జ‌గ‌న్ కొత్త ప్లాన్‌.. ఛీకొడుతున్న జనం

అధికారంలో ఉన్న‌ప్పుడు అసెంబ్లీ సాంప్ర‌దాయాలు, నియ‌మాలు మ‌రిచి అధికార మ‌దంతో మాట్లాడిన మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఇప్పుడు నియ‌మాలు గుర్తుకొస్తున్నాయి. అసెంబ్లీలో అలా ఉండాలి, ఇలా ఉండాలి, నియ‌మాలు పాటించాలంటూ దెయ్యాలు వేదాలు వల్లె వేసిన‌ట్లుగా జ‌గ‌న్ మాట్లాడుతున్నారు. తాను త‌ల‌చుకుంటే తెలుగుదేశం పార్టీకి ప్ర‌తిప‌క్ష హోదాకూడా ఉండ‌ద‌ని అసెంబ్లీ సాక్షిగా నాటి ప్ర‌తిప‌క్ష‌నేత చంద్ర‌బాబుపై నోరుపారేసుకున్న జ‌గ‌న్‌.. ఇప్పుడు మాత్రం నీతి సూత్రాలు చెబుతున్నారు. ఐదేళ్లు అసెంబ్లీ గౌరవం పోయేలా  ఇష్టానుసారంగా ప్రవర్తించి ప్ర‌జ‌ల చేత ఛీ కొట్టించుకున్న జ‌గ‌న్‌, వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు సుద్దులు చెబుతున్నారు. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు కుటుంబం పై నిండుస‌భ సాక్షిగా వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన నీచ‌మైన వ్యాఖ్యలు జ‌గ‌న్ మ‌ర్చిపోయిన‌ట్లున్నారు. స‌భా నియ‌మాలు పాటించాలంటూ గొప్ప‌ గొప్ప మాట‌లు చెబుతూ అసెంబ్లీ స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడికి  జగన్ ఓ లేఖ రాశారు. వైసీపీ   హ‌యాంలో అసెంబ్లీ జ‌రిగిన తీరు, ప్ర‌తిప‌క్ష పార్టీ ఎమ్మెల్యేల‌పై వైసీపీ ఎమ్మెల్యేలు ప్ర‌వ‌ర్తించిన తీరు ఇప్ప‌టికీ ప్ర‌జ‌లు గుర్తుచేసుకుంటున్నారు. కానీ ప్యాలెస్ రాజు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అవేమీ ప‌ట్ట‌వు. ఐదేళ్ల పాల‌న‌లో ప్ర‌తిప‌క్ష నేత‌లు, ప్ర‌జ‌ల ప‌ట్ల తాను అరాచ‌కంగా వ్య‌వ‌హ‌రించిన‌ప్ప‌టికీ.. అవ‌న్నీ మ‌ర్చిపోయి గాంధీగారిలా ఒక‌చెంప కొడితే మ‌రో చెంప చూపాల‌ని అన్న‌ట్లుగా అధికార పార్టీ నేత‌ల‌ను జ‌గ‌న్ కోరుతుండ‌టం విడ్డూరం. ఏపీలో భారీ మెజార్టీతో  తెలుగుదేశం కూటమి ప్ర‌భుత్వం కొలువుదీరింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల్లో ఎమ్మెల్యేలు ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్కించుకోని మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప‌ట్ల స‌భ‌ గౌర‌వ ప్ర‌దంగా వ్య‌వ‌హ‌రించింది. అసెంబ్లీ నిబంధ‌న‌ల ప్ర‌కారం  సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌రువాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్ర‌కారం ఎమ్మెల్యేలు ప్ర‌మాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. కానీ కూట‌మి ప్ర‌భుత్వం జ‌గ‌న్ ప‌ట్ల మ‌ర్యాద‌పూర్వంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ఆయన కూడా సిగ్గుపడాల్సినంత ఉదారంగా వ్య‌వ‌హ‌రించి మంత్రుల త‌రువాత జగన్ కు ప్ర‌మాణ స్వీకారం చేసేందుకు అవ‌కాశం క‌ల్పించింది. ప్ర‌మాణ స్వీకారానికి ముందు అసెంబ్లీ హాల్‌లోకి వ‌చ్చిన జ‌గ‌న్‌.. ఎమ్మెల్యేగా ప్ర‌మాణ‌స్వీకారం చేసి వెంట‌నే అసెంబ్లీ హాల్ నుంచి వెళ్లిపోయాడు. అసెంబ్లీలో జ‌గ‌న్ ప‌ట్ల కూట‌మి పార్టీ స‌భ్యులు వ్య‌వ‌హ‌రించిన తీరును ప్ర‌జ‌లు సైతం మెచ్చుకున్నారు. అయితే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌మాణ స్వీకారం పూర్త‌యిన నాలుగు రోజుల త‌రువాత.. అసెంబ్లీలో మీరు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించారంటూ స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడుకు లేఖ రాయ‌డం ఏపీ ప్ర‌జ‌ల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. జగన్ తీరు పట్ల వెగటు పుట్టిస్తోంది. ఐదేళ్ల కాలంలో ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌ను క‌నీసం మ‌నుషుల్లా కూడా గౌర‌వించ‌కుండా కౌర‌వ స‌భ‌ను న‌డిపిన జ‌గ‌న్‌.. ఇప్పుడు మాత్రం అసెంబ్లీ నియ‌మాలు అంటూ కొత్త విష‌యాలు ప్ర‌స్తావించ‌డం వైసీపీ నాయ‌కుల‌కు కూడా  చిరాకు తెప్పిస్తోంది.   స్పీక‌ర్ కు జ‌గ‌న్ రాసిన లేఖను ఓసారి ప‌రిశీలిస్తే,  మంత్రుల  తర్వాత తనతో ప్రమాణ స్వీకారం చేయించడం నిబంధనలకు విరుద్ధమని జగన్ పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందే నిర్ణయించుకున్నట్టున్నారు, విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నది అసెంబ్లీ రూల్స్ అంటూ కొత్త వాదాన్ని జ‌గ‌న్‌ తెర‌పైకి తెచ్చారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే 10శాతం సీట్లు వుండాలని ఎక్కడా లేదు,  పార్లమెంట్, ఉమ్మడి ఏపీలో ఈ నిబంధనలు పాటించలేదంటూ జగన్ లేఖ‌లో పేర్కొన్నాడు. కూటమి సభ్యులు, స్పీకర్ తనపై పై శత్రుత్వం ప్రదర్శిస్తున్నారు. చచ్చేదాకా కొట్టాలి అంటూ స్పీకర్ గతంలో చేసిన వ్యాఖ్యలు బయటపడ్డాయి. అసెంబ్లీలో గొంతువిప్పే పరిస్థితి కనిపించడం లేదు. ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించగలం. వీటన్నిటినీ  దృష్టిలో పెట్టుకొని వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వాలంటూ స్పీక‌ర్ కు రాసిన లేఖ‌లో జ‌గ‌న్ రెడ్డి పేర్కొన్నాడు. జ‌గ‌న్ లేఖ‌లో పేర్కొన్న అంశాల‌నుచూసి వైసీపీ నేత‌లు సైతం ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఐదేళ్ల కాలంలో అసెంబ్లీలో క‌నీస మ‌ర్యాద‌లు పాటించ‌ని మ‌నం.. అధికారం కోల్పోయాక నియ‌మాలు పాటించాలంటూ స్పీక‌ర్ కు లేఖ రాయ‌డం సిగ్గుగా లేదా జ‌గ‌న‌న్నా అంటూ నివ్వెరపోతున్నారు . అయితే, ఇక్క‌డ ఓ విష‌యం తెలుసుకోవాలి. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్పీక‌ర్ కు రాసిన లేఖ వెనుక పెద్ద వ్యూహ‌మే ఉన్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.  ఐదేళ్లు అధికారంలో కొన‌సాగిన జ‌గ‌న్‌.. అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌కు క‌నీస మ‌ర్యాద‌ కూడా ఇవ్వ‌లేదు. కానీ, వైసీపీకి కేవ‌లం 11 సీట్లు మాత్ర‌మే వ‌చ్చి.. ప్ర‌తిప‌క్ష హోదాకూడా ద‌క్క‌క‌పోయినా.. అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల‌కు స‌రియైన గౌర‌వం ఇవ్వాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల అసెంబ్లీలో జ‌గ‌న్ కు మంత్రుల తరువాత ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇచ్చారు. జ‌గ‌న్‌, వైసీపీ ఎమ్మెల్యేలప‌ట్ల చంద్ర‌బాబు ప్ర‌వ‌ర్తించిన తీరు చూసి ప్ర‌జ‌లు హ‌ర్షిస్తున్నారు. ఎప్పుడు అసెంబ్లీ స‌మావేశాలు జ‌రిగినా వైసీపీ ఎమ్మెల్యేల‌ప‌ ట్ల స‌భ‌లో మ‌ర్యాద‌గా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని, వారు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు స‌భ‌లో అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని చంద్ర‌బాబు చెప్ప‌క‌నే చెప్పారు. అదే జ‌రిగితే.. గ‌త ఐదేళ్ల కాలంలో అసెంబ్లీ జ‌రిగిన తీరును.. ప్ర‌స్తుతం అసెంబ్లీ జ‌రిగే తీరును చూసి ప్ర‌జ‌ల్లో త‌మ‌ప‌ట్ల వ్య‌తిరేక భావం మరింత ఎక్కువ అవుతుందని జ‌గ‌న్ ఆందోళ‌న చెందుతున్న‌ట్లు కనిపిస్తోంది. దీనికితోడు.. అసెంబ్లీకి వ‌చ్చే ఉద్దేశంలో జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి లేరని వైసీపీ నేత‌లే బాహాటంగా చెబుతున్నారు. జ‌గ‌న్ తానంత‌ట‌ తానే అసెంబ్లీకి రాలేద‌ని ప్ర‌జ‌లు అనుకోకుండా.. ఆ నెపాన్ని తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం, స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడిపై నెట్టేందుకు జ‌గ‌న్ ప్లాన్ చేసిన‌ట్లుగా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.

