Janaki rejects Padma Bhushan

పద్మభూషణ్ వద్దు...భారతరత్న కావాలి: ఎస్.జానకి

        ప్రభుత్వం తనకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించడం పట్ల ప్రముఖ గాయని ఎస్.జానకి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నాకు భారతరత్న తప్ప మరో అవార్డు అవసరం లేదని తేల్చి చెప్పారు. పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా మీడియా ఆమెను స్పందన కోరింది. దీంతో ఆమె తీవ్రంగా స్పందించారు. అసలు నాకు పద్మభూషణ్ అవార్డు అక్కర్లేదని చెప్పారు. “ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడీ అవార్డు వచ్చి ఉపయోగం ఏముంది?  దక్షిణాదికి ఎప్పుడూ అన్యాయమే జరుగుతోంది. నేను పెద్దసంతృప్తిగా అయితే ఏమీ లేను. పద్మభూషణ్ కంటే ఎక్కువే ఆశించాను. ఉత్తరాదికిచ్చిన ప్రాధాన్యం దక్షిణాదికి ఇవ్వట్లేదు. భారత రత్న ఇస్తే తీసుకుంటా. అంతకంటే తక్కువస్థాయిది ఏదిచ్చినా తీసుకోను. అభిమానుల గుండెల్లో నేను ఎక్కడో ఎత్తున ఉన్నాను. ఈ అవార్డు ఇవ్వడం పట్ల ప్రభుత్వాన్ని తప్పుబట్టను గానీ, ఇన్నాళ్లకు గుర్తించడం బాధగా ఉంది”  అని అన్నారు.

 Viswaroopam ban

విశ్వరూపం బ్యాన్‌: కమల్ కి రజనీకాంత్ సపోర్ట్

        విశ్వరూపం చిత్రం పై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించడం పై రజనీకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ దేశం గర్వించదగ్గ నటుడు కమల్ హాసన్ అని, ఆయన ఏనాడూ ప్రజల మనోభావాలు కించపరిచేలా సినిమా తీయలేదని అన్నారు. కమల్ హాసన్ వంద కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా విడుదల అపేయడం సరికాదన్నారు. సినిమా విడుదలకు అందరు సహకరించాలని కోరారు. విశ్వరూపం సినిమాలో ఏవైనా అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే అవి తొలగించడానికి కమల్ సిద్దంగా ఉన్నారని చెప్పారు.అభ్యంతరాలు ఉంటే చర్చలతో పరిష్కరించుకోవాలన్నారు. కమల్ హాసన్ తమిళ సినిమాను ప్రపంచ స్థాయి తీసుకెళ్లిన గొప్ప నటుడు అని అన్నారు.   ముస్లిం సోదరులకు రజనీకాంత్ మిలాద్-ఉన్-నబి శుభాకాంక్షలు తెలిపారు.

'Viswaroopam' screening stopped in Hyderabad

హైదరాబాద్ లో "విశ్వరూపం" సినిమా నిలిపివేత

        కమలహాసన్ నటించిన ‘విశ్వరూపం’ సినిమాను రెండు రోజులపాటు వాయిదా వేసేలా చర్యలు తీసుకోవాలని పోలీసుల అధికారులకు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని థియోటర్ల యజమానులకు పోలీసులు సూచిస్తున్నారు. ముందుగా తెలిపిన వివరాల ప్రకారం తెలుగులో రాష్ట్రవ్యాప్తంగా ఈ చిత్రం ఈ రోజు విడుదల కావాల్సి ఉంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు.   ఇంతకుముందు తమిళనాడు ప్రభుత్వం ఈ చిత్రాన్ని ముస్లిం సంఘాల అభ్యంతరాల మేరకు రెండు వారాలపాటు నిషేధం విధించింది. ముస్లింల కోసం ఈ చిత్రం ప్రత్యేకంగా ప్రదర్శించాడు. అయినా కూడా ముస్లింలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో చిత్రం వాయిదా పడింది. కమల్ హాసన్ ఈ విషయమై కోర్టుకు కూడా వెళ్లారు. తాజాగా తెలుగులో అభ్యంతరాలు వ్యక్తం కావడం, ముస్లింల ఈద్ మిలాదున్నబీ పండుగ ఉండడంతో శాంతిభద్రతల దృష్ట్యా రెండురోజులు వాయిదా వేయాలని హోంమంత్రి సూచనలు జారీచేశారు.  

