coronavirus in guntur district

గుంటూరులో కరోనా అనుమానిత కేసులు!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా వైరస్‌‌తో హై అలర్ట్ ప్ర‌క‌టించారు. తాజాగా గుంటూరులో రెండు కరోనా అనుమానిత కేసులను అధికారులు గుర్తించారు. వైరస్ లక్షణాలు ఉండడంతో వీరిని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరి శాంపిల్స్ సేకరించి పుణె‌ ల్యాబ్‌కు పంపారు. వీరిలో ఒకరు నేపాల్‌ పర్యటనకు వెళ్లి రాగా.. మరొకరు వియత్నాం వెళ్లొచ్చినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. వైరస్ లక్షణాలతో పలువురు ఐసోలేషన్ వార్డుల్లో చేరుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. నిఘా, నియంత్రణ, నివారణతో వైరస్‌కు అడ్డుకుట్ట వేయొచ్చంటున్నారు అధికారులు. ఇప్పటివరకు వైరస్‌ అనుమానితులుగా పరీక్షలు జరిగినవారు 70 మంది ఉన్నారని.. వారిలో కరోనా పాజిటివ్‌ ఒకరికే తేలిందని.. 57 మందికి నెగెటివ్‌గా నిర్థారణ అయ్యిందన్నారు. ఇక శాంపిల్స్‌ ఫలితాలు రావాల్సినవి 12 ఉన్నాయన్నారు. ఇప్పటివరకు స్క్రీనింగ్‌ నిర్వహించి.. పర్యవేక్షణలో ఉన్న బాధితుల సంఖ్య 512మంది అని తేలింది. 28 రోజుల పర్యవేక్షణ పూర్తి చేసుకున్న బాధితులు 244.. ఆస్పత్రి అబ్జర్వేషన్‌లో ఉన్నవారి సంఖ్య 21గా ఉంది. ఇటు విజయవాడలోని సిద్ధార్థ మెడికల్‌ కాలేజీలో కోవిడ్‌-19 వ్యాధి నిర్ధారణ కేంద్రం ఏర్పాటు చేశారు. అలాగే జిల్లా కలెక్టర్లను జిల్లా నోడల్‌ ఆఫీసర్లుగా ప్రభుత్వం ప్రకటించింది.

tension started in students due to postpone of local polls

ఎన్నికల వాయిదాతో విద్యార్థుల్లో టెన్షన్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. రాజకీయ పార్టీల సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు విద్యార్థుల్లో మాత్రం టెన్షన్ మొదలైంది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల కోస‌మే 10వ త‌ర‌గ‌తి పరీక్షలను వాయిదా వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఎన్నికలు వాయిదా పడ్డాయి. మరి విద్యార్థుల పరిస్థితి ఏంటనే భయం నెలకొంది. పరీక్షలు యధావిధిగా జరుగుతాయా? లేవా? అనే భయం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొంది. మరోవైపు పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. పరీక్షలు మాత్రం యధావిధిగా కొనసాగుతాయని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు విద్యాసంస్థల పరంగా ఎలాంటి సెలవులు ఇప్పటి వరకు ప్రకటించలేదు. నెల్లూరు జిల్లాలో మాత్రమే ఈనెల 18వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అక్కడ కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ముందు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మార్చి 31వ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి రావాల్సిన సుమారు రూ.3200 కోట్ల నిధులు రావన్న కారణంగా, ఎన్నికల కోసం పరీక్షలను వాయిదా వేసింది రాష్ట్ర ప్రభుత్వం. కరోనా వైరస్ దెబ్బతో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆరు వారాల పాటు ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. అంటే ఏప్రిల్ 30వ తేదీ వరకు వాయిదా పడ్డాయి.

ap ec gives shock to cm ys jagan

సి.ఎం.కు బ్యాడ్ టైం.. రాజ‌ధాని మార్పు ప్లాన్ త‌ల‌కిందులైంది!

రాష్ట్ర ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ నిమ్మగడ్డ నిర్ణయంతో ముఖ్య‌మంత్రి జగన్ షాక్ గురైయ్యారు. ఏప్రిల్ 6 నుంచి జూన్ 10 లోపు రాజధాని మార్చాలని కొన్న జగన్ ప్లాన్ తలకిందులైంది. ఎందుకంటే ఆరు వారాల వ్యవధి ఏప్రిల్ నెల ఆఖరికి ముగుస్తుంది. ఆ తరువాత నాలుగు వారాల పాటు ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది అనగా మే నెల ఆఖరికి చేరుతుంది. ఇటువంటి పరిస్థితిలో ఉద్యోగుల్ని తరలించాలి అంటే అనేక సవాళ్లు ఎదురవుతాయి. స్కూల్ పిల్లల అడ్మిషన్లు కాలేజీ అడ్మిషన్లు వంటి అనేక సమస్యలు ఉద్యోగులు ప్రస్తావిస్తారు. అందువలన ఈ సంవత్సరానికి రాజధాని తరలింపు అనేది అటక ఎక్కినట్టే. 151 సీట్లు వచ్చినా - లేదంటే మొత్తం 175 స్థానాలు గెలిచినా కూడా రాజ్యాంగ బద్దంగా నడిచే సంస్థపై ఆరోపణలు చేయడం పై సి.ఎం. ఇరుక్కున్నారు. ముఖ్యమంత్రికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. ఈ విషయాన్ని జగన్ గమనిస్తే మంచిది. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగినంత కాలం ఇండ్ల స్థలాల పంపిణీని నిలిపివేసే పూర్తి అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది. సరైన కారణాలతో ఎన్నికలను వాయిదా వేసే అధికారి కూడా ఈసీకి ఉంది. రాజ్యాంగ బద్ధ సంస్థలపై ఆరోపణలు చేసే ముందు ఆలోచించి కామెంట్ చేయాలి అంటూ జగన్ పై ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు తనదైన రేంజిలో సెటైర్ల వర్షం కురిపించారు. ఇప్పటికే మందు డబ్బు పంపిణీ చేసిన జగన్ వాయిదా కారణంగా మరల ఆరు వారాల పాటు తన అభ్యర్థులను పోషించాల్సిన పరిస్థితి ఉంది. కొద్ది సమయంలో విపక్షాలు బలపడటానికి అవకాశాలు చాలా ఉన్నాయి.

