AP High Court order, a slap on State Govt face

Perhaps the most concerning development in the  recent past in Andhra Pradesh is that the freedom of the Press has come under unusual pressure. Although major media houses remain strong and continue to bring the facts to light, the ruling YSR Congress Party's continual vilification of the Press has seriously exacerbated an ongoing erosion of public confidence in the mainstream media.    The Indian Constitution provides robust protection against the move to muzzle the voice of the media but the measures being adopted by the ruling YSRCP in Andhra Pradesh against the freedom of the Press have had a tangible impact on the landscape of the media.  Despite these challenges, journalists have been fighting for the freedom to air their views  without any fear of being persecuted as they strongly believe that the judiciary will certainly come to their rescue if their voices are chocked.   The death of the freedom of Press is certainly a blow to the essence of a free-thinking.  A free Press exists under Governments that are healthy, strong and confident enough for the people, leaders and bureaucrats to accept the independent media with the guts to criticise as well as support the system in which they exist.   If truth is the first casualty, newsrooms are piled high with the wounded. The Teluguone.com is a classic example as to how the voice of the media is being gagged. Launched in the year 2000 with Hyderabad as its headquarters in the combined Andhra Pradesh, the website has successfully won the hearts of lakhs and crores of readers across the globe, solely because of the credibility of the videos and the stories being uploaded.  But, this media house has recently undergone a traumatic experience with the Andhra Pradesh Government trying to choke its voice and filing a case against its Managing Director, Mr K Ravi Shankar.   What has come as a great relief is the Andhra Pradesh High Court's verdict delivered on September 11 which is a blow on the face of the ruling dispensation. Disposing of the petition filed against the Teluguone Managing Director, the High Court observed that harassing anyone without any concrete evidence amounts to brutality and the CID officials with their behaviour are sending a message to the people that they are living in kakistocracy and not in a democracy.      The court found fault with the CID for filing a case against the MD under Section 188, 505(2) and 506 of Indian Penal Code (IPC) and under Section 54 of the Disaster Management Act, in the name of airing a story against the ruling party in Andhra Pradesh and the Chief Minister. Not only this, but also the police personnel came all the way from Andhra Pradesh to Hyderabad, the capital city of Telangana where the headquarters of the website is located, and seized certain electronic goods.    The MD then knocked the doors of the Andhra Pradesh High Court with an appeal to quash the cases and the court promptly came to his rescue. The observations made by the High Court while delivering the judgment are certainly a slap on the face of the ruling party leaders. By filing a case against the MD under the circumstances mentioned by the CID, it clearly shows that the CID personnel do not have any evidence and harassing the people in the name of investigation clearly lead to autocracy. The tendency of the CID officials certainly arises doubts among the people whether they are living in a democracy or in a kakistocracy. Unless such steps taken by the CID are checked, the people will lose faith in the democracy, the court observed.      It is a fact that the prevailing situation in Andhra Pradesh is such that the people of the State are now being directed on what they should eat and what should be their attire. Any voice raised against such attitude of the Government, is muzzled by the ruling party. The cases filed by the CID against the Managing Director of the Teluguone is a classic example of this.     No doubt, the unfettered dissemination of information and ideas is being opposed, in one form or the other, by powerful sections of society in Andhra Pradesh, mainly because ideas have a tendency to challenge the powerful. At this crucial juncture it is the judiciary that is coming to the rescue of persons who are airing such ideas.      The stay granted on the FIRs in the Devgan and OpIndia cases, in the cases filed against senior journalist Vinod Dua by the Himachal Pradesh police, the criminal cases filed against Arnab Goswami of the Republic TV and the latest judgment of the Andhra Pradesh High Court in the Teluguone MD case stand aloft as to how the judiciary is standing by the voices aired freely by the journalist community.   The freedom of the Press will rest safe as long as journalists can speak without being chilled by a threat of reprisal. Subjecting journalists to harassment and forcing them face with various FIRs will certainly have a stifling effect on the exercise of freedom of the Press.    This will effectively destroy the freedom of the citizen to know the affairs of governance in any State or in the country and the right of the journalist to ensure an inform society. Free citizens cannot exist when the news media is chained to adhere to one position. The intervention of the judiciary at this crucial juncture is necessary to protect the rights of the media and the journalist community. Journalists should get a fair treatment (guaranteed under Article 14) and should get liberty to conduct an independent portrayal of views.   The Late Ramnath Goenka, the founder of the Indian Express Group, will be remembered for ages as a man who donned many hats in his lifetime, as an iconoclast and a man who had the courage to stand up for the truth. The relentless fight for years he put up for the freedom of the Press when the Indira Gandhi-led Congress government imposed emergency in the year 1975, will be recalled by all true journalists, for ages.    He once said, “I had two options: to listen to the dictates of my heart or to the powers-that-be. I finally chose to listen to my heart.” This is really the finest example for any journalist.   The fundamental right to seek and disseminate information through an independent Press is now under attack in Andhra Pradesh. Explicit attempts are being made to gag critical media voices and strengthen outlets that serve favorable coverage. The erosion of Press freedom is both a symptom of and a contributor to the breakdown of democratic institutions and principles, a fact that makes it especially alarming.   Press freedom has been deteriorating with new forms of repression. Experience has, however, shown that the freedom can rebound from even lengthy stints of repression when given the opportunity. The basic desire for democratic liberties, including access to honest and fact-based journalism, can never be extinguished, and it is never too late to renew the demand that these rights be granted in full.   The breakdown of Press freedom is closely related to the broader decline of democracy and repression of free media is a strong indication that other political rights and civil liberties are in danger. Assaults on media independence are frequently associated with power grabs by new or incumbent leaders with attempts to crush perceived threats to their control.   Established autocratic Governments continue to tighten the screws on dissenting voices, as any breach in their media dominance threatens to expose official wrongdoing or debunk official narratives. However, the picture is not entirely bleak. As long as an honest judiciary listens to the voices of the journalists, they continue to air their views freely and fairly.      The Press does not and will not exit at the behest of Governments and leaders who clamp down on free speech and freedom of association to hide their inadequacies.  A free media is thus critical in keeping citizens informed about integral issues, be they political, social or economic. Journalists will continue their fight and stay true to their cause. Whichever government might be in power, they will will also fight against voices being muzzled.

తెలుగువన్ ఎండీపై కేసుని కోర్టు కొట్టివేయడం అరాచకవాదులకు చెంపపెట్టు

సీఎం వైఎస్ జగన్ దగ్గర మార్కుల కోసం కొంత మంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని టీడీపీ నేత నారా లోకేష్ విమర్శించారు. ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రిపైనా అభ్యంతరకర వార్త ప్రసారం చేశారని ఆరోపిస్తూ తెలుగు వన్ సంస్థపై సీఐడీ అధికారులు అక్రమకేసు పెట్టగా.. దానిని హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో సీఐడీ పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, సీఐడీ పోలీసులు ప్రభుత్వానికి సాధనంగా మారి.. ఉద్దేశపూర్వకంగా కేసు నమోదు చేశారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపధ్యంలో ట్విట్టర్ వేదికగా స్పందించిన లోకేష్.. అధికార పార్టీ తీరుని, అధికారుల తీరుని తప్పుబట్టారు. "మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఖాకిస్వామ్యంలో ఉన్నామా? అని హై కోర్టు వ్యాఖ్యానించింది అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్ధమవుతోంది. జగన్ రెడ్డి గారి దగ్గర మార్కుల కోసం అత్యుత్సాహం, "ఖాకిస్టోక్రసీ" ప్రదర్శిస్తున్నారు కొంత మంది అధికారులు." అని లోకేష్ వ్యాఖ్యానించారు.   "గతంలో కూడా ఇలానే చేసి కొంత మంది అధికారులు జగన్ రెడ్డి గారితో కలిసి ఊచలు లెక్కపెట్టారు. ఇప్పుడు పత్రికా స్వేచ్ఛని హరించడానికి కూడా వెనకాడటం లేదు. కనీసం నోటీసు ఇవ్వకుండా జర్నలిస్టులను అరెస్ట్ చేస్తూ, విచారణ అంటూ వేధింపులతో అరాచకం సృష్టిస్తున్నారు." అని మండిపడ్డారు.   "వాస్తవాలను ప్రసారం చేశారన్న అక్కసుతో teluguone.com ఎండీ రవిశంకర్ గారిపై అక్రమ కేసు పెట్టి వేధించారు. ఈ కేసుని కోర్టు కొట్టివెయ్యడం అరాచకవాదులకు చెంపపెట్టు. పత్రికా స్వేచ్ఛని కాపాడుకోవడానికి అందరూ కలిసి పోరాడాలి." అని లోకేష్ పేర్కొన్నారు.

యువనేతకే పగ్గాలు! ఇంచార్జ్ తో సిగ్నల్.. రేవంత్ రూట్!

కాంగ్రెస్ పార్టీ జాతీయ కమిటీలో జరిగిన మార్పులు తెలంగాణ హస్తం పార్టీలో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. ప్రధాన కార్యదర్శులుగా సీనియర్లను కాదని తొలిసారి యువ నేతలకు ఎక్కువ అవకాశం ఇచ్చింది హైకమాండ్. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగా తమిళనాడుకు చెందిన 45 ఏండ్ల మణికం ఠాగూర్ ను నియమించింది. ప్రస్తుతం ఠాగూర్ తమిళనాడులోని విరుదునగర్‌ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీగా ఉన్నారు. తెలంగాణకు ఇంచార్జ్ గా యువకుడు రావడం ఇదే తొలిసారంటున్నారు.    కొత్త ఇంచార్జి నియామకంతో తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ నియామకంపై చర్చ జరుగుతోంది. ఇంచార్జ్ గా యువ నాయకుడు వచ్చారు కాబట్టి పీసీసీ పగ్గాలు కూడా యువనేతకే ఇస్తారనే ప్రచారం గాంధీభవన్ లో జరుగుతోంది. తెలంగాణ పీసీసీ రేసులో ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాను కూడా పీసీసీ రేసులో ఉన్నానని ప్రకటించారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క కూడా పార్టీ సారథ్య బాధ్యతలు తీసుకోవడానికి ఆసక్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ప్రస్తుతం యువ నేతలకు ఎక్కువగా ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ సహా చాలా రాష్ట్రాలకు యువకులను ఇంచార్జీలుగా నియమించింది. అట్లాగే తెలంగాణ పీసీసీ కూడా యువనేతకే వస్తుందని ఖాయంగా చెబుతున్నారు.    కొత్త ఇంచార్జ్ ఠాగూర్ ఎంపీగా ఉన్నారు. ఆయనతో మన ఎంపీలకు మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్ నేతగా పేరున్న రేవంత్ రెడ్డితో ఠాగూర్ కు ఫ్రెండి షిప్ ఉందంటున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను ధీటుగా రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నారనే అభిప్రాయం కాంగ్రెస్ ఎంపీల్లో ఉందంటున్నారు. లోక్ సభలోనూ పలువురు ఎంపీలు ఈ విషయంలో రేవంత్ ను అభినందించినట్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా ఇమేజ్ ఉందనే అభిప్రాయం హైకమాండ్ కు ఉందంట. ఇలా ఏ రకంగా చూసినా తెలంగాణ పీసీసీ పగ్గాలు యువకుడైన రేవంత్ రెడ్డిపై వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు.   2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి పీసీసీ  నాయకత్వ మార్పుపై ప్రచారం జరుగుతోంది. కాని ఛేంజ్ మాత్రం జరగలేదు. అయితే త్వరలోనే  జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. గ్రేటర్ ఎన్నికల తర్వాతే కొత్త పీసీసీని నియమిస్తారని అనుకుంటున్నారు. అందుకే గ్రేటర్ ఎన్నికల్లోనూ సత్తా చాటి .. పీసీసీ రేసులో తనకు పోటీ లేకుండా చూసుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, తన లోక్ సభ పరిధిలోకి వచ్చే గ్రేటర్ లోని 48 డివిజన్లలో మెజార్టీ సీట్లు సాధించేలా ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

గన్నవరం వైసీపీలో వంశీ కథ ముగిసినట్టేనా...!