 vishwaroopam story

కమల్‌హాసన్ 'విశ్వరూపం' చూపించాడు: స్టోరీ

        సుప్రసిద్ధ నటుడు కమల్ హాసన్ 150 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి రూపొందించిన ‘విశ్వరూపం’ చిత్ర౦ వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఆఖరికి ఈరోజు ఆంద్రప్రదేశ్లో విడుదలైంది. ఈ చిత్రం స్టోరీ మీకోసం: విశ్వనాథ్ (కమల్ హాసన్) న్యూయార్క్ లో ఉండే క్లాసికల్ డాన్స్ టీచర్. అతని భార్య నిరుపమ (పూజా కుమార్). ఐతే భర్త వ్యవహారంపై అనుమానంతో అతనేంటో తెలుసుకునేందుకు ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ను పెడుతుంది నిరుపమ. ఆ క్రమంలో విశ్వనాథ్ హిందూ కాదని ఓ ముస్లిం అని తెలుస్తుంది. అంతలోనే ఉగ్రవాద ముఠా విశ్వనాథ్, నిరుపమలను ఎత్తుకెళ్తుంది. ఆ ముఠా నాయకుడు ఒమర్ (రాహుల్ బోస్) విశ్వనాథ్ ను చూసి షాక్ తింటాడు. ఇంతకీ విశ్వనాథ్ ఎవరు? అతనితో ఒమర్ కున్న సంబంధమేంటి అన్నది మిగతా సినిమా.

visaroopam

విశ్వరూపం తమిళనాడులో బ్రేక్, ఆంధ్రలో విడుదల

  కమల్ హస్సన్ అత్యంత వ్యయప్రాయసలకోర్చి నిర్మించిన విశ్వరూపం సినిమాకు ఇంత త్వరలో కష్టాలు తీరేట్లు లేవు. తమిళనాడు ప్రభుత్వం సినిమా ప్రదర్శనను రాష్ట్రంలో నిషేధం విదించడంతో హైకోర్టులో కేసువేసిన కమల్ హాస్సన్ కి అక్కడా చుక్కెదురయింది. ప్రభుత్వ ఉత్తర్వుపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను ఈ నెల 28వ తేదికి వాయిదా వేసింది. అంటే రేపు విశ్వరూపం తమిళ్ వెర్షన్ విడుదల లేనట్లే. అయితే, ఈ నెల 26వ తేదీన స్వయంగా న్యాయస్థానం సినిమా చూసిన తరువాత ముస్లిం వర్గాలు ఆరోపిస్తున్నట్లు అభ్యంతరకర సన్నివేశాలు లేనట్లయితే సినిమా విడుదలపై ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే జారిచేయవచ్చునని కోర్టువారు కమల్ హసన్ కు తెలిపారు. తెలుగు, హిందీ భాషల్లో మాత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కాబోతోంది. అయితే, దీనివల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుంది. ఒకసారి తెలుగు లేదా హిందీ బాషలలో విడుదలయిన తరువాత, సినిమా బాగుంటే పైరసీ సీడీలు తమిళనాడును కూడా ముంచెత్తుతాయి. తద్వారా సినిమాకు మొదటి రెండువారాల్లో రావలసిన భారీరాబడికి గండిపడుతుంది. ఒకవేళ సినిమా బాగోకపోతే ఆ ప్రభావం తరువాత విడుదలయ్యే తమిళ్ వెర్షన్ పై కూడా తప్పక పడుతుంది. అప్పుడు ఆ సినిమా ధియేటర్ లలో ఎక్కువరోజులు నిలవకపొతే రూ.160 కోట్లతో సినిమా నిర్మించిన నిర్మాతలకి నష్టాల్లో ముంచి కోలుకోలేని దెబ్బ తీస్తుంది. ఈ సంఘటన సినిమా సిర్మాతల కష్టాలకి అద్దం పడుతోంది.

