అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న బైడెన్

అందరూ అనుకున్నట్టే జరిగింది. అమెరికా అధ్యక్ష పదవి రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకున్నారు. దేశ ప్రయోజనాలతోపాటు డెమోక్రటిక్ పార్టీ ప్రయోజనాల కోసం కూడా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు బైడెన్ పేర్కొన్నారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడిగా పూర్తికాలం కొనసాగుతానని ఆయన వెల్లడించారు. గత కొద్దిరోజులుగా బైడెన్ డెమోక్రటిక్ అభ్యర్థిగా అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని సొంత పార్టీ నాయకుల నుంచి ఒత్తిడి వస్తోంది. దానికి తోడు ఇటీవల ఆయన కొవిడ్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్‌ని ఎదుర్కోగల అభ్యర్థిని డెమోక్రటిక్ పార్టీ ఎంపిక చేయాల్సి వుంది.

స్మితా సభర్వాల్‌కి ఏమైంది?

కేసీఆర్ గవర్నమెంట్ వున్నప్పుడు అర్హతకు మించిన అందలాలు అందుకుని,  సీఎం కార్యాలయంలో హవా నడిపించిన ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్‌కి ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో పెద్దగా ప్రాధాన్యత లేదు. గతంలో మాదిరిగా ఆహా, ఓహో అంటూ భజన చేసేవారు లేరు. అందుకేమో ఉనికిని ప్రకటించుకోవడానికి అన్నట్టుగా స్మితా సభర్వాల్ మానసిక పరిస్థితి అదుపు తప్పిందన్నట్టుగా ‘ఎక్స్’ వేదికగా కామెంట్లు పోస్టు చేశారు. సివిల్ సర్వీసులలో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరం లేదని, వాటిని రద్దు చేయాలని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. ఈమధ్య పూజా ఖేడ్కర్ అనే ఐఏఎస్ వివాదాస్పదంగా మారింది. ఆమె తప్పుడు దివ్యాంగ ధ్రువీకరణ పత్రంతో ఐఏఎస్ అయిందనే వాదన వినిపిస్తోంది. ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వం ఏక సభ్య విచారణ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. దీని మీద కమిషన్ సభ్యుడు విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో స్మితా సభర్వాల్ అసలు మొత్తానికే దివ్యాంగులకు రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ డిమాండ్ చేయడం సంచలనాన్ని సృష్టించింది.  అదేవిధంగా యూపీఎస్సీకి ఛైర్మన్‌గా వున్న మనోజ్ సోనీ తనకు ఇంకా ఐదేళ్ళ సర్వీసు వుండగానే రాజీనామా చేశారు. ఈయన రాజీనామాకు, రెండేళ్ళ క్రితం తప్పుడు దివ్యాంగ సర్టిఫికెట్‌తో ఐఏఎస్ అయిన పూజా ఖేడ్కర్ అంశానికీ ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే, మనోజ్ సోనీ ఆరు నెలల క్రితమే యూపీఎస్సీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అందువల్ల ఆయన రాజీనామాకి, పూజా ఖేడ్కర్ వివాదానికి ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ స్మితా సభర్వాల్ మనోజ్ సోనీ మీద కూడా కామెంట్లు పోస్టు చేశారు. మనోజ్ సోనీ రాజీనామా చేసి తప్పించుకుపోలేరని ఆమె కామెంట్ చేశారు. మనోజ్ సోనీ రాజీనామా చేయడం తప్పించుకు పోయినట్టు ఎందుకు అవుతుంది? పూజా ఖేడ్కర్ ఇష్యూతో ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. ఐఏఎస్ ఆఫీసర్ అయిన స్మితా సభర్వాల్‌కి ఇంత చిన్న విషయం కూడా తెలియనట్టుగా మనోజ్ సోనీ మీద కామెంట్లు పెట్టారు. దివ్యాంగులకు రిజర్వేషన్లు ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ణయించాల్సింది స్మితా సభర్వాల్ కాదు.. తనకు సంబంధించని విషయం మీద, చాలా సున్నితమైన విషయం మీద అనవసరపు కామెంట్లు చేయడం ద్వారా స్మితా సభర్వాల్ కొత్త వివాదానికి తెరతీశారు. స్మిత చేసిన కామెంట్ల మీద భారీ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. స్మిత సభర్వాల్‌ మీద చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. 

శాంతి పట్టుచీర క‌థ‌.. వెలుగులోకి అక్ర‌మాల పుట్ట!

