mahesh son goutham

మహేష్ తనయుడు గౌతమ్ సినీ ఎంట్రీ !

        లిటిల్ ప్రిన్స్ గౌతమ్ కృష్ణ సినీ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణ ఓ సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాలో భాగంగా గౌతమ్ పై ట్రయల్‌ షూట్‌ కూడా చేశారు. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీ లో హాట్ టాపిక్. ఇంతకి లిటిల్ ప్రిన్స్ గౌతమ్ ఏ సినిమాలో నటించబోతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో మహేష్ చిన్నప్పటి పాత్ర గౌతమ్‌కృష్ణతో నటింపజేయాలని సుకుమార్ భావించారట. ఈ నిర్ణయానికి మహేష్ కూడా ఓకే చెప్పడంతో అన్నపూర్ణ స్టూడియోలో గౌతమ్ పై ట్రయల్ షూట్ చేశారు. సూపర్ స్టార్...లిటిల్ సూపర్ స్టార్ ఫస్ట్ టైం కలిసి నటిస్తుండంతో ఈ మూవీ కి భారీ క్రేజ్ రానుంది. మహేష్‌బాబు కూడా బాలనటుడిగానే తెరపైకి వచ్చారు. తండ్రి కృష్ణ నటించిన పలు చిత్రాల్లో మహేష్‌ నటించిన సంగతి తెలిసిందే. సో త్వరలో గౌతమ్ వెండితెరపై ఎన్ని వండర్స్ చేస్తాడోనని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Sravana Bhargavi marriage photos|Hemachandra Sravana Bhargavi wedding|Hemachandra Sravana Bhargavi marriage|Hemachandra marriage pics

సింగర్స్ హేమచంద్ర, శ్రావణ భార్గవి మ్యారేజ్ ఫోటో

        సింగర్స్ హేమచంద్ర, శ్రావణ భార్గవి మ్యారేజ్ ప్రేమికుల రోజున హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ ఇద్దరు ప్రేమికుల రోజున పెళ్లితో ఒక్కటయ్యారు. ఇరు కుటుంబాలకు పెద్దలు, బంధువులు, సన్నిహితులు, స్నేహితులు పెళ్లికి హాజరయ్యారు. ఇండియన్ ఐడల్ లో ఫైనల్స్ కు అర్హత సాధించడం ద్వారా హేమచంద్ర వెలుగులోకి వచ్చారు. అనంతరంగా పలు తెలుగు చిత్రాల్లో పాటలు పాడటంతో పాటు సంగీత దర్శకుడిగానూ హేమచంద్ర రాణించారు. శ్రావణ భార్గవి సప్తస్వరాలు పాటల పోటీలో రన్నరప్ గా నిలిచింది.యంగ్ ఏజ్ లోనే సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఇద్దరూ అనతి కాలంలోనే తమ ప్రతిభతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  

Nagarjuna's Bhai

నాగార్జున 'భాయ్' డైలాగ్..!

        "హైదరాబాద్ రెండింటికి ఫేమస్…ఒకటి ఇరానీ ఛాయ్, రెండు ఈ భాయ్…” అంటున్నారు కింగ్ అక్కినేని నాగార్జున. ఇది భాయ్ సినిమాలో డైలాగ్ అని ప్రచారంలోకి వచ్చింది. నాగార్జున నటిస్తున్న ‘భాయ్’ కు వీరభద్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది వరకూ ఒక కామెడీ సినిమా హిట్ ను సొంతం చేసుకున్న వీర భద్రమ్ కు నాగార్జున వంటి స్టార్ తో సినిమా చేసే అవకాశం రావడం మంచిఛాన్సే! ఒకవైపు ‘గ్రీకువీరుడు’ మరోవైపు ‘భాయ్’ ల షూటింగులో నాగార్జున బిజీగా ఉన్నాడు. భాయ్ సినిమా హలో బ్రదర్స్ లాంటి సినిమా అని కింగ్ అంటున్నారు . ఇది వరకూ ‘కింగ్’ లో కూడా భాయ్ గా కామెడీ చేసిన నాగ్… ఈ సారి భాయ్ ను ఎలా రక్తికట్టిస్తాడో అనే ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాలో బ్రెజిల్ భామ నటాలియా కౌర్ ఒక ఐటమ్ సాంగ్ చేస్తోంది. ప్రస్తుతం భాయ్ షూటింగ్ హైదరాబాద్ సిటీలో జరుగుతోంది.

