కొత్త రెవెన్యూ చట్టం.. విమర్శలు.. డిమాండ్లు

తెలంగాణ ప్రభుత్వం  అసెంబ్లీలో సెప్టెంబర్ 9 వ తేదీన  “తెలంగాణ  భూమి  హక్కులు, పట్టాదార్  పాస్  పుష్టకాల  బిల్లు, 2020”ను ప్రవేశ పెట్టింది.  ఇంత  ముఖ్యమైన  బిల్లును  హడావిడిగా  ఎటువంటి  సంప్రదింపులు  లేకుండా రెండు రోజులు అసెంబ్లీ  లో  చర్చించి  ఆమోదించాలన్న  ప్రభుత్వం  చర్య  అత్యంత  అప్రజాస్వామికమైనది.  ఇది ప్రధానంగా   చిన్న, సన్నకారు రైతుల , మహిళా రైతుల, కౌలు రైతుల, ఆదివాసీల హక్కులను పరిగణించకుండా కేవలం రెవిన్యూ శాఖలో ప్రబలి ఉన్న అవినీతిని కొంతవరకు నియంత్రించడానికి మాత్రమే దృష్టిలో పెట్టుకుని తయారుచేయబడినదిగా అగుపిస్తున్నది. అలాగే ప్రభుత్వ వైఖరి రెవిన్యూ శాఖ ఉద్యోగులు కేవలం భూమికి సంబంధించిన లావాదేవీలను మాత్రమే చూస్తారన్న భ్రమలో ఉండటం కూడా హాస్యాస్పదమే. ఈ బిల్లును ప్రజా అసెంబ్లీ సభ్యులు పరిశీలించి స్పందిస్తూ, ముఖ్యమైన ప్రజాస్వామికమైన వ్యాఖలను చేస్తూ కొన్ని ప్రశ్నలను లేవనెత్తారు. ఇటువంటి అప్రజాస్వామిక మైన బిల్లును ప్రవేశపెట్టే ముందు ఈ కింది విమర్శనాత్మక వ్యాఖ్యలను పరిశీలించి ప్రభుత్వం  పరిగణనలోకి  తీసుకోవాలి.  .  . 

రెవిన్యూ బిల్లు పై విశ్లేషణాత్మక విమర్శలు

ఈ కొత్త రెవిన్యూ చట్టం ఉద్దేశం భూమి చుట్టూ జరిగే లావాదేవీలను, వ్యాపారాన్ని సులభతరం చేస్తుంది అని ప్రభుత్వమే ప్రకటించింది. 

ఈ కొత్త బిల్లు భూ రికార్డులను నవీకరించటం గానీ లేదా వాటికి   ఖచ్చితత్వాన్ని కల్పించటానికి కాక  అది  ఎన్కుంబరెన్సీలను (లను) తొలగించి మార్కెట్ లో భూమి వ్యాపారానికి మార్గం సుగమంచేయటానికే రూపొందించబడింది. బడా పారిశ్రామికవేత్తల భూసేకరణ కోసం ఈ బిల్లు మార్గాన్ని సుగమం  చేస్తుంది.   తెలంగాణ ప్రభుత్వం అవినీతి నిరోధం అంటూ ప్రజల శ్రేయస్సును పక్కన పెట్టి పారిశ్రామిక రంగానికి అనువుగా రచించిన బిల్లు ఇది.

ఈ బిల్లు చిన్న సన్నకారు పేద రైతులకు ఏ విధంగానూ సహాయపడదు, ప్రస్తుతం వారు కొత్తగా  భూములను కొనుగోలు చేసే పరిస్థితిలో లేరు. వారి ఆన్లైన్ రికార్డులను సరిచూసుకోలేరు కాబట్టి భూ రికార్డుల కంప్యూటరీకరణ విధానంలో వారికి పెద్ద  నష్టం ఏర్పడుతుంది. ఎందుకంటే  భూ రికార్డులను సరిచూసుకోవటం, నవీకరించటం వంటి అంశాల పని భూ యజమానులపైనే ఉంటుంది. చదువుకొని స్మార్ట్ ఫోన్ లు, కంప్యూటర్ లు, ఇంటర్నెట్ సౌకర్యం ఉండి, వాటి పైన సాంకేతిక నైపుణ్యం కలిగి ఉన్నవారు మాత్రమే వాటిని చేయగలుగుతారు. ధరణి వెబ్ సైట్ నిర్వహణ సామాన్యులకు అందుబాటులో ఉండదు సరికదా అర్థం కూడా కాదు. నిరక్షరాస్యులైన పేద రైతులకు ఈ అవకాశం ఉండదు.

చాలా కాలంగా ఆస్తి, యాజమాన్యం కేంద్రంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో భాగంగానే ఇది ముందుకొచ్చింది, వ్యవసాయ భూ యజమానులను రక్షించటమే దీని లక్ష్యం. నిరక్షరాస్యులైన బడుగు పేద వర్గాలనుద్దేశించి కాదు. ఇది అప్రజాస్వామికం. దీనిలో ప్రకటించని ఉద్దేశం ఏమిటంటే, గతంలో తెచ్చిన సవరణకు అనుగుణంగా  సాగుదారులను తొలగించటమే. 