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డి, దేవాదాయ శాఖ ఉద్యోగి శాంతి వ్య‌వ‌హారం. వీరి వ్య‌వ‌హారంలో లోతుగా వెళ్లిన కొద్దీ దిగ్భ్రాంతికర విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. త‌న భార్య‌ శాంతి జ‌న్మ‌నిచ్చిన కుమారుడికి తండ్రి ఎవ‌ర‌నే విష‌యం తేల్చాల‌ని భ‌ర్త మ‌ద‌న్ మోహ‌న్ ఓ వైపు కోరుతుంటే..  మ‌రోవైపు దేవాదాయ శాఖ  అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ హోదాలో శాంతి అవినీతి అక్ర‌మాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి.   ఆమె ఆస్తుల చిట్టా కూడా చాలా చాలా పెద్ద‌గానే ఉంది. హైద‌రాబాద్, మంగ‌ళ‌గిరి, తాడేప‌ల్లిలో కోట్లాది రూపాయ‌ల విలువైన‌ విల్లాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. విశాఖ ప‌ట్ట‌ణంలో ప‌దెక‌రాల మామిడి తోట కూడా ఉందని అంటున్నారు‌. అంతేకాదు.. దేవాదాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ హోదాలో ఆమె ఏదైనా దేవాల‌యానికి వెళితే క‌చ్చితంగా ప‌ట్టు చీర‌తో పాటు రూ. 50వేలు స‌మ‌ర్పించాల్సిందేన‌న్న విమ‌ర్శ‌లూ వినిపిస్తున్నాయి. శాంతి పోస్టింగ్ విష‌యంలోనూ కొత్త విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఆమె ఏపీపీఎస్సీ పరీక్షలో పాస్ కాకుండానే   కొంత మంది మ‌ద్ద‌తుతో   జాబ్ లోకి వ‌చ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.  దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి మ‌ధ్య సంబంధంపై గ‌త వారంరోజులుగా విస్తృత చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ విష‌యంపై క్లారిటీ ఇవ్వాల్సిన విజ‌య‌సాయిరెడ్డి.. మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి క‌థ‌నాలు ప్ర‌సారం చేసిన మీడియాపై బూతుల‌తో విరుచుకుప‌డ్డారు. కానీ,  శాంతి, త‌న‌కు మ‌ధ్య సంబంధం ఏమిట‌నే విష‌యంపై ఎక్క‌డా క్లారిటీ ఇవ్వ‌లేదు. మ‌రోవైపు శాంతి మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి నేను జ‌న్మ‌నిచ్చిన మ‌గ‌బిడ్డ‌కు తండ్రి నా భ‌ర్త మ‌ద‌న్ మోహ‌న్ కాదు.. అడ్వ‌కేట్‌ సుభాష్ రెడ్డి అని కుండబద్దలు కొట్టినట్లు చేప్పేశారు.  సుభాష్ రెడ్డి ఇప్ప‌టి వ‌ర‌కు మీడియా ముందుకు రాక‌పోయినా.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వీడియోలో శాంతి జ‌న్మ‌నిచ్చిన మ‌గ బిడ్డ‌కు తనకూ ఎలాంటి సంబంధం లేద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఈ వ్య‌వ‌హారంపై శాంతి  భ‌ర్త మ‌ద‌న్ మోహ‌న్ రెడ్డి గ‌త వారం రోజులుగా త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు. నా భార్య‌ శాంతి జ‌న్మ‌నిచ్చిన మ‌గ బిడ్డ‌కు తండ్రి విజ‌య‌సాయిరెడ్డేన‌ని ఆరోపిస్తున్నారు. భ‌విష్య‌త్తులో త‌న‌కు, శాంతికి పుట్టిన ఇద్ద‌రు ఆడ పిల్ల‌ల‌కు అన్యాయం జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని, ప్ర‌స్తుతం శాంతి జ‌న్మ‌నిచ్చిన మ‌గ బిడ్డ‌కు ఎదిగే కొద్దీ ఇబ్బందులు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని.. ఇప్పుడే ఈ విష‌యంపై తేల్చాల‌ని మ‌ద‌న్ మోహ‌న్ డిమాండ్ చేస్తున్నారు. విజ‌య‌సాయి రెడ్డికి, సుభాష్ రెడ్డికి డీఎన్ఏ ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని కోరుతున్నారు. ఇదే విష‌యంపై రాష్ట్ర హోమంత్రి అనిత‌ను క‌లిశారు. కోర్టుకు సైతం వెళ్లేందుకు మ‌ద‌న్ మోహ‌న్ రెడ్డి సిద్ధ‌మ‌య్యారు. ఈ వ్య‌వ‌హారం సాగుతున్న స‌మ‌యంలోనే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా త‌న హోదాను అడ్డుపెట్టుకొని శాంతి చేసిన అక్ర‌మాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి.  శాంతి ఏపీపీఎస్సీ నుంచి డైరెక్ట్ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ గా జాయిన్ అయ్యారు. అయితే, ఆమెకు అర్హ‌త లేక‌పోయినా విశాఖ దేవాదాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ పోస్టింగ్ ఇచ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇందులో రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌మేయం ఉంద‌ని, ఆమె ద్వారా విశాఖ‌లోని దేవాదాయ శాఖ భూములను పెద్ద‌ మొత్తంలో కొట్టేశార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. స్థానికంగా కొంద‌రు వ్య‌క్తులు దేవాదాయ శాఖ ప‌రిధిలోని భూముల వివ‌రాల కోసం స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద ద‌ర‌ఖాస్తు చేసినా వివ‌రాలు ఇచ్చేందుకు గ‌తంలో శాంతి తిర‌స్క‌రించార‌ని, వివ‌రాలు ఇవ్వాల‌ని ఉన్న‌తాధికారులు సూచ‌న‌లు చేసినా ప‌ట్టించుకోలేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. తాడేప‌ల్లిలోని మాజీ సీఎం జ‌గ‌న్ నివాసానికి కొద్దిదూరంలో శాంతి ఓ విల్లా నిర్మాణం చేస్తున్నారు. ఆ విల్లా నిర్మాణానికి దాదాపు 40 నుంచి 50 మంది కూలీలు ప‌నిచేస్తున్నారు. వారంద‌రికి రోజూ భోజ‌నాలు విజ‌య‌వాడ సీతారామ‌య్య స‌త్రంతో పాటు మ‌రొక స‌త్రం నుంచి  స‌ప్ల‌య్ చేస్తున్నార‌ని స‌మాచారం. విల్లా వ‌ద్ద ప‌ర్య‌వేక్ష‌ణ‌కు కొంద‌రు దేవాదాయ శాఖ సిబ్బందిని వినియోగించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.  శాంతి స‌హ‌కారంతో విజ‌య‌సాయిరెడ్డి, మ‌రి కొంద‌రు వైసీపీ నేత‌లు పెద్ద‌మొత్తంలో దేవాదాయ భూముల‌ను క‌బ్జా చేసిన‌ట్లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే శాంతికి ఓ విల్లాను విజ‌య‌సాయిరెడ్డి కొనిచ్చార‌నేది ఏపీ రాజ‌కీయాల్లో విస్తృతంగా ప్ర‌చారంలో ఉంది. మొత్తానికి విజ‌య‌సాయిరెడ్డి, శాంతి వ్య‌వ‌హారం ఏపీలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. శాంతికి జ‌న్మ‌నిచ్చిన బిడ్డ‌కు తండ్రి విజ‌య‌సాయిరెడ్డా.. సుభాష్ రెడ్డా అనే విష‌యం తేలాల్సి ఉండ‌గా.. మ‌రోవైపు దేవాదాయ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ హోదాలో శాంతి అక్ర‌మాల‌పై ప్ర‌భుత్వం దృష్టిసారించాల్సి ఉంది. ఇప్ప‌టికే శాంతి అక్ర‌మాల‌పై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయ‌ణ రెడ్డి దృష్టి కేంద్రీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. అధికారుల నుంచి పూర్తి వివ‌రాలు సేక‌రించిన ఆయ‌న‌.. త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వానికి నివేదిక అందించే అవ‌కాశాలు ఉన్నాయి. మొత్తానికి శాంతి జ‌న్మ‌నిచ్చిన బిడ్డ ఎవ‌రో తేల్చాల‌ని ఆమె భ‌ర్త డిమాండ్ చేస్తున్న క్ర‌మంలో.. శాంతి అక్ర‌మాలుసైతం ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తుండ‌టంతో ప్ర‌జ‌లు విస్తుపోతున్నారు.

శ్రీరెడ్డిని ఏం చేయాలంటే...!