jr.ntr

రభస చేస్తున్న 'బాద్‌షా'

  కొత్త సంవత్సరం మొదలయ్యి రెండు నెలలు గడిచిపోతున్నా ఇంతవరకు జూ. ఎన్టీఆర్ సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదు. అయినప్పటికీ, త్వరలో 'బాద్ షా' సినిమా విడుదల కానున్నందున ఆ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకొన్న ఎన్టీఆర్ అభిమానులు ఓపికగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ తన మరో కొత్త సినిమా ‘రభస’ షూటింగు బుధవారంనాడు లాంచనంగా హైదరాబాదులో మొదలు పెట్టారు. 'కందిరీగ' సినిమాతో మంచి పేరు సంపాదించుకొన్న సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం చేయనున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో సమంత జత కట్టనున్నది. వీరిద్దరూ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న మరో సినిమాలో కూడా జంటగా నటిస్తున్నారు.   'రభస' సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 15 వ తేదీనుండి హైదరాబాదులో మొదలవుతుంది. ఈ సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా దసరా, దీపావళి పండుగ సమయానికి విడుదలచేయాలని వారు అనుకొంటున్నారు. ఈ సినిమా కూడా ఎన్టీఆర్ మార్క్ కమర్షియల్ సినిమాగానే నిర్మించనున్నారు. ఈ సినిమా గురించి పూర్తీ వివరాలు త్వరలో ప్రకటిస్తామని నిర్మాత బెల్లంకొండ అన్నారు.

bandla ganesh

నన్ను బలిపశువును చేశారు: గణేష్

  ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే కాస్త చుట్టకు నిప్పిస్తావా? అని అడిగినట్లుందని బండ్ల గణేష్ వాపోతున్నాడు. “ఒకపక్క ఆదాయపన్నుశాఖ వాళ్ళు గోళ్ళూడగొట్టి మరీ కోటి రూపాయలు గుంజుకొన్నారని నేనేడుస్తుంటే, ఈ రాజకీయలేమిటి చంద్రబాబూ...” అంటూ బండ్ల గణేష్ లబలబలాడుతున్నాడు.   అసలు తనకే రాజకీయనాయకుడితో బిజినెస్ వ్యవహారాలులేవని, తానూ ఎవరికీ బినామీని కానని, తన సినిమాలన్నీ తన కష్టార్జితంతో తీసినవే తప్ప, వెనకనుండి తనకు ఎవరూ కూడా డబ్బు మూటలు అందించలేదని, ఇకనైనా తనపై బురద జల్లడం మానుకోవాలని బండ్ల గణేష్ మీడియా ద్వారా అందరికీ విజ్ఞప్తి చేసాడు. తనను అనవసరంగా రాజకీయలలోకి లాగి బలి పశువును చేసారని అన్నాడు. తనకు సినిమాలు తీయడం తప్ప రాజకీయాల గురించి అసలేమి అవగాహన లేదని, అటువంటప్పుడు తనకు తెలియని రాజకీయ వ్యక్తులతో కలిసి బిజినెస్ వ్యవహారాలు ఎందుకు చేస్తానని అతను ప్రశ్నించాడు.   అతనిపై ఆదాయపన్నుశాఖ వారు దాడిచేసిన తరువాత తెలుగుదేశం పార్టీ నేతలు వర్ల రామయ్య, దాడి వీరభద్రరావు ఆదాయపన్నుశాఖ వారిని బొత్స సత్యనారాయణ ఇళ్ళు, కార్యాలయాలపై కూడా దాడి చేయాలని కోరినప్పుడు, బొత్స సత్యనారాయణ బదులు మరి బండ్ల గణేష్ ఎందుకు ఈవిధంగా స్పందించాడో తెలియదు. తెలుగుదేశం నేతల మీడియాకెక్కి ఇంత రచ్చ చేస్తున్నా కూడా ఇంతవరకు బొత్స సత్యనారాయణ మాత్రం స్పందించలేదు. బహుశః త్వరలోనే ఆయన కూడా ఘాటుగా జవాబీయవచ్చును.