      Kamal's Viswaroopam

విశ్వరూపంపై నిషేధం: కమల్ కు సినీ సెలబ్రిటీల మద్దతు

        విశ్వరూపం' సినిమాపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించడంపై హీరో కమల్‌హాసన్ తీవ్ర అసహనం వ్యక్తపరిచారు. ప్రభుత్వ నిర్ణయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని కమల్ తెలిపారు. సాంస్కృతి తీవ్ర వాదాన్ని నిలిపివేయాలన్నారు. హిందూ-ముస్లీంల ఐక్యతకు, సహజీవనానికి కృషి చేస్తున్నాని, అలాంటి తనపై ఆరోపణలు తగవన్నారు. విశ్వరూపం సినిమాలో ముస్లీంలను ఉగ్రవాదులుగా చూపించారంటూ కొన్ని ఇస్లామిక్ సంస్థలు చేసిన విమర్శలను హీరో కమల్‌హాసన్ తిప్పికొట్టారు. విశ్వరూపం తమిళనాడు ప్రభుత్వం నిషేధం పై పలువురు సినీ సెలబ్రిటీలు ప్రభుత్వ చర్యను ఖండింస్తున్నారు. కమల్ హాసన్ కు అంతా మద్దతుగా నిలుస్తున్నారు. ఈ మేరకు పేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషనల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా తమ మద్దతు ప్రకటిస్తున్నారు. కుష్బు:  విశ్వరూపం చిత్రంపై నిషేదం విధించారనే విషయం విని షాకయ్యాను. సెన్సార్ బోర్డు ఓకే చెప్పిన తర్వాత ప్రభుత్వం కలుగ జేసుకోవడం ఏమిటి. ఇది సరైంది కాదు. సరిగా ఉంటనే సెన్సార్ బోర్డు వారు సర్టిఫై చేస్తారు. ప్రకాష్ రాజ్: తెలుగు, తమిళం, హిందీ సెన్సార్ బోర్డులు విశ్వరూపం చిత్రానికి క్లీయర్ సర్టిఫికెట్ ఇచ్చాయి. అలాంటప్పుడు బ్యాన్ విధించాల్సిన అవసరం లేదు. ముస్లిం కంట్రీ అయిన మలేషియా కూడా ఈ చిత్రానికి క్లీయర్ సర్టిఫికెట్ ఇచ్చింది. తమిళనాడు ప్రభుత్వం నిషేదం విధించడం సరైంది కాదు. సిద్ధార్థ: విశ్వరూపం సినిమాపై బ్యాన్ విధించడం సరైంది కాదు. ఇలాంటి చర్యలు తమిళ సినీ పరిశ్రమకు తిరోగమనం లాంటిది. మంచు లక్ష్మి: సినిమాలపై చెత్త రాజకీయాలు ప్రదర్శించ వద్దు. విశ్వరూపం చిత్రంపై నిషేదం విధించడం సరైంది కాదు.  

 Police case against Bellamkonda

ఫైనాన్సియర్ పై బెల్లకొండ దాడి, కేసు నమోదు

        తరచూ ఏదోక వివాదంతో వార్తల్లో నిలిచే టాలీవుడ్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ మరోసారి వార్తల్లోకెక్కారు. ఫైనాన్సియర్‌పై దాడికి పాల్పడ్డట్లు ఆయన పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.   సిద్ధార్థ్ మరియు నిత్యమినన్ హీరో, హీరోయిన్లు గా బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం "జబర్ దస్త్". ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్  ఫైనాన్సియర్ రాధాకృష్ణ కి కోటి రూపాయలకు తీసుకున్నాడు. అడ్వాన్సుగా రూ. 25 లక్షలు చెల్లించాడు. అయితే ఏమైందో తెలియదు కానీ అగ్రిమెంటు విషయంలో ఇరువురి మధ్య విబేధాలు వచ్చాయి. అయితే అగ్రిమెంట్ విషయంలో విభేదాలు రావడంతో తీవ్రంగా వాదులాడుకున్నారని, మాట మాటా పెరిగి బెల్లంకొండ కోపం అపుకోలేక రాధాకృష్ణ దాడి చేశారని తెలుస్తోంది. దీంతో ఫైనాన్సియర్‌  బెల్లంకొండ పై  బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. బెల్లంకొండ పై ఇలాంటి ఆరోపణలు రావడం తొలిసారి కాదు, గతంలో కిందట కందిరీగ డైరెక్టర్ పై కూడా చెయ్యి చేసుకున్నట్టు వార్తలోచ్చాయి.   