2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గన్నవరం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన వల్లభనేని వంశీ ఇటు తెలంగాణలో తన ఆస్తులను కాపాడుకోవడంతో పాటు తనపై పెట్టిన కేసుల నుండి తప్పించుకోవడానికి సీఎం జగన్ ను కలిసారని అప్పట్లో టాక్ నడిచింది. ఆ తరువాత చంద్రబాబుకు ప్రతిపక్షనాయకుడి హోదా తప్పించే రాజకీయ క్రీడలో భాగంగా సీఎం జగన్ సారధ్యంలోని వైసిపికి జై కొట్టిన సంగతి కూడా తెలిసిందే. దీంతో అప్పటికే రెండు గ్రూపులు ఉన్న గన్నవరం వైసిపిలో ఆయన చేరిక మరిన్ని ఘర్షణలకు దారి తీస్తోంది. అంతేకాకుండా అయన చేరికను ఈ రెండు గ్రూపులు ఎంత మాత్రం జీర్ణించుకోలేకపోయాయి. దీనికి గల ముఖ్య కారణం ఎన్నికల ప్రచార సమయంలో జగన్ సారధ్యంలోని వైసిపి పై అయన చేసిన కామెంట్సేనట. "బుద్ది ఉన్నవాడెవడు వైసిపిలో చేరడు" అని ఆరోజుల్లో వంశీ చేసిన సంచలన కామెంట్స్ ఇప్పటికి వైసిపి శ్రేణులను ముల్లులా గుచ్చుతూనే ఉన్నాయి. అంతేకాకుండా టీడీపీ ఎమ్మెల్యే గా ఉన్నపుడు జగన్ సతీమణి ని కూడా జైలుకు పంపుతాము అని కామెంట్ చేయడంతోపాటు, సాక్షాత్తు జగన్ పై అయన చేసిన కామెంట్లను పార్టీ కేడర్ అసలు మర్చిపోలేకపోతున్నారని.. దీంతో వైసిపి కేడర్ ఆయనతో కలిసి నడవడం కష్టమేనని తెలుస్తోంది.   ఇదిలా ఉండగా తాజాగా నియోజకవర్గంలో అటు ఎమ్మెల్యేను, ఇటు వైసిపి ఇంచార్జ్ కూడా తానేనని వంశీ ప్రకటించుకున్న నేపథ్యంలో ఆయనకు పార్టీ కేడర్ కు మధ్య గ్యాప్ మరింత పెరిగింది. ఇప్పటికే నియోజకవర్గంలో పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న దుట్టా రామచంద్రరావు వర్గం, మొన్నటి ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు వర్గం వంశీ పోకడ పై గుర్రుగా ఉన్నాయి. అంతేకాకుండా నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ రెండు వర్గాల పై వంశీ వర్గీయులు దాడులు చేస్తుండడంతో ఈ వ్యవహారం పార్టీ అధిష్టానం దృష్టికి కూడా చేరినట్లు సమాచారం. దీంతో గన్నవరం నియోజకవర్గంలో ఏం జరుగుతోందని పార్టీ హైకమాండ్ ఆరా తీసి అక్కడి పరిస్థితుల పై రిపోర్ట్ కూడా తెప్పించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ రిపోర్ట్ ను పరిశీలించిన హైకమాండ్ పార్టీలోని కేడర్ తో అడ్జస్ట్ కాలేని నాయకులు పార్టీకి అవసరం లేదని డిసైడ్ అయిందని దీంతో ఇక వంశీని పక్కన పెట్టేసినట్లేనని జిల్లాలోని ముఖ్య నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. దీంతో వైసిపిలో వంశీ కథ ముగిసినట్లేనని లేటెస్ట్ గా టాక్ వినిపిస్తోంది. దీంతో అటు టికెట్ ఇచ్చిన పార్టీ, ఇటు అధికార పార్టీ లు రెండు పక్కన పెడితే వంశీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా అవుతుందేమోనని అయన అనుచరుల ఆందోళన.

జంతువులపై జరిపిన ప్రయోగాలలో భారత్ బయోటెక్ 'కొవాగ్జిన్' సూపర్ సక్సెస్

మన దేశంలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రతి రోజు దాదాపుగా లక్ష పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే కరొనాను ఎదుర్కొనేందుకు దేశీయంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన 'కొవాగ్జిన్' క్లినికల్ ట్రయల్స్ కీలక దశలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్ బయోటెక్ కొన్ని ఆసక్తికర వివరాలు వెల్లడించింది. జంతువులపై చేసిన కోవాగ్జిన్ ప్రయోగ ఫలితాలు అద్భుతంగా ఉన్నాయని, తమ వ్యాక్సిన్ తో జంతువుల్లో నిరోధక శక్తి బాగా పెరిగిందని అంతేకాకుండా ఎలాంటి దుష్ఫలితాలు కలగలేదని తాజాగా తెలిపింది. వ్యాక్సిన్ రెండో డోస్ ఇచ్చిన తర్వాత 14 రోజుల పాటు వాటిని పరీక్షించగా, వాటి ముక్కు, గొంతు, ఊపిరితిత్తులలో కరోనా వైరస్ వృద్ధిని వ్యాక్సిన్ సమర్థంగా అడ్డుకున్నట్టు గుర్తించామని భారత్ బయోటెక్ వివరించింది. పైగా జంతువుల్లో ఇమ్యూనిటీ కూడా అద్భుతంగా పెరిగిందని వెల్లడించింది.   ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ రెండో దశ ట్రయల్స్ కూడా పూర్తయ్యాయి. ఈ ట్రయల్స్ ఢిల్లీలోని ఎయిమ్స్ తో పాటు, హైదరాబాద్ లోని నిమ్స్ , విశాఖలోని కెజిహెచ్, రోహతక్ లోని పిజిఐఎంఎస్ లలో జరుగుతున్న సంగతి తెల్సిందే. ఒక పక్క ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో ట్రయల్స్ తాత్కాలికంగా నిలిచిపోగా.. మరోపక్క భారత బయోటెక్ వారి కొవాగ్జిన్ సత్ఫాలితాలు ఇస్తుండడం ఆనందించదగ్గ పరిణామం.

టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు? చాడాతో కేసీఆర్ లంచ్.. కాంగ్రెస్ కు షాకే..

సిద్ధిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ స్థానానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతిచ్చే అవకాశం ఉంది. సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డితో సీఎం కేసీఆర్ మాట్లాడినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికలో తమకు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ చాడాను కోరినట్లు సమాచారం. అయితే మద్దతుపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చాడా చెప్పినట్లు తెలుస్తోంది. శుక్రవారం అసెంబ్లీకి వెళ్లిన చాడా వెంకట్ రెడ్డి మధ్యాహ్న సమయంలో సీఎం కేసీఆర్ ను కలిశారు. ఇద్దరు కలిసి లంచ్ చేశారు. వర్తమాన రాజకీయాలపై ఇద్దరు నేతలు మాట్లాడుకున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. అయితే దుబ్బాక ఉప ఎన్నికపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది.    గతంలోనూ పలు ఎన్నికలు, ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు సీపీఐ సపోర్ట్ చేసింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో గత సంవత్సరం అక్టోబర్ లో జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు మొదట సీపీఐ మద్దతు ఇచ్చింది.  ఆ సమయంలోనే జరిగిన ఆర్టీసీ సమ్మె, ప్రభుత్వ తీరుపై విపక్షాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. అధికార పార్టీకి మద్దతివ్వడంపై కార్మిక సంఘాల నుంచి ఒత్తిడి పెరగడంతో తర్వాత మద్దతు ఉపసంహరించుకుంది సీపీఐ. అయినా హుజూర్ నగర్ లో ఉప ఎన్నికలో సీపీఐ కార్యకర్తలంతా లోపాయకారిగా కారు పార్టీకే మద్దతు ఇచ్చారని ఫలితాల్లో తేలింది. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల రాజీనామాలతో జరిగిన ఉప ఎన్నికల్లోనూ సీపీఐ పార్టీ గులాబీ అభ్యర్థులగా అండగా నిలిచింది. 2009 ఎన్నికల్లో టీడీపీ, వామపక్షాలతో కలిసి టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. 2004లో కాంగ్రెస్, వామపక్షాలు, టీఆర్ఎస్ కూటమిగా పోటీ చేశాయి.    దుబ్బాక ఉపఎన్నికను బీజేపీ, కాంగ్రెస్ లు సవాల్ గా తీసుకున్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని భావిస్తున్న విపక్షాలు.. దాన్ని క్యాష్ చేసుకుని దుబ్బాకలో జెండా ఎగరేయాలని ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ ప్రచారంలో దూకుడుగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్.. ఈసారి గట్టిగా పోరాడితే విజయం ఖాయమనే ధీమాలో ఉంది. వామపక్షాలను కలుపుకుని అధికారపార్టీకి ఝలక్ ఇవ్వాలని భావించింది. అయితే కాంగ్రెస్ ప్లాన్ ముందే పసిగట్టిన కేసీఆర్.. సీపీఐతో చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. దుబ్బాకలో పార్టీకి సానుకూల పవనాలు లేకపోవడం వల్లే కేసీఆరే స్వయంగా చాడాను తన ఛాంబర్ కు పిలిపించుకుని మాట్లాడారనే ప్రచారం కూడా జరుగుతోంది.    దుబ్బాక ఉపఎన్నికలో మద్దతుపై సీపీఐ తీసుకోబోయే నిర్ణయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్ఆర్ఎస్ స్కీంకు వ్యతిరేకంగా జిల్లాల్లో సీపీఐ ఆందోళనలు చేస్తోంది. గతంలో హుజూర్ నగర్ బైపోల్ లో అధికార పార్టీకి మద్దతిచ్చినప్పుడు ఆరోపణలు ఎదుర్కొంది. దీంతో ఈసారి చాడా టీమ్ ఏం నిర్ణయం తీసుకుంటుందన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవేళ టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు ఇస్తే.. ఉప ఎన్నిక షెడ్యూల్ కు ముందే విపక్షాలకు షాకివ్వడంలో కేసీఆర్ ఓ విజయం సాధించినట్లే..

