనేడియన్ ఈ సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ కి పరిచయమవుతోంది. "కిస్" Keep it simple stupid అనే ట్యాగ్ లైన్ తో వస్తుంది. "కిస్" మూవీ ని వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు డైరెక్టర్ “నంది అవార్డు గ్రహీత” సాయి కిరణ్ అడివి మై డ్రీమ్ సినిమా బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా వేసవి సెలవుల కానుకగా విడుదలకానుంది. ప్రస్తుతం అడివి శేష్ రవితేజ నటిస్తున్న బలుపు సినిమాలో ముఖ్యమైన పాత్రను చేస్తున్నారు. హీరో: అడివి శేష్ , హీరోయిన్: ప్రియ బెనర్జి (మిస్ కెనడా), ఇతర నటులు: డాక్టర్ భారత్ రెడ్డి, షఫి. జానర్: రొమాంటిక్ కామెడి. బ్యానర్: మై డ్రీం సినిమా (ప్రి)లిమిటెడ్ /థౌజండ్ లైట్స్.రచన : సాయికిరణ్ అడివి/అడివి శేష్. ఛాయాగ్రహణం:  షేనీల్ దియో. సంగీతం: శ్రీ చరణ్ పాకాల / పీట్ వండర్. దర్శకత్వం: అడివి శేష్. 

Ram Gopal Varma's daughter gets engaged to her boyfriend

కూతురు రేవతి నిశ్చితార్థంలో రామ్ గోపాల్ వర్మ

      రామ్ గోపాల్ వర్మ కూతురు రేవతి నిశ్చితార్థం హైదరాబాద్‌లోని రాడిస్సన్ హోటల్‌లో జరిగింది. ఈ వేడుకలో రామ్ గోపాల్ వర్మ పాల్గొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఎమ్ బీబీఎస్ చదువుతున్న రేవతి వర్మ తన సహచర విద్యార్ధి ప్రణవ్ ని వివాహం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సంప్రదాయాలకు వ్యతిరేఖిగా మాట్లాడే వర్మ నిశ్చితార్థ కార్యక్రమంలో అసలైన తండ్రి రోల్ పోషించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఈ కార్యక్రమానికి హాజరైన దర్శకుడు రాజమౌళి తన ట్వీట్ తో తెలియజేశాడు. కూతురి నిశ్చితార్థంలో వర్మ పోషించిన రోల్ గురించి రాజమౌళి ఈ విషయమై ట్వీట్ చేస్తూ... "వర్మ తన కుమార్తె రిసెప్షన్ లో ఓ భాద్యత గల తండ్రిగా ఉండటం చాలా ఆనందం కలిగించింది... వాటే సైట్....హ..హ..హ" అన్నారు. ఇక ఈ పంక్షన్ కి హాజరైన వారు రాము చాలా ఆనందంగా ఈ పంక్షన్ లో పాల్గొన్నాడని, చాలా ఉత్సాహంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ పంక్షన్ కి చాలా తక్కువ మంది పరిశ్రమలో వారిని ఇన్వైట్ చేసారు.

రామానాయుడు మనవడు అభిరామ్ పై కేసు నమోదు

      టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ డి. రామానాయుడు మనవడు అభిరామ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అపోలో ఆసుపత్రి వద్ద ఉన్న రవి తేజ అనే ఇంజినీర్ ఇంటిపై రామానాయుడు మనవడు అభిరామ్ దాడి చేశారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంత కాలంగా అభిరామ్, ఇంజినీర్ రవితేజ మధ్య విభేదాలు ఉన్నాయని సమాచారం. శుక్రవారం రవితేజ కలిసిన అభిరామ్ అతని పై దాడికి పాల్పడ్డారని అంటున్నారు. అక్కడ ఉన్న పోలీసులు చెబుతున్న వినకుండా రవితేజ ఇ౦టిపై అభిరామ్ దాడి చేశారు. దీంతో ఇంజినీర్ కి గాయాలయ్యాయి. పోలీసులు అభిరామ్ పై 341, 323, 506 సెక్షన్ల కిందకేసు నమోదు చేశారు.