ఒక మురికి గుంటని ఒక సంవత్సరంపాటు క్లీన్ చేయకుండా అలాగే వుంచి, దాంట్లో ఒక చచ్చిన కుక్కని వేసి ఓ నెలరోజులపాటు అలాగే వుంచితే ఎంత  దారుణమైన కంపు కొడుతుందో, శ్రీరెడ్డి అనే ఒక వైసీపీ నాయకురాలి నోట్లోంచి వచ్చే మాటలు అంత దరిద్రపు కంపు కొడతాయి. అసభ్యం, అశ్లీలం, అసహ్యం ఈ మూడు అంశాల మేలు కలయిక అయిన శ్రీరెడ్డి, ‘మహిళ’ అనే ఒక పాయింట్‌ని అడ్డు పెట్టుకుని ఎవర్నయినా ఎంత మాటయినా అంటుంది. ఒక వైపు నోరు తెరిస్తే పచ్చి బూతులు... మరోవైపు ఆడపిల్లని అని నంగనాచి కబుర్లు. జగన్ పేరు చెబితే బట్టలు చించేసుకునే ఈ వైసీపీ నాయకురాలు సోషల్ మీడియాలో ఎంత వల్గర్గా మాట్లాడుతుందో అందరికీ తెలిసిందే. గత ఐదేళ్ళుగా సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ నాయకులను చెప్పడానికి కూడా వీల్లేని భాషలో తిట్టింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ పతివ్రత ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, హోంమంత్రిని తిడుతూనే వుంది. ఇన్నాళ్ళకు పాపం పండింది. ముఖ్యమంత్రి తదితరులను తిట్టిన నేరం మీద శ్రీరెడ్డి మీద కర్నూలులో కేసు నమోదైంది. త్వరలో పోలీసులు రంగప్రవేశం చేస్తారు. శీరెడ్డి ఆచూకిని కనుక్కుంటారు. బాగా సత్కారం చేసి, మరోసారి నోరు తెరవాలంటే భయపడేలా చేస్తారు. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డికి సత్కారం చేయడం కోసం ఎలాంటి కానిస్టేబుల్స్.కి అప్పగించాలనే విషయంలో కొన్ని సూచనలు. శ్రీరెడ్డిని విచారించడానికి ఒక్క కానిస్టేబుల్ సరిపోయే అవకాశం లేదు. మినిమమ్ నలుగురు కానిస్టేబుల్స్ కావాలి. అపార్థం చేసుకోకండి.. నలుగురు లేడీ కానిస్టేబుల్స్ కావాలి. ఆ కానిస్టేబుల్స్ కూడా రఫ్‌గా ప్రవర్తించేవాళ్ళు, నాలుగైదుసార్లు సస్పెండ్ అయినవాళ్ళు అయి వుండాలి. ఈ నలుగురికీ కొత్త లాఠీలు నాలుగైదు జతలు అందించాలి. అదనంగా ఓ రెండు కిలోల పచ్చిమిరపకాయలు మెత్తగా రుబ్బి ఆ ముద్ద కూడా ఇవ్వాలి. ఈ లాఠీలు, మిరపకాయ ముద్ద సహాయంతో ఆ నలుగురు లేడీ కానిస్టేబుళ్ళు నాలుగైదు రోజులపాటు శ్రీరెడ్డిని ఇంటరాగేట్ చేయాలి. అప్పుడు జీవితంలో శ్రీరెడ్డి తన కంపు నోరు తెరవదు. ఈ సమాజంలో శ్రీరెడ్డి లాంటి కంపు కేరెక్టర్లు మళ్ళీ బయల్దేరవు.

శ్రీరెడ్డి మీద కేసు!

గత కొన్నేళ్ళుగా నోటికొచ్చిన చెత్తవాగుడు వాగుతూ అసహ్యానికి, అసభ్యతకి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న వైసీపీ నాయకురాలు శ్రీరెడ్డి మీద కర్నూలు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, అనిత‌ల‌పై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్య‌లపై తెలుగుదేశం నేత రాజు యాదవ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కర్నూలు త్రీటౌన్‌ పోలీసులు పలు సెక్షన్ల కింద శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు. పరిస్థితిని చూస్తుంటే, శ్రీరెడ్డి ఇంతకాలం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం అనుభవించే సమయం ఆసన్నమైనట్టు అర్థమవుతోంది.

కేసీఆర్ స్లీపింగ్.. ఎమ్మెల్యేల జంపింగ్.. అసెంబ్లీలో బీఆర్ఎస్ పరిస్థితేంటి?

భారత రాష్ట్ర సమితి... పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆ పార్టీకి గళమెత్తడానికి అజెండాయే లేకుండా పోయింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనముద్రలోకి వెళ్లిపోయారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, ఆ తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదేళ్ల పాటు ఓ వెలుగువెలిగిన చంద్రశేఖరరావు ఇప్పుడు అమావాస్యచంద్రుడిలా మారిపోయారు. మసకబారిపోయారు. అపర చాణక్యుడిగా, మాటల మాంత్రికుడిగా వెలుగొందిన ఆయన ఇప్పుడు చేష్టలుడిగి నిలబడిపోయారు. రాజకీయ వ్యూహాలలో ప్రత్యర్థుల కంటే రెండడుగుల ముందుంటారని పేరొందిన కేసీఆర్ ఇప్పుడు వ్యూహాలంటే ఏమిటో తిలియని పరిస్థితిలో పడ్డారు. ఆయన ఏం చేసినా రివర్స్ అవుతోంది. ఒక్క ఓటమి ఆయనను, ఆయన పార్టీనీ ఉనికి కోసం వెంపర్లాడే పరిస్థితికి తెచ్చింది. గతంలో కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తిన వారే ఇప్పుడు విమర్శలు గుప్పిస్తూ దూరం జరుగుతున్నారు.  గత ఏడాది డిసెంబర్ లో జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తరువాత కేసీఆర్ సైలెంటైపోయారు. మధ్యలో ఒకటి రెండు సార్లు జనం మధ్యకు వచ్చినా ఆయన వాగ్దాటిలో కానీ, ప్రసంగాలలో కానీ మునుపటి పదును కనిపించడం లేదు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో  తన కుమార్తె కవిత అరెస్టు తరువాత ఆయన రాజకీయ వ్యూహాలన్నీ పక్కదారి పట్టాయన్న విమర్శలు సొంత పార్టీ నుంచే వస్తున్నాయి. కుమార్తెను కాపాడుకోవడం కోసం ఆయన బీజేపీకి దగ్గరౌతున్నారనీ, ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి ప్రయోజనం చేకూర్చేలా ఆయన వ్యూహాలు రచించారనీ, అభ్యర్థుల ఎంపికలో కూడా బీజేపీకి ఏ మాత్రం నష్టం వాటిల్లకూడదన్న జాగ్రత్త వహించారనీ బీఆర్ఎస్ నేతలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు.  తెలంగాణలో బీజేపీ బలపడితే  నష్టపోయేది బీఆర్ఎస్ అనే తెలిసి కూడా  పార్టీ భవిష్యత్ గురించి ఇసుమంతైనా ఆలోచించకుండా పార్లమెంట్ ఎన్నికల్లో పరోక్ష  సాయం చేశారు. ఆ కారణంగానే బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికలలో రాష్ట్రంలో మూడో స్థానానికి పడిపోయింది. ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 16 శాతానికి పడిపోతే.. ఆ మేరకు బీజేపీ బలపడి ఓట్ల శాతాన్ని 35శాతానికి పెరిగింది. ఇప్పటికీ బీఆర్ఎస్ బీజేపీ తో పొత్తు, విలీనం  అంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టి పార్టీ పటిష్టతకు కేసీఆర్ నుంచి ఎటువంటి అడుగులూ పడటం లేదు. దీంతో బీఆర్ఎస్ క్యాడర్  నిరుత్సాహంతో ఉంది. నిజానికి కేసీఆర్ బీజేపీతో కలిసే వ్యూహానికి పదును పెట్టిన లక్ష్యం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. బీజేపీతో అయితే పొత్తులు పెట్టుకుని లేకపోతే విలీనం చేసి అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టి.. సంకీర్ణ ప్రభుత్వాన్ని అయినా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. అధికారికంగా బీఆర్ఎస్‌కు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి ఎనిమిది మంది ఉన్నారు. ఈ రెండు పార్టీలు కలిసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. కానీ కేసీఆర్.. అరవై మంది ఎమ్మెల్యేలను తీసుకుని వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఓ సీనియర్ నేత తనకు ఫోన్ చేశారని ఆయన గతంలో చెప్పారు. బీజేపీ తల్చుకుంటే ఆపరేషన్ కమల్ ప్రారంభిస్తే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని ఆకర్షించడం పెద్ద పనేమీ కాదని ఎక్కువ మంది భావన. ఈ ఆలోచనలతోనే కేసీఆర్ బీజేపీతో కలిసిపోయేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు.  ఇక మరో వైపు రేవంత్ సర్కార్ ఫుల్ స్పీడ్ లో ఉంది. ఒక వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాలు కప్పడం, ఇంకో వైపు హామీల అమలుతో  ప్రజాదరణను పెంచుకోవడంలో రేవంత్ సర్కార్ సక్సెస్ అయ్యింది. అసెంబ్లీ సమావేశాలలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి దోహదపడతాయని బీఆర్ఎస్ భావించిన అంశాల విషయంలో రేవంత్ సర్కార్ చాకచక్యంగా వ్యవహరించారు. రైతు రుణమాఫీని అమలు చేయడం, విద్యార్థుల డిమాండ్ మేరకు గ్రూప్ 2 ను వాయిదా వేయడం ద్వారా బీఆర్ఎస్ అస్త్రాలుగా భావించిన అంశాలను నిర్వీర్యం చేసేశారు. రుణమాఫీ అమలుతో రైతులు, గ్రూప్ 2 రద్దుతో  విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతు బంధు నిధులను రుణమాఫీకి మళ్లించారంటూ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. దీంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ కు ఏ అవకాశమూ మిగలలేదు.  