kiss telugu movie|Adivi sesh kiss|adivi sesh|priya Banerjee| sai kiran adivi

శరవేగంగా అడివి శేష్ 'కిస్'

        అడివి శేష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో చేస్తున్న 'కిస్' సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ప్రొడ్యూసర్ సాయికిరణ్ కిరణ్ అడివి ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను హీరోయిన్ ప్రియా బెనర్జీ, కృష్ణుడు, అడివి శేష్ మీద చిత్రీకరిస్తున్నారు. వినాయకుడు హీరో కృష్ణుడు ఈ మూవీలో గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. మరో వైపు అడవి శేష్ రవితేజ హీరోగా రూపొందుతున్న ‘బలుపు' చిత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు.   'కిస్' సినిమాలో టాలీవుడ్ నటులు షఫి, భరత్ రెడ్డి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సాయి కిరణ్ అడవి, ఆనంద్ బచ్చు సంయుక్తంగా మైడ్రీమ్ సినిమా మరియు థౌజండ్ లైట్స్ బేనర్లపై నిర్మిస్తున్నారు. వేసవిలో ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ మధ్య వచ్చిన కర్మ సినిమా ద్వారా యాక్టర్ గా, డైరెక్టర్ గా తెలుగు సినిమారంగంలోకి ఎంటరైన అడవి శేష్...పవన్ కళ్యాణ్ పంజా సినిమాలో నెగెటివ్ రోల్ పోషించి మంచి క్రేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.

Prabhas Mirchi First Day Collections|Mirchi First day Collections

ప్రభాస్ 'మిర్చి' ఫస్ట్ డే కలెక్షన్స్ అదుర్స్

        యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ఆడియన్స్ లో రోజు రోజు కి పెరిగిపోతుంది. ప్రభాస్ "మిర్చి" బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. "మిర్చి" రొటీన్ స్టోరీ అయినా ప్రభాస్ మ్యాజిక్ తో అన్నివైపుల నుంచి పాజిటివ్ టాక్ రాబట్టింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే రూ. 7.67 కోట్లు షేర్ వసూలు చేసిందని అంటున్నారు. ఏరియాల వారిగా నైజాం నుంచి రూ. 2.30 కోట్లు, సీడెడ్ రూ.1.30 కోట్లు, నెల్లూరు 30 లక్షలు, కృష్ణా 37 లక్షలు, గుంటూరు 78 లక్షలు, వైజాగ్ 54 లక్షలు, తూర్పుగోదావరి 64 లక్షలు, పశ్చిమ గోదావరి 54 లక్షలు వసూళ్లు రాబట్టడంతో రాష్ట్రం నుంచి రూ. 6.77 కోట్లు వసూలు చేసింది. కర్ణాటక నుంచి 25 లక్షలు, ఇండియాలో ఇతర ప్రాంతాలన్నీ కలుపుకుని 15 లక్షలు రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో రూ. 50 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా రూ. 7.67 కోట్లు రాబట్టింది.  ఆంధ్రప్రదేశ్ లో 'సీ' సెంటర్స్ లో సీతమవాకిట్లో..., నాయక్ నూ కూడా క్రాస్ చేసిందని అంటున్నారు.     

Shriya Pavitra

చంచల్ గూడా జైలులో శ్రియ

      హీరోయిన్ శ్రియ వేశ్యగా నటిస్తున్న 'పవిత్ర' సినిమా షూటింగ్ చంచల్ గుడా జైలులో జరుగుతుంది. హీరో శివాజి ఖైదీగా ఉన్న సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. జైలర్ గా నటుడు జయప్రకాష్ రెడ్డి నటిస్తున్నారు.చిత్రానికి దర్శకుడు ప్రముఖ రచయిత జనార్ధన మహార్షి. గత కొన్నాళ్లుగా తెలుగులో పూర్వపు స్థానం కోసం ప్రయత్నిస్తున్న శ్రియ జనార్ధన మహర్షి చెప్పిన కథను విని సంతృప్తి చెంది వేశ్యగా నటించేందుకు అంగీకరించినట్లు తెలిపింది. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంగా రూపొందుతున్న ఇలాంటి చిత్రంలో శ్రియ నటించడం తొలిసారి. వేశ్య పాత్ర అయినా శ్రియకు మంచి విజయం దక్కుతుందో లేదో వేచిచూడాలి.

 balakrishna nayanatara

బాలయ్య డైరెక్షన్ లో న్యూ కాన్సెప్ట్‌‌తో 100వ ఫిల్మ్!