ap cs neelam sahni writes letter to election commission

గవర్నర్ తో టచ్ లో ఉన్న హోమ్ మంత్రి అమిత్ షా 

* నిమ్మగడ్డ నిర్ణయానికి ముందే , హోమ్ మంత్రిత్వ శాఖ కు అన్ని విషయాలు తెలుసు .....  * ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఎన్నికల కమిషనర్ కు చీఫ్ సెక్రెటరీ లేఖ  * సుప్రీం కోర్టు కు వెళ్లే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం  * గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ తర్వాత , రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయం వెల్లడించే అవకాశం  రా ష్ట్రం లో రాజ్యాంగ సంక్షోభం  తలెత్తింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్వవస్థ, న్యాయ వ్యవస్థ ల మధ్య అసలే మాత్రం కో-ఆర్డినేషన్ లేకపోవటం, పర్యవసానం గా ఎదురవుతున్న పరిణామాలతో ముఖ్యమంత్రి ఎకంగాఎన్నిక కమిషనర్ వ్యవహార శైలిని తప్పుపడుతూ, ఈ రాష్ట్రానికి సి ఎం తానా, లేక రమేష్ కుమారా అని ప్రశ్నించటం ద్వారా రాజ్యాంగ వ్యవస్థ లకు సవాల్ విసిరారు. హై కోర్టులో తరచూ మొట్టికాయలు పడటం తో ఇప్పటికే అసహనం గాఉన్న సి ఎం జగన్ మోహన్ రెడీ, ఈ వ్యవహారం లో మాత్రం సుప్రీం కోర్టును ఆశ్రయించటానికే నిర్ణయం తీసుకున్నారు. ఈ లోగ, నిన్న అర్ధ రాత్రి ఎన్నికల కమిషనర్ కు చీఫ్ సెక్రటరీ నీలం సహానీ లేఖ రాశారు.  రాష్ట్రం లో కరోనా ఎఫ్ఫెక్ట్ లేదని ..ఎన్నికలను ముందు నిర్ణయించిన తేదీలలోనే జరిగేలా చూడాలని ఆమె ఆలేఖ లో లేఖలో  పేర్కొన్నారు.  నిన్న ఎన్నికల సంఘం విధించి వాయిదా ను ఎత్తివేయాలంటూ రమేష్ కి లేఖ రాసిన చీఫ్ సెక్రటరీ నీలం సహానీ. ఆలేఖలో ఆమె తమను ఎన్నికల సంఘం సంప్రదించలేదని, సంప్రదించి ఉంటె తాము వాస్తవ పరిస్థితిని వివరించేవారమని చెప్పుకొచ్చారు.  . తమను సంప్రదించి ఉంటే కరోనా పరిస్థితిపై సరైన సమాచారం ఇచ్చే వాళ్లమని పేర్కొన్నారు. ఈ దృష్ట్యా, ఎన్నికల వాయిదాను రద్దు చేయాలని ఆ లేఖలో ఆమె కోరారు. తమను సంప్రదించి ఉంటే కరోనా పరిస్థితిపై సరైన సమాచారం ఇచ్చే వాళ్లమని లేఖలో పేర్కొన్న సీఎస్.. ఏపీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు మాత్రమే నమోదైందని అన్నారు. కేవలం ఇటలీ నుండి వచ్చిన ఒక వ్యక్తికి మాత్రం కరోనా పాజిటివ్ వచ్చిందని ఆమె అన్నారు. స్థానికంగా ఎవ్వరికీ కరోనా సొకలేదని.. రానున్న మూడు నాలుగు వారాల్లో ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉండదని నీలం సాహ్ని పేర్కొన్నారు. నాలుగు వారాల తర్వాత కరోనా పరిస్థితిని అంచనా వేయలేమన్న సీఎస్.. అనుకున్న సమయానికే ఎన్నికలు పూర్తి చేయాలని వినతి చేసింది. కాగా కరోనా నేపథ్యంలో ఏపీలో జరగాల్సిన స్థానిక ఎన్నికలను ఆరు వారాలకు వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లాలనుకుంటోంది. ఇదిలా ఉంటె, అసలు గడిచిన వారం రోజులుగా కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ , రాజ్ భవన్ తో సంప్రదింపులు జరపటం, అలాగే ఢిల్లీ నుంచి కొందరు పరిశీలకులు విజయవాడ వచ్చి పరిస్థిని సమీక్షించటం లాంటి అంశాలు ఏవీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి లో లేకపోవడం గమనార్హం. ఇవన్నీ చూస్తుంటే, రాష్ట్రం లోజరుగుతున పరిణామాలపై కేంద్రం సీరియస్ గాఉండటం వల్లనే, ఎన్నికల కమిషనర్ ఏంన్నికల వాయిదా నిర్ణయాన్ని ప్రకటించి ఉండవచ్చుననే భావనను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి రమేష్ కుమార్ చేసిన తొందరపాటు చర్యల వల్ల, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు కు వెళ్ళడానికి గ్రౌండ్ దొరికిందని, చీఫ్ సెక్రెటరీ, హెల్త్ సెక్రెటరీ లను సంప్రదించకుండా నేరుగా ఆయన ఎన్నికలు వాయిదా వేస్తూ  ప్రకటన చేయటం వల్ల ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీమ్ కోర్టు ముందు పెట్టాలని భావిస్తోందని తెలుస్తోంది.  రమేష్ కుమార్ చర్య ఉద్దేశ పూర్వకం కాకపోయినప్పటికీ, దాని పరిణామాలు విపక్షాలకు ఆక్సిజన్ ఇచ్చినట్టు అయినదని భావనను అటు సీనియర్ ఐ ఏ ఎస్ లు, ఇటు రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నారు.

cm jagan reaction on postpone of local polls

ఈసీ చర్యలు ఏకపక్షం అంటున్న సి.ఎం. జ‌గ‌న్‌

స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అసహనానికి గురయ్యారు. ఇదే అంశంపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి నిర‌స‌న వ్యక్తం చేశారు. విచక్షణ అధికారం అన‌డం ఈ మ‌ధ్య ఓ ఫ్యాషనైపోయిందని సిఎం త‌న బాధ‌ను గ‌వ‌ర్న‌ర్ ముందు చెప్పుకున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌‌ను చంద్రబాబే నియమించారని, తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అన్నారు. రమేశ్ కుమార్ విచక్షణ కోల్పోయారని... ఆయన చేసిన వ్యాఖ్యలు బాధకలిగించాయని సీఎం పేర్కొన్నారు. కరోనా వైరస్ సాకుచూపి ఎన్నికల వాయిదా వేసినట్టు ప్రకటించిన ఆయన.. అదే సమయంలో గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించినట్టు ప్రకటించడం ఎంతవరకు సమంజసమని సి.ఎం. ప్ర‌శ్నించారు. రాజకీయాలకు అతీతంగా ఉండాలి కానీ, ఎన్నికల కమిషనర్‌కు ఉండాల్సిన లక్షణం ఇది కాదని వ్యాఖ్యానించారు. అధికారులను బదిలీచేసే అధికారం ఈసీకి ఎక్కడుందని ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్టు ఎన్నికలు వాయిదా వేస్తున్నారని జగన్ మండిపడ్డారు. ప్రజలు ఓట్లేసి 151 సీట్లతో అధికారం మాకు ఇచ్చారని.. ఈ అధికారం రమేశ్ కుమార్‌దా.. మాదా? అని నిలదీశారు. ఇక సీఎంలు ఎందుకు? ప్రభుత్వం ఎందుకు? అని అన్నారు. ఎవరో ఆర్డర్లు రాసి పంపిస్తే ఎస్‌ఈసీ చదివి వినిపిస్తున్నారని, పక్కనే ఉన్న ఇతర అధికారులను సంప్రదించడం లేదని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ క్లీన్ స్వీప్‌ను జీర్ణించుకోలేకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఇదే విషయం గురించి గవర్నర్‌కు తెలియజేశానని, ఈసీని పిలించి మాట్లాడమని చెప్పామన్నారు. అప్పటికీ కుదరకపోతే పైస్థాయికి వెళ్లి ఫిర్యాదు చేస్తామన్నారు. కరోనా వైరస్ కారణంగా ఏపీలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నానని చెప్పిన రమేష్ కుమార్ ఎందుకు గుంటూరు చిత్తూరు జిల్లా కలెక్టర్లు ఎస్పీలతోపాటు మరికొంత మందిని బదిలీ చేస్తూ ప్రకటన చేశారని సీఎం ధ్వజమెత్తారు. అధికారులను బదిలీ చేసే హక్కు ఈసీకి ఎక్కడుందని నిలదీశారు. 151మంది ఎమ్మెల్యేలతో ప్రజా బలంతో గెలిచి అధికారంలోకి వచ్చిన తమకు పవర్ ఉంటుందా? ఎన్నికల కోడ్ ఉందని రమేష్ కుమార్ కు అధికారం ఉంటుందా అని సీఎం జగన్ తీవ్ర స్వరంతో ప్రశ్నించారు.