క్షీణించిన కవిత ఆరోగ్యం...10 కిలోల బరువు తగ్గింది

మద్యం కుంభకోణంలో కింగ్ పిన్ అయిన  బిఆర్ఎస్ కల్వకుంట్ల కవిత ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.  డీప్ స్ట్రెస్ లో ఉన్న ఆమె  ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు దిగ జారుతోంది. గత నాలుగు నెలల నుంచి తీహార్ జైల్లో  మగ్గుతున్న సంగతి తెలిసిందే. గత వారం తీహార్ జైల్లో స్పృహ కోల్పోవడంతో జైలు అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హైదరాబాద్ లోని ఆమె నివాసంలో మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు అరెస్ట్ చేసి జైలుకు పంపిన సంగతి తెలిసిందే.  బెయిల్ కోసం ఆమె గత  నాలుగు నెలల నుంచి కృషి చేస్తున్నారు. అయితే  ఇదే కేసులో ఢిల్లీ  ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ లభించడం కవితకు సానుకూలాంశం. ఒక్కసారిగా ఆమె 10 కిలోల బరువు తగ్గింది. జైల్లో దోమలు ఎక్కువగా ఉండటంతో ఆమె ఇబ్బందిపడుతున్నారు. కనీస సౌకర్యలు కూడా కరువయ్యాయి. భోజనం కూడా సరిగ్గాలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  అధిక రక్తపోటుతో బాధపడుతున్న కవితకు జైలు జీవితం మరింత స్ట్రెస్ పెంచేలా చేసింది. పొలిటికల్ ప్రొవోకేటెడ్ వల్లే ఆమె జైలుకు వెళ్లాల్సి వచ్చిందని బిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కవిత ఆరోగ్యం పట్ట బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. కవిత భర్త అనీల్ కన్నీటి పర్యంతమయ్యారు. కవిత స్పృహ కోల్పోయిన నాటి నుంచి అనిల్ ఆమె వెంటే ఉన్నారు.  

దండించకుండా మన్నించండి.. కాళ్ల బేరానికి ఖాకీలు!

అడుసు తొక్కనేల.. కాలు కడగనేలా అన్న సామెత ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘానికి అతికినట్లుగా సరిపోతుంది. తాము పోలీసులమన్న విషయాన్నే మరిచి అచ్చంగా వైసీపీ కార్యకర్తలలాగే వ్యవహరించిన పలువురు పోలీసు అధికారులు, పోలీసులను కనీసం మందలించడానికి కూడా సాహసించని పోలీసు అధికారుల సంఘం.. ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. తప్పు చేశాం మన్నించండి అంటూ కాళ్లావేళ్లా పడుతోంది. గతంలో జరిగిన వన్నీ మరిచిపోండి.. ఇప్పుడు అచ్చమైన పోలీసుల్లా పని చేస్తాం. ఎవరైనా గీత దాటితే తాట తీయండి అంటూ  బతిమలాడుకుంటోంది.  తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ పోలీసు అధికారి వర్ల రామయ్యను కలిసి క్షమాపణలు చెప్పిన పోలీసు అధికారుల సంఘం ప్రతినిథులు ప్రభుత్వం తమపై కన్నెర్ర చేయకుండా చూడండి అంటూ వేడుకున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పోలీసు అధికారు సంఘం గతంలో పోలీసు వ్యవస్థ మొత్తం వైసీపీకి ఊడిగం చేయడానికి అప్పటి ప్రభుత్వ ఒత్తిడే కారణమని ఇప్పుడు చెబుతున్నది. అప్పట్లో తెలుగుదేశం నాయకులే టార్గెట్ గా రెచ్చిపోయి జగన్ మెప్పు కోసం ఊడిగం చేసిన పోలీసు అధికారులు ఇప్పుడు భయంతో వణికి పోతున్నారు. తెలుగుదేశం అధినాయకుడు సహా పలువురు పార్టీ నేతల పేర్లు ప్రస్తావించి మరీ సినీమా డైలాగులు వల్లిస్తూ తొడలు చరిచిన పోలీసు అధికారులు ఇప్పుడు కాళ్ల కింద భూమి కదిలిపోయినట్లుగా బెదిరిపోతున్నారు. దాసుడి తప్పులు దండంతో సరిపెట్టేయండంటూ తెలుగుదేశం నేతలతో కాళ్లబేరానికి వస్తున్నారు. తాము గతంలో అలా వ్యవహరించడానికి వైసీపీ నేతల ఒత్తిడి, బెదరింపులే కారణమంటూ నమ్మబలు కుతున్నారు.  ఈ క్రమంలోనే పోలీసు అధికారుల సంఘం ప్రతినిథులు  తెలుగుదేశం సీనియర్ నాయకుడు, అధికార ప్రతినిథి  వర్ల రామయ్యను శుక్రవారం (జులై 19) కలిసి క్షమాపణలు కోరారు.  ముఖ్యంగా నాడు విర్రవీగి చంద్రబాబుపైనే వైసీపీ నేతలతో సమానంగా ఇష్టారీతిగా విమర్శలు గుప్పించిన పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు అయితే నాడు  ఓ అధికారిగా   చేయకూడని పనులు చేశానని మీడియా ముందు అంగీకరించారు. అయితే అప్పటి పరిస్థితులు అలా ఉన్నాయనీ, వైసీపీ  పెద్దల ఆదేశాలు, హుకుం కారణంగానే అలా చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు.  ఊసరవెల్లి రంగులు మార్చిన చందంగా ఇప్పుడు మీడియాతో మాట్లాడుతూ  జగన్ పై విమర్శలు గుప్పించారు. గతంలో ఏపీ పోలిసులపై నమ్మకం లేదన్న ఐదేళ్ల పాటు ఇదే రాష్ట్ర పోలీసుల సహకారంతో పాలన సాగించి ఇప్పుడు   మళ్లీ పోలీసులని నిందించడం దారుణమంటూ విమర్శలు చేశారు. మొత్తానికి పోలీసు అధికారుల సంఘం ప్రతినిథుల క్షమాపణలు వారి తప్పులను కడిగేస్తాయా అన్నది రానున్న రోజులలో తెలుస్తుంది. పరిధి మీరి వ్యవహరించిన పోలీసులు, అధికారులపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోనుందో చూడాలి. 