అటవీ భూములకు సంబంధించి ఆర్ ఓఎఫ్ ఆర్ రికార్డులను రెవెన్యూ రికార్డులతో అనుసంధానం చేయకపోవటమే పెద్ద సమస్య.  అటవీ భూములను  సాగు చేస్తున్న వారందరికీ, ఆర్ ఓఎఫ్ ఆర్ పట్టాలు వున్న వారందరికీ కూడా  ఈ కొత్త చట్టం ప్రకారం పట్టాదార్ పాస్ పుస్తకాలు  టైటిల్ డీడ్ లు ఇవ్వటానికి ఈ  విధమైన  అనుసంధానం  తప్పనిసరిగా చేయాలి. అటవీ భూములను ప్రభుత్వం అభివృద్ధి పేరుతో పరిశ్రమలకు ఇచ్చే ప్రమాదం ఉంది. ఇది అటవీ హక్కుల ఉల్లంఘన. దీనికే ఈ బిల్లు ద్వారా పునాది వేస్తున్నట్టు ఉంది.

గ్రామ రెవెన్యూ  అధికారులు (VRO)లు, గ్రామ రెవెన్యూ అసిస్టెంట్లు (VRA)ల వ్యవస్థ  తొలగించటం తో  MROల చేతిలో  భూ  రికార్డులు నిర్వహించటం, రిజిస్ట్రేషన్  చేయటం  ఈ  రెండిటికీ  సంబంధించి అధిక  అధికారాలు  కేంద్రీకరించబడతాయి.   ఇది  మరింత  అవినీతి పెరగటానికి  దారి తీస్తుంది.  
 
ఈ  కొత్త  చట్టం ప్రతిపాదిస్తున్నటువంటి   సవరణలు భూవ్యవస్థను ప్రజలకు  మరింత  అందుబాటులోకి  తెచ్చి  జవాబుదారీ తనాన్ని  పెంచి అవినీతిని  తొలగిస్తుంది  అనే దాఖలాలు  ఎక్కడా  లేవు.   చివరగా సాగుదారులు, కౌలుదారులను  తొలగించటం  ద్వారా  భూయజమానులు  భూమిని  సరుకుగా  మార్కెట్  చేయటానికి  మార్గం  సుగమం చేస్తుంది. 

సాదా భైనామా సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదాలు పరిష్కారం కాలేదు. వక్ఫ్, దేవాదాయ, భూదాన్ భూముల వివాదాలు అలాగే ఉన్నాయి. ఆ సమస్యల గురించి ఈ బిల్లులో ప్రస్తావనే లేదు. ఇప్పుడున్న భూవివాదాలను పరిష్కరించడానికి తాత్కాలికంగా జిల్లా స్థాయి ట్రిబ్యునల్స్ ఏర్పరిచినా, అవి పరిష్కారం అయ్యాక భూ వివాదాలు పరిష్కారానికి సివిల్ కోర్టులకు వెళ్లాల్సి ఉంటుంది. అది సన్న, చిన్న కారు రైతులకు మరింత కష్టం. 

ఈ చట్టాన్ని కింది స్థాయి ఉద్యోగులను అవినీతి ఆరోపణల నెపంతో తొలగించడానికి చేసినట్టు ఉంది. VRO లకు ఇతర డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు ఎప్పటికి ఇస్తారన్నది స్పష్టంగా లేదు. వీరి ఇతర విధుల నిర్వహణ ఎవరు చేస్తారనేది కూడా స్పష్టంగా లేదు. గ్రామ స్థాయి రెవెన్యూ అధికారులు కేవలం  భూమికి  సంబంధించిన లావాదేవీలతో పాటు అనేక సంక్షేమ పధకాల అమలు లో కూడా కీలకమైన పాత్రవహిస్తారన్న విషయం మరచినట్టు ఉన్నది ప్రభుత్వ వైఖరి.

ఈ బిల్లులో మూడు స్థాయిల న్యాయ వ్యవస్థను రద్దు చేశారు. తక్షణ ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిష్కరించుకునే సమస్యలను ఇప్పుడు జిల్లా స్థాయికి తీసికుని వెళ్ళవలసిన అగత్యం ఎదురవుతుంది.  

రెవెన్యూ అధికారుల న్యాయ అధికారాలు తొలగించిన తరువాత, పోలీసుల ప్రమేయం ఆజమాయిషీ పెరిగే  ప్రమాదం ఉంది. సంరక్షించే బదులు నియంత్రించే పరిస్థితి చోటుచేసుకోవచ్చు.

గ్రామ స్థాయిలో కనీస వేతనం, భూఆక్రమణ, ప్రకృతి వైపరీత్యాలు, data collection వంటి బాధ్యతలు  VRO లేకుండా జరగవు. దాదాపు 5400 మంది VROలు ఇప్పుడు అయోమయ పరిస్థితిలో ఉన్నారు.

బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు  రెవెన్యూ అధికారుల జోక్యం చాలా అవసరం.. ఇప్పుడు ఆ యంత్రాంగం నిర్వీర్యం అయితే పిల్లల భవిష్యత్తు అధోగతి పాలయ్యే అవకాశం ఎక్కువగా  ఉంది.

వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం ప్రకారం Release Certificate పొందిన కార్మికులకు భూమి పంపిణీ కలెక్టర్ ఆదేశానుసారంగా, MRO చేస్తారు. ఇప్పుడు అలాంటి సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారో తెలియదు. 

సాగుదారులను గుర్తించటం అనేది పూర్తిగా తొలగించాక, భూమి హక్కులు లేకుండా వ్యవసాయం చేస్తున్న  కౌలు రైతులు,  మహిళా రైతులు తీవ్రంగా నష్టపోతారు. వాస్తవ సాగు దారుల, భూమిలేని పేదల జీవనోపాధికి ఉపయోగ పడాల్సిన భూమి, డబ్బున్న వాళ్లకు మార్కెట్ సరుకుగా అందుబాటులోకి తేవడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశ్యం. భూమి యాజమాన్యం కలిగి వున్నవారే రైతులుగా గుర్తించబడుతున్న దుర్మార్గపు వ్యవస్థ మరింత గట్టిపడుతుంది. ప్రస్తుతమున్న రైతుబంధు కూడా ఇటువంటి  పరిస్థితుల్లో అమలుచేస్తున్నారు.

ధరణి వెబ్ సైట్ లో అవకతవకలను సరిచేయకుండా రెవిన్యూ డిపార్ట్మెంట్ ను నిర్వీర్యం చేయడం సమంజసం కాదు. ఇప్పుడు దరణిలో ఉన్న తప్పుడు తడకల సమాచారాన్ని బాగుచేయకుండా దాని ఆధారంగా రెవెన్యూ రికార్డులకు శాశ్వతత్వం కల్పిస్తామని చెప్పడం మరిన్ని వివాదాలు పెరగడానికి కారణ మవుతుంది.

అసైన్డు భూములను సాగు చేస్తున్నవారిలో చాలా  తక్కువ శాతం మందికి  మాత్రమే 1971 చట్టం ప్రకారం కొత్త పాస్ పుస్తకాలు అందాయి. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే వారు కొత్త పాస్ పుస్తకాలు టైటిల్ డీడ్స్ అందుకోవటానికి ఈ కొత్త చట్టంలో ఎటువంటి ప్రస్తావనా లేదు.
క్రింది స్థాయిలో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఒక పారదర్శక యంత్రాంగం లేకపోతే పేద రైతులకు చాలా ఇబ్బంది.అవినీతి పేరుతో వీళ్ళను రద్దు చేసినంత మాత్రాన, అన్ని చోట్లా ఉండే అవినీతి తగ్గిపోతుందని భావించడం తప్పు. పైగా డబ్బున్నవాళ్ళ పక్షాన మరింత పెరిగే ప్రమాదం వుంది. అవినీతితో జరిగే పనులలో పై వారికి ఇక అడ్డుండదు. అన్నింటినీ మించి కొద్ది భూమి గల పేద రైతులు కూలీలు గా పనులు వెతుక్కుంటూ పోవలసి వస్తుంది. భూమి స్వీయ గౌరవ సాధనం కదా పేద తెలంగాణ గౌరవం సమస్య అవుతుంది. ఈ చట్టం అనేక విపరినామాలకు దారి సుగమం చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే గత చట్టంతో ఏమెరకునా జరిగిన భూ వికేంద్రీకరణ ఇక కేంద్రీకరణ వైపు అడుగులు వేస్తుంది. కలవారికి ఇది ఉపయోగం

ఈ బిల్లు కౌలు రైతులకు ఎలా ఉపయోగపడుతుందో  వివరించలేదు. అసలే గుర్తింపు లేని కౌలు రైతుల సమస్యలు ఇంకా క్లిష్టరమయ్యే ప్రమాదం ఉంది.

నోటీసుల  విధానం  అనేది తప్పులు  జరగకుండా అడ్డుకోవటానికి. రెవెన్యూ  యంత్రంగం  తప్పులు  చేస్తే అప్పీల్  చేసుకునే  అవకాశం ప్రజలకు  ఉండాలి. చట్టాల్లో  అప్పీల్  వ్యవస్థ  లేకపోవటం ప్రాధమిక  హక్కులను హరించినట్లే అవుతుంది. 