 'Kamasutra' video of Sherlyn Chopra on YouTube goes viral

యూట్యూబ్‌ లో షెర్లిన్ చోప్రా న్యూడ్ గా 'కామసూత్ర' హాట్ టీజర్

        బాలీవుడ్ హాట్ బ్యూటీ షెర్లిన్ చోప్రా నటిస్తున్న కామసూత్ర మూవీ ట్రైలర్ విడుదలైంది. ప్లేబాయ్ మేగజైన్ కోసం నగ్నంగా ఫోటోలకు పోజులిచ్చిన షెర్లిన్ కామసూత్రలో కూడా అదే విధంగా రెచ్చిపోయింది. ఈ హాట్ బ్యూటీ నగ్న సన్ని వేషాలు ఇప్పుడు యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తున్నాయి.   రూపేష్ పాల్ తన సొంత నిర్మాణ సంస్థ బ్యానర్ పై డైరెక్ట్ చేసి నిర్మిస్తున్న ఈ సినిమా పై హాట్ క్యాటగిరి ఫ్యాన్స్ అప్పుడే ఆశలు పెంచుకుంటున్నారు.  షెర్లిన్ బోల్డ్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని డైరెక్టర్ అంటున్నారు.సినిమాను వేసవిలో విడుదల చేయనున్నారు. అన్నట్లు ఈచిత్రం పెద్దలకు మాత్రమే. ఇండియన్ ఆటిట్యూడ్‌తో పర్ ఫెక్ట్ ఫిగర్‌తో ఉన్న షెర్లిన్ ఆ పాత్రలో ఇరగ దీయడం ఖాయం. దర్శకుడిగా ఈ ప్రాజెక్ట్ నాకు చాలెంజ్. 3డి టెక్నాలజీ ద్వారా శృంగార భంగిమలను అద్భుతంగా చూపెట్టగలం' అన్నారు.ఇక షెర్లిన్ చెప్రా మాట్లాడుతూ...కామ సూత్ర వల్గారిటీకి క్లోజ్‌గా ఉంటుంది. కానీ నగ్నంగా నటించడం వల్గర్ కాదు. నగ్నంగా నటించడం అనేది ఒక ఆర్ట్. నేను చాలా బోల్డ్ ఉండటం ఉండం వల్ల నన్ను సంప్రదిస్తున్నారు అంటోంది.  

Hero Prabhas marriage details

పెళ్ళి కొడుకు కాబోతున్న హీరో ప్రభాస్ ?

          యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ త్వరలో పెళ్ళి కొడుకు కాబోతున్నారు. ఫిల్మ్ నగర్ లో ప్రభాస్ వివాహానికి సంబందించిన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. హీరో ప్రభాస్ కి మ్యారేజ్ ఫిక్సయిందని తెలుస్తోంది. పశ్చిమ గోదావరి భీమవరం కి చెందిన చుట్టాల అమ్మాయితో సంబంధం సెటిల్ చేసినట్లు సమాచారం. పెళ్లి వారితో సంప్రదింపులు జరుపుతున్న పెదనాన్న కృష్ణం రాజు ఇప్పటికే పెళ్లి చర్చలు ఓ కొలిక్కి తెచ్చారని తెలుస్తోంది. త్వరలోనే పెళ్ళి కబురు బయటి తెలియజేస్తారని సమాచారం. ప్రభాస్ నటిస్తున్న "మిర్చి" మూవీ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ సినిమాని భారీగా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.   మాటల రచయిత కొరటాల శివ "మిర్చి" సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.   మరోవైపు ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న భారీ చిత్రం ‘బహుబలి'. రాజమౌళి ఇప్పటి వరకు తాను తీసిన సినిమాలకు పూర్తి భిన్నంగా, భారీ హంగులతో, చారిత్రక నేపథ్యాన్ని తలపించేలా ఈచిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ప్రభాస్ పత్యర్థిగా విలన్ పాత్రలో రాణా దగ్గుబాటి నటిస్తున్నాడు. అనుష్క హీరోయిన్ గా చేస్తోంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆర్కా మీడియా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోంది.  