కేటీఆర్‌కి శవాలు కావలెను!

ప్రస్తుతం పెద్దగా పనేం లేదు కాబట్టి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శవాల కోసం అన్వేషిస్తున్నారు. ఎక్కడెక్కడ చావులు జరిగాయా, ఆ చావులను ప్రభుత్వం మీద నెట్టేసి శవరాజకీయం చేద్దామా అని తహతహలాడుతున్నారు. అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ చేతులు ఎత్తేసి ఫామ్‌హౌస్‌లో ‘టానిక్’ తాగుతూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి అయిపోయినట్టు కలలు కని, ఆ కలలన్నీ కల్లలైపోయిన కేటీఆర్ మాత్రం ఏం చేసయినా మళ్ళీ అధికారంలోకి రావాలని తంటాలు పడుతూ, అప్పుడప్పుడు ట్విట్టర్లోకి వచ్చి కామెంట్లు పోస్టు చేస్తూ అధికార పార్టీ మీద ‘పోరాటం’ చేస్తున్నారు. అధికార పార్టీని తిట్టడానికి ఏ సాకూ దొరక్కపోతే, చచ్చిన వాడికి వచ్చిందే కట్నం అన్నట్టుగా, తన రాజకీయాల కోసం శవాలను ఉపయోగించుకుంటూ శవరాజకీయ దురంధరుడిగా పేరు సంపాదించుకుంటున్నారు. గతంలో ఉద్యమకారుల శవాల మీద నడిచి అధికారాన్ని సంపాదించుకున్నారు కదా.. ఆ అలవాటు ఎక్కడకి పోతుంది? కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి తెలంగాణలో ఎక్కడ, ఎవరు ఆత్మహత్య చేసుకున్నా అది కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో వేస్తూ కేటీఆర్ ఆత్మానందం పొందుతున్నారు. ఏ వృత్తిలో వున్న వారు ఆత్మహత్య చేసుకుని చనిపోయినా ఆ ఫలానా వృత్తికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేయడం వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని కేటీఆర్ విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వారం పదిరోజుల నుంచే కేటీఆర్ ఈ రకం రచ్చ చేయడం ప్రారంభించారు. రైతులు ఆత్మహత్య చేసుకున్నా, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నా దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే అంటున్నారు. అధికారంలోకి వచ్చిన ఇంత కొద్ది కాలంలో కాంగ్రెస్ పార్టీ అంత  దారుణాలు ఏం చేసింది? ఆత్మహత్యలు చేసుకునే స్థాయిలో ఏ వృత్తిలో వున్న వారికి అన్యాయం చేసింది? నిజానికి ఇప్పుడు ఏ వృత్తిలో వున్నవారు ఆత్మహత్య చేసుకున్నా, అది గత పదేళ్ళుగా అధికారం వెలగబెట్టిన బీఆర్ఎస్ పార్టీనే కారణం అవుతుంది తప్ప... నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు కారణం అవుతుంది?  సిరిసిల్ల ప్రాంతంలో చేనేత కార్మికులు ఈమధ్యకాలంలో ఆత్మహత్య చేసుకుంటే దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే అని కేటీఆర్ ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. మరి కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యేనే కదా.. మరి ఆయన అద్భుతమైన పరిపాలనలో వున్నప్పుడు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోకూడదు కదా... కేసీఆర్ కుటుంబం మాటలు జనం నమ్మే రోజులు పోయాయి. ఇప్పటికైనా కేటీఆర్ ఈ శవాల వేట మానుకుంటే మంచిది.

జగన్ రోడ్డున పడ్డాడు!

సొంత సొమ్ము సోమవారం ఒంటి పొద్దులుంటారు.. మంది సొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు అన్నట్లుగా జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ సొమ్ము దర్జాగా దుబారా చేశారు. అదే అధికారం కోల్పోయే సరికి పిసినారిగా మారిపోయారు. సీఎంగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి కేవలం ఎనిమిదిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి వెళ్లడానికి కూడా హెలికాప్టర్ ఉపయోగించిన జగన్.. ఇప్పుడు ఏకంగా వందల కిలోమీటర్లు రోడ్డు మార్గాన వెళ్లారు.  అది కూడా కదిరి పులివెందుల రోడ్డుపై. జగన్ ఐదేళ్ల పాలనలో చిన్నపాటి మరమ్మతుకు కూడా నోచుకోకుండా పూర్తిగా  గుంతలతో నిండి ప్రయాణీకులకు నరకం చూపించే  ఆ దారి గుండా జగన్ రోడ్డు మార్గంలో బెంగళూరు వెళ్లారు. హెలికాప్టర్ ఎందుకు ఉపయోగించలేదంటే కారణం సుస్పష్టం. ఇప్పుడు ఆయన చాపర్లో వెళ్లాలంటే సొంత సొమ్ము ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే జగన్ కు మంది సొమ్ము నొక్కేయడం తప్ప సొంత సొమ్ము ఖర్చు చేయడం తెలీదు.  అధికారంలో ఉన్నంత కాలం ఆయన తన పర్యటనల కోసం ప్రత్యేక విమానాన్ని హైర్ చేసుకునే వారు. అదే అధికారం కోల్పోయిన మరుక్షణం నుంచీ ఆకాశంలో లోహ విహంగ యానాలకు స్వస్తి చెప్పి రోడ్డు మార్గానే తిరగడం మొదలు పెట్టారు. సీఎంగా జగన్ ఉన్న సమయంలో రాష్ట్రంలో ఆయన పర్యటనల కోసం రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ ను  అద్దెకు తీసుకొనేది.  ఇక ఆయన బెంగళూరు పర్యటన వద్దకు వస్తే.. జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి పులివెందుల పర్యటనకు వెళ్లారు. ముందుగా ఆయన పులివెందులలో నాలుగు రోజుల పాటు ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే పులివెందులలో సొంత పార్టీ శ్రేణుల నుంచే తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం కావడం, ఆయన నివాసంపై దాడికి కూడా వైసీపీ శ్రేణులు ప్రకటించడంతో పులివెందులలో ఆయన పర్యటన రెండు రోజులకే పరిమితమైంది. ఎందుకంటే సొంత పార్టీ శ్రేణుల నుంచే తిరస్కారం ఎదురయ్యే సరికి ఆయన అక్కడ ఇక ఉండలేకపోయారు. ఇంతకీ సొంత పార్టీ నుంచే ఆయనకు నిరసన ఎందుకు వ్యక్తమైందంటే వారికి పెద్ద మొత్తంలో బిల్లులు పెండింగ్ లో ఉండటమే. ఒక్క పులివెందుల మునిసిపాలిటీ పరిధిలోనే వైసీపీ నేతలు చేసిన పనులకు సంబంధించి వంద కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని చెబుతున్నారు.  దీంతో ఆయన పులివెందుల పర్యటనను ముగించుకుని అక్కడ నుంచి నేరుగా బెంగళూరుకు వెళ్లిపోయారు. అధికారంలో ఉండి ఉన్నట్లైతే ఆయన బెంగళూరుకు హెలికాప్టర్ లోనే లేదా కడప చేరుకుని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలోనో వెళ్లి ఉండేవారు. ఎందుకంటే అందుకు అయ్యే ఖర్చు తనది కాదు కదా? కానీ ఇప్పుడు ఆయన చాపర్ లో వెళ్లాలన్నా, ప్రత్యేక విమానం బుక్ చేసుకోవాలన్నా చేతి చమురు వదులుతుంది. అందుకే ఆయన రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారు.  