bjp political strategy against ys jagan

జగన్ వ్యతిరేకులందరూ ఏకమయ్యారు.. ఇంటలిజెన్స్ ఏమి చేస్తున్నట్టు... 

* ఎన్నికల కమిషన్ నిర్ణయం జగన్ కు తలనొప్పి వ్యవహారమే  * లీగల్ పాయింట్స్ తో ఏకగ్రీవాలను సైతం ఛాలెంజ్ చేయటానికి రెడీ రెడీ అయిన తెలుగుదేశం  * ఇప్పటికే వై ఎస్ ఆర్ సి పి పై కత్తులు నూరుతున్న కన్నా  * జన సేన తడాఖా ఏమిటో ఇప్పుడు చూడండంటున్న పవన్ కళ్యాణ్  ఎవరివల్ల చెడ్డావోయి వీరన్నా అంటే, నోటి వల్ల చెడ్డానోయి కాటంరాజా అన్నాడుట వెనుకటికో పెద్దమనిషి. అలా తయారైంది రాష్ట్రం లో అధికార వై ఎస్ ఆర్ సి పి పరిస్థితి. రికార్డు వ్యవధిలో స్థానిక ఎన్నికలు నిర్వహించి పేరు తెచ్చుకుందామని తహ తహ లాడిన జగన్ మోహన్ రెడ్డి పార్టీని, తెలుగుదేశం , జనసేన, బీ జె పీ రాష్ట్ర  నాయకత్వాలు  ఎవరి స్థాయిలో వారు గవర్నర్కు, కేంద్రానికి ఫిర్యాదులు చేయటం ద్వారా వై ఎస్ ఆర్ సి పి దూకుడు ని అడ్డుకున్నారు. నిజానికి కన్నా లక్ష్మీ నారాయణ చేసిన హోమ్ వర్క్ మామూలుది  కాదు.  ఈ విషయం లో...తన భూములకె దిక్కు లేని ఈ రాష్ట్రం లో జగన్ పాలన ను అలా చూస్తూ ఊరుకుంటే, రాష్ట్రమంతా కబ్జా మయమైపోతుందంటూ ఆయన చేసిన ఫిర్యాదుకు, బీ జె పి కేంద్ర నాయకత్వం చాలా తీవ్రంగా స్పందించింది. స్థానిక  సంస్థల ఎన్నికలను వాయిదా వేయించడంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకుల వ్యూహాలు ఫలించినట్టే.   రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైసీపీ నాయకులు తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారంటూ బీజేపీ రాజ్యసభ సభ్యులు కేంద్రానికి నివేదించిన రెండు రోజుల్లోనే వాయిదా పడటం చర్చనీయాంశంగా మారింది. ఇదంతా కూడా , వై ఎస్ ఆర్ సి పి అధినేత నిజానికి దూకుడు గా వెళ్లడం వల్ల , కొని తెచ్చిపెట్టుకున్న సమస్య. అయితే, పదే పదే ఇలాంటి తప్పుల్లో జగన్ మోహన్ రెడ్డి ఎలా కాలు  వే స్తున్నారనే  అంశం లో -జగన్ క్యాంప్ లో ఇప్పటికీ క్లారిటీ రాకపోవటమే అసలైన విషాదం. అటు తన దూకుడు వైఖరి తో పాటు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ లో డొల్ల తనం కూడా జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలు ప్రజల్లోకి వెళ్లకుండానే, సగం లో ఆగిపోయే పరిస్థితి వస్తోంది. ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే, ఏ బీ వెంకటేశ్వర రావు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న సమయం లో ప్రతిపక్షం ఎత్తుగడలు పసికట్టడం- చంద్రబాబు నాయుడుకు చాలా  సులభతరమైన టాస్క్ అయ్యేది. వాస్తవానికి స్టీఫెన్ రవీంద్ర ఇంటెలిజెన్స్ చీఫ్ గావచ్చి ఉండి ఉంటె, జగన్ మోహన్ రెడ్డి కి ఇలాంటి విషయాల్లో కొంత బ్రీతింగ్ స్పేస్ దొరికేది. కనీసం కౌంటర్ స్ట్రాటజీస్ తో ఎలా వెళ్లాలనే అంశం లో స్టీఫెన్ లాంటి అనుభవజ్ఞుడు సలహాలు ఇచ్చే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ప్రతి అంశం లోనూ , ప్రత్యేకించి రాజకీయంగా ముందస్తుగా పరిణామాలు ఊహించే , పసికట్టే అంశాల్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ గాఢ నిద్ర పోతుండటం వల్లనే ఇలాంటి షాకింగ్ డెవెలెప్మెంట్స్ చోటు చేసుకుంటున్నాయని వై ఎస్ ఆర్ సి పి నాయకులు వాపోతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్‌ను కేంద్ర ప్రభుత్వం అదును చూసి దెబ్బకొట్టిందా? స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించడంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకుల వ్యూహాలు ఫలించాయా?- ప్రస్తుతం రాష్ట్రంలో వినిపిస్తోన్న ప్రశ్నలు ఇవి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైసీపీ నాయకులు తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారంటూ బీజేపీ రాజ్యసభ సభ్యులు కేంద్రానికి నివేదించిన రెండు రోజుల్లోనే వాయిదా పడటం చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో- బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు మరో వైపు నుంచి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హింసను ప్రేరేపిస్తోందని, రాజకీయ ప్రత్యర్థులపై ప్రాణాంతక దాడులకు పాల్పడుతోందంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల సమీపంలో చోటు చేసుకున్న ఉదంతాన్ని వారు ప్రధానంగా అమిత్ షా వద్ద ప్రస్తావించారు. వీడియో క్లిప్పింగులను చూపించారు. జగన్ సర్కార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుని కేంద్రం.. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అయితే, విషయం లో జగన్ మోహన్ రెడ్డి వ్యవహరించిన దూకుడు వైఖరిని  కూడా, కేంద్ర ప్రభుత్వం పరిగణన లోకి తీసుకున్నట్టు సమాచారం.