డిమాండ్లు : 
అత్యంత  ముఖ్యమైన, విస్తృతమైన  ప్రభావాన్ని  కలిగించే ఈ కొత్త రెవెన్యూ  చట్టం పై   చర్చలు  జరపకుండా  అసెంబ్లీ లో  ప్రవేశపెట్టి  రెండు  మూడు  రోజులలో  ఆమోదించటం  అప్రజాస్వామిక  చర్య.. ఈ  బిల్లు  ఆమోదాన్ని  వాయిదా  వేసి  ప్రజలలోకి  తీసుకెళ్లి   అన్ని సెక్షన్ల  రైతులు, రైతు  సంఘాలు, ప్రజా  సంఘాలతో విస్తృతంగా  సంప్రదింపులు  జరిపి వాటినుండి వచ్చిన  అభిప్రాయాలను  పరిగణన లోకి  తీసుకోవాలి. 

ఈ  బిల్లును  రెవెన్యూ  మరియు  న్యాయ  నిపుణులతో  కూడిన  ఒక   నిపుణల  కమిటీకి  పంపాలి,  దీనిపై    ప్రజా సంప్రదింపుల  ప్రక్రియ  చేపట్టాలి. 

సమగ్ర భూ సర్వే  జరిపి  మాగాణి,మెట్ట భూముల విస్తీర్ణాన్ని తేల్చాలి. దాని ఆధారంగా మిగులు భూములను తేల్చాలి.అసలైన  భూ యజమానులు గుర్తించి రికార్డు చేయాలి. ఈ సర్వే  ద్వారా  వెలువడే గణాంకాల ప్రకారం భూ గరిష్ట పరిమితి కంటే అదనంగా  వున్న భూమిని 1973 భూ సంస్కరణల చట్టం ప్రకారం భూమి లేనివారికి పంపిణీ చేయాలి. 

ఆర్ ఓఎఫ్ ఆర్ రికార్డులను రెవెన్యూ రికార్డులతో అనుసంధానం చేసి   అటవీ  భూములకు  హక్కు  పత్రాలు వున్న  వారందరికీ కొత్త  పట్టాదారు  పాసు పుస్తాకాలు  ఇవ్వాలి, వారందరికీ  ప్రభుత్వ  వ్యవసాయ  పధకాలను  అందుబాటులోకి  తేవాలి. 

తెలంగాణ  రాష్ట్రంలో  వాస్తవ  సాగుదారులను  గుర్తించాలి - కౌలు రైతులు, మహిళా  రైతులు, పోడు వ్యవసాయం  చేసే  రైతులను  గ్రామ స్థాయిలో  రిజిస్టర్  చేసి భూ  యాజమాన్యంతో  సంబంధం  లేకుండా   గుర్తింపు  కార్డులు  ఇవ్వాలి.   

ధరణి  వెబ్ సైట్ ద్వారా  రిజిస్ట్రేషన్,  ఆ వెంటనే మ్యుటేషన్ జరగటం వివాదాల్లేని రైతులకు మేలు  చేయవచ్చు  కానీ పేద  రైతులు, భూ  వివాదాలతో ఇబ్బందులు పడుతున్న రైతులను మరింత  ఇబ్బంది  పెట్టినట్లే  అవుతుంది. భూ  వివాదాల  పరిష్కారానికి  శాశ్వత  ట్రిబ్యునల్ ను  గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఏర్పాటు  చెయ్యాలి 

భూ  సమస్యల  విషయంలో అప్పీలు  వ్యవస్థను రద్దు చేయటం సరైనదికాదు. ఉన్న రెవెన్యూ అధికారుల జవాబుదారీతనం  పెంచి  పారదర్శకంగా  తయారు చేయా

దుబారా.. బాధ్యులెవరు? వ్యవస్థ లోపాలపై వాస్తవ వేదిక లో ప్రశ్నల పిడుగులు!

