బడ్జెట్ లో కీలక అంశాలు ఇవే!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం తరువాత లోక్ సభ బుధవారానికి వాయిదా పడింది. కాగా కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో కీలక అంశాలు ఇలా ఉన్నాయి.
*కేంద్ర బడ్జెట్ ప రూ.48.21 లక్షల కోట్లు
*మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లు
*పన్ను ఆదాయం రూ.28.83 లక్షల కోట్లు
*ద్రవ్యలోటు 4.9 శాతంగా (అంచనా)
*అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లు(అంచనా)
*మొబైల్ ఫోన్లు, ఛార్జర్లను ధరలు తగ్గుదల
* చేపలు, తోలుతో చేసిన సామాగ్రి ధరలు తగ్గుదల
* బంగారం, వెండితో చేసిన ఆభరణాల ధరలు తగ్గుదల
* తక్కువ ధరకు మందులు
* ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కింద శిక్షణకు ఎంపికైన విద్యార్థులకు నెలవారీ భత్యం రూ. 5,000
*అస్సాంలో వరద నియంత్రణ కార్యకలాపాలకు, బీహార్లోని కోసికి ఆర్థిక సహాయం
* ఇంధన భద్రత, పరివర్తన కోసం కొత్త పాలసీ
* పీఎం ఆవాస్ యోజన-అర్బన్ 2.0 కింద రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడితో కోటి కుటుంబాలకు ఇళ్లు
పట్టణాల్లో గృహ నిర్మాణాలను ప్రోత్సహించేందుకు వడ్డీ రాయితీ పథకం అమలు
* బీహార్కు ప్రత్యేక నిధులను కేటాయించింది.
* కాశీ విశ్వనాథుడి తరహాలో విష్ణుపాద దేవాలయం, మహాబోధి ఆలయాలను అభివృద్ధి
* మహిళలు, బాలికలకు లబ్ధి చేకూర్చే పథకాలకు రూ.3 లక్షల కోట్లకు పైగా నిధుల కేటాయింపు
* పారిశ్రమలలో పనిచేసే కార్మికుల కోసం రెంటల్ సిస్టమ్లో డార్మిటరీ వసతి సౌకర్యం
* ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకారం జిల్లాలకు వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చే ప్యాకేజీ
* బీహార్లో వివిధ రహదారుల ప్రాజెక్టుల కోసం రూ.26,000 కోట్లు కేటాయింపు
* పీపీపీ పద్ధతిలో బీహార్ అబివృద్ధికి ఆర్థిక సహాయం
* బీహార్లో విమానాశ్రయాలు, వైద్య కళాశాలలు, క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు
* 5 రాష్ట్రాల్లో కొత్త కిసాన్ క్రెడిట్ కార్డుల జారీ
* బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక పథకం
*ఈశాన్య రాష్ట్రాల్లో వందకు పైగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ శాఖలు ఏర్పాటు
*బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి పూర్వోదయ పథకం అమలు
* దేశ సమగ్రాభివృద్ధికి జాతీయ సహకార విధానం
* గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు కేటాయింపు
* ప్రతి సంవత్సరం లక్ష మంది విద్యార్థులకు నేరుగా ఇ-వోచర్లను అందజేయడం ద్వారా మొత్తం రుణంపైమూడు శాతం వడ్డీ రాయితీ.
* అమృత్సర్-కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్లో, బీహార్లోని గయాలో పారిశ్రామిక అభివృద్ధికి పూర్తి సహకారం
* రూ.26వేల కోట్ల వ్యయంతో రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టులు
*రొయ్యల పెంపకం, మార్కెటింగ్ కోసం ఆర్థిక సహాయం
*గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి అవకాశాలు వేగవంతంపై ప్రత్యేక దృష్టి