Symptoms of Coronavirus Disease

కరోనా వైరస్ వచ్చిన‌ట్లు గుర్తించ‌డం ఎలా?

ప్రపంచాన్ని భయంకర కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్నది. ఈ వైరస్‌కు వ్యాక్సిన్ కూడా ఇంకా తయారు కాకపోవడంతో ప్రజల్లో భయం రెట్టింపు అయింది. దీంతో ప్రభుత్వాలు కరోనాపై అవగాహన కల్పిస్తున్నాయి. ప్రపంచాన్ని భయ కంపితులను చేస్తున్న కరోనా వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించిన తొలి రోజు నుంచి ఎటువంటి మార్పులు కనిపిస్తాయి? ఎలాంటి ప్రభావం కనిపిస్తుందన్న అంశాలపై లాన్సెట్ జర్నల్ లో ఓ ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఇందులోని వివరాల ప్రకారం, ఈ వైరస్ సోకిన తరువాత తొలి ఐదు రోజులూ ఎటువంటి లక్షణాలూ బయటకు కనిపించవు. కొందరిలో 14 రోజుల పాటు ఏ మార్పులూ నమోదు కావు. ఒకసారి ప్రభావం కనిపించడం ప్రారంభమైన తరువాత... తొలి మూడు రోజులు ఒళ్లు వెచ్చబడుతుంది. ఆపై గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటివి కనిపిస్తాయి. 80 శాతం మంది కరోనా వైరస్ సోకిన వారిలో తొలుత ఈ లక్షణాలే కనిపించాయి. ఇక, నాలుగో రోజు నుంచి తొమ్మిదో రోజు లోగా, వైరస్‌ ప్రభావం ఊపిరితిత్తులపై పడి, శ్వాస తీసుకోవడంలో సమస్యలు వస్తాయి. జ్వరం కూడా పెరుగుతుంది. ఊపిరి అందడం కష్టం కావడంతో పాటు గ్యాస్ట్రిక్‌ సమస్యలు వస్తాయి. బాధితుల్లో ఈ దశను ఎదుర్కొన్న వారు 14 శాతం మంది. ఆపై పదిహేనవ రోజు వచ్చేసరికి ఊపిరితిత్తుల్లోని ఇన్‌ ఫెక్షన్‌ రక్తంలోకి ప్రవేశిస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన స్థితి. ఆ స్థితికి బాధితుడు చేరుకుంటే, తదుపరి రెండు వారాల పాటు అత్యంత కీలకం. అతని ప్రాణాలను కాపాడుకోవాలంటే, ప్రత్యేక వైద్యం, ఇంటె న్సివ్‌ కేర్‌ చికిత్స తప్పనిసరి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన వారికి ఈ పరిస్థితికి వచ్చిన వారు 5 శాతం వరకూ ఉన్నారు. ఇక వీరిలో రోగ నిరోధక శక్తి బాగుండి, ఇతర జబ్బులు లేకుంటే, కరోనాను సులువుగా జయించవచ్చు. బీపీ, షుగర్, గుండె జబ్బులు తదితరాలు ఉన్నా, 60 ఏళ్లు దాటినా కరోనా వారికి పెనుముప్పుగానే పరిణమిస్తుంది. మన శరీరంలోకి ఒక్కసారి ఈ వైరస్‌ ప్రవేశించిందో ఇక అది ఉత్పత్తి ఫ్యాక్టరీగా మారిపోతుంది. ఒక్క వైరస్‌ మరో 10 వేల కొత్త వైరస్‌లను సృష్టించే సామర్థ్యం ఉంటుంది. అందుకే భూమ్మీద ఉండే మనుషుల కంటే 10 వేల రెట్లు ఎక్కువ వైరస్‌లు ఉన్నాయని శాస్త్రవేత్తల అంచనా. మన శరీరంలో కూడా ఎన్నో వైరస్‌లు ఉన్నప్పటికీ చాలా వైరస్‌లు నిద్రాణ స్థితిలో ఉంటాయి. అందుకే వాటి వల్ల హాని జరగదు. అయితే మనిషిలో రోగ నిరోధక వ్యవస్థ నిర్వీర్యం అయిపోతే మాత్రం ఈ వైరస్‌లు విజృంభిస్తాయి. అంతుపట్టని వ్యాధులకు కారణమవుతాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలతో ఈ వైరస్‌ల దాడి మొదలవుతుంది. చివరికి జ్వరం, రక్తస్రావం వంటి వాటికి దారి తీసి ప్రాణాలే పోతాయి. వైరస్‌లన్నీ హానికరమైనవే. మనిషిలో రోగాలను ఎదుర్కొనే శక్తిని బట్టే వాటి విజృంభన ఉంటుంది. అయితే కొన్ని మాత్రమే ప్రాణాంతక వైరస్‌లు ఉంటాయి. అమెరికన్‌ జర్నల్‌ సొసైటీ ఆఫ్‌ మైక్రో బయోలజీ అంచనాల ప్రకారం ఈ భూమి మీద 3 లక్షల 20 వేల రకాల వ్యాధికారక వైరస్‌లు ఉన్నాయ‌ట‌.

nara lokesh slams ap cm ys jagan

కరోనా కంటే జగరోనా డేంజరస్: లోకేష్ 

వైసీపీ పాలనలో నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్వీట్ చేశారు. బాబు ఉంటేనే జాబు అని ముఖ్యమంత్రి జగన్ స్వయంగా చెప్పిన విషయాన్ని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. టీడీపీ హయాంలో రాష్ట్ర యువతకి పరిశ్రమల శాఖ ద్వారా 5,13,351 ఉద్యోగాలు, ఐటీ శాఖ ద్వారా 30,428 ఉద్యోగాలు వచ్చాయని వైసీపీ ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా నిజాన్ని ఒప్పుకుందని వ్యాఖ్యానించారు.   ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయ్యిందన్నారు.  10 నెలల తుగ్లక్ పాలనలో నిరుద్యోగులను నిలువునా ముంచారని విమర్శించారు. ఉన్న కంపెనీలను తరిమేశారని వస్తా అన్న కంపెనీలను వద్దన్నారని ఆరోపించారు. ఆఖరికి ఉన్న నిరుద్యోగ భృతి కూడా ఎత్తేసి ఆకలేసి కేకలేసే పరిస్థితి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.  "కరోనా కంటే ప్రమాదకరమైన జగరోనా వైరస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చెయ్యాలని ప్రయత్నించింది. దౌర్జన్య పర్వం, అరాచక వాదంతో స్థానిక సంస్థలను వశం చేసుకోవాలని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు," అంటూ ట్వీట్ చేసిన లోకేష్, " ఐపీఎస్ అధికారులను కోర్టు ముందు నిలబెట్టారు. ఐఏఎస్ అధికారుల బదిలీలకు కారణం అయ్యారు. నియంత ఎన్ని తప్పుడు పనులు చేసినా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి టీడీపీ పోరాటం చేస్తూనే ఉంటుంది " అని స్పష్టం చేశారు.

coronavirus effect on makkah

ప్ర‌తిరోజు ల‌క్ష‌ల‌ మందితో క‌ళ‌క‌ళ‌లాడే ప‌విత్ర కాబా ఇలా బోసిపోయింది!