శాంతి తో రిలేషన్ బయట పెట్టిన విజయసాయి

దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి తో తనకున్న రిలేషన్ గూర్చి వైకాపా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా విజయసాయి, శాంతితో అక్రమ సంబంధం గూర్చి చర్చ జరుగుతుంది. శాంతి కొడుకుకు విజయసాయి తండ్రి అని చెప్పిన శాంతి భర్త మదన్ మోహన్ నిన్న రాష్ట్ర హోంమంత్రి అనితను కల్సి డిఎన్ఏ టెస్ట్ చేయాలని  కోరారు. గిరిజన చట్టాల ప్రకారం శాంతి  ఇంకా తన భార్య అని, ఇంకా విడాకులు కూడా మంజూరు కాలేదని ఆయన వివరణ ఇచ్చారు. డిఎన్ ఏ పరీక్ష విజయసాయిరెడ్డి, సుభాష్ రెడ్డిలకు చేయాలని మదన్ మోహన్ కోరుతున్నారు. డిఎన్ ఏలో తాను తండ్రి కాదని తేలితే  చట్టబద్దంగా విడాకులు కూడా ఇస్తానన్నారు.  లీగల్ గా భర్త  అయిన తనకు ఫ్యూచర్ లో  ఇబ్బందులు ఉండకూడగన్న ఉద్దేశ్యంతో డిఎన్ ఏ టెస్ట్ అడుగుతున్నట్లు చెప్పారు. మదన్ మోహన్ పదే పదే డిఎన్ ఏ టెస్ట్ అడుగుతున్నప్పటికీ శాంతి మాత్రం డిఎన్ ఏ అవసరం లేదంటూ పట్టుబడుతున్నారు.  అడ్వకేట్ సుభాష్ రెడ్డి ద్వారా బిడ్డను కన్నట్లు శాంతి అంగీకరించింది.  మదన్ మోహన్ తనపై చేస్తున్న ఆరోపణల గూర్చి విజయసాయి  మొదటిసారి స్పందించారు.  వైజాగ్ సీతమ్మధారలో మొదటి సారి శాంతితో భేటీ అయినట్లు ఆయన చెప్పారు. దేవాదాయ  అసిస్టెంట్  కమిషనర్ హోదాలో ఉన్నశాంతిని 2020లో కలిసినట్లు విజయసాయి చెప్పుకొచ్చారు. శాంతిని బిడ్డ మాదిరిగా చూసుకున్నాను. శాంతికి బిడ్డ పుడితే  ఇంటికి వెళ్లి పరామర్శించాను.  తన బిడ్డతో కల్సి తాడేపల్లి గూడెంకు వస్తే  శాంతిని బిడ్డ మాదిరిగా చూసుకున్నానని విజయసాయి చెప్పుకొచ్చారు. కొన్ని టీవీ చానళ్లు మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని వక్రీకరించి ప్రసారం చేస్తున్నాయని విజయసాయి అంటున్నారు.  ఇంత జరుగుతున్నా సుభాష్ రెడ్డి స్పందించకపోవడంతో వివాదం మరింత ముదురుతుంది. శాంతి బిడ్డకు తండ్రి సుభాష్ రెడ్డి ప్రూవ్ కాకపోతే వియసాయి తండ్రి అని కన్ఫర్మ్ అవుతుంది. ఈ కారణంగా విజయసాయి ఆదేశం మేరకు సుభాష్ రెడ్డి అండర్ గ్రౌండ్ లో వెళ్లినట్లు తెలుస్తోంది. 

భయపడిపోయిన పులివెందుల పిల్లి!

జగన్‌ని అతని దండుపాళ్యం బ్యాచ్ అందరూ పులివెందుల పులి అని అంటూ ఆకాశానికి ఎత్తేస్తారు గానీ, జగన్ పులివెందుల పులి కాదు.. పులివెందుల పిల్లిపిల్ల అనే విషయం క్లియర్‌గా అర్థమైపోయింది. శుక్రవారం నాడు జగన్ వినుకొండ వెళ్ళి మృతుడు రషీద్ కుటుంబాన్ని పరామర్శిస్తున్న సమయంలో ఎదురుగా వున్న వాళ్ళు కూర్చున్న మంచం లాంటిది విరిగిపోయి భళ్ళుమని సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ విని జగన్ భయపడిపోయాడు. ఓ క్షణంపాటు అయోమయం చూపు చూశాడు. తన మీద ఏదైనా ఎటాక్ జరిగిందా అన్నట్టుగా షేక్ అయ్యాడు. ఆ తర్వాత అసలు విషయాన్ని అర్థం చేసుకుని తమాయించుకున్నాడు. జగన్ పిరికివాడని తెలుసుగానీ, ఆ విషయాన్ని మరీ ఇలా ప్రత్యక్షంగా చూడ్డమే చాలా కామెడీగా అనిపించింది. పులి.. పులి.. అని భజన చేయించుకోవడం వల్ల పిలి పులి అయిపోదు. ‘పులి’ అంటే ఎలా వుంటుందో చంద్రబాబుని చూస్తే అర్థమవుతుంది. అలిపిరిలో క్లైమోర్ మైన్స్ పేలినప్పుడు, రక్తసిక్తమైపోయిన చంద్రబాబు వ్యవహరించిన తీరు వుంది చూశారా.. అది పులి అంటే.. అంతేగానీ, చిన్న శబ్దానికే గత్తరపడిపోయేవాళ్ళని పులి అనడం కాదు.. పిల్లి అనాలన్నా కూడా ఇబ్బందికరంగానే వుంటుంది.

అయ్యో పాపం... సైబరాబాద్ మొక్క!