కాంగ్రెస్ పార్టీతో కోమటిరెడ్డి తెగదెంపులు .. త్వరలో బిజెపి తీర్థం? 

తెలంగాణ  కాంగ్రెస్ పార్టీకి కోమటి రెడ్డి ఉద్వాసన పలుకుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజీనామా చేయబోతున్నారని త్వరలోనే బిజెపి తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు  కోమటిరెడ్డి వెంకటరెడ్డి  ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు.  అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి మెజార్టీతో గెలుపొందింది. పార్లమెంటు ఎన్నికలలో బిజెపి 8 స్థానాల్లో గెలుపొందింది. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బిజెపి నుంచి కాంగ్రెస్ లో చేరి గెలుపొందారు. ఇక నేడు ఆయన ఫైనల్ డెసిషన్ తీసుకొని కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారని, కొద్ది రోజుల్లోనే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇదే గనుక జరిగితే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలినట్టే రాజకీయ విశ్లేషకులు. అంటున్నారు.  రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ , బిజెపిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కాంగ్రెస్ మంత్రి కోమటి వెంకట్ రెడ్డి మర్యాదపూర్వకంగా ఢిల్లీలో కలుసుకున్నారు. కొద్ది సేపటి తర్వాత తెలంగాణ బిజెపి చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఒకే రోజు ఇద్దరు కేంద్ర మంత్రులను కులుసుకోవడం కాంగ్రెస్ మంత్రి కలుసుకోవడం చర్చనీయాంశమైంది. త్వరలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చేరనున్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి.  ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్న కోమటిరెడ్డి కాంగ్రెస్ కు దూరమౌతున్నట్లు తెలుస్తోంది.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిగ్ షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర మనస్తాపంతో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీని వీడటం కోసం రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. గతంలో తెలంగాణ పిసిసి చీఫ్, ఏఐసిసి పదవులు ఆశించిన ఆయన తనకు పదవులు లభించకపోవడంతో భంగపడ్డారు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని కోమటిరెడ్డి బాహాటంగా వ్యతిరేకించారు. రేవంత్ రెడ్డికి టీపీసీసీ ఇవ్వటంపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అప్పుడే ఆయన పార్టీ మారతారని ప్రచారం అరిగ్గింది. దీంతో పాటు సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బిజెపి తీర్థం పుచ్చుకున్న సమయంలో కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ మారతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తమ్ముడిని గెలిపించటం కోసం పని చేస్తున్నారని ఆయన కాంగ్రెస్ శ్రేణుల నుండి కూడా పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదుర్కొన్నారు. ఆయన ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఆయన తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని తేల్చి చెప్పారు. అయినప్పటికీ తమ్ముడు ఎఫెక్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై తీవ్రంగా పడింది. కాంగ్రెస్ పార్టీ నేతలతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూరం మరింత పెరిగింది.

బాపట్లలో జగన్ పార్టీ ఆఫీసుకి ‘స్పాట్’!

జగన్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అనుమతులు లేకుండా పార్టీ ఆఫీసుల పేరుతో పెద్ద పెద్ద ప్యాలెస్‌లను నిర్మించిన విషయం తెలిసిందే. ఈమధ్యే తాడేపల్లిలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ప్రభుత్వ అధికారులు కూలగొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా అనుమతులు లేకుండా నిర్మిస్తున్న కార్యాలయాల మీద ప్రభుత్వ అధికారులు దృష్టి కేంద్రీకరించారు. బాపట్లలో వైసీపీ అనుమతి లేకుండా నిర్మించిన జిల్లా కార్యాలయానికి అధికారులు నోటీసులు అతికించారు.  ఈ అక్రమ నిర్మాణం మీద వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని సదరు నోటీసులలో పేర్కొన్నారు. తొలుత ఈ నోటీసులు అందించడానికి వైసీపీ జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకట రమణారావును సంప్రదించినప్పుడు ఆయన ‘అందుబాటులో లేను’ అని తప్పించుకున్నారు. దాంతో అధికారులు నోటీసులను పార్టీ కార్యాలయానికే అతికించారు. వారం రోజుల్లోగా సరైన వివరణ అందని పక్షంలో అధికారులు ఈ ప్యాలెస్‌కి స్పాట్ పెట్టడం ఖాయం!

గుడివాడ అమర్‌నాథ్ ‘గుడ్డు’ పగలబోతోంది!

గతించిపోయిన వైసీపీ ప్రభుత్వంలో కోడిగుడ్డు మంత్రిగా వెరీగుడ్డు నేమ్ సంపాదించుకున్న,  జగన్ మంత్రుల్లో సుపీరియారిటీ కాంప్లెక్స్ బాగా ఎక్కువగా వున్న మంత్రిగా పేరు తెచ్చుకున్న గుడివాడ అమర్‌నాథ్ తన హయాంలో గాజువాకలో ఒక షాపింగ్ కాంప్లెక్స్.ని నిబంధనలు విరుద్ధంగా కట్టారు. ఈమధ్యే వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కుప్పకూలిపోయింది. ఇక తర్వాత కుప్పకూలబోయేది కూడిగుడ్డు మంత్రి ‘గుడ్డు’ అని తెలుస్తోంది. అక్రమంగా కట్టిన షాపింగ్ కాంప్లెక్స్.ని నేలమట్టం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గతంలో అన్ని అనుమతులతో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించారు. దీన్ని చూసి కళ్ళలో నిప్పులు పోసుకున్న అమర్‌నాథ్ ఆ భవనాన్ని ఎలా కూలగొట్టాలా అని ప్లాన్ చేశారు. మాస్టర్ ప్లాన్ రహదారి విస్తరణకు భూమి వదలకుండా నిర్మాణం చేశారనే సాకు చెబుతూ, పూర్తయిన భవనాన్ని సగానికి పైగా కూలగొట్టించారు. అత్తకు బుద్దిచెప్పి కోడలు మూకుడు నాకినట్టు ఇప్పుడు అదే అమర్‌నాథ్ ఎలాంటి అనుమతులు లేకుండా అదే గాజువాకలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించారు.  జీవీఎంసీ 70వ వార్డులో చట్టివానిపాలెం దగ్గర జాతీయ రహదారిని ఆనుకుని  కోడిగుడ్డు అమర్‌నాథ్ జీ ప్లస్ ఫోర్ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించారు. ఈ జాతీయ రహదారిని మాస్టర్ ప్లాన్‌‌లో భాగంగా 2 వందల అడుగుల నుంచి 266 అడుగులకు విస్తరించాలని జీవో నంబర్ 136లో పేర్కొన్నారు. ఆ ప్రకారం అమర్‌నాథ్ తన భవంతిని రోడ్డుకు 53 అడుగులు విడిచిపెట్టి నిర్మించాల్సి వుంటుంది. కానీ, అధికార బలంతో వున్న ఆయన అలా చేయకుండా భారీ భవనం నిర్మించారు. స్థలాన్ని వదిలిపెట్టే విషయంలోనే కాకుండా ఇంకా అనేక అంశాలలో అమర్‌నాథ్ నిబంధనలను బేఖాతరు చేస్తూ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించారు. మరి... నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్టుగా, పల్లా శ్రీనివాసరావు భవనాన్ని ఎలా కూల్చారో, ఇప్పుడు కోడిగుడ్డు అమర్‌నాథ్ భవనాన్ని కూడా అలాగే కూల్చాలి  కదా!

లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా!

పవన్ కల్యాణ్ సినిమాలో చివరి పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా అనే డైలాగ్ ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు అలాంటి కిక్కే పవన్ కల్యాణ్ అనుభవంలకి వచ్చిందని చెప్పవచ్చు. గత ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయం తరువాత.. ఇప్పుడు వందశాతం స్ట్రైక్ రేట్ తో తన పార్టీ జనసేన తరఫున పోటీ చేసిన అభ్యర్థులంతా విజయం సాధించడమే కాకుండా తాను స్వయంగా పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించి ఏపీ డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. మరో వైపు గత ఐదేళ్లుగా తనను టార్గెట్ చేసి వ్యక్తిగత జీవితంపై విమర్శలతో వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వైసీపీ నేతలు ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడమే కాకుండా, స్వయంగా జగన్ మోహన్ రెడ్డి అధికారం కోల్పోయి కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా మామూలు ఎమ్మెల్యేగా మిగిలారు. వ అధికారంలో ఉన్నన్ని రోజులు పాలన మీద కన్నా ప్రతిపక్షాలపై వేధిపులు, ప్రతిపక్ష నేతలపై బురద జల్లుడే ఏకైక కార్యక్రమంగా సాగిన జగన్ పాలనకు జనం తమ ఓటుతో చరమగీతం పాడారు.  దీంతో  ఇప్పుడు జగన్ బెంగళూరులో మకాం వేసి.. కర్నాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ద్వారా వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి శతథా ప్రయత్నిస్తున్నారు. అడపాదడపా తన ఓటమికి కారణం ఈవీఎంల ట్యాంపరింగులే అనీ, తాను గద్దె దిగగానే ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా మారిందని ట్వీట్లు చేస్తూ కాలం గడుపుతున్నారు. ఇక తాజాగా తాను అసెంబ్లీలో ఇక అడుగపెట్టే అవకాశం క నిపించడం లేదంటూ వస్తున్న వార్తలపై పరోక్షంగా స్పందించారు. అసెంబ్లీలో తమ పార్టీ వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనీ, అలాగే తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించాలనీ కోరుతూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. ఆ లేఖలో తనను సభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి మంత్రుల కంటే ముందు అనుమతించకపోవడం ద్వారా తొలి రోజే సభాపతి నిబంధనలను పాటించలేదని జగన్ జగన్ ఆరోపించారు. వైసీపీ పట్ల, తన పట్ల అధికార కూటమి సభ్యులు, స్పీకర్ శత్రుభావంతో వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.   జగన్ తీరు పట్ల ప్రజలలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. గత ఐదేళ్లుగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరును గుర్తు చేసుకుంటూ.. ఇప్పుడు జగన్  ఇలా స్పీకర్ కు లేఖ రాయడాన్ని  దుయ్యబడుతున్నారు.  అదే సమయంలో  పవన్ కల్యాణ్  ఉప ముఖ్యమంత్రి హోదాలో సభలో కూర్చిన జగన్ బేల మాటలను, రాతలను చూస్తూ చిద్విలాసంగా నవ్వుకుంటున్నారు. 

హుజూరాబాద్‌ లో హైటెన్షన్... బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో హై టెన్షన్‌ నెలకొంది. ఆధిపత్య పోరులో … నియోజకవర్గంలో కాంగ్రెస్‌ బిఆర్‌ఎస్‌ నాయకులు సవాళ్లు.. ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. గతంలో ఫ్లైయాష్‌ విషయంలో మంత్రి పొన్నంపై హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి ఆరోపణలు చేయడంతో కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌ ఛార్జి ప్రణవ్‌ స్పందించి.. ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి పై ఆరోపణలు చేశారు. హుజురాబాద్‌ ఎమ్మెల్యే అవినీతికి పాల్పడినట్లు, రైస్‌ మిల్లర్లు, ఇసుక మాఫియా వద్ద డబ్బులు వసూలు చేశారని, పూర్తి ఆధారాలతో చెల్పూరు ఆంజనేయ స్వామి ఆలయానికి వస్తున్నానని, నీకు ధైర్యం ఉంటే నీవు కూడా వచ్చి డబ్బులు తీసుకోలేదని ఆంజనేయుని పై ప్రమాణం చేస్తావా అని సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ నాయకులు విసిరిన సవాల్‌ ను స్వీకరించిన కౌశిక్‌ రెడ్డి.. నేడు చేల్పూర్‌ హనుమాన్‌ దేవాలయానికి బయలు దేరారు.  ఇద్దరి సవాళ్లకు చెల్పూర్‌ ఆంజనేయ స్వామి ఆలయాన్ని వేదిక చేసుకోవడంతో ఈ రోజు 11 గంటల సమయంలో అక్కడ ఏం జరుగుతుందో అనే టెన్షన్‌ నెలకొంది. పోలీసులు ముందుగానే చెల్పూర్‌కు వెళ్లి ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఫ్లైయాష్ తరలింపు విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ రూ. వంద కోట్ల అవినీతికి పాల్పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల విమర్శలు ప్రతివిమర్శలు హుజురాబాద్ నియోజకవర్గంలో ఉద్రిక్తతకు దారితీశాయి. ఇరుపార్టీల నేతల సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.   మంత్రి పొన్నం ప్రభాకర్ పై పాడి కౌశిక్ రెడ్డి చేసిన విమర్శలను కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి ప్రణవ్ తోసిపుచ్చారు. కౌశిక్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తూ చెల్పూర్ హనుమాన్ టెంపుల్‌లో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఈ సవాల్ ను స్వీకరించిన పాడి.. మంగళవారం ఉదయం వీణవంకలోని తన నివాసం నుంచి చెల్పూర్ బయలుదేరగా పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు, ప్రణవ్ కూడా చెల్పూర్ బయలుదేరారు. దీంతో పోలీసులు హనుమాన్ దేవాలయం వద్ద 144 సెక్షన్ ను అమలు చేశారు. హుజురాబాద్, జమ్మికుంట రహదారిలో బారికేడ్లను ఏర్పాటు చేసి కార్యకర్తలను ఎవ్వరినీ అక్కడికి అనుమతించడం లేదు. హనుమాన్ టెంపుల్ చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బయటకు వెళ్లనీయకపోవడంతో తాను ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు అని కౌశిక్ రెడ్డి ఇంట్లోనే ప్రమాణం చేశారు. కాషాయ వస్త్రాలతో తలస్నానం చేసి, తడిబట్టలతోనే దేవుడి చిత్రపటంపై ప్రమాణం చేశారు. ఫ్లైయాష్ తరలింపులో రూ.100 కోట్ల అవినీతి, ఓవర్ లోడ్ లారీల విషయంలో అవినీతికి పాల్పడలేదని తన మాదిరిగానే ప్రమాణం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఛాలెంజ్ చేశారు. టీటీడీ ఆలయంలో ప్రమాణం చేయడానికీ సిద్ధమని, తానొక్కడినే వస్తానని చెబుతూ.. దమ్ముంటే ప్రమాణం చేసేందుకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు సవాల్ విసిరారు.

స్పీకర్ అయ్యన్నకి జగన్ లేఖ... గొంతెమ్మ కోరికలు!

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే లేఖ రాశారు. ఆరోపణలు, డిమాండ్లు, కమాండ్లు ఆ లేఖలో వున్నాయి. మొదట మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన చేత ప్రమాణ స్వీకారం చేయించారని, అది అసెంబ్లీ పద్ధతులకు విరుద్ధమని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే మొత్తం సీట్లలో 10 శాతం సీట్లు వచ్చి వుండాలన్న నిబంధన ఎక్కడా లేదని జగన్ లేఖలో చెప్పారు. ప్రతిపక్షంలో ఎవరికి ఎక్కువ స్థానాలు వుంటే ఆ పార్టీకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ పద్ధతి పాటించలేదని లేఖలో అన్నారు. ‘‘అధికార కూటమి, స్పీకర్ ఇప్పటికే నామీద శత్రుత్వం ప్రదర్శిస్తున్నారు. జగన్ని చచ్చేదాకా కొట్టాలని స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటకి వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించేన అవకాశం వుంటుంది. ప్రతిపక్ష హోదాతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుందని ఆశిస్తున్నాను. ఈ అంశాలను దృష్టిలో వుంచుకుని ఈ లేఖను పరిశీలించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను’’ అని స్పీకర్‌కి రాసిన లేఖలో జగన్ పేర్కొన్నారు.