svsc triple platinum disc

"సీతమ్మ వాకిట్లో..." ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ హైలైట్స్

        "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. ఈ సినిమా ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్‌ ఫంక్షన్‌ హైదరాబాద్ లోని సినీ ప్రముఖులు, చిత్ర యూనిట్‌ సభ్యుల సమక్షంలో వైభవంగా జరిగింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆడియో ఫంక్షన్ కి మహేష్ బాబు, వెంకటేష్ బాబు కుమారులు అతిధులు గా రాగా, ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్‌ ఫంక్షన్‌ కి సూపర్ స్టార్ కృష్ణ, డా.డి.రామానాయుడు గారు ముఖ్య అతిధులు గా వచ్చారు. ఈ సందర్భంగా సూపర్‌స్టార్‌ కృష్ణ మాట్లాడుతూ - ''అన్ని రికార్డులు బ్రేక్‌ చేసిన ఈ సినిమా చూస్తుంటే పూర్వం చక్రపాణిగారు, ఎల్‌.వి.ప్రసాద్‌గారు తీసిన సినిమాలు గుర్తొచ్చాయి. వెంకటేష్‌, మహేష్‌ అన్నదమ్ములుగా చూడముచ్చటగా కనిపించారు. హీరోల చుట్టూ కథ అల్లకుండా ఒక కుటుంబం, ఆ కుటుంబంలోని ఇద్దరు అన్నదమ్ముల చుట్టూ జరిగే కథతో అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు. ఈ చిత్రానికి ఇంత పెద్ద విజయాన్ని చేకూర్చిన ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా కలెక్షన్ల పరంగా 81 సంవత్సరాల తెలుగు సినిమా రికార్డులన్నీ బ్రేక్‌ చేస్తూ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా పాటలు మళ్ళీ మళ్ళీ వినేలా వున్నాయి. ఇంకా ఈ సినిమా పెద్ద రన్‌ వచ్చి 100 డేస్‌ ఫంక్షన్‌ జరుపుకోవాలని కోరుకుంటున్నాను'' అన్నారు. డి.రామానాయుడు మాట్లాడుతూ - ''ఈ సినిమా ఇంత పెద్ద కావడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. దిల్‌రాజుగారు టాప్‌ ప్రొడ్యూసర్స్‌లో ఒకరుగా నిలిచారు. ఇలాంటి మరిన్ని మంచి సినిమాలు దిల్‌రాజుగారు నిర్మించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.  

prabhas mirchi release date

ఫిబ్రవరి 7న వస్తున్న ప్రభాస్ "మిర్చి"

      యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న "మిర్చి" చిత్రాన్ని ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొని వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయినా ఈ సినిమా ఆడియోకి మంచి స్పందన రావడంతో సినిమా పై కూడా అంచనాలు పెరిగాయి. రచయిత కొరటాల శివ " మిర్చి" సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రభాస్ సరసన అనుష్క, రిచా హీరోయిన్లు గా నటిస్తున్నారు. మిర్చి సినిమా యాక్షన్ తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఎంటర్ టైన్ చేస్తుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. రెబెల్ తో ఫ్లాప్ చూసిన ప్రభాస్ ఈ సినిమాతో హిట్ కోడతాడో లేదో వేచి చూడాలి.

ram ongole gitta|Ongole githa release|hero Ram injury|Actor Ram injured

ఒంగోలు గిత్త షూటింగ్ లో గాయపడిన హీరో రామ్

        ఒంగోలు గిత్త షూటింగ్ లో ఆ సినిమా హీరో రామ్ గాయపడ్డారు. సినిమా కోసం ఫైట్ సీన్లు చిత్రీకరిస్తుండగా రామ్ కాలి మడమ భాగంలో గాయమైంది. డాక్టర్లు అతనికి నాలుగు వారాలు రెస్ట్ తీసుకోమని సూచించారు. గతంలో దేవదాసు షూటింగ్ లో నాన్ చాక్ ఫైట్ చేస్తుండగా గాయపడ్డారు. హీరో రామ్ కి గాయం కావడంతో ఒంగోలు గిత్త రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉంది. ఇంకా  సినిమాకి సంబంధించిన ప్యాచ్ వర్క్ పెండింగ్ లో ఉంది.  డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ చేస్తున్న తొలియాక్షన్ మూవీ ఒంగోలు గిత్త. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్‌కుమార్ సంగీతం అందించగా, ప్రకాష్‌రాజ్, అభిమన్యుసింగ్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. శ్రీ వెంక సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్‌పసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  