విజయసాయికి నాలుగు తగిలిస్తే ఆ కుట్ర బయటపడుతుంది

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో రధం దగ్ధం చేసిన ఘటన రాష్ట్రంలో తీవ్ర అలజడి రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన పై వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ "రథం దగ్ధం వ్యవహారంలో చంద్రబాబు హస్తముంది. హైదరాబాద్‌లో ఉంటూ రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ఆయన కుట్ర చేస్తున్నారు. ఈ ఘటనలో గుంటూరు, హైదరాబాద్‌ వ్యక్తుల ప్రమేయాన్ని ఏపీ పోలీసులు గుర్తించారు. అంతర్వేదిలో గలాటా సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగాయని ప్రచారం చేయాలనుకుంటున్నారు. దీనిపై సీబీఐ దర్యాప్తు కోరాం. త్వరలోనే ఈ వ్యవహారంలో చినబాబు, పెదబాబు హస్తం బయటపడుతుంది.'' అని విజయసాయిరెడ్డి అన్నారు.   అయితే తాజాగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్పందించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి డైరెక్షన్‌లో ఏపీలో హిందూత్వంపై వ్యవస్థీకృతమైన దాడి జరుగుతోందని ట్విట్టర్ వేదికగా సెన్సషనల్ కామెంట్స్ చేశారు. "వివేకా గారు చనిపోతే ముందు గుండెపోటు అన్న దొంగ బ్యాచ్ తరువాత బాబాయ్ ని చంద్రబాబు, లోకేష్ చంపేసారు. దీని పై సీబీఐ వెయ్యాలి అని చిల్లర హడావిడి చేసారు. తీరా అధికారంలోకి వచ్చాక బాబాయ్ ని లేపేసింది అబ్బాయ్ జగన్ రెడ్డే అనే విషయం బయటపడకుండా సీబీఐ విచారణ అడ్డుకోవడానికి కుట్ర పన్నారు. అధికారంలో ఉండి దద్దమ్మ ఆరోపణలు చేస్తున్నాడు విజయసాయిరెడ్డి. వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి డైరెక్షన్ లో ఆర్గనైజ్డ్ గా హిందుత్వం పై దాడి జరుగుతోంది. తిరుమల కొండపై అన్యమత ప్రచారం, దేవతా విగ్రహాలు ధ్వంసం, 60 వేలకోట్ల విలువైన మాన్సాస్ భూములు మింగడం, అంతర్వేది లో రథం తగలబెట్టడం అందులో భాగమే. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిన జగన్ రెడ్డి మతాల మధ్య కూడా చిచ్చుపెడుతున్నాడు. రధాన్ని కాల్చింది పిచ్చోడు, తేనెటీగలన్న సాయిరెడ్డి ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ పై విషం కక్కుతున్నాడు. సాయిరెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసి నాలుగు తగిలిస్తే లోటస్ పాండ్ వేదికగా హిందుత్వం పై జరుగుతున్న కుట్ర బయటపడుతుంది." అంటూ సంచలన ట్వీట్లు చేశారు.