రియల్ ముసుగులో మోసం... వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై కేసు 

యధా రాజా తథా ప్రజా అన్నట్టు వైసీపీ అధినేత జగన్ అడుగు జాడల్లో  వైసీపీ నేతలు వెళ్తున్నారు  వారు చేసే నేరాలు అన్నీ ఇన్నీ కావు. విశాఖ రాజధాని అని అనౌన్స్ చేసిన క్షణం నుంచే వైసీపీ నేతలు  రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు. చట్ట ప్రకారం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఏ ఇబ్బంది లేదు. కానీ వైసీపీ నేతలు రియల్ ఎస్టేట్ ముసుగులో భూ కబ్జాలకు పాల్పడ్డారు.   వైసీపీ నేత, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతోపాటు ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు, రియల్టర్ గద్దె బ్రహ్మాజీపై విశాఖపట్టణం పోలీసులు కేసు నమోదు చేశారు. హయగ్రీవ కన్‌స్ట్రక్షన్ అధినేత జగదీశ్వరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేశారు.  ఎంవోయూ పేరిట ఖాళీ పత్రాలపై ఎంవీవీ తనతో సంతకాలు పెట్టించుకున్నారని, విలువైన భూములను కాజేసే ప్రయత్నం చేశారని జగదీశ్వరుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 22న సత్యనారాయణపై పోలీసులు నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ సత్యనారాయణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ముళ్ళపూడి వీరవెంకట సత్యనారాయణ అంటే ఠక్కున గుర్తుకురాకపోవచ్చు. అదే ఎంవీవీ సత్యనారాయణ అంటే మాత్రం ఇట్టే గుర్తొస్తారు. వైసీపీ అభ్యర్ధిగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో విశాఖ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందారు. వ్యాపారాలు చేసుకుంటూనే, రాజకీయ నాయకుడిగానూ కొనసాగారు. గతేడాది ఎంపీ ఎంవీవీ కుమారుడు శరత్, భార్య జ్యోతి, ఆడిటర్ జీవీలను కిడ్నాప్‌ చేయడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ ఘటన తర్వాత విశాఖను వదిలి హైదరాబాద్‌కు తన మకాం మార్చాలని సత్యనారాయణ నిర్ణయించుకోవడం అప్పట్లో దుమారం రేపింది. తాజా పార్లమెంట్ ఎన్నికల్లో జగన్ ఆయనకు కనీసం టికెట్ సైతం ఇవ్వలేదు. ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఘటన జరిగి ఏడాది పూర్తవుతోంది. అయినప్పటికీ ఇంకా సస్పెన్స్ మాత్రం వీడలేదు.. ఈ ఘటన ఎంవీవీ ప్రత్యర్ధుల పనేనా, లేక సొంత పార్టీ నేతలే ఆయనను ఇబ్బంది పెట్టారా అంటూ విశాఖ ప్రజలు ఇప్పటికీ చర్చించుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో ఎంవీవీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని స్థానిక నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. రియల్ ఎస్టేట్ బిజినెస్‌తో పాటు సినీ నిర్మాతగానూ ఎంవీవీ సత్యనారాయణ వ్యవహరిస్తున్నారు. ఎంవీవీ సినిమా బ్యానర్‌పై గీతాంజలి, శంకరాభరణం, అభినేత్రి, లక్కున్నోడు, నీవెవరో, గల్లీ రౌడీ, గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాలు తీశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా విడుదలపై పెద్ద వివాదం నడిచింది. ఈ మూవీ రిలీజ్ ఆపాలని నిర్మాత నట్టికుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు కూడా. 

పవన్ కళ్యాణ్ చేస్తున్న ‘వారాహి దీక్ష’ అంటే ఏమిటి?

పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి దీక్షకు తంత్ర సాధనలో చాలా ప్రాధాన్యం వుంది. తన ఎన్నికల ప్రచార వాహనానికి వారాహి అని పేరు పెట్టుకున్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు తన ఇష్టదేవత వారాహి అమ్మవారి దీక్షని కూడా 11 రోజులపాటు చేపట్టారు. అసలీ వారాహి దీక్ష అంటే ఏమిటి?  వారాహి అంటే పంది శిరస్సుతో వుండే అమ్మవారు. వారాహి అంటే లలితాదేవి అమ్మవారి సాయుధ దళాలకు చీఫ్ కమాండర్ అని చెప్పుకోవచ్చు. లలితాదేవి అమ్మవారి ఆజ్ఞాచక్రం దగ్గర నివసిస్తూ, ఆమె ఆదేశాలు (ఆజ్ఞలు) పాటిస్తూ, తన దగ్గర వున్న విస్తారమైన సైన్యంతో ఎంతటి బలవంతుడైన శత్రువునైనా ఓడించగలదు. వారాహి శక్తులను సానుకూల ధోరణిలో ఉపయోగించడం వల్ల కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను అధిగమించవచ్చు. అంతర్గంగా వున్న వ్యాధులకు చికిత్స చేసుకోవచ్చు. జీవితంలో నాణ్యతను పెంచుకోవచ్చు. ఒకరి తరఫున  వేరే ఎవరైనా వారాహి మంత్ర సాధన చేసి, ఆ తర్వాత జల ప్రోక్షణ చేయడం వల్ల ఎవరి కోసమైతే మంత్ర సాధన చేశారో ఆ వ్యక్తికి మేలు జరుగుతుంది. ప్రాణాంతక వ్యాధులను తగ్గించడంలో వారాహి మాత సాధన ఉపయోగపడుతుంది. వరాహ రూపంలో వున్న మూర్తిని ఒక శక్తిగా ఆరాధించడం అనేది కేవలం హిందూ పురాణాలలో మాత్రమే కాదు.. సెల్టిక్, జపనీస్, చైనీస్, గ్రీక్, అమెరికన్, ఈజిప్టియన్ సంస్కృతులలో భాగంగా కూడా వుంది. వారాహి దేవత ధైర్యం, నిర్భయం, స్వయం నియంత్రణ శక్తులకు ప్రతిరూపం. శత్రువుతో పోరాడటానికి అవసరమైన ధైర్యాన్ని వారాహి ఇస్తుంది. ఒక్కోసారి విజయం మనల్ని అహంకారంలోకి నెట్టేస్తుంది. వారాహి దీక్ష చేయడం, వారాహిని ఆరాధించడం వల్ల మనసులో చేరిన అహంకారం తొలగిపోతుంది. వారాహి దీక్షను రెండు స్థాయిల్లో చేపడతారు. ఒకటో స్థాయిలో రక్షణ కోసం చేసే వారాహి అస్త్ర బీజ మంత్ర సాధన వుంటుంది. రెండో స్థాయిలో మంచి ఆరోగ్యం కోసం వారాహి అస్త్ర బీజమంత్ర సాధన వుంటుంది. వారాహి దీక్ష, వారాహి మంత్ర సాధన చేయడం వల్ల చేకూరే ఇతర ప్రయోజనాలు... నరదిష్టి తొలగుతుంది. రాహు - కేతు దోషాలు పోతాయి. ప్రాణాంతక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. తమ మీద జరిగిన తంత్ర, మంత్ర ప్రయోగాలను అరికడుతుంది. ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది. శక్తి, కీర్తి, పాజిటివ్ దృక్పథం పెరుగుతుంది. సంపదను అందిస్తుంది. సమాజంలో ఉన్నత స్థాయి లభిస్తుంది. శత్రువులు, పురోగతికి అడ్డుగా నిలిచేవారి నుంచి రక్షణ లభిస్తుంది. ఏంటీ ఆలోచిస్తున్నారు.. మీకూ వారాహి దీక్ష చేయాలని అనిపిస్తోందా? శుభం!

 కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి గుడ్ బై ? 