        నందమూరి బాలకృష్ణ తన శ్రీమన్నారాయణ చిత్రం తరువాత మళ్ళీ ఇంతవరకు కొత్తగా ఏ సినిమా ఒకే చేయలేదు. ఫిల్మ్ నగర్ సమాచారం మేరకు ఆయన త్వరలో ఒక జానపద సినిమాలో నటించబోతున్నారు. బాలయ్య బాబు అభిమానులకు సంతోషం కలిగించే మరో ఆసక్తికరమయిన వార్త ఏమిటంటే ఈ సినిమాకు ఆయనే స్వయంగా దర్శకత్వం వహిస్తారని సమాచారం.     ‘సింహా,’ ‘శ్రీ రామ రాజ్యం’ సినిమాలలో బాలకృష్ణ సరసన నటించిన నయనతార ఈ సినిమాలో కూడా నటిస్తుంది. ఈ సినిమాలో వారిద్దరూ మహారాజు, మహారాణీ పాత్రలు పోషిస్తారని సమాచారం. ఇక,  ఇంకా పేరు పెట్టని ఈ సినిమాను ‘శ్రీరామరాజ్యం’ సినిమాను నిర్మించిన ఎలమంచిలి శివాజీ నిర్మిస్తారని సమాచారం. బాలయ్య బాబు పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10వ తేదీన ఈ సినిమా షూటింగు మొదలవవచ్చునని సమాచారం. అయితే, ఈ విషయాన్నిఇంకా సంబందిత వ్యక్తులు ధృవీకరించవలసి ఉంది.  

ongole gitta movie talk

'ఒంగోలు గిత్త' లో రామ్ ఎనర్జీ అదుర్స్

        ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన ‘ఒంగోలు గిత్త' మూవీ నిన్న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ‘ఒంగోలు గిత్త' సినిమా టాక్ పరిశీలిస్తే..ఈ సినిమా కూడా యావరేజ్ గా ఉందనే టాక్ వినిపిస్తోంది. పూర్తి మాస్ నేపథ్యంలో ఈ చిత్రం క్లాస్ ప్రేక్షకులను మెప్పించడం కష్టమే అనే టాక్ వినిపిస్తోంది. రామ్ పెర్ఫార్మెన్స్ మాత్రం బాగుందని అంటున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీశాడు. హీరోయిన్ కృతి కర్బంద కేవలం గ్లామర్ ప్రదర్శనే తప్ప నటనకు పెద్దగా అవకాశం లేకుండా పోయింది. ప్రకాష్ రాజ్ పెర్ఫార్మెన్స్ వంకలు పెట్టాల్సిన పని లేదని....దర్శకుడు భాస్కర్ దర్శకత్వానికి పూర్తి న్యాయం చేయలేక పోయాడనే టాక్ వినిపిస్తోంది  