కొత్త రెవెన్యూ చట్టం.. విమర్శలు.. డిమాండ్లు

తెలంగాణ ప్రభుత్వం  అసెంబ్లీలో సెప్టెంబర్ 9 వ తేదీన  “తెలంగాణ  భూమి  హక్కులు, పట్టాదార్  పాస్  పుష్టకాల  బిల్లు, 2020”ను ప్రవేశ పెట్టింది.  ఇంత  ముఖ్యమైన  బిల్లును  హడావిడిగా  ఎటువంటి  సంప్రదింపులు  లేకుండా రెండు రోజులు అసెంబ్లీ  లో  చర్చించి  ఆమోదించాలన్న  ప్రభుత్వం  చర్య  అత్యంత  అప్రజాస్వామికమైనది.  ఇది ప్రధానంగా   చిన్న, సన్నకారు రైతుల , మహిళా రైతుల, కౌలు రైతుల, ఆదివాసీల హక్కులను పరిగణించకుండా కేవలం రెవిన్యూ శాఖలో ప్రబలి ఉన్న అవినీతిని కొంతవరకు నియంత్రించడానికి మాత్రమే దృష్టిలో పెట్టుకుని తయారుచేయబడినదిగా అగుపిస్తున్నది. అలాగే ప్రభుత్వ వైఖరి రెవిన్యూ శాఖ ఉద్యోగులు కేవలం భూమికి సంబంధించిన లావాదేవీలను మాత్రమే చూస్తారన్న భ్రమలో ఉండటం కూడా హాస్యాస్పదమే. ఈ బిల్లును ప్రజా అసెంబ్లీ సభ్యులు పరిశీలించి స్పందిస్తూ, ముఖ్యమైన ప్రజాస్వామికమైన వ్యాఖలను చేస్తూ కొన్ని ప్రశ్నలను లేవనెత్తారు. ఇటువంటి అప్రజాస్వామిక మైన బిల్లును ప్రవేశపెట్టే ముందు ఈ కింది విమర్శనాత్మక వ్యాఖ్యలను పరిశీలించి ప్రభుత్వం  పరిగణనలోకి  తీసుకోవాలి.  .  .  రెవిన్యూ బిల్లు పై విశ్లేషణాత్మక విమర్శలు ఈ కొత్త రెవిన్యూ చట్టం ఉద్దేశం భూమి చుట్టూ జరిగే లావాదేవీలను, వ్యాపారాన్ని సులభతరం చేస్తుంది అని ప్రభుత్వమే ప్రకటించింది.  ఈ కొత్త బిల్లు భూ రికార్డులను నవీకరించటం గానీ లేదా వాటికి   ఖచ్చితత్వాన్ని కల్పించటానికి కాక  అది  ఎన్కుంబరెన్సీలను (లను) తొలగించి మార్కెట్ లో భూమి వ్యాపారానికి మార్గం సుగమంచేయటానికే రూపొందించబడింది. బడా పారిశ్రామికవేత్తల భూసేకరణ కోసం ఈ బిల్లు మార్గాన్ని సుగమం  చేస్తుంది.   తెలంగాణ ప్రభుత్వం అవినీతి నిరోధం అంటూ ప్రజల శ్రేయస్సును పక్కన పెట్టి పారిశ్రామిక రంగానికి అనువుగా రచించిన బిల్లు ఇది. ఈ బిల్లు చిన్న సన్నకారు పేద రైతులకు ఏ విధంగానూ సహాయపడదు, ప్రస్తుతం వారు కొత్తగా  భూములను కొనుగోలు చేసే పరిస్థితిలో లేరు. వారి ఆన్లైన్ రికార్డులను సరిచూసుకోలేరు కాబట్టి భూ రికార్డుల కంప్యూటరీకరణ విధానంలో వారికి పెద్ద  నష్టం ఏర్పడుతుంది. ఎందుకంటే  భూ రికార్డులను సరిచూసుకోవటం, నవీకరించటం వంటి అంశాల పని భూ యజమానులపైనే ఉంటుంది. చదువుకొని స్మార్ట్ ఫోన్ లు, కంప్యూటర్ లు, ఇంటర్నెట్ సౌకర్యం ఉండి, వాటి పైన సాంకేతిక నైపుణ్యం కలిగి ఉన్నవారు మాత్రమే వాటిని చేయగలుగుతారు. ధరణి వెబ్ సైట్ నిర్వహణ సామాన్యులకు అందుబాటులో ఉండదు సరికదా అర్థం కూడా కాదు. నిరక్షరాస్యులైన పేద రైతులకు ఈ అవకాశం ఉండదు. చాలా కాలంగా ఆస్తి, యాజమాన్యం కేంద్రంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో భాగంగానే ఇది ముందుకొచ్చింది, వ్యవసాయ భూ యజమానులను రక్షించటమే దీని లక్ష్యం. నిరక్షరాస్యులైన బడుగు పేద వర్గాలనుద్దేశించి కాదు. ఇది అప్రజాస్వామికం. దీనిలో ప్రకటించని ఉద్దేశం ఏమిటంటే, గతంలో తెచ్చిన సవరణకు అనుగుణంగా  సాగుదారులను తొలగించటమే.  అటవీ భూములకు సంబంధించి ఆర్ ఓఎఫ్ ఆర్ రికార్డులను రెవెన్యూ రికార్డులతో అనుసంధానం చేయకపోవటమే పెద్ద సమస్య.  అటవీ భూములను  సాగు చేస్తున్న వారందరికీ, ఆర్ ఓఎఫ్ ఆర్ పట్టాలు వున్న వారందరికీ కూడా  ఈ కొత్త చట్టం ప్రకారం పట్టాదార్ పాస్ పుస్తకాలు  టైటిల్ డీడ్ లు ఇవ్వటానికి ఈ  విధమైన  అనుసంధానం  తప్పనిసరిగా చేయాలి. అటవీ భూములను ప్రభుత్వం అభివృద్ధి పేరుతో పరిశ్రమలకు ఇచ్చే ప్రమాదం ఉంది. ఇది అటవీ హక్కుల ఉల్లంఘన. దీనికే ఈ బిల్లు ద్వారా పునాది వేస్తున్నట్టు ఉంది. గ్రామ రెవెన్యూ  అధికారులు (VRO)లు, గ్రామ రెవెన్యూ అసిస్టెంట్లు (VRA)ల వ్యవస్థ  తొలగించటం తో  MROల చేతిలో  భూ  రికార్డులు నిర్వహించటం, రిజిస్ట్రేషన్  చేయటం  ఈ  రెండిటికీ  సంబంధించి అధిక  అధికారాలు  కేంద్రీకరించబడతాయి.   ఇది  మరింత  అవినీతి పెరగటానికి  దారి తీస్తుంది.     ఈ  కొత్త  చట్టం ప్రతిపాదిస్తున్నటువంటి   సవరణలు భూవ్యవస్థను ప్రజలకు  మరింత  అందుబాటులోకి  తెచ్చి  జవాబుదారీ తనాన్ని  పెంచి అవినీతిని  తొలగిస్తుంది  అనే దాఖలాలు  ఎక్కడా  లేవు.   చివరగా సాగుదారులు, కౌలుదారులను  తొలగించటం  ద్వారా  భూయజమానులు  భూమిని  సరుకుగా  మార్కెట్  చేయటానికి  మార్గం  సుగమం చేస్తుంది.  సాదా భైనామా సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదాలు పరిష్కారం కాలేదు. వక్ఫ్, దేవాదాయ, భూదాన్ భూముల వివాదాలు అలాగే ఉన్నాయి. ఆ సమస్యల గురించి ఈ బిల్లులో ప్రస్తావనే లేదు. ఇప్పుడున్న భూవివాదాలను పరిష్కరించడానికి తాత్కాలికంగా జిల్లా స్థాయి ట్రిబ్యునల్స్ ఏర్పరిచినా, అవి పరిష్కారం అయ్యాక భూ వివాదాలు పరిష్కారానికి సివిల్ కోర్టులకు వెళ్లాల్సి ఉంటుంది. అది సన్న, చిన్న కారు రైతులకు మరింత కష్టం.  ఈ చట్టాన్ని కింది స్థాయి ఉద్యోగులను అవినీతి ఆరోపణల నెపంతో తొలగించడానికి చేసినట్టు ఉంది. VRO లకు ఇతర డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు ఎప్పటికి ఇస్తారన్నది స్పష్టంగా లేదు. వీరి ఇతర విధుల నిర్వహణ ఎవరు చేస్తారనేది కూడా స్పష్టంగా లేదు. గ్రామ స్థాయి రెవెన్యూ అధికారులు కేవలం  భూమికి  సంబంధించిన లావాదేవీలతో పాటు అనేక సంక్షేమ పధకాల అమలు లో కూడా కీలకమైన పాత్రవహిస్తారన్న విషయం మరచినట్టు ఉన్నది ప్రభుత్వ వైఖరి. ఈ బిల్లులో మూడు స్థాయిల న్యాయ వ్యవస్థను రద్దు చేశారు. తక్షణ ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిష్కరించుకునే సమస్యలను ఇప్పుడు జిల్లా స్థాయికి తీసికుని వెళ్ళవలసిన అగత్యం ఎదురవుతుంది.   రెవెన్యూ అధికారుల న్యాయ అధికారాలు తొలగించిన తరువాత, పోలీసుల ప్రమేయం ఆజమాయిషీ పెరిగే  ప్రమాదం ఉంది. సంరక్షించే బదులు నియంత్రించే పరిస్థితి చోటుచేసుకోవచ్చు. గ్రామ స్థాయిలో కనీస వేతనం, భూఆక్రమణ, ప్రకృతి వైపరీత్యాలు, data collection వంటి బాధ్యతలు  VRO లేకుండా జరగవు. దాదాపు 5400 మంది VROలు ఇప్పుడు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు  రెవెన్యూ అధికారుల జోక్యం చాలా అవసరం.. ఇప్పుడు ఆ యంత్రాంగం నిర్వీర్యం అయితే పిల్లల భవిష్యత్తు అధోగతి పాలయ్యే అవకాశం ఎక్కువగా  ఉంది. వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం ప్రకారం Release Certificate పొందిన కార్మికులకు భూమి పంపిణీ కలెక్టర్ ఆదేశానుసారంగా, MRO చేస్తారు. ఇప్పుడు అలాంటి సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారో తెలియదు.  సాగుదారులను గుర్తించటం అనేది పూర్తిగా తొలగించాక, భూమి హక్కులు లేకుండా వ్యవసాయం చేస్తున్న  కౌలు రైతులు,  మహిళా రైతులు తీవ్రంగా నష్టపోతారు. వాస్తవ సాగు దారుల, భూమిలేని పేదల జీవనోపాధికి ఉపయోగ పడాల్సిన భూమి, డబ్బున్న వాళ్లకు మార్కెట్ సరుకుగా అందుబాటులోకి తేవడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశ్యం. భూమి యాజమాన్యం కలిగి వున్నవారే రైతులుగా గుర్తించబడుతున్న దుర్మార్గపు వ్యవస్థ మరింత గట్టిపడుతుంది. ప్రస్తుతమున్న రైతుబంధు కూడా ఇటువంటి  పరిస్థితుల్లో అమలుచేస్తున్నారు. ధరణి వెబ్ సైట్ లో అవకతవకలను సరిచేయకుండా రెవిన్యూ డిపార్ట్మెంట్ ను నిర్వీర్యం చేయడం సమంజసం కాదు. ఇప్పుడు దరణిలో ఉన్న తప్పుడు తడకల సమాచారాన్ని బాగుచేయకుండా దాని ఆధారంగా రెవెన్యూ రికార్డులకు శాశ్వతత్వం కల్పిస్తామని చెప్పడం మరిన్ని వివాదాలు పెరగడానికి కారణ మవుతుంది. అసైన్డు భూములను సాగు చేస్తున్నవారిలో చాలా  తక్కువ శాతం మందికి  మాత్రమే 1971 చట్టం ప్రకారం కొత్త పాస్ పుస్తకాలు అందాయి. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే వారు కొత్త పాస్ పుస్తకాలు టైటిల్ డీడ్స్ అందుకోవటానికి ఈ కొత్త చట్టంలో ఎటువంటి ప్రస్తావనా లేదు. క్రింది స్థాయిలో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఒక పారదర్శక యంత్రాంగం లేకపోతే పేద రైతులకు చాలా ఇబ్బంది.అవినీతి పేరుతో వీళ్ళను రద్దు చేసినంత మాత్రాన, అన్ని చోట్లా ఉండే అవినీతి తగ్గిపోతుందని భావించడం తప్పు. పైగా డబ్బున్నవాళ్ళ పక్షాన మరింత పెరిగే ప్రమాదం వుంది. అవినీతితో జరిగే పనులలో పై వారికి ఇక అడ్డుండదు. అన్నింటినీ మించి కొద్ది భూమి గల పేద రైతులు కూలీలు గా పనులు వెతుక్కుంటూ పోవలసి వస్తుంది. భూమి స్వీయ గౌరవ సాధనం కదా పేద తెలంగాణ గౌరవం సమస్య అవుతుంది. ఈ చట్టం అనేక విపరినామాలకు దారి సుగమం చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే గత చట్టంతో ఏమెరకునా జరిగిన భూ వికేంద్రీకరణ ఇక కేంద్రీకరణ వైపు అడుగులు వేస్తుంది. కలవారికి ఇది ఉపయోగం ఈ బిల్లు కౌలు రైతులకు ఎలా ఉపయోగపడుతుందో  వివరించలేదు. అసలే గుర్తింపు లేని కౌలు రైతుల సమస్యలు ఇంకా క్లిష్టరమయ్యే ప్రమాదం ఉంది. నోటీసుల  విధానం  అనేది తప్పులు  జరగకుండా అడ్డుకోవటానికి. రెవెన్యూ  యంత్రంగం  తప్పులు  చేస్తే అప్పీల్  చేసుకునే  అవకాశం ప్రజలకు  ఉండాలి. చట్టాల్లో  అప్పీల్  వ్యవస్థ  లేకపోవటం ప్రాధమిక  హక్కులను హరించినట్లే అవుతుంది.  డిమాండ్లు :  అత్యంత  ముఖ్యమైన, విస్తృతమైన  ప్రభావాన్ని  కలిగించే ఈ కొత్త రెవెన్యూ  చట్టం పై   చర్చలు  జరపకుండా  అసెంబ్లీ లో  ప్రవేశపెట్టి  రెండు  మూడు  రోజులలో  ఆమోదించటం  అప్రజాస్వామిక  చర్య.. ఈ  బిల్లు  ఆమోదాన్ని  వాయిదా  వేసి  ప్రజలలోకి  తీసుకెళ్లి   అన్ని సెక్షన్ల  రైతులు, రైతు  సంఘాలు, ప్రజా  సంఘాలతో విస్తృతంగా  సంప్రదింపులు  జరిపి వాటినుండి వచ్చిన  అభిప్రాయాలను  పరిగణన లోకి  తీసుకోవాలి.  ఈ  బిల్లును  రెవెన్యూ  మరియు  న్యాయ  నిపుణులతో  కూడిన  ఒక   నిపుణల  కమిటీకి  పంపాలి,  దీనిపై    ప్రజా సంప్రదింపుల  ప్రక్రియ  చేపట్టాలి.  సమగ్ర భూ సర్వే  జరిపి  మాగాణి,మెట్ట భూముల విస్తీర్ణాన్ని తేల్చాలి. దాని ఆధారంగా మిగులు భూములను తేల్చాలి.అసలైన  భూ యజమానులు గుర్తించి రికార్డు చేయాలి. ఈ సర్వే  ద్వారా  వెలువడే గణాంకాల ప్రకారం భూ గరిష్ట పరిమితి కంటే అదనంగా  వున్న భూమిని 1973 భూ సంస్కరణల చట్టం ప్రకారం భూమి లేనివారికి పంపిణీ చేయాలి.  ఆర్ ఓఎఫ్ ఆర్ రికార్డులను రెవెన్యూ రికార్డులతో అనుసంధానం చేసి   అటవీ  భూములకు  హక్కు  పత్రాలు వున్న  వారందరికీ కొత్త  పట్టాదారు  పాసు పుస్తాకాలు  ఇవ్వాలి, వారందరికీ  ప్రభుత్వ  వ్యవసాయ  పధకాలను  అందుబాటులోకి  తేవాలి.  తెలంగాణ  రాష్ట్రంలో  వాస్తవ  సాగుదారులను  గుర్తించాలి - కౌలు రైతులు, మహిళా  రైతులు, పోడు వ్యవసాయం  చేసే  రైతులను  గ్రామ స్థాయిలో  రిజిస్టర్  చేసి భూ  యాజమాన్యంతో  సంబంధం  లేకుండా   గుర్తింపు  కార్డులు  ఇవ్వాలి.    ధరణి  వెబ్ సైట్ ద్వారా  రిజిస్ట్రేషన్,  ఆ వెంటనే మ్యుటేషన్ జరగటం వివాదాల్లేని రైతులకు మేలు  చేయవచ్చు  కానీ పేద  రైతులు, భూ  వివాదాలతో ఇబ్బందులు పడుతున్న రైతులను మరింత  ఇబ్బంది  పెట్టినట్లే  అవుతుంది. భూ  వివాదాల  పరిష్కారానికి  శాశ్వత  ట్రిబ్యునల్ ను  గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఏర్పాటు  చెయ్యాలి  భూ  సమస్యల  విషయంలో అప్పీలు  వ్యవస్థను రద్దు చేయటం సరైనదికాదు. ఉన్న రెవెన్యూ అధికారుల జవాబుదారీతనం  పెంచి  పారదర్శకంగా  తయారు చేయా

మంత్రి కొడాలి నాని వ్యాఖ్యల పై తాడేపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు 

ఏపీ పౌర సరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని కొద్దీ రోజుల క్రితం వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, గన్నవరం ఎమ్మెల్యే వంశీ తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయమై దేవినేని ఉమ తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఒక బాధ్యత గల మంత్రి అయి ఉండి తనను లారితో యాక్సిడెంట్ చేసి చంపేస్తా అని బెదిరించారని అయన పేర్కొన్నారు. మంత్రి పదవిలో ఉన్న నాని తమను తమ పార్టీ అధినేత చంద్రబాబును ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారని అయన పేర్కొన్నారు. ఇదే కేసులో కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ, వసంత కృష్ణప్రసాద్ లపై కూడా అయన ఫిర్యాదు చేశారు.   సీఎం జగన్ మెప్పు పొందటానికే మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని దేవినేని ఉమ ఆరోపించారు. అమరావతి రైతులు, దళితులను, న్యాయ విభాగంలో ఉన్నవారిని వైసిపి నాయకులు తిడితే కేసులు ఉండవని ఉమా అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే వైకాపా నాయకులకు వత్తాసు పలుకుతున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. గుడివాడలో టీడీపీ నాయకులపై 20 మంది గుండాలు ఇంటిమీద దాడి చేస్తే ఇప్పటివరకు చర్యలు లేవని విమర్శించారు. దీనిపై డీజీపీ సుమోటోగా తీసుకుని కేసులు నమోదు చేయాలని అయన డిమాండ్ చేశారు. తాను గతంలోనూ ఎన్నో ప్రభుత్వాలను విమర్శించానని.. అయితే అప్పుడు ఎవరూ తనను బెదిరించలేదని అన్నారు. జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం రోజూ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని.. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలా జరగలేదని అయన వాపోయారు. ఇదంతా పూర్తిగా సీఎం జగన్ ప్రోత్సాహంతోనే జరుగుతోందని దేవినేని ఉమ ఆరోపించారు.   టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని చెప్పారు. ప్రశ్నించే వారిపై భౌతికదాడులకు పాల్పడుతున్నారని అన్నారు. రానున్న రోజుల్లో జగన్ అరాచకపాలనపై ప్రజలు తిరగబడతారని అయన అన్నారు.

జగన్ తో హాయ్.. కేసీఆర్ తో కటీఫ్.. బీజేపీ నయా స్టాండ్!