బిఆర్ఎస్ స్క్రాబ్ కాంగ్రెస్ లో చేరడంపై కరడు గట్టిన కాంగ్రెస్ వాదుల నుంచి వ్యతిరేకత వస్తోంది.  గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బిఆర్ఎస్ ఘోర పరాజయం చెందినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ నేతలకు కాంగ్రెస్ కండువాలు కప్పడం కొందరికి నచ్చడం లేదు.  జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరిక కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రాజేసింది. పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ... తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తన ప్రమేయం లేకుండానే జరగాల్సింది జరిగిపోయిందన్నారు. తాను రాజీనామా చేశాక పల్లెలన్నీ తిరుగుతానన్నారు. ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. కానీ ఇప్పటి వరకు తనకు ఏ పార్టీ నుంచి పిలుపురాలేదన్నారు. బీజేపీ నుంచి కూడా ఎవరూ సంప్రదించలేదన్నారు. అయినప్పటికీ తనకు పార్టీ మారే ఆలోచన అయితే ఇప్పటి వరకు లేదన్నారు. కానీ ఆ తర్వాత ప్రజల నిర్ణయం ప్రకారం నడుచుకుంటానన్నారు. పార్టీ నుంచి శ్రీధర్ బాబు తనతో మాట్లాడారని తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ కూడా మాట్లాడినట్లు చెప్పారు. తాను ఈ స్టేజీలో పార్టీ నుంచి గౌరవం కోరుకున్నానని... కానీ ఈరోజు ఆ గౌరవం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్లుగా పార్టీ ప్రతి నిర్ణయాన్ని గౌరవించానన్నారు. తనకు నష్టం కలుగుతుందని తెలిసినా పార్టీ చెప్పిన చోట పోటీ చేశానని వాపోయారు.

మృత్యుభయంలో జగన్!

అనేక మానసిక సమస్యల పుట్ట మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి. ఆయన తన మానసిక సమస్యలకు లండన్‌లో చికిత్స తీసుకుంటున్నారని, లండన్ నుంచి తెప్పించుకుంటున్న మందులు వాడుతున్నారని చెబుతూ వుంటారు. ఆయన మానసిక ఆరోగ్యంపై స్వయానా ఆయన చెల్లెలు షర్మిలారెడ్డి కూడా అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. జగన్‌కి ఉన్న అతి పెద్ద మానసిక వ్యాధి ‘నార్సిజం’ అని ఇప్పటికే అనేకమంది  మానసిక నిపుణులు ఒక నిర్ణయానికి వచ్చారు. నేనే అందరికంటే ఉన్నత స్థానంలో వుండాలని, అందరూ తన కాళ్ళకిందే పడి వుండాలనేది నార్సిజంలో వున్న ప్రధాన లక్షణం. సరే, ఇప్పుడు జగన్ అధికారం ఎలాగూ పోయింది కాబట్టి,  నార్సిజం కూడా కాలక్రమేణా అదుపులోకి వచ్చే అవకాశం వుంది. అయితే, జగన్ చాలా ప్రమాదకరమైన థనాటోఫోబియా (Thanatophobia) అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నారని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. తనను ఎవరో చంపేయడానికి కుట్ర చేస్తున్నారని నిరంతరం భయపడుతూ బతకడమే ఈ థనాటోఫోబియా (Thanatophobia) ప్రధాన లక్షణం. ఈ వ్యాధి తన మనసు మీద పడిన ముద్రల కారణంగా కొంతమందిలో ఏర్పడుతుందని అంటున్నారు.  జగన్‌ ఈ మానసిక వ్యాధి బారిన పడటానికి దారితీసిన పరిస్థితులను గమనిస్తే, జగన్ తాత రాజారెడ్డి పులివెందుల ప్రాంతంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వుండేవారు. కరడుగట్టిన ఫ్యాక్షనిస్టు అయిన ఆయన్ని ఫ్యాక్షనిజమే బలి తీసుకుంది. ప్రత్యర్థులు రాజారెడ్డిని దారుణంగా హత్య చేశారు. ఈ హత్య జరిగిన సమయంలో జగన్ చాలా చిన్న కుర్రాడు. తాతయ్యతో చాలా సన్నిహితంగా వుండే జగన్ మనసు మీద ఆ హత్య ముద్ర బాగా పడింది. ఆ తర్వాత జగన్ మనసు మీద పడిన మరో ముద్ర... తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం. రాజశేఖరరెడ్డిది ప్రమాదవశాత్తూ జరిగిన మరణమే అని విచారణలో తేలినప్పటికీ, తన తండ్రిని ఎవరో హత్య చేశారనే జగన్ భావిస్తూ వుంటారు. వైఎస్సార్ మరణం సందర్భంగా కూడా తన తండ్రిది హత్యేనని ఆయన ఆరోపిస్తూ వచ్చారు. సరే, సమాజం ఏమని తీర్మానించినప్పటికీ, జగన్ దృష్టిలో మాత్రం తన తండ్రిది ముమ్మటికీ హత్యే. ఇలా వైఎస్సార్ మరణం కూడా జగన్ మనసు మీద ఎక్కువగానే ప్రభావం చూపించింది. ఇద్దరు తన ఆత్మీయులు అసహజ మరణానికి గురికావడంతో జగన్‌లో థనాటోఫోబియా (Thanatophobia) ప్రారంభమై వుండొచ్చని మానసిక నిపుణులు  చెబుతున్నారు. తాను కూడా తన పెద్దల తరహాలోనే హత్యకు గురవుతాననే భయం ఆయనలో క్రమేపీ పెరుగుతూ వచ్చిందని భావిస్తున్నారు. తాత, తండ్రి మరణాలే జగన్ మనసు మీద ప్రభావం చూపిస్తున్నాయని అనుకుంటే, ఇంతలోనే జగన్ ప్రాణపదంగా భావించే ఆయన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని ‘ఎవరో’ హత్య చేయించారు. గిట్టనివాళ్ళు అది జగన్ డైరెక్షన్లో జరిగిన మర్డరేనని అంటూ వుంటారుగానీ, నేరం బయటపడేంత వరకు మనం ఎవర్నీ నిందించకూడదు. ఆ విధంగా తండ్రి తర్వాత తండ్రి లాంటి వ్యక్తి... తమ కుటుంబానికి పెద్ద అయిన వివేకానందరెడ్డి హత్య కూడా జగన్ మనసుకు తీరని గాయం చేసి వుంటుందని, దాంతో ఆయనలో వున్న థనాటోఫోబియా (Thanatophobia) మరింత పెరిగి మానసిక నిపుణులు భావిస్తున్నారు. ఈ ఘటనల ఫలితంగానే జగన్ ప్రాణభయంతో బతుకుతున్నారని చెబుతున్నారు. జగన్ ఈ మృత్యుభయంతోనే నిరంతరం అభద్రతా భావంతో బతుకుతూ వుంటారు. బెంగళూరులో వున్న జగన్ ప్యాలెస్‌కి భద్రత మామూలుగా వుండదు.. ఇక హైదరాబాద్ లోటస్ పాండ్ ప్యాలెస్ భద్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాడేపల్లి ప్యాలెస్ భద్రత అయితే మరీ పరాకాష్ట. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ మొత్తం 48 చోట్ల చెక్‌పోస్టులు జగన్ ఏర్పాటు చేసుకున్నారు. జగన్ అధికారంలో వున్నంతకాలం మొత్తం 934 మందితో భద్రత ఏర్పాటు చేసుకున్నారు. అమెరికా ప్రెసిడెంట్‌కి కూడా ఇంతమందితో భద్రత ఉంటుందా అంటే డౌటే... జగన్ ఇండియాలో ఉన్నప్పుడే కాదు.. ఈయనని ఎవరూ  గుర్తుపట్టని విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా భారీగా భద్రతా ఏర్పాట్లు చేసుకుంటారు. జగన్ అధికారంలో వున్నంతకాలం ఈయన భద్రతకే వేల కోట్ల రూపాయలు ఖర్చయింది. ముఖ్యమంత్రి పదవిలోంచి దిగిపోయిన తర్వాత కూడా ప్రభుత్వ ఖర్చుతో అదే భద్రత కొనసాగుతోంది. ఇలాంటి భారీ భద్రతను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సమీక్షిస్తోంది. ఏది ఏమైనప్పటికీ, జగన్ తన మానసిక సమస్యల నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడాలని ఆశిద్దాం.