 kadali movie story

'కడలి' ఫస్ట్ రిపోర్ట్...మూవీ స్టోరీ

        షామ్ (అరవింద్ స్వామీ), బర్గ్ మన్ (అర్జున్ ) ఫాదర్ లు అవ్వాలని ఒక చర్చి లో చేరతారు. సడన్ గా ఒక రోజు బర్గ్ మన్ పై అనుకొని పరిస్థితుల్లో షామ్ కంప్లైంట్ చేస్తాడు. అప్పుడు అతను చర్చి నుంచి బయటకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కోపంలో వున్న బర్గ్ మన్, షామ్ పై పగ తీర్చుకుంటానని ఛాలెంజ్ చేసి వెళ్ళిపోతాడు. ఆ తరువాత షామ్ కి ఫాదర్ గా ఒక విలేజ్ లో పోస్టింగ్ వస్తుంది. ఆ ఉరిలో ఉన్న జనాలకు షామ్ దేవుడి గురించి చెబుతూ ఉంటాడు. ఈ సమయంలో అనాధ అయినా థామస్ (గౌతమ్ కార్తీక్ ) ని చేరదిస్తాడు. అనుకోకుండా ఒక రోజు షామ్, బర్గ్ మన్ ని కలుస్తాడు,దానితో అతను ఒక ప్రమాదంలో పడతాడు. వీరి కధ జరుగుతుండగా థామస్, తులసిని కలుస్తాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. అతనికి తులసి బర్గ్ మన్ కూతురు అని తెలుస్తోంది. అయితే బర్గ్ మన్ ను ఎదిరించి థామస్ తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు. షామ్ కి ఎలా సహాయపడతాడు అనేది మిగతా కధ.  

Ongole Gitta story|ram Ongole Gitta story

'ఒంగోలు గిత్త' సినిమా స్టోరీ

      ‘ఆరెంజ్’ దెబ్బకు దిమ్మతిరిగిన డైరెక్టర్ భాస్కర్ ఇక కెరీర్లో ‘కొత్తదనం’ జోలికేల్లకూడదని అనుకున్నాడేమో కాని, ఇప్పటిదాకా ప్రతి సినిమాలోనూ ఎంతో కొంత కొత్తదనం చూపిస్తూ, సున్నితమైన ప్రేమకథలు తీసిన భాస్కర్.. ఆ బాటను పూర్తిగా వదిలేసి ‘మాస్ ఎంటర్టైనర్’ "ఒంగోలు గిత్త" పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా స్టోరీ మీ కోసం. ఒంగోలు గిత్త మిర్చ్ యార్డ్ నేపధ్యంలో సాగే కథ. వైట్ (హీరో రామ్) చిన్నపాటి నుంచి మిర్చి యార్డ్ లో పెరిగి ఆదికేశవ నాయుడు కి కుడి భుజంలా ఎదుగుతాడు. సంధ్య( క్రితిఖర్బంధ) ఆదికేశవనాయుడి కూతురు. వైట్ సంధ్యతో లవ్ లో పడతాడు. ఆమెని పెళ్ళిచేసుకుంటానని ఆదికేశవనాయుడిని అడుగుతాడు. ఇంతలో లోకల్ ఎమ్మెల్యే అయినా ఆహుతిప్రసాద్ తన సొంత లాభం కోసం మిర్చి యార్డ్ ని వేరే ప్రాంతానికి మార్చాలని అనుకుంటాడు. అయితే మిర్చి యార్డ్ ని నమ్ముకుని వున్నవాళ్ళు తమకు ఎలాగైనా సహయం చేయమని వైట్, ఆదికేశవనాయుడి ని అడుగుతారు. సడన్ గా మూవీలో ట్విస్ట్ జరుగుతుంది. మిర్చి యార్డ్ పాత చైర్మన్ నారాయణ(ప్రభు) తో వైట్ కి ఆదికేశవనాయుడి కి సంబంధం ఉంటుంది. ఇంతకి గతం ఏమిటి? వైట్ కి ఆదికేశవనాయుడి కి నారాయణ్ తో వున్న సంబంధం ఏమిటి? అనేది మిగతా స్టోరీ.  