ముస్లింల పవిత్ర ప్రదేశం మక్కా. అక్కడ సంవత్సరంలోని అన్ని రోజులు ముస్లింల తాకిడితో రద్దీగా ఉంటుంది. కానీ ఇప్పుడది బోసిపోయింది. మచ్చుకు ఒక్కరు కూడా మక్కాను సందర్శించడం లేదు. ఇదే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రాలన్నీ మనుషులు లేక ఖాళీగా ఉన్నాయి. కరోనా వైరస్ భయానికి జనం రావడం లేదు. ఇళ్లలోనే తమను తాము నిర్భందించుకుంటున్నారు. నిర్వాహకులు కూడా వాటిని మూసివేశారు. కొన్ని సంవత్సరాలుగా జనాల తాకిడితో ఉపశమనం అనేదే లేకుండా ఉన్న ప్రదేశాలన్నీ ఇప్పుడు ఖాళీగా ఉండడం చూసి పర్యావరణ వేత్తలు తాజాగా 'ప్రపంచం రెస్ట్ తీసుకుంది' అని పేర్కొంటున్నారు. సౌదీ అరేబియాలోని పవిత్ర మక్కా మసీదు ప్రస్తుతం ఎడారిగా కనిపిస్తోంది. కరోనా భయంతో జనం రాక సోకకుండా అధికారుల సైతం మక్కాను మూసివేశారు. పవిత్ర మక్కా, మదీనా మసీదులో ప్రార్ధనలపై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. మదీనాలో ప్రవక్త మసీదుతో పాటు మక్కా మసీదుల ఓపెనింగ్, క్లోజింగ్ షెడ్యూల్ ను సంబంధిత అధికారులు ప్రకటించారు. పవిత్ర కాబాతో పాటు సఫా, మార్వాహ్ మధ్య సయీకి భక్తులను ఎవర్ని అనుమతించడం లేదు. ఉమ్రా పై నిషేధం ఎత్తివేసే వరకు మసీదులో అంతర్గత ప్రార్ధనలు మాత్రం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ముందస్తుగా ఈ జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇక ఎప్పుడూ పర్యాటకులతో కళకళలాడే రోమ్ లోని వాటికన్ సిటీ చర్చి ఇటలీలోని వెనిస్ లో ప్రసిద్ధ వెనిస్ స్క్వేర్ కూడా జనాలు లేక బోసిపోవడం ఇదే తొలిసారి అట. ఇవేకాదు.. అమెరికాలో కర్మాగార కేంద్రమైన బోస్టన్ - టోక్కోలోని వీధులు - సువర్ణభూమి విమానాశ్రయం - బ్యాంకాక్ పర్యటక క్షేత్రాలు - పట్టాయా - థాయ్ లాండ్ లో ఖాళీ బీచులు దర్శనమిస్తున్నాయి. ఆస్ట్రేలియా - సింగపూర్ లో ఖాళీ రెస్టారెంట్లు కనిపిస్తున్నాయి. అమెరికాలో జనాలు లేని స్టేడియాలు చూస్తే కరోనాకు జనం ఎంత భయపడుతున్నారో అర్థమవుతోంది. కరోనా మహమ్మారి ధాటికి ఇప్పుడు ప్రపంచమే విరామం తీసుకుందన్నట్టుగా పరిస్థితి తయారైందని ఆయా పర్యాటక క్షేత్రాల ఫొటోలు చూసి పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

bjp janasena alliance gives shock to jagan in kadapa

జగన్ అడ్డాలో సత్తాచాటిన బీజేపీ-జనసేన

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వై.సి.పి. అధికార పార్టీ. సీఎం జగన్ సొంత జిల్లాలో బీజేపీ-జనసేన సత్తా చాటింది. ఏకంగా వైసీపీని తోసిరాజని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇలా అస్సలు ఉనికే లేని బీజేపీ-జనసేన అభ్యర్థి సత్తా చాటడం వైసీపీ వర్గాలకు షాకింగ్ గా మారింది.స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ టీడీపీ టికెట్లు దక్కని బలమైన అభ్యర్థులు బీజేపీ-జనసేన పార్టీలో చేరి అనూహ్య ఫలితాలను సాధించారు. పలు జిల్లాల్లో ఈ రెండు పార్టీలు బలపరిచిన అభ్యర్థులు ఘనవిజయాలు సాధిస్తున్నారు. సీఎం సొంత జిల్లా కడపలోనూ ఇదే పునరావృతం కావడం గమనార్హం. కడప జిల్లా రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వీరబల్లి మండలం మట్లిలో బీజేపీ-జనసేన ఎంపీటీసీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేసిన రావూరి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయనకు వ్యతిరేకంగా అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ నుంచి ఒక్కరు కూడా పోటీగా నామినేషన్ వేయకపోవడం గమనార్హం. దీంతో బీజేపీ-జనసేన అభ్యర్థి రావూరి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా రాయచోటి ఎమ్మెల్యే గడొకోట శ్రీకాంత్ రెడ్డితో రావూరి శ్రీనివాస్ కు మంచి సంబంధాలున్నాయని తెలుస్తోంది. ఆయన ఆదేశాల మేరకే వైసీపీ తరుఫున ఎవరూ నామినేషన్ వేయలేదని సమాచారం. అందుకే ఏకంగా అధికార వైసీపీ పార్టీని కాదని బీజేపీ-జనసేన ఇక్కడ విజయం సాధించిందని అంటున్నారు. స్నేహితుడి కోసం వైసీపీ పార్టీ అభ్యర్థినే పక్కనపెట్టిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వ్యవహారం చర్చనీయాంశమైంది. అయితే మంచి పేరు సమర్థ నాయకుడైన రావూరి కోసం వైసీపీ శ్రేణులంతా ఇలా పోటీచేయకుండా సహకరించారని చెబుతున్నారు.

shoaib akhtar slams china over corona

చైనీయులే ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టారా?

ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా (కోవిడ్‌ 19) వైరస్‌ వ్యాప్తికి కారణమైన చైనాపై పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ మండిపడ్డారు. ఏది పడితే అది తిని ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గబ్బిలాలు, కుక్కలు, పాములు, పిల్లులు, ఎలుకల్ని తిన‌డం, అంతే కాదు వాటి రక్తాన్ని, మూత్రాన్ని తాగి తద్వారా ప్రపంచానికి వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గబ్బిలాలు, కప్పలు, పాములు, కుక్కలు వంటికి తినడం తమ సంస్కృతిలో భాగం అని చైనీయులు అనొచ్చు. కానీ.. ఆ సంస్కృతి మీకు లాభాన్ని కాకుండా తీవ్రమైన నష్టాన్నే మిగిల్చింది కదా. ఏది పడితే అది తినడం సరికాదని అంటున్నా. నేను చైనీయులకు వ్యతిరేకం కాదు. అక్కడ మూగజీవాలపై ఉన్న చట్టాలనే ప్రశ్నిస్తున్నా' అని అక్తర్‌ పేరొన్నారు. 'రక్తం, వ్యర్థాలను సైతం ఆహారంగా తీసుకునే చైనీయులపై చాలా కోపంగా ఉంది. ప్రపంచం మొత్తం ప్రమాదంలో పడింది. తద్వారా పర్యాటకం రంగం దెబ్బతిన్నది. ఆర్థికంగా చాలా నష్టం వాటిల్లుతోంది, అన్నిదేశాలు పతనం అవుతున్నాయి' అని అక్తర్‌ అన్నారు. ప్రాణాంతక కరోనా వైరస్‌ 145కు పైగా దేశాలకు పాకింది. 1,45, 810 మంది ఈ వైరస్‌ బారినపడి చికిత్స పొందుతుండగా.. 5 వేలకు పైగా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇక భారత్‌లో 84 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఇద్దరు మరణించారు.