టీఆర్ఎస్, బీజేపీ మధ్య గ్యాప్ పెరిగిందా?.. టీఆర్ఎస్ కలిసిరాకున్నా కేంద్రంలో నష్టం లేదని కమలం భావిస్తుందా?.. గులాబీ బాస్ బీజేపీని టార్గెట్ చేస్తోంది అందుకేనా? అంటే అవుననే సమాధానమే  వస్తోంది. గతంలో కేంద్ర బిల్లుల ఆమోదానికి, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతు తీసుకుంది ఎన్డీఏ సర్కార్. కాని ప్రస్తుతం మాత్రం సీన్ మారింది. టీఆర్ఎస్ మద్దతు అవసరం లేదనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే త్వరలో జరగనున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతు కోరడం లేదు  ఈ నెల 14 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక జరగబోతోంది. ప్రస్తుతం డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్న జేడీయూ ఎంపీ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్ రాజ్యసభ పదవీకాలం ముగిసిపోవడంతో ఆయన్నే మరోసారి  అభ్యర్ధిగా నిలబెట్టింది ఎన్డీయే. ఎగువసభలో తమకు పూర్తి మెజారిటీ లేకపోవడంతో ఆయనకు మిగతా పార్టీల  మద్దతు కూడగడుతోంది బీజేపీ కూటమి. రాజ్యసభలో ఆరుగురు సభ్యుల బలం ఉన్న వైసీపీ మద్దతు కోరింది. హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌కు మద్దతివ్వాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ ఫోన్‌ చేశారు. గతంలో హరివంశ్‌ను డిప్యూటీ ఛైర్మన్‌ చేసేందుకు వైసీపీమద్దతిచ్చింది. దీంతో మరోసారి తమ మద్దతు కొనసాగించాలని నితీశ్‌ కోరగా.. జగన్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది.  రాజ్యసభలో టీఆర్ఎస్ కు ఏడుగురు సభ్యులున్నారు. అంటే వైసీపీ కంటే ఒకరు ఎక్కువే. కాని ఇంతవరకు ఎన్డీయే కేసీఆర్ ను మద్దతు కోరలేదు. బీహార్ సీఎం నితీశ్ తో కేసీఆర్ కు వ్యక్తిగతంగానూ మంచి సంబంధాలున్నాయి. అయినా నితీశ్ కుడా టీఆర్ఎస్ మద్దతు కోసం ప్రయత్నించడం లేదు. బీజేపీ సూచనల ప్రకారమే జగన్ తో మాట్లాడిన నితీశ్.. కేసీఆర్ తో కాంటాక్ట్ కాలేదని తెలుస్తోంది. గత ఎన్నికల్లో హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ కు కారు పార్టీ ఎంపీలు మద్దతిచ్చారు.  గత ఆరేండ్లుగా కేంద్రంలో మోడీ సర్కార్ తో మంచి సంబంధాలు కొనసాగించింది టీఆర్ఎస్. పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన కీలక బిల్లులకు మద్దతు ఇచ్చింది. అయితే కొన్ని రోజులుగా రెండు పార్టీల మధ్య తేడాలు వచ్చినట్లు సమాచారం.  గతంలో ప్రధాని మోడీని ప్రశంసించిన సీఎం కేసీఆర్.. ఇటీవల మాత్రం కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రాల హక్కులు హరిస్తున్నారని, న్యాయంగా రావాల్సిన నిధులు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. జీఎస్టీ బకాయిల విషయంలో కేంద్రంతో సమరానికి సిద్ధమంటున్నారు గులాబీ బాస్. బీజేపీతో తనతో సరిగా వ్యవహరించడం లేదనే కారణంగానే కేసీఆర్ కేంద్రాన్ని టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనూ రాష్ట్ర సమస్యలపై కేంద్రాన్ని నిలదీయాలని పార్టీ ఎంపీలను కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు ప్రయత్నాలను గమనిస్తున్న బీజేపీ.. ఆయన్ను దూరం పెట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో టీఆర్ఎస్ సపోర్ట్ అవసరం లేదనే భావనలో బీజేపీ.. కేంద్రంతో పోరాడాలనే యోచనలో కారు పార్టీ ఉన్నట్లు కనిపిస్తోంది.  మరోవైపు రాజ్యసభ ఎన్నికల్లో విపక్షాల తరఫున మనోజ్‌ ఝాను నిలబెట్టాలని కాంగ్రెస్‌తో పాటు దాని మిత్రపక్ష పార్టీలు భావిస్తున్నాయి. ఆయనకు కాంగ్రెస్‌, ఆర్జేడీతో పాటు తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే, వామపక్షాలు మద్దతివ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీకి 87, కాంగ్రెస్ కు 40 మంది సభ్యులున్నారు. బలాబలాల ప్రకారం మరోసారి ఎవ్డీయే అభ్యర్ధికే విజయావకాశాలు కనిపిస్తున్నాయి.  

దారుణం... పన్నెండేళ్ల బాలికను ఎత్తుకెళ్లి రేప్ చేశారు

ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని మహారాజ్ గంజ్ జిల్లాలో 12 ఏళ్ల బాలికను అపహరించి తీసుకువెళ్లిన ఇద్దరు మృగాళ్లు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు‌.  ఒకవైపు రామ జన్మభూమి అయోధ్యలో మందిర నిర్మాణం జరుగుతుండగా మరోవైపు ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం పట్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో కొందరు విమర్శలు చేస్తున్నారు. రామ రాజ్యం అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. దేశంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో అత్యాచార ఘటనలు వార్తల్లో నిలుస్తూ ఉన్నాయి. ఇటీవల కరోనా సోకిన మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన మరువకముందే 12 ఏళ్ల బాలిక కామందుల కాటుకు గురికావడం శోచనీయం

జగన్ నాయకుడో? దద్దమ్మో వైసీపీ శ్రేణులు తేల్చుకోవాలి

వైసీపీ నేత, ఏపీ మంత్రి కొడాలి నాని ప్రతిపక్ష టీడీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల 'పెద్ద బిచ్చగాడు, అడ్డ గాడిద, ఉమక్క, నాలంటోడైతే లారీతో తొక్కిస్తాడు' అంటూ మాజీ సీఎం చంద్రబాబు మరియు మాజీ మంత్రులపై నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాని వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా TNSF మాజీ అధ్యక్షుడు బ్రహ్మం తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ.. మంత్రి ఉపయోగించిన భాషతోనే సమాధానం చెప్పారు. దీంతో బ్రహ్మంపై అక్రమకేసులు పెట్టి వేదిస్తున్నారు అంటూ టీడీపీ నేత నారా లోకేష్ అధికార పార్టీపై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. జగన్ నాయకుడో? దద్దమ్మో వైసీపీ శ్రేణులు తేల్చుకోవాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.   రాష్ట్ర ప్రజలకు సేవ చెయ్యాల్సిన ఒక మంత్రితో ప్రతిపక్ష నాయకుడ్ని బూతులు తిట్టించి ఆనంద పడిన రోజు జగన్ రెడ్డి గారికి చట్టాలు, మర్యాద, సాంప్రదాయాలు గుర్తురాలేదా? అని లోకేష్ ప్రశ్నించారు. రాజారెడ్డి రాజ్యాంగంలో బూతులు తిట్టిన వైకాపా నాయకుల పై చర్యలు ఉండవు అని రాసుకున్నారా? అని నిలదీశారు.   మేము కూడా తిట్టగలం కానీ మా పార్టీ సంస్కృతి అది కాదు అని చెప్పినందుకు బ్రహ్మంపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తారా? అని మండిపడ్డారు. బ్రహ్మంకి పార్టీ అండగా ఉంటుందని అన్నారు. మా కార్యకర్త విమర్శకి సమాధానం చెప్పే దమ్ములేక కేసులు పెట్టే జగన్ నాయకుడో? దద్దమ్మో వైకాపా శ్రేణులు తేల్చుకోవాలి అని లోకేష్ వ్యాఖ్యానించారు.

చిరంజీవిని సీఎం చేయడమే సోము వీర్రాజు లక్ష్యం 

అంతర్వేది రథం దగ్ధం ఘటనపై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన  వ్యాఖ్యలు చేశారు. అంతర్వేది ఆలయం రాజోలు నియోజకవర్గంలో ఉందని..  రాజోలులో జనసేన రెబల్ రాపాక వరప్రసాదరావు ఎమ్మెల్యేగా ఉండటం వల్లే జనసేన, బీజేపీలు అంతర్వేది ఘటనని రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ ద్వారా రాజోలు నియోజవర్గంలో కాపు కులాన్ని రెచ్చగొడుతున్నారని అన్నారు.    బీజేపీ మతాభిమానంతో, జనసేన కులాభిమానంతో కుళ్లిపోయాయని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకి కులాభిమానం ఎక్కువని, చిరంజీవిని ముఖ్యమంత్రిని చేయాలనేది ఆయన లక్ష్యమని అన్నారు. చిరంజీవి కుటుంబానికి సోము వీర్రాజు హనుమంతుడిలా మారిపోయారని ఎద్దేవా చేశారు. కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎంపికైన తరువాత సోము వీర్రాజు.. చిరంజీవిని ఇంటికి వెళ్లి కలిసిన సంగతి తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకునే హర్షకుమార్ ఈ వ్యాఖ్యలు చేసుంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.   సీఎం వైఎస్ జగన్ పై కూడా హర్షకుమార్ విమర్శలు గుప్పించారు. ఒక్కో కులానికి, ఒక్కో మతానికి ఒక్కోలా జగన్ నిర్ణయాలు తీసుకుంటారని విమర్శించారు. అంతర్వేది రథం ఘటనను సీబీఐకి అప్పగించాలని నిర్ణయించిన జగన్.. దళిత యువకుడికి శిరోముండనం కేసును సీబీఐ చేత ఎందుకు విచారణ చేయించడం లేదని ప్రశ్నించారు. దళితులపై సీఎం జగన్‌ కు చిత్తశుద్ధి ఉంటే.. శిరోముండనం ఘటనపై కూడా సీబీఐ విచారణ జరిపించాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు.