ఢిల్లీ గ్యాంగ్ రేప్ : షెర్లిన్ ట్విట్ సంచలన౦

      " నన్ను రేప్ చేస్తే ఇకా ఇండియాలో అసలు రేప్ లు జరగకుండా ఉంటాయంటే నేను రేప్ చేయించుకోవడానికి రెడీ" అని షెర్లిన్ చోప్రా ట్విట్టర్ లో ప్రకటించింది. ఆమె చేసిన ఈ సంచలన ప్రకటన అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పోయి పోయి పచ్చిగా రేప్ చేయించుకుంటాను అని చాంటింపు వేసిందేంటా అని నోరెళ్ల బెడుతున్నారు.. ఈ బాలీవుడ్ తారలు ఏ సమస్య మీద ఎలా స్పందిస్తారో అర్థంకాదు. ఢిల్లీ గ్యాంగ్ రేప్ సంఘటనపై దేశమంతట నిరసనలు పెలుబికుతుంటే...ఈ బాలీవుడ్ హాట్ స్టార్ మాత్రం కొత్త సవాల్ లు విసురుతోంది. షెర్లిన్ చోప్రా చేసిన ట్విట్:      (“Dear HATERS, u say that I should be raped. IF my rape can guarantee no further rapes of India’s daughters, then I am ready by all means# No fear”)  

అదరగొట్టిన సన్నీలియోన్

    బాలీవుడ్ నటి గా కూడా మారిన పోర్న్ స్టార్ సన్నీ లియోన్ కొత్త సంవత్సర వేడుకలలో అదరగోట్టేసింది. దేశ రాజధాని ఢిల్లీ లో కుర్రకారుకు మత్తెక్కించేసింది. అనేక మంది బాలీవుడ్ నటీమణులు కొత్త సంవత్సర వేడుకలను సుదూర ప్రాంతాల్లో జరుపుకోగా, మరి కొంత మంది ఢిల్లీ రేప్ భాదితురాలి మృతికి సంతాపంగా అసలు ఈ వేడుకలకు దూరంగా ఉండగా, సన్నీ మాత్రం తన తొలి స్టేజ్ ప్రదర్శనను ఇచ్చింది.   ఢిల్లీ నగరంలోని లలితా హోటల్లో ఓ గంట ప్రదర్శన కోసం తాను తీసుకొన్న కోటి రూపాయలకు పూర్తి ‘న్యాయం’ చేసింది. గత డిసెంబర్ 31 అర్ధ రాత్రి ఆ హోటల్ లో ఆమె ఇచ్చిన ప్రత్యక్ష ప్రదర్శనకు సుమారు మూడు వేల మంది కుర్ర కారు ఈలలు, చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘ఏ జిస్మ్ హైతో క్యా, డిస్కో దీవానే,అభీ...అభీ’ వంటి పాటలకు తన సన్నని నడుమును ఊపుతూ కుర్ర కారులో పూర్తి హుషారును నింపింది.   అంతే కాదు, అమెరికా పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్ ఆల్బం లోని కొన్ని పాటలకు కూడా ఆమె నృత్యం చేసింది. సన్నీ చేసిన పాటలకు ప్రేక్షకులకు పిచ్చెక్కిపోయిందని ఆమె భర్త డేనియల్ వెబర్ ఆనందంతో చెప్పాడు. వారి రెస్పాన్స్ అద్భుతంగా ఉందని, సన్నీ కార్యక్రమాన్ని వారు చాలా బాగా ఆనందించారని వెబర్ అన్నారు.   మరోవైపు ప్రేక్షకుల ప్రతిస్పందన తనకు బాగా నచ్చిందని సన్నీ అన్నారు.

రికార్డ్ రిలీజ్ పై కన్నేసిన రామ్ చరణ్ 'నాయక్'

      నాయక్ సంక్రాంతికి హంగామా చేయనున్నాడు. రామ్ చరణ్, వినాయక్ కాంబినేషన్ లో వస్తున్న తొలి మూవీ కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ పై టాలీవుడ్ లో హాట్ గా చర్చలు జరుగుతున్నాయి. చిరంజీవి ఈ సినిమాలో కొన్ని మార్పులు చేశారని వార్తలు రావడంతో ఈ సినిమాపై మెగా అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ప్రాంతాల వారిగా అమ్ముడుపోయిన ఈ సినిమా అన్ని ఏరియాల్లో ఎక్కువ ధియేటర్ లో రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం హైదరాబాద్లో వంద ధియేటర్లో, నైజాం లో మూడువందల పైగా ధియేటర్లో విడుదల చేయటానికి నిర్ణయించారు. వైజాగ్ ఏరియాల్లో వందకు పైగా ధియేటర్లో రిలీజ్ చేయనున్నారు. ఈస్ట్, వెస్ట్, గుంటూరు, కృష్ణా జిల్లాలో కూడా భారీగా విడుదల చేయడానికి ప్లాన్ చేసినట్టు సమాచారం.