సమాజం పట్ల అక్కర, బాధ్యత ఉన్న ఇద్దరు వ్యక్తులు వర్తమాన రాజకీయాలలో భ్రష్ఠత్వంపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు. ఈ భ్రష్టత్వం అఖిల భారత సర్వీసు అధికారులకూ విస్తరించడాన్ని నిలదీశారు. తెలుగువన్  వాస్తవ వేదిక ద్వారా తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ వ్యవస్థ లోపాలపై విమర్శల శస్త్రాలు గుప్పించారు.  రాజకీయ నాయకుల దుబారా ఖర్చులు, ఆడంబర ప్రయాణ వ్యయాలు రాజకీయాలలో నాయకుల ఆర్థిక అరాచకత్వం చూస్తుంటే, ఆర్థిక నిబంధనలన్నవి సామాన్యులకేనా, నేతలకు వర్తించవా అన్న ప్రశ్న తలెత్తుతున్నది. ఇదే విషయాన్ని ‘వాస్తవ వేదిక‘ ద్వారా తెలుగువన్ ఎండీ కంఠం నేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్రప్రసాద్  మరోసారి లేవనెత్తారు.   ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్  ప్రభుత్వ ఖర్చుతోనే చార్టర్డ్ విమానాల్లో తిరుగుతున్నారనీ, ప్రభుత్వం దగ్గర సొంత విమానం లేనందున గంటకు 6 నుండి 8 లక్షల రూపాయలు అద్దె చెల్లిస్తున్నారన్న ప్రచారం, అలాగే  విజయవాడ నుండి హైదరాబాద్‌కు వచ్చి వెళ్లే ట్రిప్పుకు 10 నుండి 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, ఇది వ్యక్తిగత దుబారా అని  విమర్శించారు. లోకేష్ తన ప్రయాణ ఖర్చులకు సొంత డబ్బులు వినియోగిస్తున్నారన్న ఆర్టీఐ  వివరణ నమ్మశక్యంగా లేదని అభిప్రాయపడ్డారు.  ఆయన ముఖ్యమంత్రితో కలిసి ప్రయాణించడం వల్ల ఆ ఖర్చు ముఖ్యమంత్రి ఖాతాలోకి వెళ్తోందని పేర్కొన్నారు. అయితే ఇలా ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.  ఐఏఎస్ అధికారులు  నిబంధనల్లో లొసుగులను ఆసరా చేసుకుని వాటని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. కొందరు అధికారులు ఎలక్షన్ బడ్జెట్‌తో కార్లు కొనుక్కుంటున్నారని, ఒక్కో అధికారికి మూడు నుండి ఐదు కార్లు ఉంటున్నాయనీ అన్నారు.  గతంలో కలెక్టర్లు సొంత పనులకు రిక్షాల్లో వెళ్లేవారని, కానీ ఇప్పటి అధికారులకు ఆ నిబద్ధత లేదని, వారు ఉద్యోగంలో చేరగానే విల్లాలు, అపార్ట్‌మెంట్ల గురించి ఆలోచిస్తున్నారని విమర్శించారు.  దుబారాకు, ఆ దుబారాకు అధికారులు పలుకుతున్న వత్తాసుకు నిలువెత్తు ఉదాహరణగా రుషికొండ ప్యాలెస్ ను చెప్పుకోవచ్చన్న వారు.. తొలుత రుషికొండ ప్యాలెస్ కు 200 కోట్ల రూపాయలు మంజూరైతే.. అది పూర్తయ్యే నాటికి మొత్తం వ్యయం 600 కోట్లకు చేరిదనీ,  అంత ఖర్చు చేసీ  సిఆర్జెడ్, ఎన్విరాన్మెంట్, అటవీ నిబంధనల ఉల్లంఘనా యథేచ్ఛగా జరిగిందనీ దీనిని అడ్డుకోవలసిన అధికారులు ఏం చేస్తున్నారనీ ప్రశ్నించారు.  అదే విధంగా జగన్ హయాంలో ప్రభుత్వ భవనాలకు వైసీపీ  రంగులు వేయడానికి, తీరా వేసిన తరువాత హైకోర్టు మొట్టికాయలు వేసి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఆ రంగులను తొలగించడానికి దాదాపు ఐదువేల కోట్ల రూపాయల ప్రజాధనం వ్యయం చేశారనీ, ఇంకా చెప్పుకుంటూ పోతే..  గతంలో విజయవాడలోని ఒక స్టార్ హోటల్ నుండి ముఖ్యమంత్రి కుటుంబం కోసం రోజుకు లక్షన్నర రూపాయల వరకు భోజన బిల్లులు ఉండేవని, ఐదేళ్లలో ఇది సుమారు 400 కోట్లు అయి ఉండవచ్చనీ పేర్కొన్నారు.    ఇక ప్రజాస్వామ్య దేవాలయంగా చెప్పుకునే అసెంబ్లీలో అర్ధవంతమైన చర్చలు ఇసుమంతైనా జరగడం లేదనీ, కేవలం స్వోత్కర్ష, పరనిందకే అసెంబ్లీని నేతలు వేదికగా చేసుకుంటున్నారనీ సోదాహరణంగా వివరించారు. తెలుగుదేశం, వైసీపీలు ప్రజల ముందే కొట్టుకుంటున్నట్టు కనిపిస్తాయి కానీ, అంతర్లీనంగా అవి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇంటి ఫెన్సింగ్‌కు 14 నుంచి 15 కోట్ల రూపాయలు ఖర్చు చేయడంపై ఎవరూ ప్రశ్నించడంలేదన్నారు. నేతల తప్పులను నిలదీయాల్సిన ప్రజా సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీలు నిర్వీర్యం అయిపోయాయి నామావశిష్టంగా మిగిలాయన్నారు.   మొత్తంగా వ్యవస్థలో  అలీబాబా   మారాడు తప్ప,  40 మంది దొంగలు (అధికారులు, కాంట్రాక్టర్లు, దోపిడీదారులు) అలాగే ఉన్నారనీ, నాయకులు మారినా వ్యవస్థలో దోపిడీ విధానం మారలేదనీ చెప్పారు. ఇక రాష్ట్ర ఉత్పాదకత పెరిగినా ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేకపోవడానికి కారణం   దుబారా, అవినీతేనన్నారు.   ఈ చర్చకు కొనసాగింపు గురువారం (జనవరి 8) రాత్రి ఏడు గంటలకు  తెలుగువన్ ‘వాస్తవ వేదిక‘లో ఈ దిగువన ఉన్న లింక్ ద్వారా చూడండి.