film svsc

"సీతమ్మ వాకిట్లో....." సరికొత్త వివాదం

  రామ్ చరణ్ నటించిన ‘నాయక్’ సినిమాలో విలన్ కి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు గండి బాబ్జీ పేరు పెట్టినందుకు వివాదంలో చిక్కుకొంటే, ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కూడా చిన్నపాటి వివాదంలో చిక్కుకొంది.   ఆ సినిమాలో శ్రీ సీతారాముల కళ్యాణమహోత్సవంలో అగ్ని ప్రమాదం సంభవించే సన్నివేశం, కేవలం హీరోల హీరోయిజం ప్రదర్శించడానికి ప్రత్యేకంగా సృష్టించడం చాల తప్పని శ్రీశైలం దేవస్థానం ఈ.వో. శ్రీనివాసరావు అన్నారు. శ్రీరామనవమి రోజున అటువంటి దుర్ఘటనలు ఇంతవరకు ఎన్నడూ జరుగలేదని, స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్బంగా మిగిలిన రోజులకి బిన్నంగా వాతావరణం చాలా ఆహ్లాదంగా మారి అక్కడక్కడ చిన్నపాటి వానలు కూడా పడుతూ ఎటువంటి అగ్నిప్రమాదాలకు తావీయకుండా పంచభూతాలు భక్తులను కాపాడుతాయని అయన అన్నారు. కేవలం హీరోల హీరోయిజం ప్రదర్శనకొరకు ఇటువంటి సన్నివేశాలు సృష్టించడం చాలా అపచారమని, అది హిందువుల, ముఖ్యంగా శ్రీరామ భక్తుల మనోభావాలను దేబ్బతీసేవిదంగా ఉందని ఆరోపిస్తూ, వెంటనే సినిమాలోంచి ఆ సన్నివేశాలను తొలగించాలని ఆయన కోరారు. లేకపోతే, సినిమా తీసినవారిపై కోర్టులో కేసు వేస్తానని హెచ్చరించేరు.

mahesh babu

మళ్ళీ మల్టీ స్టారరా! వద్దురా బాబు అన్న మహేష్ ..!

  సీతమ్మ వాకిట్లో.. సినిమా ఇచ్చిన ఊపుతో చిన్నోడు మహేష్ బాబు మరిన్ని మల్టీ స్టారర్ సినిమాలు చేసేస్తాడని, అందరూ ఊహిస్తుంటే, “మళ్ళీ మరో మల్టీ స్టారరా! వద్దురా బాబు...వద్దు’ అంటున్నాడు మన చిన్నోడు. సీతమ్మ వాకిట్లో విజయోత్సవం జరుపుకోవడానికి విజయవాడ వచ్చిన మహేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ మళ్ళీ ఇంతత్వరలో మల్టీ స్టారర్ సినిమా చేయబోవట్లేదని అన్నాడు. అదేవిదంగా తానూ రాజకీయ చిత్రం చేస్తున్నట్లు వస్తున్న వార్తలను కూడా ఖండించేడు. సిక్స్ ప్యాక్ బాడీ కోసం తానూ కష్టపడుతున్నట్లు మీడియాలో వస్తున్నవి కేవలం పుకార్లు మాత్రమే నని చెప్పాడు. బాలీవుడ్ కి పయనం ఎప్పుడనే ప్రశ్నకు సమాధానంగా తనకి ఆ ఆలోచనలేదని, తెలుగు సినిమాలకే అంకితం అవుతానని అన్నాడు. ప్రస్తుతం సీతమ్మ వాకిట్లో విజయానందాన్ని ఆస్వాదిస్తున్నానని, అందులోంచి బయట పడేందుకు కొంత సమయం పడుతుందని అన్నాడు.