మతిస్థిమితం లేనివారు దోషులంట.. మీకు మతి ఉండే మాట్లాడుతున్నారా.. ఎంపీ రఘురామరాజు ఫైర్

ఏపీలో కొద్ది రోజులుగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా వైసిపి ఎంపీ రఘురామకృష్ణం రాజు గాంధేయ పద్ధతిలో ఈ రోజు ఉదయం 9 గంటలకు తన ఢిల్లీ నివాసంలో ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మ‌తి స్థిమితం లేని వారు కేవ‌లం హిందూ దేవాల‌యాల‌ను, ర‌థాల‌ను మాత్ర‌మే ల‌క్ష్యంగా చేసుకుంటున్నారా అంటూ అయన జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏపీలో హిందూ దేవాల‌యాల‌పై జ‌రుగుతోన్న దాడులపై జగన్ స‌ర్కారు చెబుతున్న స‌మాధానం స‌రికాద‌ని ఆయన మండిప‌డ్డారు. అంతేకాకుండా రాష్ట్ర దేవాదాయ మంత్రి వెల్లంపల్లి మ‌తిలేకుండా మాట్లాడుతున్నార‌ని రఘురామరాజు విమ‌ర్శించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న చేస్తూ ప్రస్తుత క‌రోనా విప‌త్తు స‌మ‌యంలోనూ దీనికి సంబంధించి ప్ర‌జ‌లు త‌మ నిర‌స‌న‌ తెలియ‌జేసేందుకు రోడ్ల మీద‌కు వ‌స్తున్నార‌ని ఆయ‌న చెప్పారు.   ఈ సందర్బంగా అయన విడుదల చేసిన ప్రకటన సారాంశం: గడచిన సంవత్సరకాలంలో ఏపీలో వరుసగా మొత్తం 15 దేవాలయాలపై దాడులు జరిగాయి. పిఠాపురం, కొండబిట్రగుంట తాజాగా అంతర్వేదిలలో జరిగిన ఘటనలను పరిశీలిస్తే ఇవి యాధృచ్ఛికంగా జరిగినవి కావని స్పష్టం అవుతుంది. ఇటువంటి సంఘటనలను మతిస్థిమితం లేనివారి పని, తేనె పట్టు కోసం చేసిన పని అంటూ ఒక రకంగా వీటిని సమర్ధించే ప్రయత్నం చేయడం నవ్వులాటగా కనిపిస్తున్నది. తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం సమయంలోనే ప్రభుత్వం సరిగా స్పందించి ఉంటె మళ్ళీ ఇటువంటి సంఘటన జరిగి ఉండేదా అని ఒక సారి ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరం ఉంది. వరుస సంఘటనల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండడంతో పెద్దలు మద్దతుతోనే అవి జరుగుతున్నట్లు భక్తులు భావించే పరిస్థితి కూడా ఏర్పడుతున్నది. హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారం జరుగుతూ ఉండడం, హిందూ దేవాలయాల భూములపై పలుకుబడి గలిగిన వారు కన్నేసి కైవసం చేసుకొనే ప్రయత్నం చేస్తుండడం గమనిస్తే ఈ దాడులు ఒక పధకం ప్రకారం జరుగుతున్నట్లు వెల్లడి అవుతుంది. ప్రస్తుతం ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు నేడు దేశం మొత్తం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి, తగు నష్ట నివారణ చర్యలు తీసుకోని పక్షంలో పరిస్థితులు అనూహ్యమైన మలుపు తీసుకొనే అవకాశం ఉంటుందని గ్రహించాలి.   సాక్షాత్తూ దత్తాత్రేయ స్వరూపుడయిన శ్రీపాద శ్రీ వల్లభుడు పుట్టిన పిఠాపురంలో.. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పీఠంలో ఈ సంఘటనల పరంపర ప్రారంభమైనది. అలాంటి చోట దుర్గాదేవి విగ్రహాలను, గణపతి విగ్రహాలను, సాయిబాబా విగ్రహాలను ధ్వంసం చేశారు. అది ఎవరు చేశారు అంటే అపుడు ఒక మతిస్థిమితం లేని వ్యక్తి చేశాడు అన్నారు. నెల్లూరు జిల్లాలోని కొండ బిట్రగుంటలో స్వామి వారి రథాన్ని తగులబెట్టేస్తే దాన్ని కూడా మతిస్థిమితం లేని వాడు తగులపెట్టేశాడన్నారు. ఇలా వరుసగా సంఘటనలు జరుగుతున్నా సమాధానం మాత్రం ఒకే రకంగా ఉండడంతో, అవ్వన్నీ ఒక పధకం ప్రకారం జరుగుతున్నట్లు భావించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. విజయవాడలోని శ్రీ కాశీవిశ్వేశ్వరాలయం భూములకు సంబంధించి, అలాగే సింహాచలం మాన్సాస్ ట్రస్ట్ కి సంబంధించి వివాధాలు ఏర్పడ్డాయి. ఇప్పటికైనా సీఎం జగన్ మోహన్ రెడ్డిగారు వరుసగా జరుగుతున్న దాడులను తీవ్రమైన అంశంగా పరిగణించి, తక్షణం తగు చర్యలు తీసుకోవడం ద్వారా హిందువుల మనోహభావాలకు భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి. టిటిడి భూములను అమ్మివేసే ప్రయత్నం జరిగినప్పుడు ప్రజలనుండి పెద్ద ఎత్తున ఎదురైన ఆగ్రవేశాలను పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి సకాలంలో స్పందించి, ఆ మొత్తం పక్రియను రద్దు చేయడంతో ఒక పెద్ద ఉపద్రవాన్ని నివారింప గలిగారు. ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నం చేయవలసి ఉంది. లేని పక్షంలో పరిస్థితులు అదుపు తప్పవచ్చనే ఆందోళన కలుగుతున్నది.   అంతర్వేది వద్ద భారీ సంఖ్యలో హిందూ సంస్థలకు చెందిన వారు ఆగ్రవేశాలతో దేవాలయాన్ని చుట్టుముట్టినపుడు మంత్రులు లోపల గంటలపాటు నిలబడవలసి రావడం గమనిస్తే ప్రజాగ్రహాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోని పక్షంలో వచ్చే తీవ్ర పరిణామాలకు సంకేతం ఇచ్చిన్నట్లయింది. కేవలం హిందూ మతం విషయంలో మాత్రమే ప్రభుత్వం స్పందించడం లేదని అభిప్రాయం ప్రజలలో బలంగా నెలకొనడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. ఏ మతంపై చెందినవైనా ప్రార్ధనా మందిరాల పట్ల ప్రజల మనోభావాలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంకు ఉంటుంది. ప్రభుత్వం కేవలం ఒక ప్రత్యేక మతం చెందిన వారిని ఆదరిస్తూ మిగిలిన వారి పట్ల నిర్లక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నదని అభిప్రాయం కలగడం ఏ లౌకిక ప్రభుత్వంకు కూడా మంచిది కాదు. రాజకీయంగా తీవ్ర మూల్యాన్ని చెల్లించే పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందని దేశంలో నేడు పలు చోట్ల జరుగుతున్న పరిణామాలను చూసైనా గ్రహించాలి. చెప్పుకోదగిన ఆస్తులు, ఆదాయాలున్న దేవాలయాలను ఎంపిక చేసి, వాటి లక్ష్యంగా దాడులు జరుపుతూ, వాటిని కైవసం చేసుకొనే ప్రయత్నం రాజకీయ నాయకత్వం మద్దతుతోనే జరుగుతున్నట్లు ఈ సందర్భంగా ప్రజలలో అనుమానాలు చెలరేగడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. వరుసగా జరుగుతున్న సంఘటనలను యాదృచ్చికంగా జరిగినవిగా కాకుండా, వాటి మధ్య గల సంబంధాన్ని గుర్తించి, వాటి వెనుక ఉన్న శక్తులను కనిపెట్టేందుకు ప్రభుత్వం నిష్పాక్షికంగా అన్ని సంఘటనలను కలిపి దర్యాప్తు జరిపించాలి.

ఏపీ తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్ కరోనాతో మృతి

టీడీపీ సీనియర్ నేత, కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ చ‌ల‌మ‌ల‌శెట్టి రామాంజ‌నేయులు తుదిశ్వాస విడిచారు. కరోనా లక్షణాలతో ఇటీవల ఆయ‌న విజయవాడ జీజీహెచ్ లో చేరారు. ఆరోగ్యం విషమించడంతో నాలుగు రోజులుగా వెంటిలేటర్ మీద ఉంచి ఆయ‌న‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఉద‌యం ఆరోగ్యం మరింత విషమించడంతో రామాంజనేయులు కన్నుమూశారు.     రామాంజనేయులు స్వస్థలం  ప‌శ్చిమగోదావ‌రి జిల్లా కలిదిండి మండలం అవ్వకూరు. 2014లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత తొలిసారి కాపు కార్పొరేష‌న్ ను ఏర్పాటు చేసింది. దీనికి తొలి ఛైర్మ‌న్ గా రామాంజనేయులు వ్య‌వ‌హ‌రించారు. రామాంజనేయులు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ కాపు కార్పొరేషన్ తొలి చైర్మన్ గా కార్పొరేషన్ కు ఉత్తమ సేవలందించిన చలమలశెట్టి మరణం విచారకరం అన్నారు చంద్రబాబు. పార్టీకి, కాపుల పురోగతికి, సంక్షేమానికి వారు చేసిన సేవలు చిరస్మరణీయం అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

ఏపీలో కోటి మందికి తెలియకుండానే కరోనా వచ్చి పోయింది.. తేల్చిన లేటెస్ట్ సర్వే

ఏపీ ప్రస్తుత జనాభా 5 కోట్లకు పైగా ఉంది. ఐతే అధికారికంగా ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు లక్షలు దాటింది. అయితే రాష్ట్రంలోని మొత్తం జనాభాలో 19.7 శాతం మందికి, అంటే ఏకంగా కోటి మందికి కరోనా వైరస్‌ సోకి తగ్గిపోయిందని సీరో తాజా సర్వేలో తేలింది. మన రక్తంలోని సీరంలో ఉన్న యాంటీ బాడీస్‌ ఆధారంగా కరోనా వైరస్‌ సోకిందా లేదా అనే విషయాన్ని గుర్తించే అవకాశం ఉంది. రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి తీవ్రతను గుర్తించేందుకు ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా సీరో సర్వే నిర్వహించింది. ముందుగా తొలిదశలో అనంతపురం, తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో నిర్వహించగా... 15.7 శాతం మందికి వైరస్‌ సోకి, తగ్గిపోయినట్లుగా తేలింది. తాజాగా రెండో దశలో మిగిలిన తొమ్మిది జిల్లాల్లోనూ సర్వే చేశారు. ఆ సర్వే ఫలితాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ మీడియాకు తెలిపారు.   తాజాగా జరిపిన సిరో సర్వేలో భాగంగా ఒక్కొక్క జిల్లా నుంచి 5 వేల మంది చొప్పున మొత్తం 45వేల మంది నుండి శాంపిల్స్‌ సేకరించారు. వారిలో 19.7 శాతం మందికి తెలియకుండానే కరోనా వైరస్‌ సోకి దానంతట అదే తగ్గిపోయినట్టుగా తేలింది. అంతేకాకుండా వైరస్‌ సోకిన వారిలో పైకి ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. ఇక జిల్లాల వారీగా చూస్తే విజయనగరం జిల్లా లో అత్యధికంగా 30.6 శాతం మంది నమూనాల్లో కరోనా యాంటీ బాడీ్‌సను గుర్తించారు. ఆ తర్వాతి స్థానాల్లో కర్నూలు జిల్లా 28.1 శాతం, శ్రీకాకుళం జిల్లా 21.5 శాతం, చిత్తూరు జిల్లాలో 20.8 శాతం, విశాఖపట్నంలో 20.7 శాతం, కడపలో 19.3 శాతం, గుంటూరు జిల్లాలో 18.2 శాతం, ప్రకాశం జిల్లాలో 17.6 శాతం మందిలో యాంటీబాడీస్‌ కనిపించాయి. ఇక కరోనా యాంటీ బాడీస్ విషయంలో 12.3 శాతంతో పశ్చిమ గోదావరి చివరి స్థానంలో ఉంది.   ఈ సర్వేను బట్టి తేలిందేంటంటే పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా మహమ్మారి ముందు ముందు ఇంకా పెరిగే అవకాశం ఉంది. అలాగే ప్రకాశం, కడప జిల్లాల్లో కూడా వైరస్‌ ఉధృతి పెరగవచ్చు. అయితే ఇదే సమయంలో విజయనగరం, కర్నూలు జిల్లాల్లో కరోనా క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి.   కరోనా వైరస్‌ వ్యాప్తి ఏయే జిల్లాలో ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు ఈ సర్వే నిర్వహించినట్లుగా కమిషనర్‌ భాస్కర్ తెలిపారు. ఈ సర్వే ఫలితాలు వ్యాధి సంక్రమణ తీవ్రతను అర్థం చేసుకోవడానికి, భవిష్యత్‌ కార్యాచరణకు ఉపయోగ పడతాయి. దీనికి అనుగుణంగా ఆయా జిల్లాల్లో కొవిడ్‌ ఆసుపత్రుల ఏర్పాటు, వాటిలో మౌలిక సదుపాయాల కల్పన చేపట్టవచ్చుఅని అయన తెలిపారు. తొలిసారి ఢిల్లీలో నిర్వహించిన సీరో సర్వేలో 29.8 శాతం రిజల్ట్‌ వచ్చిందని దని తరువాత నుండి ఢిల్లీలో కరోనా వైరస్‌ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పట్టిందని తెలిపారు. ఇక మన రాష్ట్రంలో తొలిదశలో నిర్వహించిన సీరో సర్వేలో కృష్ణా జిల్లాలో అత్యధికంగా 21.7 శాతం మంది రక్త నమూనాల్లో కరోనా సంబంధిత యాంటీబాడీలు కనిపించాయి.. అప్పటి నుండి ఈ జిల్లాలో కూడా కరోనా వ్యాప్తి క్రమంగా కొంత తగ్గుముఖం పట్టింది.