coronavirus effect on olympics

షెడ్యూల్‌ ప్రకారమే ఒలింపిక్స్‌.. వాయిదా వేసే ఆలోచ‌న లేదు

కరోనా వైరస్‌ (కొవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తున్నప్పటికీ అన్ని జాగ్రత్తలతో టోక్యో ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని జపాన్‌ ప్రధాని షింజో అబే స్పష్టం చేశారు. ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలా? లేదా రద్దు చేయాలా? అనేది డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సులకు అనుగుణంగానే ఉంటుందని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ చెబుతుంటే.. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారమే ఒలింపిక్స్‌ జరుగుతుందని, ఈ విషయంలో ఐఒసితో కలిసి పనిచేస్తున్నామని ప్రధాని అన్నారు. ఇటీవల టోక్యో మెగా ఈవెంట్‌ను వాయిదా వేయాలనే ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో ఆయన స్వయంగా స్పందించారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో స్పోర్ట్స్‌ ఈవెంట్‌లు వాయిదా పడిన నేపథ్యంలో ఒలింపిక్స్‌ను సైతం రీ షెడ్యూల్‌ చేస్తే బాగుంటుందనే వాదన ఎక్కువైంది. ఈ క్రమంలోనే మాట్లాడిన జపాన్‌ ప్రధాని.. ఒలింపిక్స్‌ నిర్వహణ అనేది ఆలస్యం కావడం కానీ, వాయిదా పడటం కానీ జరగదన్నారు. షెడ్యూల్‌లో పేర్కొన్నట్లు జూన్‌ 24 నుంచే ఒలింపిక్స్‌ జరుగుతుందన్నారు. స్టేక్‌ హోల్డర్స్‌తో కూడా టచ్‌లో ఉన్నామన్నారు. కరోనా విజృంభణ, ఒలింపిక్స్‌ నిర్వహణ అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. ఎలాంటి సమస్య లేకుండా షెడ్యూల్‌ ప్రకారం ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తాం. ఒలింపిక్స్‌ వాయిదా లేదా రద్దు గురించి తాము ఆలోచించడం లేదు' అని టోక్యోలో అబే ప్రకటించారు.

paritala family may join ysrcp

వైసీపీ బాట‌లో పరిటాల ఫ్యామిలీ...

టిడిపి గుడ్ బాయ్ చెప్ప‌డానికి తాజాగా పరిటాల ఫ్యామిలీ కూడా సిద్దమైంది. పరిటాల శ్రీరాం… ఇప్పటికే జిల్లా మంత్రిని ఒకరిని కలిసి పార్టీలోకి వచ్చే విషయమై చర్చలు జరిపారని అంటున్నారు. ఆయన ఇప్పటికే పరిటాల అభిమానులతో కూడా చర్చలు జరిపి పార్టీ మారే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. పరిటాల అభిమానులు కొంత కాలంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై ఆగ్రహంగా ఉన్నారు. జేసి ఫ్యామిలీకి ఇచ్చిన విలువ తమకు ఇవ్వడం లేదనే భావనలో వారు ఉన్నారు. దీనితో త్వరలో పార్టీకి గుడ్ బై చెప్పడానికి రెడీ అవుతున్నారని సమాచారం. అన్ని విధాలుగా టీడీపీ లో సహకారం అనేది లేదని, కార్యకర్తల మీద, నమ్ముకున్న అనుచరుల మీద కేసులు పెడుతున్నారని శ్రీరాం ఆగ్రహంగా ఉన్నారు. జేసి కి న్యాయ సహాయం అందింది కాని తమకు పార్టీ నుంచి అందడం లేదని శ్రీరాం అసహనంగా ఉన్నారు. దీనితో ఉగాది తర్వాత పార్టీ మారడానికి శ్రీరాం అన్ని సిద్దం చేసుకున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆయన ఈలోపే వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఇక పరిటాల సునీత కూడా ఈ విషయంలో అసహనంగా ఉన్నారని, తమకు పార్టీ అధిష్టానం నుంచి ఏ మాత్రం మద్దతు రావడం లేదనే భావనలో ఆమె ఉన్నారని జిల్లా నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అనంతపురం జిల్లాలో మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌తో చంద్ర‌బాబునాయుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆయ‌న న‌మ్మ‌కం పెట్టుకున్న వాళ్ళే ఇప్పుడు న‌ట్టేట ముంచుతున్నారు. మాజీ మంత్రులు, టీడీపీ సీనియర్ నేతలు ఒక్కొక్కరు పార్టీ మారడానికి సర్వం సిద్దం చేసుకుంటున్నారు.

BS 4 Vehicles ban

బీఎస్ 4 వాహనాల‌పై ఏప్రిల్ ఒకటి నుంచి నిషేధం

మారిన నిబంధనల ప్రకారం ఈ నెలాఖరు తర్వాత నుంచి బీఎస్4 వాహనాల్ని వినియోగించకూడ‌దు. కాలుష్యాన్ని మరింత తగ్గించి.. పర్యావరణానికి మేలు చేసేలా బీఎస్ 6 వాహనాల్ని మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే.. ఈ నెలాఖరు వరకూ బీఎస్ 4 వాహనాల్ని కొనుగోలు చేసే వీలుంది. అలా కొన్న వాటిని ఈ నెలాఖరులోపు రిజిస్ట్రేషన్లు చేయించాల్సిందే. ఒకవేళ.. వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించే విషయంలో కాస్తంత నిర్లక్ష్యానికి భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తోంది ఏపీ సర్కారు. త‌క్కువ ధ‌ర‌కు వ‌స్తుంది క‌దా అయిన కొత్తగా కొనుగోలు చేసిన‌ టూవీలర్ కానీ, కారు కానీ వుంటే వెంటనే రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం ఉంది. తర్వాత చూద్దామన్న భావనతో చాలామంది లైట్ తీసుకుంటారు. అయితే.. ఇలా లైట్ తీసుకునే వారికి దిమ్మ తిరిగిపోయేలా షాకిచ్చే నిర్ణయాన్ని వెల్లడించింది ఏపీ రవాణా శాఖ. బీఎస్ 4 వాహనాల్ని ఏప్రిల్ ఒకటి నుంచి అమ్మకూడదు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న కంపెనీలు ఈ నెలాఖరు వరకూ తమ వద్ద ఉన్న బీఎస్ 4 వాహనాల్ని తక్కువ ధరకు అమ్మేస్తున్నారు. బీఎస్ 6కు.. బీఎస్ 4 వెహికిల్స్ కు మధ్య ధరలో ఉండే తేడా కారణంగా కొందరు ఈ వాహనాల్ని కొనుగోలు చేస్తున్నారు. ఈ వాహనాల్ని నెలాఖరులోపు రిజిస్ట్రేషన్లు చేయించకుంటే.. తర్వాత నుంచి ఆ కార్లను తక్కుగా పరిగణిస్తారు. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వాహనాన్ని జఫ్తు చేసి.. తుక్కు కింద ట్రీట్ చేస్తారు.