పేదలపై కక్షతోనే ఉపాధిహామీ పథకం నిర్వీర్యం.. మోడీ సర్కార్ పై రేవంత్ ధ్వజం

కేంద్రంలోని మోడీ సర్కార్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గాంధీ భవన్ లో గురువారం (జనవరి 8) జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ప్రసంగించిన ఆయన 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ 400 స్థానాలలో విజయం సాధించి ఉంటే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేసి ఉండేదన్న ఆయన కాంగ్రెస్ ప్రజలను అప్రమత్తం చేయడం వల్లనే ఆ పార్టీకి పూర్తి మెజారిటీని జనం ఇవ్వలేదని అన్నారు. మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు.   మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే  మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు. నిబంధనల మార్పు పేరుతో ఆ పథకాన్ని శాశ్వతంగా నిలిపివేయడానికి కేంద్రంలోని మోడీ సర్కార్ కుట్రపన్ననుతోందని విమర్శించారు. అధికారం ఉందన్న అహంకారంతో చట్టసభలను వినియోగించి పేదలను అణిచివేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.  

గోబెల్స్ ను మించి జగన్ అసత్య ప్రచారం!

క్రిస్మస్ సెలబ్రేషన్స్ ను పులివెందులలో జరుపుకున్న తరువాత బెంగళూరుకు వెళ్లిపోయిన జగన్ ఆ తరువాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ మీడియా సమావేశం అనే లాంఛనం పూర్తి చేసి తిరిగి బెంగళూరు వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయిన తరువాత జగన్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వస్తున్న సంగతి తెలిసిందే. అలా వచ్చిన ప్రతి సారీ మీడియా సమావేశం పెట్టి ఏదో ఒక అంశంపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం ఆనవాయితీగా మార్చుకున్నారు. తాజాగా కూడా ఆయన అదే పని చేశారు. తాడేపల్లి ప్యాలెస్ లో గురువారం (జనవరి 8) మీడియా సమావేశంలో జగన్  సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.   సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి  సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అయితే వాస్తవానికి ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించి, నిలిపివేయడం జరిగింది  జగన్ హయాంలోనే. ప్రాజెక్టును ప్రారంభించిన ఆరు నెలలలోనూ ఆ  ప్రాజెక్టు చేపట్టిన ఆరునెలలలోగానే అప్పటి మంత్రి పెద్దిరెడ్డి కంపెనీకి భారీ చెల్లింపులు చేసి, పనులు నిలిపివేసింది జగన్ హయాంలోనే. అయితే ఆ తరువాత ఈ ప్రాజెక్టుకు అనుమతుల కోసం మూడేళ్ల పాటు ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా, ఇప్పుడా ప్రాజెక్టును నిలిపివేసింది చంద్రబాబే అని విమర్శలు గుప్పించడం పట్ల పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.   తన హయాంలో నిలిచిపోయిన సీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు చంద్రబాబును బాధ్యుడిని చేస్తున్న జగన్.. చంద్రబాబు ఆలోచనతో ఆంకురార్పణ జరిగి, ఆయన హయాంలోనే పూర్తి అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ మాత్రం తన ఖాతాలో వేసుకోవడానికి తహతహ లాడుతున్నారంటూ నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు.  జగన్ తన వైఫల్యాలను చంద్రబాబు ఖాతాలోనూ, చంద్రబాబు విజయాలను తన ఖాతాలోనూ వేసుకోవడానికి తాపత్రేయపడుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రెడిట్ కోసం జగన్ అవాస్తవాలు వల్లెవేస్తూ గోబెల్స్ ను మించిపోతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఐప్యాక్ కార్యాలయంపై ఈడీ రెయిడ్స్.. మమత ఫైర్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జరగనున్నాయి. హ్యాట్రిక్ విజయాలతో వరుసగా మూడు సార్లు రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తృణమూల్ కాంగ్రెస్ నాలుగోసారి విజయం సాధించి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నది. అదే సమయంలో బీజేపీ కూడా రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టాలన్న పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ వేడి రగులు కుం టోంది.  తాజాగా  రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.   కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుట్రపూరితంగా ఎన్నికల లబ్ధి కోసం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.    కోల్‌కతాలోని సాల్ట్ లేక్‌లో ఉన్న ఐ-ప్యాక్ ప్రధాన కార్యాలయంతో పాటు, సంస్థ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ నివాసంలోనూ గురువారం (జనవరి 8) ఉదయంఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు.  కేంద్ర సాయుధ బలగాల   భద్రత నడుమ జరుగుతున్న దాడుల నేపథ్యంలో  మమతా బెనర్జీ, కోల్‌కతా పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ వర్మతో కలిసి నేరుగా ప్రతీక్ జైన్ నివాసానికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లి ఈడీ అధికారులతో మాట్లాడి, కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చిన ఆమె, మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.    తృణమూల్ కాంగ్రెస్‌కు సంబంధించిన పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారనీ, అయితే.. తాను వాటిని తిరిగి తీసుకువచ్చానని చెప్పిన మమతా బెనర్జీ,  హోంమంత్రి దేశాన్ని రక్షించలేరు, కానీ ఈడీ ద్వారా  తృణమూల్ ను ఇబ్బందులు పెట్టడానికి చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  అక్కడ నుంచి  సాల్ట్ లేక్‌లోని ఐ-ప్యాక్ కార్యాలయానికి కూడా  ఆమె వెళ్లారు.  2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అంటే 2020 నుంచి ఐ-ప్యాక్ సంస్థ తృణమూల్ కాంగ్రెస్‌కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. మమత చర్యలపై పశ్చిమ బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగబద్ధమైన సంస్థ విధుల్లో మమతా బెనర్జీ నేరుగా జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు.   గతంలో కోల్‌కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లినప్పుడు కూడా ఆమె ఇదే విధంగా అడ్డుకున్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక ప్రైవేట్ కార్పొరేట్ సంస్థ కార్యాలయంపై ఈడీ దాడి చేస్తే సీఎం మమతా బెనర్జీకి ఎందుకంత ఆందోళన అని ప్రశ్నించారు.    మొత్తం మీద పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల హీట్ పీక్ స్టేజికి చేరిందని ఈ పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. 