శుక్రవారం నాడు వినుకొండలో జగన్ జరిపిన ఓదార్పు పర్యటన ఒక పెద్ద కామెడీ ఎపిసోడ్‌గా మారిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఇంత పెద్ద కామెడీ ఎపిసోడ్‌లో కూడా ఒక ‘అయ్యో పాపం’ అనిపించే విషయాలు కూడా వున్నాయి. చనిపోయిన రషీద్ కుటుంబాన్ని చూస్తే కలిగే జాలి ఒకటి. అది కూడా చెట్టంత మనిషి చనిపోయిన బాధలో వుండి కూడా, జగన్ చెప్పినట్టు చిలక పలుకులు పలకాల్సిన పరిస్థితి వచ్చిందేంటా అనే జాలి. ఇది కాకుండా మరో వ్యక్తిని చూసినా చాలా జాలి కలిగింది. ఈ ఆర్టికల్ చూసి ఆ వ్యక్తి ఎవరో చాలామందికి అర్థమయ్యే వుంటుంది. కరెక్ట్.. మన సైబరాబాద్ మొక్క విడదల రజినిని ఆ సందర్భంలో చూసినప్పుడు కూడా ‘అయ్యో పాపం’ అని చాలా జాలి కలిగింది. మృతుడు రషీద్ ఇంట్లోకి వెళ్లిన జగన్, అతని కుటుంబాన్ని పరామర్శించింది తక్కువ... రాజకీయాలు మాట్లాడింది ఎక్కువ. మొత్తానికి ఆ రాజకీయ పరామర్శ కార్యక్రమాన్ని ముగించుకుని బయటకి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ వెనుక సైబరాబాద్ మొక్క దీనంగా నిల్చుని వున్నారు. కళ లేని ముఖంతో, జీవం లేని కళ్ళతో నిస్తేజంగా నిలబడి వున్న సైబరాబాద్ మొక్కని చూసి చాలామందికి గుండె తరుక్కుపోయింది. ఒకప్పుడు విడదల రజిని అంటే ఎంత బిల్డప్పుడు వుండేది.. ఇప్పుడు ఆ బిల్డప్పు ఏమీ లేదు. జగన్ వెనుక నిలబడి కెమెరాల్లో పడటానికి తాపత్రయపడే బడ్డింగ్ కార్యకర్తలాగా విడదల రజిని పరిస్థితి తయారైంది. జగన్ మాట్లాడుతూ వుండగా,  ‘‘అవును.. మా జగన్ సార్ చెబుతున్నదంతా పచ్చి నిజం’’ అన్నట్టుగా మధ్యమధ్యలో సైబరాబాద్ మొక్క తల ఆడిస్తూ ఎక్స్.ప్రెషన్లు ఇవ్వడం చూసి నిజంగా చాలా జాలి వేసింది. ఆల్రెడీ సైబరాబాద్ మొక్క, తనకు ఈ జగన్ పార్టీ నుంచి ఎప్పుడు ‘విడుదల’ లభిస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురు చూపులు కూడా విడదల రజిని ముఖంలో కనిపించాయి.

ఏం మాట్లాడుతున్నానబ్బా.. ప్రసంగం మధ్యలో బుర్రగోక్కున్న జగన్!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ స్క్రిప్ట్ లేకండా సొంతంగా ప్రసంగం చేయడం ఇప్పటి వరకూ చూడలేదు. అధికారంలో ఉండగా స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేని తన బలహీనత బయటపడకూడదని ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్ట లేదు. బహిరంగ సభలలో అయితే విలేకరులు ప్రశ్నలు వేయరు కనుక తడబడుతూనో, నట్టుతూనో స్క్రిప్ట్ చూసుకుని ప్రసంగం పూర్తి చేయడం సులువు. అందుకే ఆయన బటన్ నొక్కుడు సభలలో ప్రసంగాలు ఎలాంటి ఆటంకాలూ లేకుండా సజావుగా సాగిపోయేవి. ఇప్పుడు అధకారం కోల్పోయిన తరువాత ఇప్పటి వరకూ ఆయన రెండు సార్లు బయటకు వచ్చారు.  ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టై నెల్లూరు జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి ఒకసారి. వినుకొండలో హత్యకు గురైన జిలానీ కుటుంబాన్ని పరామర్శించడానికి రెండో సారి ఆయన బయటకు వచ్చారు. ఆ రెండు సార్లూ కూడా అనివార్యంగా మీడియాను ఉద్దేశించి మాట్లాడాల్సి వచ్చింది. నెల్లూరు జైలు వద్ద ఆయన ప్రసంగం చేసి విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. ఇక వినుకొండలో మాత్రం మీడియా ప్రతినిథి ప్రశ్నకు ఆయన విసుక్కున్నారు. ప్రసంగిస్తుండగా ప్రశ్నించడమేంటని చిరాకు పడ్డారు. అలా ప్రశ్నలు వేస్తే తన ప్రసంగం ఫ్లో దెబ్బతింటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ చిన్నపాటి ఆటంకానికే ఆయన ప్రసంగిస్తున్న విషయమేంటో మర్చిపోయారు. చదువుతున్న స్క్రిప్ట్ లో ఎక్కడ ఆపానో గుర్తుకు రాలేదు. బుర్రగోక్కున్నారు. కంగారు పడిపోయారు. పక్కనున్న వారు అందిస్తే అప్పుడు ప్రసంగాన్ని పున: ప్రారంభించారు.  