Komatireddy Rajgopal Reddy Sensational Comments

అనవసరంగా విడ‌గొట్టారు! ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌యే బాగుండేది!

ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌యే బాగుంది! అనవసరంగా విడిపోయాం అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటులో తెలంగాణ కోసం కొట్లాడినందుకు తాను ఇప్పుడు బాధపడుతున్నానని ఆయ‌న చెప్పారు. అసెంబ్లీ విరామంలో రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. కాంగ్రెస్ వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పిన సీఎం కేసీఆర్‌. ఇప్పుడు అదే కాంగ్రెస్‌పార్టీని కరోనా వైరస్‌తో పోల్చడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి అరెస్టు విషయంలో పార్టీకి నష్టం కలిగించేలా సీనియర్ నాయకులు మాట్లాడటం మంచి పద్ధతి కాదని, పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే జూనియర్లను ప్రోత్సహించాల్సింది పోయి.. విమర్శలు చేయడం తగదని అన్నారు. రేవంత్‌రెడ్డికి తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. కానీ, ఎంపీగా ఉన్న ఓ వ్యక్తి డ్రోన్‌‌తో కేటీఆర్ ఫామ్‌హౌస్‌ ఫొటోలు తీయించడం సరికాదన్నారు. దీన్ని సాకుగా చేసి ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేయించడమూ దారుణమన్నారు. బలమైన నాయకత్వ లక్షణాలు, సామాజిక వర్గం, కలుపుగోలు తనం ఉన్న వారినే పీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. అలాంటి లక్షణాలున్న నాయకుల్లో తానే మొదటివాడిని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికలో ఆదిష్ఠానం నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని కోరారు. ఒకవేళ పార్టీ అదిష్ఠానం సరైన నిర్ణయం తీసుకోకపోతే తమదారి తాము చూసుకుంటామని తేల్చి చెప్పారు.

భారత్‌లో పత్రికా స్వేచ్ఛ లేదు!

భార‌త‌దేశంలో జర్నలిస్టులపై వేధింపుల్లో అవమానాలు, అత్యాచారాలు, హత్య బెదిరింపులు పెరిగిపోయాయి. పత్రికా స్వేచ్ఛకు సంబంధించి ఈ ఏడాది అత్యంత అధ్వాన్నమైన దేశాల జాబితాలో భారత్‌ చేరిపోయింది. అంతర్జాతీయ మీడియా పర్యవేక్షణా సంస్థ 'రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌' (ఆర్‌ఎస్‌ఎఫ్‌) విడుదల చేసిన జాబితాలో భారత్‌ కూడా చేరింది. భావ ప్రకటనా స్వేచ్ఛకు తీవ్రమైన ప్రమాదం ఏర్ప‌డిందని ఆర్ ఎస్ ఎఫ్ ఆందోల‌న వ్య‌క్తం చేసింది. భారతదేశంలో జర్నలిస్టులపై వేధింపుల్లో సామాజిక మీడియా సాక్షిగా జరిగే అవమానాలు, అత్యాచారాలు, హత్య బెదిరింపులు వంటివి వున్నాయని ఆర్‌ఎస్‌ఎఫ్‌ పేర్కొంది. ఇటువంటి వేధింపులకు ఇద్దరు భారత జర్నలిస్టులు రాణా అయూబ్‌, స్వాతి చతుర్వేదిలను ఉదాహరణగా పేర్కొనవచ్చని తెలిపింది. 2002 గుజరాత్‌ అల్లర్లపై అయూబ్‌ పుస్తకం రాశారు. ఈ సందర్భంగా తనకు అనుభవంలోకి వచ్చిన ఆన్‌లైన్‌ వేధింపులను న్యూయార్క్‌ టైమ్స్‌లో రాసిన వ్యాసంలో వివరించారు. ఆమెకు వ్యతిరేకంగా ఆన్‌లైన్‌లో విద్వేష ప్రచారం కొనసాగుతున్న దృష్ట్యా రక్షణ కల్పించాలని యుఎన్‌హెచ్‌ఆర్‌సి నిపుణులు భారత ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు స్వాతి చతుర్వేది 'ఐ యామ్‌ ఎ ట్రోల్‌'-ఇన్‌సైడ్‌ ది సీక్రెట్‌ వరల్డ్‌ ఆఫ్‌ బిజెపి డిజిటల్‌ ఆర్మీ పేరుతో రాసిన పుస్తకానికి ఆర్‌ఎస్‌ఎఫ్‌ అవార్డు కూడా లభించింది. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ చతుర్వేది రాసినందుకు ఆమెకు సోషల్‌ మీడియాలో బెదిరింపులు ఎదురవుతున్నాయని ఐరాస ప్రత్యేకాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తూ భారత ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ఇకపోతే జమ్మూ కాశ్మీర్‌లో ప్రజలకు ఇంటర్‌నెట్‌ను అందుబాటులో లేకుండా చేయడం ద్వారా భారత ప్రభుత్వం ప్రభుత్వ సెన్సార్‌షిప్‌కు పాల్పడిందని ఆర్‌ఎస్‌ఎఫ్‌ పేర్కొంది. 2019లో 121సార్లు ఇంటర్‌నెట్‌ను ఆపివేసిన దేశం భారత్‌ అని వ్యాఖ్యానించింది. భారత్‌లోని ఆర్‌ఎస్‌ఎఫ్‌ విలేకరితో సహా భారత విలేకర్లపై ఇజ్రాయిల్‌లో ఎన్‌ఎస్‌ఓ గ్రూపు గూఢచర్యం జరిపిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారత్‌లో 14శాతం ట్వీట్లు భారత మహిళా రాజకీయవేత్తలను దూషిస్తూ వచ్చాయని అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఇండియా పేర్కొంది. ప్రైవేటు రంగ కంపెనీలు, అసంఘటిత రంగ సంస్థలు తమకు వున్న అధికారాలతో ఇన్వెస్టిగేటివ్‌ విలేకర్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నాయ‌ని పారిస్‌ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ పర్యవేక్షణా సంస్థ పేర్కొంది.