డేంజర్ జగన్నాథం.. దొంగలే దోస్తులు.. క్రిమినల్సే కావాల్సినోళ్లు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ నేర చరిత్ర,  చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారిని ప్రోత్సహిస్తారన్న గుర్తింపు ఉంది.  గత ఏడాది డిసెంబర్ లో జగన్ పుట్టిన రోజు సందర్భంగా  రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో జంతు బలి నిర్వహించి, ఆ రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు అభిషేకం చేసిన సంఘటనలను ఆయన ఖండించకపోవడం, పైగా ఆయన పార్టీ నేతలు దానికి మద్దతుగా మాట్లాడటంతోనే ఇది రుజువైంది.  కాగా ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా  పలువురు వైసీపీ కార్యకర్తలపై  జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే.   ఇప్పుడు జగన్ తాజాగా  ఈ  కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.   ఇలా జగన్ నుంచి హామీ పొందిన వారిలో అత్యధికులు గోపాలపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ తానేటి వనిత మద్దతుదారులని తెలుస్తోంది.   అయితే ఆయన ఇలా హామీ ఇవ్వడం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు.  ఎందుకంటే ఇప్పటికే చట్టాన్నిచేతుల్లోకి తీసుకునే పార్టీ మద్దతుదారులను జగన్ ప్రోత్సహించడం తెలిసిందే. గంజాయి కేసుల్లో ఇరుక్కుని అరెస్టైన వారిని పరామర్శించడం వంటి చర్యలతో ప్రజలలో ఇప్పటికే జగన్ ప్రతిష్ఠ, పార్టీ ప్రతిష్ఠ ప్రజలలో బాగా దిగజారింది. ఇప్పుడు తాజాగా జంతుబలుల వ్యవహారంలో కేసుల్లో ఇరుక్కున్న వారికి పార్టీ మద్దతు అంటూ ప్రకటించడం ఆయన ప్రతిష్టను మరింత దిగజారుస్తుందని అంటున్నారు. 

ఒకే విడతలో తెలంగాణ మునిసిపోల్స్!

తెలంగాణలో మునిసిపోల్స్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమౌతోంది. రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించాలని భావిస్తోంది. ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేసే దిశగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే ఇప్పటికే ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటించిన ఎన్నికల సంఘం, ఈ నెల 12న తుదిజాబితా ప్రకటించనుందని తెలుస్తోంది.   ఈ నేపథ్యంలోనే బుధవారం (జనవరి 7) జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్  రాణికుముదిని వారికి దిశా నిర్దేశం చేశారు.  ఈ నెల 16న పోలింగ్‌ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్‌ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు ఈ నెల 20న మునిసిపోల్స్ కు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అ య్యే అవకాశాలు ఉన్నాయి.  