'విశ్వరూపం' డీటీహెచ్ విడుదల తేదీ ఫిబ్రవరి 2

      విశ్వరూపం’ సినిమాను నేరుగా డీటీహెచ్ తో పాటే థియేటర్ల విడుదల చేస్తానని ప్రకటించిన ప్రముఖ నటుడు కమల్ హాసన్ థియేటర్ యాజమాన్యాల సంఘంతో జరిగిన పోటీలో ఓడిపోయాడు. అనేక వివాదాలు, మలుపులు తిరిగిన ఈ వ్యవహారం ఆఖరుకు థియేటర్లో సినిమా విడుదలయిన వారం రోజులకు విడుదల చేయాలన్న ఒప్పందంతో ముగిసింది. ఈ ప్రకారం తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 25న విడుదలవుతుంది. వచ్చేనెల 2న డీటీహెచ్ లలో ప్రసారమవుతుంది. హిందీలో ఫిబ్రవరి 1న విడుదలవుతుంది. ఫిబ్రవరి 2న అన్నిభాషల్లో డీటీహెచ్ లో విడుదలవుతుంది. రెండూ ఒకేసారి విడుదల చేయాలన్న కమల్ హాసన్ నిర్ణయాన్ని ముప్పుతిప్పలు పెట్టి థియేటర్ యాజమాన్యాలు మార్చుకునేలా చేశాయి.

"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" కి సూపర్ టాక్..!

  ఈ రోజు విడుదలయిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా సినీ విమర్శకులనుండి మంచి రేటింగ్ పొందింది. మహేష్ బాబు, సమంత ఒక జంటగా, వెంకటేష్, అంజలి మరో జంటగా నటించిన ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే, పూర్తిస్థాయి ఫామిలీ సినిమా అని నిర్మాత దిల్ రాజు ప్రకటించడం వల్ల, వెంకటేష్, మహేష్ బాబు అభిమానులు ఎటువంటి ఫైట్లు ఆశించకుండా సినిమా చూసేందుకు వచ్చేలా చేసింది. ఇద్దరు పెద్ద హీరోలున్న సినిమాలో ఫైట్స్ ఆశించకుండా ప్రేక్షకులను సినిమా హాళ్ళకి రప్పించడంలోనే సినిమా సగం విజయం సాదించింది, ఇక మిగతాది సినిమాలో నటించిన వారందరి అద్బుతమయిన నటన, కధా, కధనం, పాటలు, కెమేరా పనితనం, మనసుకు హత్తుకొనే సన్నివేశాలు వగైరాలన్నీ కలిసి విజయవంతంచేసాయి.   ప్రతీ మధ్యతరగతి కుటుంబములో సాదారణంగా కనిపించే అంశాలనే తీసుకొని, అందరికీ తెలిసిన ఒక కధని అల్లుకొన్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, దానిని వెండి తెరమీద ఆవిష్కరించిన తీరుకి నూటికి నూరు మార్కులు వేయవలసిందే. ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ ఏదో ఒక పాత్రలో మమేకం అయ్యేలా చేయగలిగేడు. ప్రతీ సినిమాలో కత్తులు, తుపాకులు పట్టుకొని రక్తం చిందించే మహేష్ బాబును కాక, ఈ సినిమాలో కేవలం అతనిలో ఒక మంచి సోదరుడిని మాత్రమే చూసారు. వెంకటేష్ , ప్రకాష్ రాజ్ ఇరువురూ కూడా తమ అద్బుతమయిన నటనతో ఒక సాదారణమయిన కధకి ప్రాణం పోశారు. సినిమాలో నటించిన ఇద్దరు హీరోయిన్లూ కూడా రొటీన్ సినిమాలకు బిన్నంగా అందివచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొన్నారు.   సాదారణంగా కుటుంభ కధా చిత్రాలలో కనిపించే భావోద్వేగాలు ఇందులో కూడా ఉన్నపటికీ అన్నీ సమపాళ్ళలో ఉండి, ప్రేక్షకులను అలరించేయి. చాలా రోజుల తరువాత విడుదలయిన ఒక పెద్ద మల్టీ స్టార్ సినిమా అయినప్పటికీ, అనవసరమయిన ఆర్భాటాలకు, భేషజాలకు పోకుండా సినిమాకి అవసరమయినన్నిపాటలనే పెట్టి సినిమాని రక్తి కట్టించేడు దర్శకుడు.   ఇక మహేష్ బాబు ఈ సినిమా సంతకం చేసినప్పుడు, మంచి ఫాంలో ఉన్నపుడు ఇటువంటివెందుకు అని సణిగిన అభిమానులు కూడా ఇప్పుడు మహేష్ బాబులో మరో కొత్త బాబును చూసి చాలా ఆనందించేరు. అదే విదంగా, ఒక మంచి హిట్టు కోసం ఎదురు చూస్తున్న వెంకటేష్ కూడా ఈ సినిమా విజయం ఆనందం కలిగించింది.   అంతే గాకుండా, పెద్ద హీరోలు కేవలం మూస ధోరణిలో కమర్షియల్ సినిమాలకే అంకితమయి పోనవసరం లేదని ఈ సినిమా నిరూపించింది. ఒక మంచి కుటుంబ కధా చిత్రమో లేక మంచి ప్రేమ కావ్యమో తీసినా కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమా నిరూపించింది. దిల్ రాజు ముందే చెప్పినట్లు ఈ సినిమా విజయం మరనేక మంచి సినిమాలకి ప్రేరణనిస్తుందని నమ్మవచ్చును. తెలుగు ప్రజలకిష్టమయిన సంక్రాంతి పండుగ సమయంలో అచ్చమయిన తెలుగుసినిమాకు అచ్చమయిన తెలుగు పేరుపెట్టి విడుదల చేసినందుకు దర్శక నిర్మాతలకు అభినందనలు.