వీణా వాణీలకు వేర్వేరు హాల్‌టిక్కెట్లు

పదో తరగతి పరీక్షలకు సిద్ధపడుతున్న అవిభక్త కవలలు వీణావాణీలకు వేర్వేరు హాల్‌టిక్కెట్లు ఇచ్చిన‌ట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌, వెంగళ్‌రావునగర్‌ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న వీణా వాణీలకు అదే సెంటర్‌లో పదో తరగతి పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేశారు. వారు వేర్వేరుగా పరీక్ష రాసే సామర్ధ్యాలు ఉన్నాయని, వారు కావాలని అడిగితే స్కైబ్స్‌ ఏర్పాటేచేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. వీణా వాణీలు పరీక్ష రాసేందుకు వీలుగా పరీక్షా కేంద్రంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2016 వరకు నిలోఫర్‌ ఆస్పత్రిలో ఉన్న వీణా వాణీలను 2017లో స్టేట్‌హౌంకు తరలించారు. అక్కడ వారు ప్రత్యేక ఉపాధ్యా యుల పర్యవేక్షణలో చదువుతున్నారు. ఈ ఏడాది పదో తరగతికి రాగా...ఇటీవల వీరు ఎస్‌ఎస్‌సీ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇద్దరికీ కలిపి ఒకే హాల్‌టికెట్‌ ఇవ్వాలా? వేర్వేరుగా ఇవ్వాలా? అనే అంశంపై బోర్డు అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. పరీక్ష రాసే అర్హత, శక్తిసామర్థ్యాలు వారికి ఉన్నట్లు నిర్ధారించుకుని ఇద్దరికీ వేర్వేరుగా రెండు హాల్‌టికెట్లు జారీ చేయాలని నిర్ణయించారు. మరో రెండు మూడు రోజుల్లో వీరికి హాల్‌ టికెట్లు అందజేసే అవకాశం ఉంది. వీరిలో ఒకరి ముఖం కింది వైపు చూస్తుంటే.. మరొకరిది పైకి చూస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు కూర్చొని స్వయంగా పరీక్ష రాసే అవకాశం తక్కువ. వీణావాణీలు కోరితే ఇద్దరికీ స్క్రైబ్‌లను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా విద్యాశాఖప్రకటించింది.

సి.ఎం. ప‌ద్ద‌తి మార్చుకో! లేక‌పోతే అస‌లుకే మోస‌పోతావు

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు రాజ్యాంగానికి విరుద్దంగా ఉంటున్నాయంటూ హైకోర్టు నిత్యం హెచ్చరిస్తున్నా ఈ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోదంటారు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు, అధికా రుల వ్యవహార శైలి రాజ్యాంగ బద్ధంగా లేవని హైకోర్టు వ్యాఖ్యానించిందన్నారు. దశాబ్దాలుగా పేదలు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూము లు, అసైన్డ్‌ భూములను ఇళ్ళ పట్టాల పేరుతో అక్రమంగా లాక్కుంటున్నారని న్యాయమూర్తి వ్యాఖ్యానించిన విషయాన్ని మరవరాదన్నారు. అమరావతిలో రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములను పేదలకు ఇళ్ళ స్థలాల పంపిణీ పేరుతో 1250 ఎకరాలు ఇచ్చేలా జీవో జారీ చేయడం సీఆర్డీఏ చట్టానికి వ్యతిరేకమన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్య టనలో పోలీసుల వ్యవహరించిన తీరుపై డీజీపీ హైకోర్టుకు వచ్చి సంజాయిషీ చెప్పుకోవాల్సిన పరిస్థితి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేదన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం వైసీపీ ప్రభుత్వం ఎవరు చెప్పినా వినకుండా ప్రభుత్వ కార్యాలయాలకు రూ.130 కోట్లతో పార్టీ రంగులు వేశారని, న్యాయస్థానం సూచించినా ఇప్పటివరకు రంగు లు మార్చకపోవడానికి గల కారణమేమిటని నిలదీశారు. ముఖ్య‌మంత్రి జగన్‌ పద్ధతి మార్చుకోవాల‌ని వ‌డ్డే స‌ల‌హా ఇచ్చారు.

కంచి లో చేసే దొంగతనానికి కాళహస్తి నుంచే దండాలు పెట్టుకుంటూ వెళ్లినట్టు...

కంచి లో చేసే దొంగతనానికి కాళహస్తి నుంచే వంగి వంగి దండాలు పెట్టుకుంటూ వెళ్లినట్టు, బీ జె పీ తో  కలిసి 2024 లో ఆంధ్ర ప్రదేశ్ లో అద్భుతం సృష్టించటం కోసం జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచే అమిత్ షా ను ఆకాశానికెత్తేస్తూ, జగన్ మోహన్ రెడ్డి ని మాత్రం ఓ రేంజ్ లో మాటలతో ఆడుకుంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని, హిట్లర్‌లా పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లను నిష్పక్షపాతంగా జరిపిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి.. దాన్ని చేతల్లో చూపించాలని డిమాండ్ చేశారు. ఆధునిక హిట్లర్‌కు ప్రజలు తమ ఓటు హక్కుతో బుద్ధి చెప్పాలని అన్నారు. రౌడీయిజానికి, గుండాయిజానికి అధికార పార్టీ నాయకులు కేరాఫ్‌గా నిలిచారని చెప్పారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండబోదని పేర్కొన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ఆధునిక ఉక్కుమనిషిగా అభివర్ణించారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ తరువాత ఆ స్థాయి శక్తిమంతమైన నాయకుడిగా కితాబునిచ్చారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అత్యంత శక్తిమంతుడిగా ఎదిగారని, ఇప్పుడు అమిత్ షా ఆ స్థాయికి చేరుకున్నారని పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను హిట్లర్‌తో పోల్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ తరువాత అంత బలమైన అమిత్ షా కోరిన కోరికను తాను తిరస్కరించానని పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయాలని కోరారని, తాను కుదరదని కుండబద్దలు కొట్టానని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన పార్టీ అవసరం ఉందని, అందుకే బీజేపీలో విలీనం చేయదలచుకోలేదని చెప్పారు. జనసేన అనే ఉనికి కోల్పోతే పవన్ కళ్యాణ్ లేడని అన్నారు. పార్టీ ఉనికిని తాను ఎప్పుడూ కాపాడుతానని, ధికారం వచ్చినా రాకపోయినా ఉనికి మాత్రం కోల్పోబోమని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని పార్టీలు వెంపర్లాడాయని, తాము మాత్రం బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని అన్నారు. దేశ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పారు. దేశ సమగ్రతను కాపాడే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని, దాన్ని దృష్టిలో ఉంచుకునే తాము ఆ పార్టీతో సీట్ల సర్దుబాటు చేసుకున్నామని పవన్ కల్యాణ్ వివరించారు. రాష్ట్ర, దేశ ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భౌతిక దాడులకు పాల్పడటం.. అధికార మదాన్ని చాటి చెబుతోందని విమర్శించారు. అధికారం తమ చేతుల్లో ఉందనే కారణంతోనే వైఎస్ఆర్సీపీ నాయకులు జనసేన అభ్యర్థులపై ఇష్టారాజ్యంగా దాడులు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకునే శక్తిసామర్థ్యాలు తమకు ఉన్నాయని, తమ బలాన్ని నిర్వీర్యం చేయడానికి అధికార పార్టీ నాయకులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.