 Nothing personal against Kamal Haasan Jayalalitha

కమల్ హాసన్ 'విశ్వరూపం', అందరిపై కేసులు పెడతా: జయలలిత

      ప్రముఖ హీరో కమల్ నటించిన 'విశ్వరూపం' సినిమాను నిషేధించలేదని, శాంతిభద్రతల దృష్ట్యా సినిమాను నిలిపివేశామని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పేర్కొన్నారు. విశ్వరూపం సినిమాపై తమిళనాడు ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలను ఆమె ఖండించారు. ఇంటలిజెన్స్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు. విశ్వరూపం వివాదంపై మీడియా అతిగా స్పందించిందని జయ మండిపడ్డారు. జయ టీవీతో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేవన్నారు. తనపై ఆరోపణలు చేసినవారిపై కోర్టుకెళ్తానని జయ హెచ్చరించారు. ఈ సినిమాపై 25 ముస్లిం సంస్థలు ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చాయని, ఆందోళనలకు దిగుతామని హెచ్చరించినట్లు జయ చెప్పారు. కమల్ ప్రధానిని ఎంపిక చేయలేరని తనకు తెలుసన్నారు. కమల్‌తో తనకు వ్యక్తిగత కక్షలు లేవన్నారు.  ఆయన అన్ని తెలిసిన పెద్దమనిషి అని, బాధ్యతాయుత పౌరుడిగా వ్యవహరించాలని సూచించారు. ఈ సినిమా కోసం కమల్ రిస్క్ తీసుకున్నారని, ఆయన రిస్క్ తీసుకుంటే ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తుందని జయలలిత ప్రశ్నించారు.

samantha hot

'జబర్‌దస్త్'గా సమంత అందాలు

        హీరో సిద్దార్థ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం "జబర్ దస్త్ ". ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను రీసెంట్ గా విడుదల చేశారు. ఈ సినిమాలో సమంత తన అందాలను "జబర్ దస్త్ " గా చూపిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్లలో సమంత తన నడుము అందాలతో అభిమానులకు పిచ్చేక్కిస్తోంది. అసలకే వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న సమంత "జబర్ దస్త్ " లో తన అందాలతో ఏ మాయ చేస్తోందో వేచి చూడాలి.   శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు."జబర్ దస్త్ " సినిమాని నంది రెడ్డి దర్శకత్వం వహించగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈచిత్రం ఫస్ట్ కాపీ సిద్దం అయింది. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు. ఫస్ట్ కాపీ చూసిన అనంతరం హీరో సిద్ధార్థ ట్విట్టర్ ద్వారా తన అనుభవాలను పంచుకున్నారు. సినిమా చాలా బాగా వచ్చిందని, నా కెరీర్లో తొలిసారి లేడీ డైరెక్టర్ తో చేసాను. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా హిట్టవుతుందనే నమ్మకం ఉందని సిద్ధార్థ ట్వీట్ చేసారు   

సూపర్ స్టార్ మహేష్ కి నో చెప్పిన బాలీవుడ్ బ్యూటీ సోనమ్

  టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు, శ్రీనువైట్ల కాంబినేషన్ లో దూకుడు తరువాత 'ఆగడు' అనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ ని హీరోయిన్ గా నటిస్తుందని ఫిల్మ్ నగర్ టాక్. ఈ విషయం పై సోనమ్ కపూర్ తన మైక్రో బ్లాగింగ్ సైట్ లో వివరణ ఇచ్చింది. తాను మహేష్ బాబు తో ఏ సినిమా చేయడం లేదని చెప్పింది. ఇప్పుడు ఈ విషయం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు 'ఆగడు' సినిమాని దూకుడు నిర్మాతలు అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మించనున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు సుకుమార్ తో చేస్తున్న సినిమాలో బిజీగా ఉన్నారు.  శ్రీనువైట్ల ఎన్టీఆర్ తో  ‘బాద్ షా' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాల తరువాత మహేష్, శ్రీనువైట్ల మూవీ స్టార్ట్ అవుతుందని సమాచారం. 