దమ్ముంటే ఖమ్మంలో పోటీ చేయ్...కేటీఆర్‌కు పొంగులేటి సవాల్

  తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు సవాల్ విసిరారు. ఆయనకు దమ్ముంటే ఖమ్మం జిల్లాలో వచ్చి పోటీ చేయాలని చాలెంజ్ విసిరారు. నిన్న ఖమ్మం వచ్చిన కేటీఆర్ ఏదేదో మాట్లాడారని ముందు తన ఇంట్లో వ్యవహారం చక్కబెట్టుకోవాలని పొంగులేటి హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే సత్తా చూపిస్తామని హెచ్చరించారు. కేటీఆర్ అక్రమాలపై ప్రభుత్వం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన  ఆరు నెలలకే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారని మంత్రి సంచలన ఆరోపణలు చేశారు.  కేటీఆర్ మతి భ్రమించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై, గాంధీ కుటుంబంపై మాట్లాడుతున్నారని, సూర్యూడి పైకి ఉమ్మితే అది తిరిగి తన ముఖం మీదే పడుతుందనే విషయాన్ని కేటీఆర్ మర్చిపోతున్నారన్నారు. అవినీతి, అక్రమాలు, దోపిడీలకు పేటెంట్‍గా ఉన్న కల్వకుంట్ల ఫ్యామిలీ గాంధీ కుటుంబం గురించా మాట్లాడేది అని మండిపడ్డారు. జాతీయ నాయకుడిని విమర్శిస్తే తాను జాతీయ నాయకుడిని అవుతానని తాపత్రయపడటం తప్పులేదు కానీ ఆశకు కూడా హద్దు ఉండాలన్నారు. జూబ్లీహిల్స్, గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికలను సెమీ ఫైనల్స్ అంటున్నారు. దేనికి సెమి ఫైనల్? అని మంత్రి  పొంగులేటి ప్రశ్నించారు  

కాకినాడ జిల్లాలో పవన్ పర్యటన.. పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం (జనవరి 8) నుంచి మూడు రోజుల పాటు ఆయన జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయ నున్నారు.  అలాగే  ప్రజాసమస్యలపై  అధికారులతో చర్చిస్తారు.  క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు. ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో  శుక్రవారం జరగనున్న  సంక్రాంతి సంబరాల్లో  పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.   అనంతరం  నియోజకవర్గంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పవన్ కల్యాణ్ ప్రారంభిస్తారు. పిఠాపురం ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, బాధితుల సమస్యలను నేరుగా తెలుసుకుంటారు.  ఈ పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష, రంగరాయ మెడికల్ కాలేజీలో పలు శంకుస్థాపనల కార్యక్రమంలో  కూడా పాల్గొంటారు. 

కేంద్ర కేబినెట్ లోకి మరో తెలుగు మంత్రి.. ఎవరంటే?

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ప్రధాని మోడీ సమాయత్తమౌతున్నారన్న వార్తలు వినవస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం ప్రాథాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో చంద్రబాబు  అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి  పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా  కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.  ఇప్పటికే టీడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు చొప్పున ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్నారు. అయితే మరో పదవి కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ బెర్త్ టీడీపీకి దక్కే ఛాన్సు లభిస్తుండటంతో.. ఆ అదృష్టవంతుడు ఎవరన్న కోణంలో  ఇప్పుడు రాజకీయవర్గాలలో చర్చ నడుస్తోంది. కొన్ని కొన్ని ఈక్వేషన్ల ప్రకారం  రెడ్డి సామాజిక వర్గానికి ఈ బెర్త్ కేటాయించాలన్న డిమాండ్  బలంగా వినిపిస్తోంది. అందులో భాగంగా  నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిలు రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అదలా ఉంటే.. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో  టీడీపీకి చెందిన వారు ఇద్దరు, బీజేపీ ఎంపీ ఒకరు ఉండగా, జనసేన మాకేం తక్కువ అంటూ కేంద్ర కేబినెట్ బెర్త్ కోసం డిమాండ్ చేస్తున్నదంటున్నారు.  జనసేన ఎంపీలిద్దరిలో  మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సీనియర్ కాబట్టి ఆయనను కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవాలని జనసేనాని పవన్ కళ్యాణ్‌  కోరుతున్నట్లు చెబుతున్నారు. చూడాలి మరి కేంద్ర కేబినెట్ బెర్త్ ఎవరికి లభిస్తుందో? 

జవాబుదారీతనం ఎవరికి ఉండాలి?

సమాజహితమే లక్ష్యంగా దశాబ్దాలుగా తమ రంగంలో కృషి చేస్తున్న తెలుగువన్, జమీన్ రైతు పత్రిక సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘వాస్తవ వేదిక’.. నాయకులను ప్రశ్నిస్తూ, ప్రజలను మేల్కొలుపుతూ చరిత్రలో నిలిచిపోయే ప్రస్థానానికి నాంది పలికింది. తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.  జవాబుదారీ తనం ఎవరికి ఉండాలి? ప్రజలకా? పాలకులకా? అధికారులకా? ఎగ్జిక్యుటివ్ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? తమ మేధాశక్తిని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు  ఎలా వాడుతున్నారు? పాలకుల తప్పులు కప్పడానికా; ప్రజల బాగు కోసమా? ప్రజాధనం దుర్వినియోగానికి బాధ్యులు ఎవరు?  ఇత్యాది సూటి ప్రశ్నలను సంధించారు. ప్రజా చైతన్యమే లక్ష్యంగా సాగుతున్నవాస్తవ వేదిక గురువారం (జనవరి 8) రాత్రి 7గంటలకు తెలుగువన్  యూట్యూబ్ చానల్ లో తప్పక వీక్షించండి.  https://youtu.be/T_mYTVE6Wgs