"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" స్టోరీ..!

          25సంవత్సరాల తరువాత టాలీవుడ్ లో వస్తున్న మెగా మల్టీ స్టారర్ మూవీ "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" సంక్రాంతి కానుకగా జనవరి 11 విడుదలైంది. ఈ చిత్రం కథ మీ కోసం:   రేలంగి అనే పల్లెటూరులో జరిగే రేలంగి మామయ్య కుటుంబ కథే "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు".  రేలంగి మామయ్య ( ప్రకాష్ రాజ్ ) అతనికి ఇద్దరు కొడుకులు. పెద్దోడు ( వెంకటేష్) , చిన్నోడు ( మహేష్ బాబు ). పెద్దోడు వెంకటేష్ (నిరుద్యోగి) చాలా ఎమోషనల్ గా ఉండే యువకుడు. ఎవరి ముందు తలవంచకుండా తనకి నచ్చింది చేస్తూ మంచి అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. ఇతనికి తన తమ్ముడు అంటే ప్రాణం. సీత అంజలి తనకి చిన్నపాటి నుంచి తన బావ (వెంకటేష్)  అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా తననే పెళ్ళి చేసుకుంటాడని కలలు కంటూ ఉంటుంది. చిన్నోడు మహేష్ బాబు చాలా తెలివిగల యువకుడు. ఎంతటి క్లిష్ట పరిస్థితులైన తనకి అనుగుణంగా మార్చుకుంటాడు. ఇతను ఒకసారి గీత (సమంత) అనే అమ్మాయిని చూడగానే ప్రేమలో పడిపోతాడు.  రేలంగి మామయ్య ( ప్రకాష్ రాజ్ ) కుటుంబం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావడంతో గీత (సమంత) వాళ్ళ ఫాదర్ చులకనగా చూస్తాడు. వెంకటేష్ నిరుద్యోగి కావడంతో కుటుంబంలో కొన్ని మనస్పర్ధలు వస్తాయి. మహేష్ బాబు మరియు వెంకటేష్ కొంచెం మధ్య దూరం పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో ప్రకాష్ రాజ్ ఎలా స్పందిస్తాడు? వెంకటేష్ మరియు మహేష్ బాబు వారి ప్రేమను ఎలా గెలుచుకున్నారు అనేది మిగతా సినిమా.