జగన్ తోక వంకరే.. సోషల్ మీడియా ఉవాచ! 

 ప్రజా స్వామ్య వ్యవస్థ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేదు.  గత ఐదేళ్ల క్రితం అబద్దపు ప్రచారంతో అధికారంలో వచ్చిన జగన్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అదే పంథాలో కొనసాగుతుంది. వై నాట్ 175 అని ప్రచారంలో దిగిన జగన్ కు ఎపి ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి వైఖరి మారలేదు. కుక్క తోక వంకర అని జగన్ మరో సారి రుజువు చేసుకున్నారు. పోటీ చేసిన అన్ని లోకసభ, అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందిన జనసేన ను అప్రతిష్ట పాలు చేయాలని వైఎస్ జగన్ కంకణం కట్టుకున్నారు. ఐ ప్యాక్ సలహాలు, సూచనలతో అరాచక ప్రభుత్వాన్ని చేపట్టిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఫేక్ యూట్యూబ్ చానల్స్ ద్వారా జనసేనాని మీద దుష్ ప్రచారానికి ఒడి గట్టుతున్నాయి.  తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య అపోహలు సృష్టించేందుకు వైసీపీ పెద్ద కుట్రకు తెరలేపిందని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు పెట్టింది. జగన్‌రెడ్డి పడేసే డబ్బుల కోసం నడుపుతున్న సోషల్ మీడియా పేజీలు, చానళ్లు పవన్ కల్యాణ్‌పై ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నాయని మండిపడింది. టీడీపీకి అనుకూలం అని నమ్మించేలా ‘యువగళం’ అనే యూట్యూబ్ చానల్‌ను ‘ఐప్యాక్’తో పెట్టించి, చంద్రబాబును తిడుతూ వీడియోలు పెట్టించారని పేర్కొంది. ఇప్పుడు జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ఫేక్ వీడియోలు పోస్టు చేసి రెండు పార్టీల మధ్య అపోహలు సృష్టించే పెద్ద కుట్రకు తెరలేపారని వివరించింది.  యువగళం అనే యూట్యూబ్ చానల్‌తో టీడీపీకి ఎలాంటి సంబంధమూ లేదని వివరణ ఇచ్చింది. ఇరు పార్టీల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, సినీ అభిమానుల మధ్య కుట్రలు చేసే నీచపు బుద్ధి ఈ దేశంలో జగన్ ఒక్కడికే ఉందని, దయచేసి ఇలాంటి ఫేక్ వార్తలను ఎవరూ నమ్మవద్దని కోరింది. ఇలాంటి వాటిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించింది.

జగన్ జెండా పీకేస్తున్నారా? కాంగ్రెస్ లో వైసీపీ విలీనమేనా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పార్టీ జెండా పీకేయడానికి రెడీ అయిపోయారా?  వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడం ఇక లాంఛనమేనా? అన్న అనుమానాలు ఇప్పుడు రాజకీయవర్గాలలో గట్టిగా వ్యక్తమౌతున్నాయి. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి రెడీ అయిపోయిన ఆయన ఆ లాంఛనం పూర్తి చేయడానికి తన సోదరి షర్మిల నడిచిన దారిలోనే నడుస్తున్నారన్న చర్చ కూడా బలంగా వినిపిస్తోంది. పులివెందుల నుంచి ఆయన బేంగళూరు వెళ్లింది కూడా పార్టీ విలీనంపై కాంగ్రస్ సీనియర్ నేత, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో సంప్దింపుల కోసమేనని అంటున్నారు. షర్మిల కూడా తన వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి డీకేనే ఆశ్రయించారు. ఇప్పుడు జగన్ కూడా అదే దారిలో నడుస్తున్నారని అంటున్నారు. అయితే జగన్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ఒక షరతు పెట్టారని అంటున్నారు. ఇంతకీ ఆ షరతు ఏమిటయ్యా అంటే తన సోదరిని కాంగ్రెస్ దూరం పెట్టాలి. తన దారికి ఆమె అడ్డు ఉండకూడదు. ఈ షరతుకు కాంగ్రెస్ అంగీకరిస్తుందా అన్నది పక్కన పెడితే.. జగన్  ఇంకెంత మాత్రం వైసీపీని కొనసాగించే    ఉద్దేశం లేదన్నది మాత్రం స్పష్టమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడం,  అటు కేంద్రంలో కూడా తెలుగుదేశం పార్టీ కీలక పాత్రపోషిస్తుండటంతో బలమైన జాతీయ పార్టీ అండ లేకుండా మనుగడ కష్టమన్న భావనకు జగన్ వచ్చారని అంటున్నారు. దీంతో ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అంటున్నారు. తనపైన సిబిఐ, ఈడీ కేసులతో పాటు, బాబాయ్ మర్డర్ కేసు కూడా వేలాడుతూ ఉండటంతో జాతీయ పార్టీ సాయం లేనిదే బ్రతికి బట్టకట్టటం కష్టమని భావించిన  జగన్  వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలన్న నిర్ణయానికి వచ్చారని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.  ఇందుకు బెంగుళూరు వేదికగా జగన్ చర్చలు జరుపుతున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, డీకే శివకుమార్ తో  బుధవారం రాత్రి భేటీ అయిన జగన్, కాంగ్రెస్ నుంచి షర్మిలని పక్కన పెడితే, తాను వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని ఆఫర్ ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఇందుకు డీకే నుంచి ఎటువంటి సానుకూలతారాలేదనీ, హైకమాండ్ తో చర్చిస్తానని మాత్రమే అన్నారని తెలుస్తోంది.    ఇక ఈ విషయంలో జగన్ కు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు అంతంతమాత్రమేనని కూడా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ పార్టీని విలీనం చేసుకుంటే జగన్ పాపాలు కాంగ్రెస్ కు కూడా అంటుతాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారంటున్నారు.  

జగనోన్మాద బాధితులు.. ఉద్యోగులు!

ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులపై అరాచకాలు పెరిగిపోయాయి.. మనందరి ప్రభుత్వంలో ఉద్యోగులు నిర్భయంగా పనిచేసుకునే స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పిస్తాం.. ఉద్యోగుల సంక్షేమానికి మనందరి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. ఇవీ 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ చెప్పిన మాటలు. ఔను..  ఐదేళ్లు అధికార మ‌దంతో అరాచ‌క పాల‌న సాగించిన మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. స‌రిగ్గా 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా పలికిన చిలుక‌ప‌లుకులు. అధికారంలోకి వ‌చ్చేవ‌ర‌కూ మేక‌వ‌న్నె పులిలా.. ప్ర‌జలు, ఉద్యోగులు ఏది చెబితే అది చేస్తాన‌ని న‌మ్మించారు. ఒక్క‌సారి అధికారం ఇవ్వండి ఫ్లీజ్ అంటూ బ‌తిమలాడుకున్నారు. జ‌గ‌న్ మాయ‌ మాట‌లు న‌మ్మిన ప్ర‌జ‌లు 2019 ఎన్నిక‌ల్లో భారీ మెజార్టీతో అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు. అధికారంలోకి వ‌చ్చిన కొద్ది కాలంలోనే జ‌గ‌న్ లో క్రూర‌మైన మృగం బ‌య‌ట‌కొచ్చింది. ప్ర‌జ‌లు, ఉద్యోగులు ఎవరైనా తన కాళ్ల‌కిందే ఉండాల‌న్న‌ట్లుగా జ‌గ‌న్ అధికార మ‌దంతో విర్ర‌వీగారు. ఉద్యోగుల‌ను పెట్టిన చిత్ర‌హింస‌లు అన్నీఇన్నీకావు. జ‌గ‌న్ హ‌యాంలో భ‌యంతో ఎవ‌రూ బ‌య‌ట‌కు చెప్పుకోలేక పోయారు. తాజాగా చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఊపిరిపీల్చుకున్న ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేత‌లు.. గ‌త ఐదేళ్ల‌లోతాము అనుభ‌వించిన ఇబ్బందుల‌ను చెప్పుకుంటున్నారు. దీంతో ఉద్యోగుల ప‌ట్ల జ‌గ‌న్ అరాచ‌కాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎం కుర్చీలో ఉన్నంత‌కాలం ఉద్యోగ సంఘాల నేత‌లు వ‌ణికిపోయారు. ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై నోరెత్త‌కుండా, త‌న‌కు అనుకూలంగాఉన్న ఉద్యోగ సంఘాల నేత‌ల‌కే తన హయాంలో  జ‌గ‌న్ ప్రాధాన్య‌త‌నిచ్చారు. ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం, ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై పోరాడే ఉద్యోగ సంఘాల నేత‌ల‌ను జ‌గ‌న్, ఆయ‌న‌ గ్యాంగ్ చెప్పుకోలేని ఇబ్బందుల‌కు గురి చేసింద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే.  పీఆర్సీ విష‌యంలోనూ ఉద్యోగులను జ‌గ‌న్ స‌ర్కార్ మోసం చేసింది. ఇదేమ‌ని ప్ర‌శ్నిస్తే.. ఉద్యోగుల సమస్యలపై సంఘాల నాయకులను చర్చలకు పిలవడం, ఏమీ తేల్చకుండా పంపించడం. గ‌ట్టిగా ప్ర‌శ్నిస్తే బెదిరింపుల‌కు గురిచేయ‌డం జగన్ హయాంలో రివాజుగా మారిపోయింది. ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి, ధ‌నుంజ‌య‌రెడ్డి ఇలా ఒక్క‌రేంటి.. ప్ర‌తి ఒక్క‌రూ ఉద్యోగుల‌ను బెదిరింపుల‌కు గురిచేసిన వారే. ఒకానొక సంద‌ర్భంలో ప్రభుత్వ ఉద్యోగులకు కాళ్లు పట్టుకునే నేర్పు ఉండాలంటూ విద్యాశాఖ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారంటే.. ఉద్యోగ సంఘాల నేత‌లు ఏ స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్నారో అర్థంచేసుకోవ‌చ్చు. తన అనుచరగణానికి సలహాదారుల పదవులు కట్టబెట్టి కోట్లు దోచి పెట్టిన జగన్‌.. ఉద్యోగులను, వారి సమస్యలను మాత్రం గాలికి వదిలేశారు.  పీఆర్సీ అమలు విష‌యంలో జగన్‌ సర్కార్‌ చేసిన అన్యాయంపై ఉద్యోగులు 2022 ఫిబ్రవరిలో గర్జన పేరుతో పెద్ద ఎత్తున ఆందోళ‌న నిర్వ‌హించారు. ల‌క్ష‌లాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మిక‌, పింఛ‌ను దారుల సంఘాలు పోలీసుల నిర్భందాల‌ను దాటుకొని విజ‌య‌వాడ‌కు చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళ‌న నిర్వ‌హించారు. దీంతో జ‌గ‌న్‌, ఆయ‌న గ్యాంగ్ కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టాయి. ఉద్యోగుల్లో ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త‌ను గుర్తించిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం కాస్త త‌గ్గిన‌ట్లు క‌నిపించినా వారి స‌మ‌స్య‌లు ఏమాత్రం ప‌రిష్కారం కాలేదు. సీఎం హోదాలో జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేసిన మ‌రో ఘోర‌ త‌ప్పిందం.. ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందు నిలబెట్ట‌డం. ఈ వ్య‌వ‌హారం దేశం యావత్తు నివ్వెరపోయేలా చేసింది.  బ‌డుల్లో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు.. సిగ్గుతో త‌ల‌దించుకొని మ‌ద్యం షాపుల ముందు నిల్చోవాల్సి వ‌చ్చింది. ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నించినందుకు ఉద్యోగ సంఘాల నేత‌ల‌ను పెట్టిన చిత్ర‌హింస‌లు అన్నీఇన్నికావు.  నేను రాజును.. మీరంతా నా భ‌టులు అన్న‌ట్లుగా జ‌గ‌న్ వ్య‌హ‌రించిన తీరు ఇప్ప‌టికీ ఉద్యోగులు గుర్తుచేసుకుంటూ క‌న్నీరు పెట్టుకుంటున్న సంద‌ర్భాలు ఉన్నాయి. ఇవ‌న్నీ మ‌న క‌ళ్ల‌ముందు జ‌రిగిన‌వే. కానీ, బ‌య‌ట ప్ర‌పంచానికి తెలియ‌కుండా జ‌గ‌న్, ఆయ‌న గ్యాంగ్ ఉద్యోగ సంఘాల నేత‌ల‌ను ఎంత‌లా చిత్ర‌హింస‌ల‌కు గురిచేశారో ప్ర‌స్తుతం ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి.  వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో ఉద్యోగ సంఘాల నేత‌లు ఎదుర్కొన్న అవ‌మానాలు, బెదిరింపులు అనేకం ఉన్నాయి. జ‌గ‌న్ గ్యాంగ్ బ‌రి తెగించి వారిని ఇబ్బందుల‌కు గురిచేసింది. అప్ప‌ట్లో త‌మ ఫోన్లుసైతం జ‌గ‌న్ ప్ర‌భుత్వం ట్యాప్ చేసింద‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు వాపోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయటంతో పాటు, ఉద్యోగులపై జగన్ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, ధనుంజయ రెడ్డి అరాచ‌కాల‌ను తాజాగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ వివ‌రించాడు. తాను గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన త‌రువాత తన రెండు ఫోన్ నెంబ‌ర్ల‌ను ఇంటెలిజెన్స్ డీజీ ఆంజ‌నేయులు ట్యాప్  చేసి   బెదిరించారని, అందుకు తన వద్ద  ద‌గ్గ‌ర ఆధారాలు ఉన్నాయ‌ని సూర్య‌నారాయ‌ణ చెప్పారు. గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసిన త‌రువాత ప్ర‌భుత్వం తనపై దాడిచేస్తుంటే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబుతోపాటు ప‌వ‌న్ క‌ల్యాణ్ ను క‌లిసేందుకు వారి అపాయింట్ మెంట్‌కోసం ఫోన్ చేశాన‌ని.. వెంట‌నే న‌న్ను పిలిపించి నువ్వు ప‌వ‌న్‌, చంద్ర‌బాబుల‌ను క‌ల‌వ‌డం మానుకోక‌పోతే చాలా ఇబ్బందులు ప‌డ‌తావ‌ని బెదిరించార‌ని, అవ‌స‌ర‌మైతే చంపిస్తామ‌నే స్థాయికి వారు వెళ్లార‌ని సూర్య‌నారాయ‌ణ క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. ఆర్థికశాఖ, ఉద్యోగుల సమస్యల్ని ప్రశ్నించినందుకే తనపై కేసులు పెట్టి వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ పేరుతో తన కుటుంబాన్ని కూడా వేధించారని, తన కుటుంబాన్ని వేధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, వేధింపులపై జ్యుడీషియల్  కమిషన్‌ను నియమించాలని సూర్యనారాయణ ప్ర‌భుత్వాన్ని కోరాడు. ఇలా జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో చిత్ర‌హింస‌ల‌కు గురైంది ఒక్క సూర్య‌నారాయ‌ణే కాదు.. ఉద్యోగుల త‌ర‌పున మాట్లాడిన ప్ర‌తిఒక్క‌రికి ఇలాంటి ట్రీట్‌మెంట్‌నే జ‌గ‌న్, ఆయ‌న గ్యాంగ్ ఇచ్చింద‌ని ఉద్యోగ వ‌ర్గాల్లో చ‌ర్చ‌జ‌రుగుతోంది.

కుప్పంలో చంద్రబాబు పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుమంగళవారం (జూన్ 25) నుంచి రెండు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి కుప్పం చేరుకుంటారు.   హంద్రీ-నీవా కాలువను పరిశీలించిన అనంతరం కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అలాగే సాయంత్రం ఆర్ అండ్ బీ భవనంలో పార్టీ నేతలతో చంద్రబాబు చంద్రబాబు భేటీ అవుతారు. ఇక బుధవారం (జూన్ 26) కుప్పం ఆర్ అండ్ బీ అతిథిగృహం వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు.   మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం డిగ్రీ కళాశాలలో అధికారులతో   సమీక్ష  నిర్వహిస్తారు. అనంతరం  పీఈఎస్ ఆడిటోరియంలో పార్టీ శ్రేణులతో చంద్రబాబు సమావేశం అవుతారు. అనంతరం సాయంత్రం హెలికాప్టర్ లో అమరావతి చేరుకుంటారు.