ప్రముఖ గాయని ఎస్.జానకి వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర౦

        ప్రభుత్వం తనకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించడం పట్ల ప్రముఖ గాయని ఎస్.జానకి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గాయని ఎస్.జానకి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అవార్డు గ్రహీతల ఎంపికలో ఏ రాష్ట్రంపట్ల కూడా వివక్ష చూపడం లేదని తెలిపింది. కేంద్ర మంత్రి వి.నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ, జానకి వ్యాఖ్యలను తోసిపుచ్చారు.   “ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడీ అవార్డు వచ్చి ఉపయోగం ఏముంది?  దక్షిణాదికి ఎప్పుడూ అన్యాయమే జరుగుతోంది. నేను పెద్దసంతృప్తిగా అయితే ఏమీ లేను. పద్మభూషణ్ కంటే ఎక్కువే ఆశించాను. ఉత్తరాదికిచ్చిన ప్రాధాన్యం దక్షిణాదికి ఇవ్వట్లేదు. భారత రత్న ఇస్తే తీసుకుంటా. అంతకంటే తక్కువస్థాయిది ఏదిచ్చినా తీసుకోను అని ఎస్.జానకి చెప్పారు.  ‘అవార్డు గ్రహీతల ఎంపిక ప్రక్రియలో ఏ రాష్ట్రంపైనా పక్షపాతం చూపడం లేదు. దక్షిణాది వారిని నిర్లక్ష్యం చేస్తున్నామనడం సబబుకాదు’ అని నారాయణ స్వామి పేర్కొన్నారు. ‘వివిధ అవార్డుల కోసం వచ్చే దరఖాస్తులను నిపుణుల కమిటీ పరిశీలించి, కొన్ని పేర్లను ఎంపికచేసి ఆ జాబితాను కేబినెట్ కార్యదర్శికి పంపుతుంది. అనంతరం గ్రహీతల పేర్లను ప్రధానమంత్రి, రాష్ట్రపతి నిర్ణయిస్తారు’ అని ఆయన చెప్పారు. అందువల్ల జానకి అవార్డును స్వీకరించాలని కోరారు.  

కమల్ వద్దు.. మహేషే ముద్దు!

  గత ఏడాది విడుదలయిన హిందీ సినిమా ‘దబాంగ్’తో కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన అందాల భామ సోనాక్షి సిన్హాపై కమల్ హస్సన్ కూడా మనసు పారేసుకొన్నాడు. ఆమెతో ఆడిపాడి తన విశ్వరూపం చూపలనుకొన్న కమల్ హస్సన్ కి డేట్స్ లేవంటూ హ్యండిచ్చిన ఆ అందాల భామ మన ప్రిన్స్ మహేష్ బాబు సినిమాలో చాన్స్ అనగానే ఎగిరి గెంతేసినంత పని చేసి వెంటనే ఒప్పేసుకొంది. త్వరలో క్రిష్ దర్శకత్వంలోమహేష్ బాబు చేయనున్న సినిమాలో అతనితో ఆమె జత కట్టనుంది. అసలే మహేష్ బాబు..ఇప్పుడు అతనికి అందాల సోనక్షి జతయింది. ఇక ఆ జంట ఎంత చూడ ముచ్చటగా ఉంటుందో వర్ణించడం కష్టమే.   ఇక, శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోతున్న మరో సినిమాలో మరో బాలివుడ్ అందాల భామ సోనం కపూర్ కూడా జతకట్టదానికి సిద్దం అయింది. ఈ సినిమాకి కధనందిస్తున్న కోన వెంకట్ ఈ విషయాన్నీ దృవీకరించారు. సుకుమార్  దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుందని ఆయన అన్నారు. ఈ సినిమాకి ‘ఆగడు’ అని పేరు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఇద్దరు హిందీ భామలతో రోమాన్స్ చేయబోతున్న మహేష్ బాబు ఇక అక్కడితోనే ఆగడని అనుకోవచ్చును. రెండు సినిమాలలో హిందీ భామలు ఉన్నందున ఆ రెంటినీ హిందీలో కూడా విడుదలచేస్తారేమో ఇంకా తెలియదు. మరిన్ని విశేషాలు త్వరలో.

ప్రభాస్ 'మిర్చి'తో ఫిబ్రవరి 8న వస్తున్నాడు

        యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ "మిర్చి" ఒక రోజు ఆలస్యంగా రానుంది. ముందుగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కాని ఒక రోజు ఆలస్యంగా ఫిబ్రవరి 8న రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు చెప్పారు. ఈ సినిమాని ప్రభాస్ కెరీర్ లో హయ్యేస్ట్ ధియేటర్స్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. "మిర్చి" లో ప్రభాస్ డిఫరెంట్ క్యారెక్టర్, న్యూలుక్ లో కనిపించనున్నారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సూపర్ హిట్ కొట్టింది. మాటల రచయిత కొరటాల శివ "మిర్చి"తో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.  అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ సంయుక్తంగా యు.వి.క్రియేషన్స్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.