కార్గో స్పేస్ క్రాఫ్ట్ కు కల్పనాచావ్లా పేరు

అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయమహిళా వ్యోమగామి కల్పనాచావ్లా పేరును ఒక కమర్షియల్ కార్గో స్పేస్ క్రాఫ్ట్ కు పెట్టాలని అమెరికాకు చెందిన నార్త్ రాప్ గ్రూమన్ సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే ఏడాది స్పేస్ లోకి పంపనున్న సిగ్నస్ క్యాప్య్సూల్ కు ఎస్ఎస్ కల్పనా చావ్లా అని నామకరణం చేసినట్టు సంస్థ ప్రకటించింది. గ్లోబల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీ సేవలను అందించే  నార్త్ రాప్ గ్రూమస్ సంస్థ తన అధికార ట్విట్టర్ లో వెల్లడించింది. కల్పనా చావ్లాను గౌరవిస్తున్నాం. ఆమె తొలి భారత మహిళా వ్యోమగామిగా నాసాలో చరిత్ర సృష్టించారు. హ్యూమన్ స్పేస్ క్రాఫ్ట్స్ అభివృద్ధిలో ఆమె ఎంతో సేవ చేశారని, ఎన్జీ-14 సిగ్నస్ ఎయిర్ క్రాఫ్ట్ కు కల్పనా చావ్లా పేరును పెట్టడాన్ని నార్త్ రాప్ గ్రూమన్ గర్వంగా భావిస్తోంది. ప్రతి సిగ్నస్ కూ అంతరిక్ష సేవలందించిన వారి పేర్లను పెట్టాలని కూడా నిర్ణయించాం. స్పేస్ ప్రోగ్రామ్ లో భాగంగా తన ప్రాణాలను పోగొట్టుకున్న ఆమె సేవలను ఎన్నో తరాలు గుర్తు పెట్టుకుంటాయి.   ఆన్ బోర్డ్ రీసెర్చ్, వ్యోమగాముల ఆరోగ్యం, స్పేస్ ఫ్లయిట్ లో సేఫ్టీ తదితర ముఖ్యమైన అంశాలపై ఎంతో సమాచారాన్ని ప్రపంచానికి కల్పనా చావ్లా అందించారని కంపెనీ వెబ్ సైట్ లో పేర్కొన్నారు. ఈనెల 29న కల్పనా చావ్లా పేరుతో అంతరీక్షంలోకి వెళ్లే స్పేస్ క్రాఫ్ట్ దాదాపు 3,629 కిలోల బరువైన వస్తువులను స్పేస్ స్టేషన్ కు చేర్చడానికి సిద్ధంగా ఉంది. ఈ నెల 29న ఈ స్పేస్ క్రాఫ్ట్ వర్జీనియాలో ఉన్న నాసా వాలోప్స్ ఫ్లయిట్ ఫెసిలిటీ నుంచి గగనతలంలోకి పంపిస్తారు. దాదాపు 80 పరిశోధనలు.. కల్పనాచావ్లా అంతరీక్షయానం చేసిన మొదటి భారతీయ మహిళ. ఆమె హర్యానాలోని కర్నాల్ లో 17 మార్చి 1962న జన్మించారు. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి 1982లో ఎయిరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత  ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి మాస్టర్స్ డిగ్రీని, కొలరాడో యూనివర్శిటీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో పీహెచ్డీ పూర్తి చేశారు. కమర్షియల్ పైలట్ లైసెన్స్ ను, సర్టిఫైడ్ ఫ్లయిట్ ఇన్ స్ట్రక్టర్ హోదాను అందుకున్న ఆమె 1988లో నాసాలో తన కెరీర్ ను ప్రారంభించారు. 1994లో నాసా  అంతరిక్షంలోకి పంపే వ్యోమగామిగా ఎంపికయ్యారు. ఆ తర్వాత రెండేండ్లకు STS-87  కొలంబియా వ్యొమనౌక లో ఆకాశయానం చేయడానికి సిద్ధమయ్యారు. ఆమె మొదటి అంతరిక్ష ప్రయాణం 1997 నవంబర్ 19 న ఆరు వ్యోమగాములతో మొదలైంది. దాంతో తొలిసారిగా అంతరిక్షానికి  వెళ్లిన భారత మహిళగా చరిత్ర సృష్టించారు. రెండవసారి అంతరిక్ష యానాన్ని చేసే అవకాశం కూడా ఆమెకు లభించింది.  2001లో ఎస్టీఎస్-107 క్రూ మెంబర్ గా ఎన్నికయ్యారు. 2003, జనవరి 16 న ఎస్‌టిఎస్-107 కొలంబియా స్పేస్ షటిల్ లో 16 రోజుల అంతరిక్ష పరిశోధనల కోసం ఆమె అంతరిక్షంలోకి వెళ్ళారు. ఈ రెండు ప్రయాణాల్లో ఆమె దాదాపు 80 పరిశోధనలను పూర్తి చేశారు. స్పేస్ క్రాఫ్ట్ లో తిరిగి భూమ్మీదకు వస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అంతరిక్షయానంలో భారత మహిళ పేరును చరిత్రలో తొలిసారి లిఖించి ఎందిరో స్ఫూర్తిదాయకంగా మారారు.  ఆమె జ్ఞాపకార్ధం ప్రపంచవ్యాప్తంగా అనేక విద్యాసంస్థలు, పరిశోధన సంస్థలు అవార్డులను, స్కాలర్ షిప్ లను అందిస్తున్నాయి. మొదటిసారి కమర్షియల్ స్పేస్ క్రాఫ్ట్ కు ఆమె పేరు పెడుతున్నారు.  "పరిస్థితులు ఎలాగున్నా... కన్న కలల్ని నిజం చేసుకోవడమే అంతిమ లక్ష్యం " అంటూ చెప్పే కల్పన చిన్నతనంలో ఆకాశంలో విహరించాలన్న తన కలను నిజం చేసుకున్నారు. 31రోజుల 14గంటల,54నిమిషాలు అంతరిక్షంలో ఉన్న ఆమె చివరికి తన ఊపిరి కూడా ఆకాశంలోనే వదిలారు. ఎందరిలోనూ స్ఫూర్తి రగిలించి చిరంజీవిగా మిగిలారు. 

 ప‌దునైన మోడీ..గాంభీర్య మోడీ!