వినుకొండ క్రైమ్ స్టోరీలో రాజ‌కీయ జోక‌ర్‌ జగన్

ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్లు అరాచ‌క పాల‌న సాగించిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ప్ర‌జ‌లు దిమ్మ‌తిరిగే షాకిచ్చారు.  ప్ర‌తిప‌క్ష హోదా కూడా దండ‌గేన‌ని గ‌ట్టిగా గ‌డ్డి పెట్టారు. అయినా, జ‌గ‌న్ ప్ర‌వ‌ర్త‌నలో ఏ మాత్రం మార్పు రాలేదు. నిత్యం కొట్లాట‌లు, హ‌త్య‌ల‌కు ఏపీ నిల‌యంగా ఉండాల్సిందే అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అధికారంలో ఉన్న‌న్ని రోజులూ ఏపీని రావ‌ణ‌ కాష్టంలా మార్చిన జ‌గ‌న్‌  తెలుగుదేశం పాలనలో కూడా రాష్ట్రం అలాగే ఉండాల‌న్న‌ట్లుగా భావిస్తున్నారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వ‌చ్చిన నెల‌రోజుల‌కే జ‌గ‌న్నాట‌కాన్ని మొద‌లు పెట్టారు. చంద్ర‌బాబు నాయుడు సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటినుంచి రాష్ట్రంలో ఎలాంటి ఘ‌ర్ష‌ణ‌లు త‌లెత్త‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. తెలుగుదేశం, జ‌న‌సేన‌, బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఘ‌ర్ష‌ణ‌ల‌కు దూరంగా ఉంటూ అభివృద్ధే ల‌క్ష్యంగా ముందుకెళ్తున్నారు. దీంతో గ‌త  ఐదేళ్ల జ‌గ‌న్ క‌క్ష‌పూరిత‌ పాల‌న‌కు ఇబ్బందులు ప‌డిన ప్ర‌జ‌లు   చంద్ర‌బాబు పాల‌న ప‌ట్ల హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేస్తున్నారు. కొంద‌రు వైసీపీ నేత‌లు సైతం చంద్ర‌బాబు పాల‌న‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ‌నుగ‌డ‌కే ప్ర‌మాదం అన్న ఆందోళన జగన్ లో ఆరంభమైంది. దీంతో ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతలు అధ్వానం అని ప్రచారం చేయడానికి కొత్త జగన్నాటకానికి తెరతీశారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అధికారంలో ఉన్నా, ప్ర‌తిప‌క్షంలో ఉన్నా ప‌బ్జీ గేమ్ త‌ర‌హాలో రాష్ట్రంలో నిత్యం ఘ‌ర్ష‌ణ‌లు, కోట్లాట‌లు జ‌ర‌గాల‌ని భావిస్తుంటారు.  2019లో సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి జ‌గ‌న్ అదే ప‌నిచేశారు. ఐదేళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌పై దాడులు చేయించ‌డం, పోలీసుల‌తో కొట్టించ‌డం, హ‌త్య‌లు వంటి ఘ‌ట‌న‌లు వేల సంఖ్య‌లో చోటుచేసుకున్నాయి.  తెలుగుదేశం జెండా పట్టినా, ఆ పార్టీకి మద్దతుగా నిలిచినా సహించలేక..  వారిపై త‌ప్పుడు కేసులు బ‌నాయించారు. దీంతో ఏపీలో ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు తెలుగుదేశం బ్యాన‌ర్ క‌ట్టేందుకు   టీడీపీ నేత‌లు సైతం సాహ‌సం చేయ‌లేని పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత‌.. సీఎం చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రంలో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం నెల‌కొల్పేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. పార్టీల‌కు అతీతంగా ప్ర‌జ‌లు క‌లిసిమెలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామ‌ని పిలుపునిస్తూ ముందుకు సాగుతున్నారు. కానీ, క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌కు అల‌వాటు ప‌డిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి,  వైసీపీ నేత‌లు అధికార తెలుగుదేశం కూటమి  నేతలు, కార్య‌క‌ర్త‌ల‌ను రెచ్చ‌గొట్టి ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అలా వైసీపీ మూకల రెచ్చగొట్టే ధోరణి కారణంగా జరుగుతున్న   ఘర్షణలను త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటూ రాష్ట్రంలో వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు పెరిగిపోయాయ‌ని, త‌మ అనుకూల మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేయిస్తున్నారు.  అందులో భాగంగానే వినుకొండ ఘ‌ట‌న‌ను రాజ‌కీయంగా వాడుకొనేందుకు జ‌గ‌న్ ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నారు.  వినుకొండ‌లో జ‌రిగిన హ‌త్య ఘ‌ట‌న‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నించిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాష్ట్ర రాజ‌కీయాల్లో ఓ జోక‌ర్‌గా మారారు. వినుకొండ ఘ‌ట‌న‌పై జ‌గ‌న్ వ్యవహరిస్తున్న తీరును చూస్తే రాష్ట్రంలో ప్ర‌శాంత వాతావ‌ర‌ణాన్ని  చెడగొట్టేందుకు ఎంతకైనా తెగించడానికి సిద్ధపడు తున్నా రని   ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్టంగా అర్ధ‌మైంది.  పోలీసుల విచార‌ణ‌లో, జిలానీ, ర‌షీద్‌లు చిన్న‌ప్ప‌టి నుంచి స్నేహితులు. ఇళ్లు కూడా ప‌క్క‌ప‌క్క‌నే. రెండేళ్ల క్రితం వారిద్ద‌రి మ‌ధ్య ఘ‌ర్ష‌ణ త‌లెత్తింది. ఆ గొడ‌వతో ఇద్ద‌రి మ‌ధ్య దాడులు జ‌రిగాయి. వారి కుటుంబాల మ‌ధ్య‌ కూడా వైరం పెరిగింది. ఆ త‌రువాత ర‌షీద్‌ ఫిర్యాదుతో జిలానీ జైలు కెళ్లాడు. దీంతో ర‌షీద్ పై జిలానీ క‌క్ష పెంచుకున్నాడు. ఇటీవ‌ల‌ ర‌షీద్ షాపులో ప‌ని ముగించుకొని వ‌స్తుండ‌గా జిలానీ కాపు కాసి దాడిచేసి హ‌త‌మార్చాడు. ఈ ఘ‌ట‌న‌ల‌పై జిలానీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాస్త‌వానికి ర‌షీద్‌, జిలానీ ఇద్ద‌రికీ వైసీపీ, తెలుగుదేశం అన్న రాజకీయ తేడాలు లేవు.  ఇరు పార్టీల నేత‌ల‌తో వారు ఫొటోలు దిగారు. కానీ, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆయ‌న గ్యాంగ్ ర‌షీద్ హ‌త్య‌ను తెలుగుదేశం పార్టీకి అపాదించి,  తెలుగుదేశం కూటమి  హ‌యాంలో ఏపీలో హ‌త్య‌లు పెరిగిపోయాయ‌ని చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేశారు. మ‌రో  విచిత్రమైన విష‌యం ఏమిటంటే జ‌గ‌న్ ర‌షీద్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు వెళ్లారు. ఆ సందర్భంగా ఆయన   కొడుకును కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్న మృతుడి తల్లిని ఓదార్ఛాల్సింది పోయి రాజకీయం మొదలుపెట్టారు. ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేస్తూ కూటమి సర్కార్ ను బద్నాం చేసేందుకు జగన్  అధిక ప్రాధాన్యతనిచ్చారు. కూటమి అధికారంలోకి వస్తే అమ్మఒడి ఇస్తా అన్నారు.. తల్లికి వందనం అన్నారంటూ.. చంద్రబాబు హామీలను జ‌గ‌న్ గుర్తు చేయడం అందర్నీ విస్తుపోయేలా చేసింది. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్ధి వైఫల్యాలను గుర్తు చేసినట్టుగా పరామర్శలోనూ రాజకీయ అంశాలనే లేవనెత్తారు.  జగన్ తీరునుచూసి పరామర్శకు వచ్చారా..? రాజకీయాలు చేసేందుకు వచ్చారా..? అని స్థానిక వైసీపీ నేత‌లే చ‌ర్చించుకోవ‌టం క‌నిపించింది.  రాష్ట్రంలో వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌ని చెప్పుకొచ్చిన జ‌గ‌న్‌.. ఏపీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాలని డిమాండ్ చేయడం వైసీపీ శ్రేణుల‌ను సైతం ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి నెల‌రోజులే అయ్యింది. అప్పుడే రాష్ట్ర‌ప‌తి పాల‌న అంటూ జ‌గ‌న్ అన‌డాన్ని కొంద‌రు వైసీపీ నేత‌లు త‌ప్పుపట్టారు. దీనికితోడు..  ఏపీలో జరుగుతున్న దాడులపై ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తామని జగన్ సంచలన ప్రకటన చేశారు. అంతే కాదు.. ఏపీ పరిస్థితులపై బుధవారం ఢిల్లీలో ధర్నా చేస్తామని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ధర్నాకు దిగుతామని జ‌గ‌న్ అన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ ను గ‌మ‌నించిన ఏపీ ప్ర‌జ‌లు జ‌గ‌న్ తీరుప‌ట్ల ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఏపీ అభివృద్ధి చెందుతుంటే జ‌గ‌న్‌కు ఎందుకంత క‌డుపు మంట అని వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.  మొత్తం మీద వినుకొండ క్రైం స్టోరీలో జగన్ ఓ పొలిటికల్ జోకర్ పాత్ర పోషిస్తున్నారని నెటిజనులు ఎద్దేవా చేస్తున్నారు.  

ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వానలు

బంగాళాఖాతంలో ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. వాయవ్య దిశగా పయనించి.. పూరీ సమీపంలో శనివారం తెల్లవారు జామున తీరం దాటింది. ఆ తర్వాత క్రమంగా బలహీనపడుతోంది. దీని ప్రభావంతో శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదాదవరి, కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో  పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు అనంతపురం, శ్రీ సత్యసాయి, వై.యస్.ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో నూ వర్షాలు కురుస్తున్నాయి.  వర్షాల నేపథ్యంలో అత్యవసర సహాయక చర్యల కోసం 3 ఎస్డీఆర్‌ఎఫ్‌, 2ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేసినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రో తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవహిస్తున్న వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. 

అసెంబ్లీకి జగన్.. పోరాటమా.. పలాయనమా?!

ఆంధ్రప్రదేశ్  అసెంబ్లీ సమావేశాలు జులై 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ హాజరు కానున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. అయితే జగన్ హాజరుపై అనుమానాలు ముప్పిరి గొంటూనే ఉన్నాయి. జగన్ ఐదేళ్ల పాలనలో వివిధ రంగాలలో జరిగిన విధ్వంసంపై వరుస శ్వేత పత్రాలు విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. ముందుగా ప్రకటించిన మేరకు గురువారం శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయాల్సి ఉంది. అయితే వినుకొండ ఘటన, పుంగనూరులో ఉద్రిక్తతల వేనుక ఉన్న కుట్ర కోణాన్ని గ్రహించి శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల వేదికను అసెంబ్లీకి మార్చారు. అసెంబ్లీ వేదకగానే శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదలకు చంద్రబాబు నిర్ణయించారు. అలాగే జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరౌతారని పేర్ని నాని ప్రకటన నేపథ్యంలో జగన్ ముందే, సభ సాక్షిగా జగన్ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని కళ్లకు కట్టేందుకు రెడీ అయ్యారు. దీంతో జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంలో పునరాలోచనలో పడ్డారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీలో జగన్ తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలనీ, అలాగే వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలనీ కోరుతూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. ఆ లేఖపై స్పీకర్ ఇంకా స్పందించలేదు. అయితే జగన్ కు విపక్ష నేత హోదా, వైసీపీకి విపక్షంగా గుర్తింపు ఇచ్చే అవకాశాలు దాదాపు మృగ్యమే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. స్పీకర్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కూడా జగన్ వైఖరే కారణమని అంటున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం విషయంలో చంద్రబాబు చాలా ఉదారంగా జగన్ కు మంత్రుల తరువాత ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇచ్చారు. అయితే దానిని జగన్ పాజిటివ్ గా తీసుకోలేదు. పైపెచ్చు.. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సభ నుంచి వెళ్లిపోయారు. తన పార్టీ సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసే వరకూ కూడా ఆగలేదు. బయటకు వెళ్లి తీరిగ్గా ప్రతిపక్ష నేతగా తనకు సముచిత గౌరవం ఇవ్వలేదంటూ విమర్శలు గుప్పించారు. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా గుర్తింపు రావడానికి అవసరమైనంత మంది సభ్యులు లేరన్న విషయం జగన్ కు తెలుసు. అయినా ఏవో కారణాలు చెబుతూ తమది ప్రధాన ప్రతిపక్షమేనంటూ వాదిస్తున్నారు.  ఈ నేపథ్యంలో జగన్ పార్టీని ప్రతిపక్షంగా గుర్తించేందుకు స్పీకర్ ఇష్టపడే అవకాశం కనిపించడం లేదు. విపక్ష హోదా లేకుండా సభకు వస్తే.. సాధారణ ఎమ్మెల్యేగా మాత్రమే జగన్ కు ట్రీట్ మెంట్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే జగన్ అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టడం ఖాయమని అంతా భావించారు. అయితే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యపై గళమెత్తడానికి జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వినుకొండ ఘటన, పుంగనూరు ఉద్రిక్తతలను ఆసరాగా చేసుకుని ఆయన రాజకీయం చేయడానికి రెడీ అయిపోయారు. ఆ రెండు సంఘటనలకూ కారణం వైసీపీయే అయినా, పెనుకొండ ఘటన వ్యక్తిగత కక్షల కారణంగా జరిగిందని స్పష్టంగా తేలినా, పుంగనూరు ఉద్రిక్తతకు కారణం మిథున్ రెడ్డి ముందస్తు సమాచారం లేకుండా పుంగనూరుకు రావడం అ    ని పోలీసులు తేల్చే సినా.. జగన్ తెలుగుదేశం ప్రభుత్వ వేధింపులు, శాంతి భద్రతల పరిస్థితి అధ్వానం అంటూ గగ్గోలు పెడుతున్నారు.  రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై మోడీకి వివరించడానికి అప్పాయింట్ మెంట్ కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన అసెంబ్లీకి వెళ్లి గట్టిగా గళం వినిపించాలని నిర్ణయించుకున్నారు. అయితే చంద్రబాబు శాంతి భద్రతలపై అసెంబ్లీ వేదికగానే శ్వేతపత్రం విడుదలకు నిర్ణయించుకోవడం జగన్ కు గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లైంది. తన ఎదుటే తన ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతల విధ్వంసంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను తిలకించాల్సిరావడం జగన్ కు ఇబ్బందికరమే. ఖండించడానికి కానీ, సభలో గందరగోళ పరిస్థితులు సృష్టించడానికి కానీ తగినంత బలం లేదు. ఉన్నవారెవరూ గట్టిగా మాట్లాడగలిగేవారు కాదు. దీంతో సభకు వెళ్లి అవమానపడటం కంటే గైర్హాజరవ్వడమే మేలని భావిస్తున్నారు. అయితే అలా చేస్తే పలాయనం చిత్తగించానన్న విమర్శలు వెల్లువెత్తుతాయన్న భయం వెంటాడుతోంది. అంటే అసెంబ్లీ సమావేశాల హాజరు విషయం జగన్ కు ముందు గొయ్యి వెనుక నుయ్యిలా తరారైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

గోడదూకితే అనర్హత వేటు వేయాలని కెసీఆర్ నిర్ణయం 

ఫిరాయింపులను సీరియస్ గా తీసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ  చీఫ్ కెసీఆర్  నిర్ణయించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు. వారిపై   చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.  ఇప్పటికే 10 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బిఆర్ఎస్ పార్టీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు బిఆర్ఎస్  ఫిర్యాదు చేసింది.  బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ నేతృత్వంలో  గులాబీ ఎమ్మెల్యేలు స్పీకర్ కు    ఫిర్యాదు చేశారు.  గులాబీ ఎమ్మెల్యేలు  మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయి. హైకోర్టులో కూడా పిటిషన్ వేయాలని నిర్ణయించిన గులాబీ పార్టీ అవసరమైతే సుప్రీంకోర్టు గడప దొక్కాలని నిర్ణయించింది. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా ప్రోటో కాల్ పాటించడం లేదని కెటీఆర్ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఇటీవల బిఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి అవమానం జరిగిందని,చెక్కుల పంపిణీ కార్యక్రమంలో స్టేజి మీదకు ఆహ్వానించలేదన్నారు.  కాంగ్రెస్ నేత కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారని కెటీఆర్ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.