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ..డెబ్బ‌య్ ఏళ్ల వ‌య‌స్సు...ప్ర‌ధానిగా రెండో ట‌ర‌మ్‌లోనూ ప‌ద‌హారు నెల‌లు కావ‌స్తున్న‌ది. క‌రోనా ద‌రిమిలా లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ ఆహార్యంలో మార్పు కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తున్న‌ది. పొడ‌వాటి గ‌డ్డం..మెడ‌చుట్టూ కండువా..అదే మాస్కుగాను ఉప‌యోగం..వీలైనంత‌వ‌ర‌కు మౌన‌మునిలా క‌నిపిస్తున్నారు. ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు, ప్ర‌భుత్వ ప్రొటోకాల్ స‌మావేశాల్లో త‌ప్ప ఇత‌ర‌త్రా ఆయ‌న హ‌డావుడి పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు.వినిపించ‌డం లేదు. ఉప‌న్యాసాలు కూడా వీలైనంత‌వ‌ర‌కు క్లుప్తంగా ఉంటున్నాయి. ఎందుకీ మార్పు? ఆయ‌న  అంత‌రంగంలో ఏముంది? ఆయ‌న లోలోన ఏమి ఆలోచిస్తున్నారు?  ఆయ‌నొక‌ హావ‌భావాల సునామీ.. కాని ఈమ‌ధ్య కాలంలో ఎందుకు మౌనాన్ని ఆశ్ర‌యిస్తున్న‌ట్టు? స‌భ‌లు, స‌మావేశాలైనా..అంత‌ర్జాతీయ వేదిక‌లైనా ప్ర‌ధాని మోడీ భావోద్వేగాల‌తో అవి ఊగిపోయేవి. విదేశీ అధిప‌తులు ఆయ‌న ముందు మోక‌రిలిన‌ట్టే అనిపించేది. ఆయ‌న మాట్లాడుతుంటే త‌లూపుతూ వింటూ మంత్ర‌ముగ్దుల్లా అయిపోవాలి త‌ప్ప వారికి వేరే మార్గం ఉండేది కాదు. అగ్ర‌రాజ్యాధిప‌తి ట్రంప్ అయినా అంతే. చేతిలో చెయ్యేసి ట్రంప్ మాట్లాడ‌టం కాదు. మోడీయే ట్రంప్ చేతిమీద చెయ్యేసి జోకేసి మాట్లాడితే ట్రంప్ కూడా న‌వ్వుతూ ఔన‌న్న‌ట్టు త‌లూప‌డ‌మే చూశాం. గ‌తంలో ఒబామాతోనైనా అవే స‌న్నివేశాలు. స‌రికొత్త‌గా చాయ్‌పే అంటూ ఒక సంద‌ర్భాన్ని క్రియేట్ చేసుకుని ద్వైపాక్షిక సంబంధాల మీద ఒక అవ‌గాహ‌న‌కు రాగ‌లిగిన సమ‌య‌స్ఫూర్తి మోడీ సొంతం.అంతేకాదు.  పార్ల‌మెంటు స‌భాప‌ర్వ‌మైతే ఇక చెప్పేదేముంది? అంతా ఏక‌ప‌క్ష‌మే. మాట‌ల దాడి ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. ఎదురుదాడి అంటే ఇంకా ఇష్టం. అల‌వోక‌గా ప‌దాల గార‌డీతో వ్యంగ్య‌బాణాలు సంధిస్తూ అక్ష‌రాల అల మీద సునాయాసంగా ఈత కొడ‌తారు.  ఆయ‌‌న వాగ్దాటి అలాంటిది. ఆయ‌న త‌త్వం అలాంటిది. ఆయ‌న హావ‌భావాల్లో రివ్వున ఎగిరే ప‌క్షుల రెక్క‌ల చ‌ప్పుడు వినిపిస్తుంది. ఆయ‌న శారీర‌క భాష‌లో ఉద్వేగ‌పు దొంత‌ర‌లు తార‌ట్లాడతాయి. అలాంటిది ప్ర‌ధాని మోడీ ఈమ‌ధ్య మిత‌భాషిలా క‌నిపిస్తున్నారు. ఆ చొర‌వ‌లో వేగం కాస్తంత నెమ్మ‌దించిన‌ట్టు అనిపిస్తున్న‌ది. జాతీయ స‌మ‌స్య‌లు, అంత‌ర్జాతీయ అంశాల మీద ఆయ‌న నోటి నుంచి విన‌వస్తున్న మాట‌లు ప‌రిమిత‌మ‌య్యాయి. ప్ర‌ధానిగా తొలి ట‌ర‌మ్ లో మోడీ అంద‌రికీ ఇప్ప‌టికీ గుర్తే. ఆ వేగం..ఆ ప‌దును..ఆయ‌న ప్ర‌తిచ‌ర్య‌లోనూ క‌నిపించేవి. వాటి ప్ర‌తిధ్వ‌నులు వినిపించేవి. ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు చారిత్రాత్మ‌కం. సాహ‌సోపేతం. ఆ నిర్ణ‌యాల్లో ప‌దును మ‌న‌సుల‌కు తాకేది. కాలం చెల్లిన‌, తుప్పుప‌ట్టిన కొన్ని వ్య‌వ‌స్ధ‌ల‌కు ఆయ‌న మంగ‌ళం పాడిన‌ప్పుడు యావ‌జ్జాతి స‌మ్మ‌తించింది. ఆ ఆలోచ‌ల్లోని తెగువ చూసి ముచ్చ‌ట‌ప‌డింది. ప్లానింగ్ క‌మిష‌న్ని బుట్ట‌దాఖ‌లా చేయ‌డం..2016 న‌వంబ‌రులో పెద్ద‌నోట్ల రద్దు..2017 జులైలో జీఎస్టీ..2016 సెప్టెంబ‌రులో పాకిస్తాన్ మీద స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్సు..ఇలా మొద‌టి ట‌ర‌మ్ అంతా సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో సాగింది. అంతేకాదు. ఆయ‌న జ‌రిపిన ప్ర‌తి విదేశీ ప‌ర్య‌ట‌న ఒక ప‌ర్వ‌దినంగా వెలిగింది. స్ధానిక భార‌తీయుల స‌మ్మేళ‌నాలు జ‌రిగాయి. ఆ బ‌హిరంగ వేదిక‌ల మీద ఆయా దేశాల అధిప‌తుల‌తో క‌లిసి మోడీ చేసిన ప్ర‌సంగ విన్యాసాలు అంత‌ర్జాతీయ వేదిక‌ల‌ను ఆక‌ర్షించాయి. ఇక రెండో ట‌ర‌మ్‌..అదొక సాహ‌స క్రీడ‌. ఆర్టిక‌ల్‌370 ర‌ద్దు..రామాల‌య నిర్మాణం..త్రిపుల్ త‌లాక్‌..సిటిజెన్ షిప్ యాక్టు..ఇర‌వై ల‌క్ష‌ల కోట్ల ప్యాకేజీ..ఇలా ఒక్కొక్క‌టీ ఒక్కో చారిత్రాత్మ‌క నిర్ణ‌యం. ఇవ‌న్నీ మోడీ సాహ‌సోపేత నాయ‌క‌త్వానికి చిహ్నాలుగా శాశ్వతంగా చ‌రిత్ర‌లో నిలిచిపోతాయి. ఇక ఈ ఏడాది మార్చి నుంచి ఒక దుర్ద‌శ మొద‌లైంది. అదే క‌రోనా కాలం. క‌‌రోనా మ‌హ‌మ్మారి మ‌న‌దేశంలోకి ప్ర‌వేశించిన తొలినాళ్ల‌లో ప్ర‌ధాని మోడీ కార్యోన్ముఖుల‌య్యారు. దేశ ప్ర‌జ‌ల‌కు త‌క్ష‌ణ క‌ర్త‌వ్యాన్ని బోధించ‌డంలో వినూత్న ప‌ద్ద‌తుల‌తో ముందుకొచ్చారు. లాక్‌డౌన్ కాలంలో దేశ‌ప్ర‌జ‌లంద‌రిచేతా కేంద్ర మార్గ‌ద‌ర్శ‌కాల‌ను మ‌న‌సా వాచా అమ‌లుచేయించ‌డంలో విజ‌యం సాధించారు. లాక్‌డౌన్ వ‌ల్ల దేశం ఎదుర్కొన్న ఆర్ధిక సంక్షోభం నుంచి కోలుకునే మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. 2014లో ప్ర‌ధాని మోడీ తొలిసారి ప్ర‌ధానిగా ప‌ద‌వీబాధ్య‌త‌లు స్వీక‌రించాక అయిదేళ్ల‌పాటు వ్య‌వ‌హ‌రించిన తీరు ఒక ర‌కం. రెండోద‌ఫా ప్ర‌ధాని అయ్యాక వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు మ‌రొక ర‌కం. మొద‌టి ట‌ర‌మ్ లో వినూత్న‌పంథాలో అడుగులేశార‌న్న భావ‌న అంద‌రిలో ఉంది. రెండో ట‌రమ్‌లో ఆయ‌న‌లో మ‌రింత ప‌రిప‌క్వ‌త కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తున్న‌ది. అది ఆయ‌న ఆహార్యంలో ప్ర‌తిబింబిస్తున్న‌ది. పొడ‌వాటి గ‌డ్డం అంద‌రూ గుర్తించేలా ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్న‌ది. ఆయ‌న‌లో మునిపుంగ‌వుడు ద‌ర్శ‌న‌మిస్తున్నాడ‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఆరేళ్ల భార‌త‌దేశ సార్వ‌భౌమ‌త్వ బాధ్య‌త‌ల నిర్వ‌హ‌ణ అనంత‌రం ఆయ‌న‌లో ఈ మార్పు దేశ ప్ర‌గ‌తికి ఒక చిహ్న‌మ‌న్న భావ‌న క‌లుగుతున్న‌ది. పాకిస్తాన్ తో ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరుకు, చైనాతో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుకు పొంత‌న లేద‌న్న విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతున్న‌ది. అయితే ఆ రెండు దేశాల‌తో మ‌న‌కున్న వివాదాల గుణ‌గ‌ణాలు వేరు. రెండింటినీ పోల్చి చూడ‌డం భావ్యం కాదు. కాని పాకిస్తాన్ విష‌యంలో మెరుపుదాడుల‌తో ఆయ‌న తీవ్రంగా వేగంగా స్పందించిన విష‌యాన్ని విశ్లేష‌కులు ఇక్క‌డ గుర్తు చేస్తున్నారు. అదే చైనా ద‌గ్గ‌ర‌కొచ్చేస‌రికి ఆయ‌న‌లో నిగ్ర‌హం క‌నిపిస్తున్న‌ది. చైనా సైనికులు ల‌డ‌ఖ్ లోని పాంగాంగ్లో మ‌న జ‌వాన్ల‌ని వ‌ధించినందుకు మొద‌టి ట‌ర‌మ్ మోడీ అయితే ఏమి చేసి ఉండేవార‌న్న విశ్లేష‌ణ‌లు జ‌ర‌గ‌క‌పోలేదు. అయితే   చైనాతో వ్య‌వ‌హ‌రిస్తున్న‌తీరు విదేశాంగ విధానంలో ఆచితూచి అడుగులేయాల‌న్న ప్రాథ‌మిక సూత్రానికి అనుగుణంగా ఉంది. శ‌త్రుశిబిరం దుందుడుకుగా వ్య‌వ‌హ‌రిస్తున్నా..భార‌త్ మాత్రం చ‌ర్చ‌ల‌కే ప్రాధాన్య‌మిస్తున్న‌ది. చైనాతో ద‌శాబ్దాల మైత్రి ఒక వంక మోడీని క‌ట్టిప‌డేస్తున్న‌ది. భార‌తీయ సంప్ర‌దాయ‌క మైత్రీభావ‌న‌ను చెక్కుచెద‌ర‌నీయ‌కూడ‌ద‌న్న మోడీ భావ‌న ఆయ‌న‌లోని ప‌రిప‌క్వ‌త‌కు నిద‌ర్శ‌నంగా నిలుస్తున్న‌ది. ఈ ప‌రిప‌క్వ‌త‌కు అనుగుణంగానే క్ర‌మ‌బ‌ద్దంగా ఆయ‌న ఆహార్యంలో మార్పు కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తున్న‌ది!

సరిహద్దులో టెన్షన్ల మధ్య భారత, చైనా దేశాల మధ్య కీలక ఒప్పందం

భారత చైనాల మధ్య లడాఖ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడి నిత్యం ఘర్షణలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణ వాతావరణాన్ని సాకుగా చూపుతూ చైనా భారత భూభాగంలోకి చొరబడే ప్రయత్నాలు చేస్తుండటంతో భారత సైన్యాలు వాటిని తిప్పి కొడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణానికి ముగింపు పలికే దిశగా భారత్, చైనా మధ్య మాస్కోలో అత్యున్నత స్థాయి చర్చలు జరిగాయి. ప్రస్తుతం మాస్కో‌లో షాంఘై సహకార సంస్థ సమావేశాల వేదికగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ గురువారం చర్చలు జరిపారు. ఇద్దరు మంత్రులు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించే అంశంపై సుమారు రెండున్నర గంటల పాటు చర్చలు జరిపారు. ఈ చర్చలలో ప్రస్తుతం సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. దీనికోసం ఐదు అంశాలతో కూడిన ఒక ప్రణాళికను ఈ సమావేశంలో ఖరారు చేశారు. ప్రస్తుతం సరిహద్దులలో నెలకొన్న పరిస్థితులు రెండు దేశాలకు కూడా మంచిది కాదని రెండు దేశాలు అంగీకరించాయి. ప్రస్తుతం ఎల్‌ఏసీ వద్ద నెలకొన్న ఉద్రిక్తతలను వెంటనే తగ్గించాలని రెండు దేశాల ప్రతినిధులు నిర్ణయించారు. ఇదే సమయంలో రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగించడం, అలాగే వెంటనే సైన్యాలను వెనక్కి రప్పించడంతో పాటు ఎల్ఏసీ నుంచి సమదూరం పాటిచడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దాలని ఈ సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చాయి. నిన్న జరిగిన ఈ సమావేశంలో చైనా తీరుపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గత కొన్ని సంవత్సరాలలో ఎపుడు లేనంతగా ఎల్‌ఏసీ సమీపంలో చైనా బలగాలు భారీగా ఆయుధాలను తరలించడాన్నిఅయన ప్రశ్నించారు. అంతేకాకుండా 1993, 1996 లో రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాల తర్వాత ఇంత పెద్ద ఎత్తున సైన్యాన్ని ఎప్పుడూ మోహరించలేదని.. అసలు ఆ పరిస్థితులు ఎందుకొచ్చాయని అయన నిలదీయగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ సరైన సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. అయితే రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదరడం ఒక మంచి పరిణామంగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.